1 ENS Live Breaking News

నిరుపేదలకు భరోసా జగనన్నతోడు..

జగనన్న తోడు పథకం కింద రెండవ విడతలో  రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాలలో  రూ. 10వేల చొప్పున రూ. 370 కోట్లను  విడుదల చేసినట్లు   ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  మంగళవారం నాడు  ఆయన  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి  కంప్యూటర్ బటన్ నొక్కి  నేరుగా  లబ్దిదారుల ఖాతాలలో  నగదు జమ చేసారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  తోపుడు బండ్లపై, బుట్టల్లో  సరుకులు  అమ్మేవారు,  పుట్ పాత్ లపై  వ్యాపారుల చేసేవారు , సైకిల్ , వాహనాలపై  వస్తువులు  అమ్మేవారు , కొండపల్లి, ఏటికొప్పాక కొయ్యబొమ్మల లాంటి  సాంప్రదాయ హస్తకళలపై  ఆధార పడే వారికి  రూ. 10వేల వరకు  వడ్డీ లేని రుణం ఇస్తున్నామని  పేర్కొన్నారు.   గత ఏడాది  జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది  రుణ సౌకర్యం పొందారని  అన్నారు.  అర్హత ఉన్నవారందరికి సహాయం చేస్తున్నామని  సకాలంలో వడ్డీ చెల్లించే వారికి  తిరిగి వారి ఖాతాలలోకి  వడ్డీ జమ చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నుంచి  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర మేయర్ గొలగాని  హరి వెంకట కుమారి,  పార్లమెంట్ సభ్యులు  జి.మాధవి, శాసన సభ్యులు  జి. అమర్ నాథ్, జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు,  అసిస్టెంట్ కలెక్టర్  అదితి సింగ్, డి ఆర్ డి ఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడిపిడి  వై. శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు  మాట్లాడుతూ, చిరువ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారుల  జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని,  వారి వ్యాపార, జీవనోపాధి కార్యక్రమాలకు  ఈ డబ్బును వినియోగించుకొని  ఆర్ధికంగా అభివృద్ది చెందాలని ఈ పథకాన్ని   అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో  మొదటి దశలో గత ఏడాది 54,277 మంది లబ్దిదారులకు రూ. 54.28 కోట్లు  సహాయం చేసామని  తెలిపారు.  ప్రస్తుతం  రెండవ దశలో   35,186 మంది లబ్దిదారులకు రూ. 35.19 కోట్లు సహాయం చేస్తున్నామని  తెలిపారు. ఇందులో  గ్రామీణ ప్రాంతంలో  22,370 మంది  లబ్దిదారు లున్నారని,  జి.వి.ఎం సి పరిధిలో  9,320 మంది లబ్దిదారులున్నారని , నర్సీపట్నం మున్సిపాలిటి పరిధిలో  2,487 మంది  లబ్దిదారులున్నారని , ఎలమంచిలి  మున్సిపాలిటి పరిధిలో 1,009 మంది లబ్దిదారులున్నారని  తెలిపారు. 

Visakhapatnam

2021-06-08 11:10:50

ఆటో డ్రైవర్లకు అండగా వాహన మిత్ర..

కోవిడ్ విపత్తులో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అండగా నిలుస్తోందని .నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 20 వ డివిజన్ లో జరుగుతున్న వాహన మిత్ర సర్వేలో మంగళవారం నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ సాకే చంద్రలేఖ తో కలసి డివిజన్ పరిధిలో ఆర్వ్హత ఉన్న ఆటో డ్రైవర్లనుండి వాహన మిత్ర దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ గతంలో ఆటోలు రిపేరిలు వస్తే రిపేరీ ల కోసం  వడ్డీ వ్యాపారులతో అధిక వడ్డీకి తీసుకునే పరిస్థితి ఉండేదన్నారు..వచ్చిన ఆదాయం వడ్డీ వ్యాపారులకు సరిపోయేదని కుటుంబ పోషణ కు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆటోల మైంటెనెన్స్ కోసం వాహన మిత్ర ప్రవేశ పెట్టి ప్రతియేటా 10వేల రూపాయలు అందిస్తుండటం ఆటో డ్రైవర్లకు వరంగా మారిందన్నారు ఈ అవకాశాన్ని  ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కోవిడ్ సమయంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమేనని ఈ సందర్భంగా మేయర్ కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కుళ్లయిస్వామి, కొర్రపాడు హుస్సేన్ పిరా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-08 11:06:16

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి..

శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ ప్రోజెక్టులు చాలావరకు ఉన్నాయని వాటికి ప్రాధాన్యతను ఇస్తామని, అలాగే అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేస్తూ జిల్లా  సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబరులో నూతన జిల్లా కలెక్టర్ గా విధుల్లోకి చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రతో తనకు చాలా అనుభవం , అనుబంధం ఉందని, తాను విజయనగరం జిల్లాలో దాదాపు మూడేళ్ల  పాటు పనిచేసినట్లు  చెప్పారు.జిల్లాలో గత మూడు మాసాలుగా కోవిడ్ సెకెండ్ వేవ్ నియంత్రణకై జిల్లా యంత్రాంగం,  జిల్లా అధికారులు చాలా కష్టపడి పనిచేసారని,  ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో నెలరోజుల పాటు కరోనా సెకెండ్ వేవ్ ఉండే అవకాశం ఉన్నందున కరోనా  నియంత్రణకు ప్రాధాన్యతను ఇస్తూ అందరి అధికారుల సహకారంతో కోవిడ్ ను  పూర్తిగా నియంత్రించేందుకు కృషిచేస్తామని తెలిపారు. కరోనాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వారంలో రెండు, మూడు సార్లు వీడియోకాన్ఫరెన్సులను నిర్వహిస్తున్నారని, అలాగే జిల్లా కలెక్టర్లు అధికారులతో ప్రతీ రోజూ సమావేశాలను ఏర్పాటుచేస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలు, ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు ముందుకు సాగుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  వ్యవసాయపరంగా జూన్ మొదటివారంలో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయినందున , జిల్లాలో అన్ని చోట్ల సాగు ప్రారంభం అవుతున్నందన వ్యవసాయానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 30 లక్షల గృహనిర్మాణాల కొరకు ప్రత్యేకంగా సంయుక్త కలెక్టర్(హౌసింగ్) ను ప్రభుత్వం ఇటీవల నియమించడం జరిగిందని, జిల్లాలో గృహపట్టాలు పొందిన లబ్ధిదారులకు గృహాలను నిర్మించి అప్పగించడం పెద్ద టాస్క్ అని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తామని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లాకు రావడం తనకు ఆనందంగా ఉందని, ఇక్కడ చాలా మంచి అధికారులు పనిచేసారని, మంచి అధికారులు కూడా ఉన్నారని వారందరి సహకారంతో దేశ, రాష్ట్ర, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తొలుత సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.  అనంతరం   శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వేదపండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలుకగా, ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ పుష్పగుచ్ఛం, దుశ్శాలువతో నూతన కలెక్టర్ కు సత్కరించి స్వామి వారి ప్రసాదాలను అందించారు. 

Srikakulam

2021-06-08 10:56:18

Tirumala

2021-06-08 10:51:38

రాయల్ యూత్ సొసైటీకి ఉత్తమ అవార్డు..

సమాజం అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాలు నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘం అవార్డు ప్రదానం లో భాగంగా 2019- 20 సంవత్సరానికి గాను రాయల్ యూత్ సొసైటీని జిల్లా ఉత్తమ యువజన సంఘంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ డా.ఏ. సిరి లు సొసైటీ అధ్యక్షుడు రమేష్ కు సుంకర అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ" నేటి యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉత్తమ యువ సంఘం రాహుల్ యూత్ సొసైటీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో  నెహ్రూ యువ కేంద్ర డీడీవో శ్రీనివాసులు ,రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసతి భరత్ ,తోట నాగరాజ్ , జగ్గా రఘు, ధనుంజయ, సునీల్, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-08 10:46:09

పేదలకు ఆసరా జగనన్న తోడు..

