1 ENS Live Breaking News

కౌలుదారునికి సాగుదారు హక్కు కార్డు ఉండాలి..

జిల్లాలో ప్ర‌తి కౌలుదారునికి త‌ప్ప‌నిస‌రిగా పంట సాగుదారు హ‌క్కు కార్డు (సీసీఆర్‌సీ) అందించాల‌ని, ఈ కార్డుల జారీకి రైతు భ‌రోసా కేంద్రం స్థాయిలో శుక్ర‌వారం నుంచి 15 రోజుల పాటు ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సీసీఆర్‌సీ కార్డుల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, 100 శాతం కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్.. మండ‌ల‌, డివిజ‌న‌ల్‌, జిల్లాస్థాయి వ్య‌వ‌సాయ‌, రెవెన్యూ అధికారుల‌తో వర్చువ‌ల్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రైతుల‌తో పాటు కౌలు రైతుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అర్హ‌త ఉన్న ప్ర‌తి కౌలుదారునికీ సాగుదారు కార్డు అందించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించి అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో 1,10,000 కార్డులు జారీచేశామ‌ని.. ఇప్పుడు అద‌నంగా మ‌రో రెండు ల‌క్ష‌ల కార్డులను జారీచేయాల‌ని లక్ష్యంగా నిర్దేశించిన‌ట్లు వెల్ల‌డించారు. గ్రామ‌స్థాయిలోని వీఆర్వో, వీఏఏ మొద‌లు జిల్లాస్థాయిలోని జేడీ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి, ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కార్డుల జారీ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్‌బీకే స్థాయిలో జ‌రిగే స‌ద‌స్సుకు మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి (ఎంఏవో), త‌హ‌సీల్దార్ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌న్నారు. కౌలుదారునికి కార్డు అందించ‌డం ఎంత ముఖ్య‌మో భూ య‌జ‌మానికి ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌ద‌నే విష‌యంపై అవగాహ‌న క‌ల్పించ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని, ఈ దిశ‌గా జ‌రిగే స‌ద‌స్సుల్లో రైతులు, కౌలు రైతుల సందేహాల‌ను నివృత్తి చేయాల‌ని సూచించారు. కార్డుల జారీలో పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తామ‌ని, నిర్ల‌క్ష్యం వ‌హించే సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసి, జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాల‌న్నారు. పంట వైవిధ్యంపైనా సీసీఆర్‌సీ స‌ద‌స్సుల్లో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, కేవ‌లం వ‌రికే ప‌రిమితం కాకుండా ఆవ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను దృష్టిలో ఉంచుకొని నీటి ల‌భ్య‌త స‌రిగా లేని ప్రాంతాల్లో లాభ‌సాటి ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై దృష్టిసారించేలా అవగాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. రైతులు ఏయే వ‌రి ర‌కాల‌ను సాగుచేయాల‌నే అంశంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, వినియోగం, లాభ‌దాయ‌క‌త‌, డిమాండ్‌, మార్కెటింగ్ సౌక‌ర్యాలు త‌దిత‌రాల ఆధారంగా వ్య‌వ‌సాయ అధికారులు సూచించిన ర‌కాల‌ను వేసేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జేడీ (ఏ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీడీ(ఏ) ఎస్‌.మాధ‌వ‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, త‌హ‌సీల్దార్లు, ఎంఏవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-10 13:29:28

జూన్ 20వరకూ కోవిడ్ కర్ఫ్యూ అమలు..

కోవిడ్‌-19 విప‌త్తు నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర‌కు జిల్లాలో అమ‌ల‌వుతున్న క‌ర్ఫ్యూ జూన్ 20 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని, శుక్ర‌వారం నుంచి రోజూ మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద‌యం 6 గం. వ‌ర‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేర‌కు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆసుప‌త్రులు, డ‌యాగ్నోస్టిక్ ల్యాబ్‌ల‌కు, ఫార్మ‌సీలతో పాటు అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల పంపిణీతో ముడిప‌డిన వాటికి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం, 2005లోని 51-60 సెక్ష‌న్లతో పాటు ఐపీసీ సెక్ష‌న్ 188, ఇత‌ర వ‌ర్తింపు చ‌ట్టాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు నిబంధ‌న‌ల క‌చ్చిత అమ‌లుకు ఎస్‌పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. 

Kakinada

2021-06-10 13:24:00

జిల్లా కలెక్టర్ కి ఎంపీ మాగుంట సత్కారం..

