1 ENS Live Breaking News

ఆపదలో ఆదుకున్నవారే నిజమైన దేవుళ్లు..

కరోనా లాంటి ఆపద  సమయంలో సహాయం చేయడానికి ముందుకి వచ్చిన దాతలు పేదల పాలిట నిజమైన దేవుళ్లని, అలాంటి వారి మేలు మరువరాదని ద్రోణంరాజు శ్రీవాత్సవ పేర్కొన్నారు. గురువారం విశాఖలోని  1 టౌన్ జగన్నాధస్వామి ఆలయంలో దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు జ్ఞాపకార్ధం వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద అర్చకులకు నిత్యవసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ,  సంఘం గౌరవాధ్యక్షులు టిఎస్సార్ పర్యవేక్షణలో ఇలాంటి మంచి కార్యక్రమం నాల్గవ దఫా చేయడం ఆనందంగా వుందన్నారు. కరోనా సమయంలో నిరుపేద అర్చకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకి వచ్చిన సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావురు చరణ్ కుమార్ , లక్ష్మీ కన్నతల్లి, కె. రాంభద్రుడు ,శంకర్ నీల్, విప్పాని మురళీకృష్ణ , ఆలయ ప్రధాన అర్చకులు  జగన్నాదాచార్యులు , ఆనంతాచార్యులు, అరుణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-10 17:14:03

రైతుల జాబితా అందజేయండి..

శ్రీకాకుళం జిల్లాలో ఏ ఏ రైతుకు ఏ ఏ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కావాలో మండలాల వారీగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ జెడి ని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన  వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలపై కంపెనీ డీలర్లుతో కమిటీ తో ఆయన సమావేశం నిర్వహించారు.  పరికరాలకు సంబంధించిన  40 శాతం సబ్సిడీ రైతులకు వస్తుందని ఆయన చెప్పారు.  పరికరాల తయారీ దారులతో ధరలపై మాట్లాడాలన్నారు. డీలర్లు ఫైనల్ ధరలను తెలియజేశారు.  డిసిసిబి బ్యాంకు నుండి బుణం ఆలశ్యం లేకుండా చూడాలని సిఇఓ కు చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్ ఎడి, రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డిడి రాబర్ట్ పాల్, ఆయా కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-10 15:52:57

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు..

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్థ పూర్వ,  గర్భస్థ దశలో పరీక్ష నిర్దారణ నిరోధక చట్టం -1994 సంవత్సరం మరియు దీనికి సంబంధించిన నిబంధనలు 1996 సంవత్సరం  నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె. యాస్మిన్ పేర్కొన్నారు.   గురువారం స్థానిక జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని  డియం అండ్ హెచ్ ఓ  ఛాంబర్ లో పీసీ అండ్ పీఎన్డిటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె.యాస్మిన్ అధ్యక్షతన  జరిగింది.  ఈ సమావేశంలో డా. జె. యాస్మిన్ మాట్లాడుతూ క్రొత్త స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ పై డియం అండ్ హెచ్ ఓ కు సమాచారం ఇవ్వవలసి వుంటుందన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ను 5 సంవత్సరాలకొకసారి రెన్యూవల్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్స్ ను రద్దు చేయడం జరుగుతుందన్నారు.  స్కానింగ్ సెంటర్లలో సిబ్బంది మార్పు జరిగినప్పుడు, క్రొత్త స్కానింగ్ మిషన్స్  కొనుగోలు అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 23 హోస్పిటల్స్ క్రొత్త రిజిస్ట్రేషన్స్ కొరకు, రెన్యూవల్ కొరకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు.  మిషన్స్  మార్పులు చేర్పుల రిజిస్ట్రేషన్స్ కొరకు 22 దరఖాస్తుల అందగా,  అనుమతి  కొరకు జిల్లా అప్రాప్రియేట్ ఆధారీటీ వారికి పంపడం జరిగింద న్నారు.  జిల్లాలో స్కానింగ్ సెంటర్స్ 372  ఉన్నట్లు తెలిపారు. ఏవైనా రిజిస్ట్రేషన్స్ లేని  స్కానింగ్ సెంటర్స్  వెనువెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. లేని పక్షంలో అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో పరీక్షలు చేసేటప్పుడు  పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయ అనే విషయం తల్లితండ్రులకు తెలియజేస్తున్నట్లు వైద్యాధికారి  దృష్టికి వస్తే  స్నానింగ్ సెంటర్స్ ను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసినా   టోల్ ఫ్రీ నెంబర్ 102, 104 కి ఫోన్ చేసి సమాచారం అందించ వచ్చాన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్ల పై సెక్షన్ల వారీగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.  
  ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి టీ. జయసింహా, గైనకాలజిస్ట్ హెచ్ ఓడి డా. పి.చంద్ర శేఖర్, పిల్లల డాక్టర్ జిజిహెచ్ డా. ఆర్. గిరీష్, అసిస్టెంట్ ప్రోపిసర్ మెడికల్ కళాశాల డా. సిహెచ్. సుధాకర్,  ఐద్వా తరపున ఎల్. అరుణ,  సీడ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 