జగనన్న తోడు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీలేని రుణాలను కరోనా కష్టకాలంలో కూడా పేదలకు ఆసరా గా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలుస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని  వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఏర్పాటు చేసిన జగనన్న తొ డు పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు మాల గుండ్ల శంకర  నారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిరు వ్యాపారు లకు తోడుగా నిలవాలని వారి జీవన విధానాన్ని మార్చాలని అంతేగాక వారందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఒక మంచి ఆలోచనా విధానంతో జగనన్న తోడు పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీలు తీసుకొని పెట్టుబడులు పెట్టి ఎంతో నష్టపోతున్నారని గుర్తించి పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం రూ.10 వేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత  సంవత్సరం నవంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.35 లక్షల మంది లబ్ధిదారులకు  సున్నా వడ్డీ కింద రూ. 10,000 చొప్పున రుణాలను అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రెండవ విడతగా జగనన్న తోడు పథకం ద్వారా 3.70 లక్షల మంది తో కలిపి మొత్తం 9.05 మంది చిరు వ్యాపారులకు రూ 9 .05 కోట్లు అందిస్తున్న ఘనత   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు . ఇలాంటి కార్యక్రమాలు ప్రస్తుత కరోనా కష్టకాలంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు అమలు చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.  అలాగే విధుల్లో తిరుగుతూ చిరు వ్యాపారులను ఆదుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా వడ్డీ లేని రుణాలు జమ చేస్తున్నదని తెలిపారు.  అంతేగాక ప్రభుత్వ పథకాలను ఒక నిర్దిష్టమైన సమయంలో అమలు చేసేందుకు ప్రణాళిక బద్దంగా ముఖ్యమంత్రి సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి క్రమం తప్పకుండా తేదీల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతోందన్నారు. తన పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి హామీలను దశలవారీగా వారిగా నెరవేరు స్తున్నారని మంత్రి శంకర నారాయణ తెలిపారు.

Anantapur

2021-06-08 10:43:10

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వితరణ..

కాకినాడ జేఎన్‌టీయూలోని కోవిడ్ కేర్ కేంద్రంలో రోగుల‌ కోసం రూ.6 ల‌క్ష‌లతో కొనుగోలు చేసిన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, వైద్య ప‌రిక‌రాల‌ను జేఎన్‌టీయూ అడ్మిష‌న్స్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ కేవీ ర‌మ‌ణ‌.. మంగ‌ళ‌వారం వ‌ర్సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరికి అందించారు. సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ రోగుల‌కు చికిత్స‌లో అవ‌స‌ర‌మ‌య్యే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, వైద్య ప‌రిక‌రాల‌ను అందించిన ప్రొఫెస‌ర్ కేవీ ర‌మ‌ణ‌ను క‌లెక్ట‌ర్, జేసీ అభినందించారు. ఇప్ప‌టికే ప్రొఫెస‌ర్ ర‌మ‌ణ రూ.5 ల‌క్ష‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు అందించార‌ని తెలిపారు. తాను సొంతంగా రూ.ల‌క్షా 25 వేలు, యూసీఈకేలో 1984లో ఇంజ‌నీరింగ్ పూర్తిచేసుకున్న స‌హ‌చరుల ద్వారా రూ.10 ల‌క్ష‌లు విరాళాలు సేక‌రించి.. ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, డ‌యాబెటిక్ టెస్టింగ్ కిట్లు వంటివాటిని జిల్లాకు అంద‌జేసిన‌ట్లు ప్రొఫెస‌ర్ కేవీ ర‌మ‌ణ తెలిపారు. కోవిడ్ బారిన‌ప‌డి త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన విద్యార్థులకు అవ‌స‌ర‌మైన పుస్త‌కాలు కూడా అంద‌జేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌,  సీసీసీ ఆర్ఎంవో డా. ఆర్‌.సుద‌ర్శ‌న్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

jntu Kakinada

2021-06-08 10:34:49

తూ.గో.జి. కి రూ.33.45 కోట్లు లబ్ది..

జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ద్వారా తూర్పుగోదావ‌రి జిల్లాలో రెండోవిడ‌త‌లో మొత్తం 33,445 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.33.45 కోట్ల మేర ల‌బ్ధి చేకూరిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి తెలిపారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద రెండో విడ‌త‌లో 3,70,458 మందికి ల‌బ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.370 కోట్ల వ‌డ్డీలేని రుణాల‌ను బ‌ట‌న్ నొక్కి నేరుగా ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద స‌మావేశ మందిరం నుంచి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌; ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, వంగా గీత‌, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర‌బాబు, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి; జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, కీర్తి చేకూరి, జి.రాజ‌కుమారి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో జ‌గ‌న‌న్న తోడు కింద ఇప్ప‌టికే ల‌బ్ధిపొంది విజ‌య‌వంతంగా చిరువ్యాపారాలు నిర్వ‌హిస్తున్న వివిధ ప్రాంతాల‌కు చెందిన లబ్ధిదారులు పండూరు ప‌చ్చ‌ళ్లు, ఉప్పాడ చీర‌లు, వెదురు ఉత్ప‌త్తులు వంటి వాటిని ప్ర‌ద‌ర్శించారు.  ఈ సంద‌ర్భంగా జిల్లాలో ప‌థ‌కం అమ‌లుతీరు వివ‌రాల‌ను క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వివ‌రించారు.