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఇటీవల  బాధ్యతలు స్వీకరించిన  ప్రవీణ్ కుమార్ ను  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి లు పుష్పగుచ్ఛాలచ్చి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.  ఇటీల విధుల్లోకి చేరిన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వీరు జిల్లా అభివ్రుద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జిల్లా యొక్క స్తితిగతులు, గతంలో పనిచేసిన కలెక్టర్ల అభివ్రుద్ధి, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాగుంట కలెక్టర్ కి వివరించారు. ఎంపీ సూచనలపై సానుకూలంగా స్పందిచిన కలెక్టర్ అన్ని వర్గాల సహకారంతో జిల్లాని అభివ్రుద్ధి పదంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుంగా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.

Ongole

2021-06-10 09:53:46

స‌కాలంలో గృహ‌నిర్మాణాలు పూర్తి చేస్తాం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స‌కాలంలో గృహ‌నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) కె.మ‌యూర్ అశోక్ అన్నారు. ఆయ‌న జాయింట్ క‌లెక్ట‌ర్‌గా గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న‌, ఇంత‌కుముందు తెనాలి స‌బ్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించి, జిల్లాకు బ‌దిలీపై వ‌చ్చారు.  బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ సంద‌ర్భంగా చెన్నారెడ్డి భ‌వ‌న్‌లోని త‌న ఛాంబ‌ర్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మంలో భాగంగా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వం ఇళ్లు కేటాయిస్తోంద‌ని చెప్పారు. ఏడాదికి సుమారు 15ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌న్న‌ది ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద కార్య‌క్ర‌మ‌మ‌ని, ప్ర‌భుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని, ప్ర‌త్యేకంగా ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌ను నియ‌మించింద‌ని చెప్పారు. గృహ‌నిర్మాణం తోపాటు మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తామ‌ని తెలిపారు. జిల్లాలోని అధికారులను స‌మ‌న్వ‌యం చేసుకొని, ప్రభుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా కార్య‌క్ర‌మాన్ని న‌డిపిస్తాన‌ని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సామాన్య ప్ర‌జ‌లు సైతం నేరుగా త‌న‌ను క‌లిసి, త‌మ స‌మ‌స్య‌లను చెప్పుకోవ‌చ్చ‌ని సూచించారు. జిల్లా గృహ‌నిర్మాణ‌శాఖ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, ఇత‌ర అధికారులు జెసిని క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.

Vizianagaram

2021-06-10 09:47:22

దశలవారీగా అందరికీ కోవిడ్ టీకా..

తూర్పుగోవరి జిల్లాలో అందిరికీ ద‌శ‌ల వారీగా కోవిడ్ టీకా డోసుల ల‌భ్య‌త ఆధారంగా పంపిణీ చేప‌ట్ట‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. టీకాల పంపిణీ స‌జావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేశారు. రిజిస్ట్రేష‌న్‌, వ్యాక్సినేష‌న్‌, నిరీక్ష‌ణ గ‌దుల‌ను ప‌రిశీలించి, అక్క‌డి ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మూడో వేవ్‌లో కోవిడ్ చిన్నారుల‌పై అధిక ప్ర‌భావం చూపుతుంద‌నే సంకేతాల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త ఆధారంగా ఆరు నెల‌ల నుంచి అయిదేళ్ల లోపు పిల్ల‌లు గ‌ల త‌ల్లుల‌కు గురువారం నుంచి టీకాలు వేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, వ్యాక్సినేష‌న్ జ‌రిగేలా చూస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి దాదాపు వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ నాగ‌న‌ర‌సింహారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-10 09:45:31

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వితరణ..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానానికి విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ విరాళంగా అందించింది. ఈ మేరకు బుధవారం ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళకు పెదపూడి శర్మ ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవస్థా అధికారుల కోరిక మేరకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి కూడా సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. వీహెచ్పీ నాయకులు టీపీవీ రావు, జీ. సుబ్రమణ్యం, మీసా రవీంద్ర కృషివల్ల విశాఖపట్నానికి మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయని ఆయన చెప్పారు.  ఈ మూడింటిలో రెండు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లకు అందించామని ఒకటి సింహాచలం దేవస్థానం కోసం ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-09 13:19:08