Guntur

2021-06-10 15:33:12

కోవిడ్ లో విద్యాకార్యదర్శిల సేవలు అమోఘం..

కోవిడ్-19 కాలంలో విద్యా కార్యదర్శుల సేవలు మరువరానివని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డి.ఇ.ఒ. శ్రీనివాస్,   వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో ధైర్యంతో విద్యా కార్యదర్శులు 104కాల్స్ ను తీసుకోవడం, మొబైల్ వ్యానుల ద్వారా సచివాలయ పరిధిలో కరోనా సోకిన వారికి   సేవ చేయడం, ప్రతి పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ టెస్టులుకు ఐ.డి. క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్ సెంటర్లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనులు చాల బాగా నిర్వహించారని కొనియాడారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పై స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని అందరు సర్వీసు రిజిస్టర్లు తెరవాలని, ఇంకా సర్వీసు రిజిస్టర్లు తెరవని వారు వెంటనే అధికారులకు తెలియాజేయాలని తెలిపారు. కార్యదర్శులు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజల నుంచి మన్ననలు పొందాలని తెలిపారు.
అనంతరం డి.ఇ.ఒ. శ్రీనివాస్ మాట్లాడుతూ కోవిడ్ లాంటి కష్టకాలంలో విద్యా కార్యదర్శులు నిబద్దతతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేశారని తెలిపారు. సచివాలయాలలో కార్యదర్శులకు అవసరమైన మౌళిక  సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, త్వరలోనే మీ ద్వారా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడతామని తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డి.ఇ.ఒ. శ్రీనివాస్, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-10 14:31:56

జలక్రీడలపై నివేదిక సమర్పించండి..

విజయనగరం జిల్లాలో జల క్రీడల్లో శిక్షణ పునరుద్ధరించే విషయమై తనకు నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె. వెంకటరావు సెట్ విజ్ సి ఇ ఓ ను ఆదేశించారు. జామి మండలం తాటిపూడి జలాశయం వద్ద నిర్మాణంలో ఉన్న జల క్రీడల అకాడమీ భవనాన్ని జె.సి. వెంకటరావు గురువారం సందర్శించి ఈ అకాడమీ ప్రస్తుత పరిస్థితి పై సిఇఓ విజయ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. యువతకు కయాకింగ్, కన్నోయింగ్ తదితర జల క్రీడల్లో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు గతంలో మంజూరు చేశారని వివరించారు. ఈ అకాడమీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని జె.సి. పేర్కొన్నారు. ఏ.పి. సంక్షేమ మౌళిక సదుపాయాల సంస్థ ఈ.ఈ. కూడా పర్యటనలో పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-10 14:02:27

సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపండి..

 ఉన్నతాధికారులు తమ అధికారాన్ని సామాన్యుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, వెలుగులు నింపేందుకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ భవన్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అధికారుల సహకారంతోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగానన్నారు. కోవిడ్ పై పోరాటంలో కుటుంబ సభ్యుల్లాంటి అధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తాను చేపట్టిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక ఎజెండానే స్ఫూర్తి అన్నారు. "అనంతపురము జిల్లా వాసుల మాట కటువు, మనసు వెన్న- ఈ ప్రాంతంలో దొరికేటంత రుచికరమైన పండ్లు మరో చోట  దొరకవు" అన్నారు. జిల్లాను కుటుంబం లాగానే భావించానన్నారు. అనంత జిల్లాను వెనుకబడిన జిల్లాగా పరిగణించ కూడదనుకున్నానని, అభివృద్ధి చెందిన జిల్లాగా ఉండాలనే తపనతో అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందని ఆలోచించడం తన నైజమన్నారు. అందుకే కోవిడ్ సమయంలో వైద్య రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయగలిగేందుకు కృషి చేశానన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లాలో పనిచేయడం గొప్ప సంతృప్తి ఇచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ,  మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-10 13:50:56

అనంత ఆత్మీయత ఎన్నటికీ మరువలేనిది..