అప్పన్న దర్శన సమయం పెంపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శన సమయం 2గంటల పెంచినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి దర్శన సమయం పెంచినట్టు వివరిచారు. ఈ పెంచిన సమయం 11వ తేది నుంచి అమలులోకి వస్తుందన్నారు.  ఉదయం 6 :30 నుంచి 1:30 మధ్యలో  భక్తులు దర్శించుకోవచ్చనని తెలియజేశారు. దర్శన సమయంలో ప్రభుత్వ నిర్ధేశించిన కర్ఫ్యూ నిబంధనలు...మాస్కు ధారణ, బౌతిర దూరం, పరిశుభ్రత,  అమలు జరుగుతాయన్నారు. మధ్యలో 11:30 నుంచి 12:00 కు రాజభోగం ఉంటుందని చెప్పారు. సుప్రభాతం నుంచి పవళింపు వరకు ... స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ సంప్రదాయబద్ధంగా జరుగుతాయని వివరించారు. ఈ నియమం 20 వ తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని స్వామివారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Simhachalam

2021-06-09 12:48:24

దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు..

 దేవాలయాల అద్భివృద్ధి , ఆస్తుల పరిరక్షణ పై పూర్తి స్థాయి లో దృష్టి పెదుతున్నట్లు రాష్ట్ర  దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.  జిల్లాలో ఏ ఏ దేవాలయాలు అభివృద్ధికి అవకాశం ఉందో  నియోజక వర్గం వారీగా  ఎమ్మెల్యే  అంగీకారం తో ప్రతిపాదనలు పంపాలని దేవాలయాల అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి కలెక్టరేట్ ఆడిటోరియం లో ప్రజాప్రతినిధులతో కలసి దేవాదాయ శాఖ  అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేవాలయాల భద్రతకు సి సి కెమెరాలు,  పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  నియోజక వర్గం వారీగా  ఉన్న దేవస్థానాల స్థితి గతుల పై పూర్తి నివేదికను 15 రోజుల్లోగా అందించాలని, తదుపరి  ఏ గుడికి ఎలాంటి అభివృద్ధి అవసరం , ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. అన్ని  దేవాలయాల ఈ.ఓ లు ఆయా ప్రజా ప్రతినిధులతో మాట్లాడి నివేదిక నివ్వాలన్నారు. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని  భక్తుల మనో భావాల కనుగుణంగా  భక్తులను భగవంతుని సన్నిధికి చేర్చేలా ఈ-పూజ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని  తెలిపారు.  టి టి డి ఆధ్వర్యం లో ఉత్తరంధ్రకు చెందిన మూడు జిల్లాల్లో వెయ్యి దేవాలయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 100 కుటుంభాలు ఉన్న ఛోట 10 లక్షల వ్యయం తో  ఎస్.సి., ఎస్.టి , బి.సి , మత్స్యకార  గ్రామాల్లో  అక్కడి ప్రజల కోరిక మేరకు హిందూ దేవాలయాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమం క్రింద జిల్లా నుండి కనీసం 100  ప్రాంతాలను ఎంపిక చేసి 15 రోజుల్లో  నివేదిక పంపాలని అన్నారు. 
జగనన్న కాలనీల్లో  దేవాలయాల నిర్మాణం:      రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి 
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం అబినందనీయమని టీటీడీ  ఆధ్వర్యం లో చేపట్టనున్న దేవాలయాలను జగనన్న కాలనీలలో కూడా నిర్మించాలని    రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. రాష్ట్రం లో 17 వేల  జగనన్న కాలనీలు గ్రామాలుగా మారాయని, అన్నీ సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, ఈ కాలనీలు వర్ణ, జాతి బేధాలు లేకుండా అందరికీ సమానంగా నిర్మించడం జరిగిందని, అక్కడ టీటీడీ ద్వారా ప్రజలు  కోరిన విధంగా దేవాలయాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. మొదటి దశ లో కనీసం 100  దేవాలయాల నిర్మాణాలకు శాసన సభ్యుల అంగీకారంతో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.  దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం ముఖ్యమని,  దేవాలయాల సిబ్బంది, అధికారులు వారి పరిధి లోనున్న  ప్రతి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి దేవాలయాల భూములు, ఆభరణాలు,ఇతర  ఆస్తుల పై  సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.  ఏ ఏ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు లు ఏర్పాటు చేయవలసి ఉందో శాసన సభ్యుల సిఫార్శు లతో ప్రతిపాదనలు మంత్రివర్యులకు పంపాలని సూచించారు.  విజయనగరం ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లోకి దేవాలయం పక్కనున్న దుకాణాలను తరలించి అబివృద్ధి చేయడానికి   దేవాదాయ శాఖ సహకరించాలని కోరారు.  రహదారి విస్తరణకు 5 అడుగులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, మరో 5 అడుగులు ఇస్తే సమస్య తీరిపోతుందని అన్నారు.  దుకాణాల వారికి ఇబ్బంది లేకుండా, పండగల్లో ఇరుకుగా లేకుండా అందరికీ  సౌకర్యవంతంగా ఉంటుందని, మరో  5 అడుగులు వెనక్కు వెళ్లడానికి దేవాదాయ కమిషనర్ అనుమతిని ఇవ్వాలని కోరారు.  
పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ , నెల్లిమర్ల శాసన సభ్యులు బద్దుకొండ అప్పల నాయుడు, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు,  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు ,  ఎస్.కోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాస రావు వారి నియోజక వర్గాల్లో నున్న దేవాలయాల సమస్యలు,  అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. 
ఈ సమావేశం లో   సంయుక్త కలెక్టర్ జి.సి. కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు,  ప్రత్యేక అధికారి భ్రమరాంబ,  డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాధవి, మాన్సాస్ ఈ.ఓ వేంకటేశ్వర రావు,  జిల్లా సహాయ కమిషనర్ వినోద్ కుమార్, పలు దేవాలయాల ఈ.ఓ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-09 12:32:03

జనవరి నాటికి రామతీర్ధ ఆలయం..

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై గత ఏడాది డిసెంబర్ లో కొందరు దుండగుల దాడిలో దెబ్బతిన్న రామస్వామి వారి ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది(2022) జనవరి నాటికి పూర్తి చేసి సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు వెల్లడించారు. ఆలయాన్ని ప్రారంభించేందుకు జనవరిలో ముహూర్తాన్ని చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేవాలయాన్ని రాతి కట్టడంగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చిలకలూరిపేట వద్ద రాతి నిర్మాణాలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు.  జనవరి నాటికి ఆలయ నిర్మాణాన్నిత్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. కొండపై ఆలయాన్ని నిర్మించడంలో చాలా ఇబ్బందులు వున్నాయని, నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించడం, విద్యుత్ సరఫరా, నీటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు వున్నా వాటిని పరిష్కరించేందుకు దేవాదాయ శాఖ ప్రాంతీయ కమీషనర్ భ్రమరాంభ ను ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో వున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ సంస్థను కుడా ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా పూర్తి శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం, విగ్రహాల పునఃప్రతిష్ఠ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో కొండపై ఆలయంలో ఘటన జరిగిన వెంటనే నెల రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సీతారాముల విగ్రహాలను తయారు చేయించి ఇక్కడకు రప్పించామన్నారు. వెనువెంటనే రాతి కట్టడంగా ఆలయాన్ని నిర్మించేందుకు మూడు కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ ప్రతిపాదనలు రుపొందించగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినపుడే ఒక ఏడాదిలో ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.

రామతీర్థంలోని రామస్వామి వారి ఆలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడుతో కలసి మంత్రి ఆలయంలో పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండపై నిర్మించనున్న ఆలయ నమూనా చిత్రపటాలను విడుదల చేశారు.

మీడియాతో మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, దీనిలో భాగంగా ఆలయాల్లో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలను రాజకీయం చేయడం తగదని మంత్రి చెప్పారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట దేవాదాయ శాఖ కమీషనర్ అర్జున రావు, దేవాదాయ శాఖ జాయింట్ కమీషనర్ భ్రమరాంభ, ప్రాంతీయ కమీషనర్ సురేష్ బాబు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, సహాయ కమీషనర్లు డి.వి.ప్రసాదరావు, వినోద్ కుమార్, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇ.ఓ. కిశోర్ కుమార్, ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం డి.ఇ. సైదా, ఏ.ఇ. కృష్ణ, నెల్లిమర్ల తహశీల్దార్ రాము తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-09 09:54:01

ఈవిఎంల భద్రతకి పటిష్టచర్యలు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, క‌ట్టుదిట్ట‌మైన ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో త‌నిఖీలు చేప‌ట్టి నివేదిక‌లు రూపొందిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం,  ఎస్‌.అప్పారావు (బీఎస్‌పీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజ‌శేఖ‌ర్ (సీపీఎం), డీఎన్‌వీ భ‌ద్ర‌రావు (తెదేపా), ఆర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు (వైఎస్సార్ సీపీ) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-09 09:39:22

చీని, నిమ్మ సంవత్సరంగా 2021-22..