 ప్రభుత్వ ఉద్యోగికి వృత్తిరీత్యా బదిలీ కావడం సహజమని అయితే తన జీవితంలో అనంతపురం జిల్లా ప్రజలు , అధికారులు , ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు తదితర వర్గాలు చూపిన ఆత్మీయత ఎన్నటికీ మరువలేనని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయిన నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలవడానికి అనేకమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు , సేవా సంస్థల ప్రతినిధులు,  జర్నలిస్టులు, కవులు, రచయితలు, విద్యార్థులు, కియా మోటార్స్ ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొని  ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ప్రజల ఆత్మీయత మరువలేనిదని ఇంతటి ప్రజల అభిమానం చూరగొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ అభిమానం మరింత బాధ్యతను కూడా  పెంచిందని తెలిపారు. తాను జిల్లా నుండి బదిలీ పై వెళ్లే క్రమంలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన సహకారం ఎనలేనిదని తెలియజేస్తూ ఒక సందర్భంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై ఉన్న అభిమానంతో ఎంతోమంది స్వచ్ఛందంగా వీడ్కోలు పలుకడానికి తరలి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ గా అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యంతో అమలు చేయడం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నానన్నారు.

 కరువు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంలో భాగంగా   సామాజిక ,ఆర్థిక అజెండాలను  ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క జీవన విధానాలను వారి అభ్యున్నతి వైపు పయనింప చేసేందుకు కృషి చేశానన్నారు. తాను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉరవ కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ,  కియాప్రతినిధులు , పలువురు ఉద్యోగులు , ఎమ్మార్పీఎస్, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు , విద్యార్థి సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు . ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలతో కూడిన వినతులను కలెక్టర్ కు అందజేశారు. 

Anantapur

2021-06-10 13:43:52

కొండవాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి..

 మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో చెత్తవేయకుండా చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మోరకు ఎనిమిదవ జోన్ 94వ వార్డు వేపగుంట పరిధిలోని గౌతమ్ నగర్, బి.సి.కోలనీ తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ స్థానిక కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావుతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కోలనీ వాసులతో మాట్లాడుతూ, కొండవాలు ప్రాంతం పైన నివసిస్తున్న వారు కాలువలో చెత్త వేయరాదని, దాని వలన కొండ దిగువ భాగంలో చెత్త పేరుకుపోయి కాలువలు పొంగిపోతాయని తెలిపారు. ప్రతీ రోజు తడి-పొడి చెత్తను విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూడాలని, ప్రతీ రోజు త్రాగు నీరు సమయానికి వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం అధికారులతో మాట్లాడుతూ, రానున్నది వర్షాకాలమని, కాలువలలో నీరు సాఫీగా ప్రవహించే విధంగా చూడాలని, ప్రధాన కాలువలోను చెత్తను, రోడ్లపైన ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఖాళీ  స్థలాలలో తుప్పలు, చెత్త పేరుకు పోకుండా ఆ  స్థల యజమానిచే శుభ్రం చేయించాలని, లేకుంటే వారికి జరిమానా విధించాలని, పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, భూ గర్భ డ్రైనేజీ నుండి మురికి నీరు బయటకు పొంగకుండా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఇంటికి వెళ్లి సీజనల్ వ్యాధులపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధు కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-10 13:36:35

కౌలుదారునికి సాగుదారు హక్కు కార్డు ఉండాలి..