చీని, నిమ్మ సంవత్సరంగా ఈ  ఏడాది (2021-22) ని ప్రకటిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ,  సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం సిట్రస్ పంటల విస్తరణ అంశంపై నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్ లో  మంత్రి  తమ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం చేకూర్చడమే  కాకుకండా, గ్రామాల్లో ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే నిమ్మ , బత్తాయి (చీని ) పంటల సాగుకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దేశానిర్దేశం చేశారన్నారు. తదనుగుణంగా బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ  ఏడాదిని "నిమ్మ, బత్తాయి సంవత్సరంగా" ప్రకటించాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంచి లాభదాయకమైన ఉత్పత్తుల సాధనకు ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే శాస్త్రీయ పరమైన యాజమాన్య, సాగు పద్దతులపై రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్ బి కె ల ద్వారా నిమ్మ మరియు బత్తాయి సాగు శిక్షణ , సమగ్ర యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.  సిట్రస్ జాతి పండ్ల ఉత్పత్తిలో మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానంలో వుందని, మన రాష్ట్ర బత్తాయి , నిమ్మ పండ్ల దేశీయ రకాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో  మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమ్మ, బత్తాయి జాతి కాయలు, పండ్లు రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయని, వాటిని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చి స్థానిక వినియోగాన్ని పెంచాలని కోరారు.  సిట్రస్ పంటల విస్తరణ ప్రణాళికలపై పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, నిమ్మ,బత్తాయి సాగు చేస్తున్న రైతులతో మంత్రి కన్నబాబు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ జానకి రామ్ , ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-08 15:01:22

ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని దివ్యాంగులకు (వివిధ ప్రతిభావంతులు)  ప్రత్యేక వ్యాక్సినేషన్ ను ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో వేస్తారని నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రతిభావంతులు నగర మేయర్ ను క్యాంప్ ఆఫీసులో కలసి వారి సమస్యలపై,  కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. నగర మేయర్ వెంటనే స్పందించి జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో మాట్లాడి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో దివ్యాంగుల కొరకు ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్ ను తెరవాలని ఆదేశించారు. స్పందించిన వైద్యాధికారి, రేపటి(బుధవారం) నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని పరిశీలించి అవి అమలయ్యే విధంగా చూస్తానని మేయర్ వారికి హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు సురేష్ మేనన్,  రామదాసు శ్రీనివాస రావు,  తిరుపతి, మోహన రావు, 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.   

Arilova

2021-06-08 13:53:03

చివరి వ్యక్తి వరకూ ఫలాలు అందాలి..

 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్ అన్నారు. ఆ మేరకు ప్రతి ఒక్కరూ ఉత్తమ సేవలు అందించాలని కోరారు. మంగళవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శాఖల ప్రగతిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బృందంగా (టీమ్ వర్క్) పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుందామని ఆయన పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల గుండెల్లో నిలుద్దామని ఉద్బోధించారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రత కనిపించాలన్నారు. పంచాయతీల పనితీరుకు పరిశుభ్రత సూచికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక రీచ్ ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, దానిపై వివిధ శాఖల నిర్మాణాలు ఆధార్ ఉంటాయని ఆయన చెప్పారు. మత్స్యకారుల భరోసా క్రింద ఖాతాల్లో జమకాని అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులు తమ శాఖల కార్యకలాపాలను వివరించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ పిఓ సిహెచ్.శ్రీధర్, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, డిఆర్ఓ బి.దయానిధి, ఆర్డీఓలు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ బి.లక్ష్మీపతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, నగర పాలక సంస్థ కమీషనర్ కె.శివ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-08 13:48:33

జిల్లా స‌మ‌గ్రాభివృద్దికి స‌త్వ‌ర చ‌ర్య‌లు..

విజ‌య‌న‌గ‌రంజిల్లా వెనుకబాటు త‌నాన్ని రూపుమాపి, స‌మ‌గ్రాభివృద్దికి స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ‌శాఖామాత్యులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉత్త‌రాంధ్ర ప్రాంతం తీవ్ర నిర్ల‌క్ష్యానికి గుర‌య్యింద‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతాభివృద్దిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ అధ్య‌క్ష‌త‌న జిల్లా స‌మీక్షా  స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లోని ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, గిరిజ‌న శాఖామాత్యులు పాముల పుష్ప‌శ్రీ‌వాణి, మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు హాజ‌ర‌య్యారు. జిల్లాలో కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, ఖ‌రీఫ్ స‌న్న‌ద్ద‌త‌, ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌, నీటి పారుద‌ల ప్రాజెక్టులు, గ్రామీణ ఉపాధిహామీ ప‌నుల ప్ర‌గ‌తి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి, ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ రెండోద‌శ నియంత్ర‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌లు, మూడోద‌శ‌కు స‌న్న‌ద్ద‌త‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతం జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని, రాష్ట్రంలోనే అతి త‌క్కువ‌గా 6శాతం పాజిటివిటీ రేటు న‌మోద‌య్యింద‌న్నారు. ఈ నెల 15 నాటికి పాజిటివిటీ రేటును 5శాతానికి త‌గ్గించ‌డానికి కృషి చేస్తున్నామ‌న్నారు. ఫీవ‌ర్ స‌ర్వే, టెస్టులు, వేక్సినేష‌న్‌, హోమ్ ఐసోలేష‌న్‌, కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, వ్యాధికి చికిత్స త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. జిల్లాలో ఆక్సీజ‌న్‌కు ఎటువంటి కొర‌తా లేద‌ని అన్నారు. బ్లాక్ ఫంగ‌స్ కేసులు జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 13 న‌మోదు కాగా, ఒక‌రిని డిస్‌ఛార్జి చేశామ‌ని, ముగ్గురిని శ‌స్త్ర‌చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. మిగిలిన‌వారికి స్థానికంగానే చికిత్స చేస్తున్నామ‌ని, బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ చికిత్స కోసం జిల్లా కేంద్రాసుప‌త్రిలో 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక వార్డును ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్‌ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వివ‌రించారు. మ‌రో 8,300 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం మిగిలిఉంద‌ని, ఈ నెల 15 లోగా సేక‌ర‌ణ పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

              ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి మాట్లాడుతూ, ఈ-క్రాప్ న‌మోదు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేద‌ని, దీనివల్ల రైతులు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. న‌మోదులో సిబ్బంది బాధ్య‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. అలాగే దీర్ఘ‌వ్యాదిగ్ర‌స్తుల‌కు ఇచ్చే పింఛ‌న్ల మంజూరులో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. చాలామంది అర్హుల‌కు ఈ పింఛ‌న్లు అంద‌టం లేద‌ని, ఇదే స‌మ‌యంలో కొంద‌రు అన‌ర్హులు పింఛ‌న్లు పొందుతున్నార‌ని చెప్పారు. వీటిపై స‌మ‌గ్ర విచార‌ణ చేసి, అర్హుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

             మున్సిప‌ల్ శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, వివిధ అంశాల‌పై కూలంకుషంగా స‌మీక్షించారు. కోవిడ్ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి, పిల్ల‌ల వ‌య‌సుల వారీగా వివ‌రాలు సేక‌రించి, వ‌ర్గీక‌ర‌ణ చేసి, దానికి అనుగుణంగా ప్రణాళిక‌ను సిద్దం చేయాల‌ని సూచించారు.  రైతుకు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, ఎరువుల కొర‌త రాకుండా చూడాల‌ని వ్య‌వ‌సాయాధికారుల‌ను ఆదేశించారు. త‌మ‌ది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని, ఎట్టిప‌రిస్థితిలోనూ రైతుకు న‌ష్టం వాటిల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై స‌మీక్షిస్తూ, మిల్లుల సామ‌ర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, స‌మ‌గ్ర విధానాన్ని రూపొందించాల‌ని సూచించారు. గ్రామీణ ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, రెండుమూడు రోజుల్లో పెండింగ్ బిల్లుల‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు. ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంపై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచేందుకు, ఇళ్ల నిర్మాణాన్ని స‌కాలంలో పూర్తి చేసేందుకు, ప‌ట్ట‌ణాల్లో ప‌బ్లిక్‌హెల్త్ ఇంజ‌నీర్లు, వార్డు ఎమినిటిస్ కార్య‌ద‌ర్శుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