జిల్లాలో ప్ర‌తి కౌలుదారునికి త‌ప్ప‌నిస‌రిగా పంట సాగుదారు హ‌క్కు కార్డు (సీసీఆర్‌సీ) అందించాల‌ని, ఈ కార్డుల జారీకి రైతు భ‌రోసా కేంద్రం స్థాయిలో శుక్ర‌వారం నుంచి 15 రోజుల పాటు ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సీసీఆర్‌సీ కార్డుల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, 100 శాతం కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్.. మండ‌ల‌, డివిజ‌న‌ల్‌, జిల్లాస్థాయి వ్య‌వ‌సాయ‌, రెవెన్యూ అధికారుల‌తో వర్చువ‌ల్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రైతుల‌తో పాటు కౌలు రైతుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అర్హ‌త ఉన్న ప్ర‌తి కౌలుదారునికీ సాగుదారు కార్డు అందించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించి అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో 1,10,000 కార్డులు జారీచేశామ‌ని.. ఇప్పుడు అద‌నంగా మ‌రో రెండు ల‌క్ష‌ల కార్డులను జారీచేయాల‌ని లక్ష్యంగా నిర్దేశించిన‌ట్లు వెల్ల‌డించారు. గ్రామ‌స్థాయిలోని వీఆర్వో, వీఏఏ మొద‌లు జిల్లాస్థాయిలోని జేడీ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి, ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కార్డుల జారీ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్‌బీకే స్థాయిలో జ‌రిగే స‌ద‌స్సుకు మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి (ఎంఏవో), త‌హ‌సీల్దార్ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌న్నారు. కౌలుదారునికి కార్డు అందించ‌డం ఎంత ముఖ్య‌మో భూ య‌జ‌మానికి ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌ద‌నే విష‌యంపై అవగాహ‌న క‌ల్పించ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని, ఈ దిశ‌గా జ‌రిగే స‌ద‌స్సుల్లో రైతులు, కౌలు రైతుల సందేహాల‌ను నివృత్తి చేయాల‌ని సూచించారు. కార్డుల జారీలో పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తామ‌ని, నిర్ల‌క్ష్యం వ‌హించే సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసి, జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాల‌న్నారు. పంట వైవిధ్యంపైనా సీసీఆర్‌సీ స‌ద‌స్సుల్లో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, కేవ‌లం వ‌రికే ప‌రిమితం కాకుండా ఆవ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను దృష్టిలో ఉంచుకొని నీటి ల‌భ్య‌త స‌రిగా లేని ప్రాంతాల్లో లాభ‌సాటి ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై దృష్టిసారించేలా అవగాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. రైతులు ఏయే వ‌రి ర‌కాల‌ను సాగుచేయాల‌నే అంశంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, వినియోగం, లాభ‌దాయ‌క‌త‌, డిమాండ్‌, మార్కెటింగ్ సౌక‌ర్యాలు త‌దిత‌రాల ఆధారంగా వ్య‌వ‌సాయ అధికారులు సూచించిన ర‌కాల‌ను వేసేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జేడీ (ఏ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీడీ(ఏ) ఎస్‌.మాధ‌వ‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, త‌హ‌సీల్దార్లు, ఎంఏవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-10 13:29:28

జూన్ 20వరకూ కోవిడ్ కర్ఫ్యూ అమలు..

కోవిడ్‌-19 విప‌త్తు నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర‌కు జిల్లాలో అమ‌ల‌వుతున్న క‌ర్ఫ్యూ జూన్ 20 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని, శుక్ర‌వారం నుంచి రోజూ మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద‌యం 6 గం. వ‌ర‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేర‌కు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆసుప‌త్రులు, డ‌యాగ్నోస్టిక్ ల్యాబ్‌ల‌కు, ఫార్మ‌సీలతో పాటు అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల పంపిణీతో ముడిప‌డిన వాటికి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం, 2005లోని 51-60 సెక్ష‌న్లతో పాటు ఐపీసీ సెక్ష‌న్ 188, ఇత‌ర వ‌ర్తింపు చ‌ట్టాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు నిబంధ‌న‌ల క‌చ్చిత అమ‌లుకు ఎస్‌పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. 

Kakinada

2021-06-10 13:24:00

జిల్లా కలెక్టర్ కి ఎంపీ మాగుంట సత్కారం..

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఇటీవల  బాధ్యతలు స్వీకరించిన  ప్రవీణ్ కుమార్ ను  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి లు పుష్పగుచ్ఛాలచ్చి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.  ఇటీల విధుల్లోకి చేరిన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వీరు జిల్లా అభివ్రుద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జిల్లా యొక్క స్తితిగతులు, గతంలో పనిచేసిన కలెక్టర్ల అభివ్రుద్ధి, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాగుంట కలెక్టర్ కి వివరించారు. ఎంపీ సూచనలపై సానుకూలంగా స్పందిచిన కలెక్టర్ అన్ని వర్గాల సహకారంతో జిల్లాని అభివ్రుద్ధి పదంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుంగా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.