              ఎంఎల్‌సి పివిఎన్ మాధ‌వ్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా అధికారులు తీసుకున్న చ‌ర్య‌ల‌ను అభినందించారు.  ఏప్రెల్ 26న జిల్లా కేంద్రాసుప‌త్రిలో జ‌రిగిన సంఘ‌ట‌ను ప్ర‌స్తావిస్తూ, మృతులు ఎవ‌రైనా ఉంటే, వారికి ప్ర‌భుత్వం నుంచి పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ఆ నాటి సంఘ‌ట‌న‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ ఎవ‌రూ చ‌నిపోలేద‌ని, సాధార‌ణ మ‌ర‌ణాలేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ కార‌ణంగా సుమారు 48 మంది ఉపాధ్యాయులు మ‌ర‌ణించార‌ని, కారుణ్య నియామ‌కాల్లో వారికి త‌గిన ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని కోరారు. బొబ్బిలి శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, గ‌త ఖ‌రీఫ్‌లో 1121 ర‌కం వ‌రి విత్త‌నాలు ఇచ్చార‌ని, దీనివ‌ల్ల జిల్లా రైతుల‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని అన్నారు. జిల్లా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, రైతుకు లాభ‌దాయ‌కంగా ఉండే ర‌కాల‌ను ఇవ్వాల‌ని కోరారు. పార్వ‌తీపురం ఎంఎల్ఏ అల‌జంగి జోగారావు మాట్లాడుతూ, స‌బ్‌ప్లాన్ మండ‌లాల్లోని గిరిజ‌న రైతుల‌కు 90శాతం స‌బ్సిడీపై విత్త‌నాలు ఇస్తున్నార‌ని, ఈ అవ‌కాశాన్ని జిల్లాలోని గిరిజ‌న రైతులంద‌రికీ వ‌ర్తింప‌జేయాల‌ని కోరారు. పార్వ‌తీపురంలో గ‌త రెండు నెల‌లుగా విద్యుత్ స‌మ‌స్య ఉంద‌ని, సీతాన‌గ‌రం వంతెన నిర్మాణ ప‌నులు ఆగిపోయాయ‌ని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఎస్‌.కోట ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే మెరుగైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని అన్నారు. ఎస్‌కోట‌లో ఎల‌క్ట్రిక‌ల్ ఏఇ పోస్టు ఏడాది కాలంగా ఖాలీగా ఉంద‌న్నారు.

                చివ‌రిగా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, అజెండాలోని అన్ని అంశాల‌నూ కూలంక‌షంగా చ‌ర్చించి, త‌గిన నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. జిల్లాలో కోవిడ్ సెకండ్‌వేవ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, మూడో ద‌శ‌వ‌స్తే, దానిని ఎదుర్కొనేందుకు కూడా జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉంద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి హాయంలో స‌కాలంలో రుతుప‌వ‌నాలు కూడా వ‌స్తున్నాయ‌ని, రైతుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ దృష్టికి తెచ్చిన స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తూ, రాజ‌కీయాల‌కు అతీతంగా జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డ‌ప‌డానికి కృషి చేస్తున్నామ‌ని వెలంప‌ల్లి స్ప‌ష్టం చేశారు.

                ఈ స‌మావేశంలో పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, గొడ్డేటి మాధ‌వి, ఎంవివి స‌త్య‌నారాయ‌ణ‌, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, ఎంఎల్ఏలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి జిల్లా ఛైర్మ‌న్ వాకాడ నాగేశ్వ‌ర్రావు, జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు రైతుల‌కు ఎరువులు, విత్త‌నాల‌ను మంత్రుల చేతుల‌మీదుగా అంద‌జేశారు.

Vizianagaram

2021-06-08 13:47:30

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

కరోనా విపత్తు సమయంలో నిరుపేదలకు సహాయం చేసే దాతల సేవలు మరువలేనివని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మంగళవారం నగర  పరిధిలోని ఇటీవల కోవిడ్  బారినపడి కోలుకున్ననిరుపేద కుటుంబాలకు స్వాంతన సేవా సమితి ఆధ్వర్యంలో మేయర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాంతన సేవా సమితి డైరెక్టర్ ప్రజ్ఞా కుమార్, అన్నా గ్రేస్ లకు ఈ నిత్యావసర సరుకులు సమకూర్చి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంతన సేవాసమితి డైరెక్టర్ ప్రజ్ఞా కుమార్, అన్నా గ్రేస్, 11వ వార్డు ఇంచార్జ్  గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-06-08 13:36:53