Ongole

2021-06-10 09:53:46

స‌కాలంలో గృహ‌నిర్మాణాలు పూర్తి చేస్తాం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స‌కాలంలో గృహ‌నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) కె.మ‌యూర్ అశోక్ అన్నారు. ఆయ‌న జాయింట్ క‌లెక్ట‌ర్‌గా గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న‌, ఇంత‌కుముందు తెనాలి స‌బ్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించి, జిల్లాకు బ‌దిలీపై వ‌చ్చారు.  బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ సంద‌ర్భంగా చెన్నారెడ్డి భ‌వ‌న్‌లోని త‌న ఛాంబ‌ర్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మంలో భాగంగా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వం ఇళ్లు కేటాయిస్తోంద‌ని చెప్పారు. ఏడాదికి సుమారు 15ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌న్న‌ది ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద కార్య‌క్ర‌మ‌మ‌ని, ప్ర‌భుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని, ప్ర‌త్యేకంగా ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌ను నియ‌మించింద‌ని చెప్పారు. గృహ‌నిర్మాణం తోపాటు మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తామ‌ని తెలిపారు. జిల్లాలోని అధికారులను స‌మ‌న్వ‌యం చేసుకొని, ప్రభుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా కార్య‌క్ర‌మాన్ని న‌డిపిస్తాన‌ని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సామాన్య ప్ర‌జ‌లు సైతం నేరుగా త‌న‌ను క‌లిసి, త‌మ స‌మ‌స్య‌లను చెప్పుకోవ‌చ్చ‌ని సూచించారు. జిల్లా గృహ‌నిర్మాణ‌శాఖ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, ఇత‌ర అధికారులు జెసిని క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.

Vizianagaram

2021-06-10 09:47:22

దశలవారీగా అందరికీ కోవిడ్ టీకా..

తూర్పుగోవరి జిల్లాలో అందిరికీ ద‌శ‌ల వారీగా కోవిడ్ టీకా డోసుల ల‌భ్య‌త ఆధారంగా పంపిణీ చేప‌ట్ట‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. టీకాల పంపిణీ స‌జావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేశారు. రిజిస్ట్రేష‌న్‌, వ్యాక్సినేష‌న్‌, నిరీక్ష‌ణ గ‌దుల‌ను ప‌రిశీలించి, అక్క‌డి ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మూడో వేవ్‌లో కోవిడ్ చిన్నారుల‌పై అధిక ప్ర‌భావం చూపుతుంద‌నే సంకేతాల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త ఆధారంగా ఆరు నెల‌ల నుంచి అయిదేళ్ల లోపు పిల్ల‌లు గ‌ల త‌ల్లుల‌కు గురువారం నుంచి టీకాలు వేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, వ్యాక్సినేష‌న్ జ‌రిగేలా చూస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి దాదాపు వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ నాగ‌న‌ర‌సింహారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-10 09:45:31

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వితరణ..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానానికి విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ విరాళంగా అందించింది. ఈ మేరకు బుధవారం ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళకు పెదపూడి శర్మ ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవస్థా అధికారుల కోరిక మేరకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి కూడా సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. వీహెచ్పీ నాయకులు టీపీవీ రావు, జీ. సుబ్రమణ్యం, మీసా రవీంద్ర కృషివల్ల విశాఖపట్నానికి మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయని ఆయన చెప్పారు.  ఈ మూడింటిలో రెండు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లకు అందించామని ఒకటి సింహాచలం దేవస్థానం కోసం ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-09 13:19:08

అప్పన్న దర్శన సమయం పెంపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శన సమయం 2గంటల పెంచినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి దర్శన సమయం పెంచినట్టు వివరిచారు. ఈ పెంచిన సమయం 11వ తేది నుంచి అమలులోకి వస్తుందన్నారు.  ఉదయం 6 :30 నుంచి 1:30 మధ్యలో  భక్తులు దర్శించుకోవచ్చనని తెలియజేశారు. దర్శన సమయంలో ప్రభుత్వ నిర్ధేశించిన కర్ఫ్యూ నిబంధనలు...మాస్కు ధారణ, బౌతిర దూరం, పరిశుభ్రత,  అమలు జరుగుతాయన్నారు. మధ్యలో 11:30 నుంచి 12:00 కు రాజభోగం ఉంటుందని చెప్పారు. సుప్రభాతం నుంచి పవళింపు వరకు ... స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ సంప్రదాయబద్ధంగా జరుగుతాయని వివరించారు. ఈ నియమం 20 వ తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని స్వామివారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Simhachalam

2021-06-09 12:48:24