 గ్రామీణ‌ప్రాంతాల్లో డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో స్త్రీనిధి ద్వారా మొత్తం 23,241 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.23 కోట్ల 24 ల‌క్ష‌ల ప‌దివేల రూపాయ‌లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వ‌ర్యంలో పీఎం స్వ‌నిధితో డీసీసీబీ ద్వారా 10,204 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.10 కోట్ల 20 ల‌క్ష‌ల 40 వేల రూపాయ‌లు ల‌బ్ధి చేకూరిన‌ట్లు వెల్ల‌డించారు. ఎస్‌సీ కేట‌గిరీలో 7,375 మంది, ఎస్‌టీ కేట‌గిరీలో 1,388 మంది, బీసీ కేటగిరీలో 14,044 మంది, ఓసీ కేట‌గిరీలో 9,978 మంది, మైనారిటీ కేట‌గిరీలో 660 మంది ల‌బ్ధిపొందిన‌ట్లు తెలిపారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ద్వారా ఎలాంటి పూచీక‌త్తు లేకుండా రూ.10 వేల చొప్పున బ్యాంకు ద్వారా అందుతున్న వ‌డ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, సంప్ర‌దాయ వృత్తిదారులకు పెద్ద ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్నాయ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌ర‌సింహారావు, డీసీసీబీ సీఈవో పి.ప్ర‌వీణ్‌కుమార్‌, స్త్రీనిధి ఏజీఎం ఎం.ధ‌ర్మేంద్ర‌, వివిధ ప్రాంతాల‌కు చెందిన ల‌బ్ధిదారులు, అధికారులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-06-08 10:31:11

జగనన్నతోడు తో చిరు వ్యాపారులకు ప్రోత్సాహం..

జగనన్న తోడు తో జిల్లాలోని చిరువ్యా పారులకు, సంప్రదాయ, చేతి వృత్తి కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు. జగనన్న తోడు రెండవ విడత  కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వెలగ పూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  తోడు క్రింద మొదటి విడత లో  స్త్రీ నిధి, స్వా నిధి క్రింద మొత్తం  23,961 మందికి 23.96 కోట్ల రూపాయల లబ్ధి అందగా రెండవ విడత క్రింద 22,086 మంది  లబ్ధి దారులకు 22.08 కోట్ల రూపాయలు  రుణాలుగా అందజేయడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమానికి జిల్లా నుండి ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, మున్సిపల్ , పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్,  శాసన మండలి సభ్యులు డా. సురేశ్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, బడ్డు కొండ అప్పల నాయుడు, శంబంగి వెంకట చిన్న అప్పల  నాయుడు, అలజంగి జోగా రావు,  సంయుక్త కలెక్టర్ డా. మహేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వి.సి. అనంతరం జిల్లా లబ్ధి దారులకు చెక్కును, గుర్తింపు కార్డులను  అందజేశారు. 
పాద యాత్రలో చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని చేస్తున్నారు:   జగనన్న తోడు లబ్ధిదారు గడి జ్యోతి 
పాదయాత్ర లో తమ వెంట పాల్గొన్నాను, మీరు ఇచ్చిన హామీలన్నీ చేయడం అసాధ్యం అనుకున్నాను.. కానీ అన్నిటిని గుర్తు పెట్టుకుని  మీరు చేసి చూపిస్తున్నారు.. లబ్ధి దారులకు జల్లెడ పట్టి, గుర్తించి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని భావోద్వేగం తో చెప్పారు గడి జ్యోతి.    ఎస్.కోట మండలం భవాని నగర్ కు చెందిన ఈమె ముఖ్యమంత్రి తో  వీడియొ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.   తను కూరగాయల వ్యాపారం చేస్తోందని, 100 రూపాయలు వాడితే వడ్డీ తో కలిపి  150 రూపాయలు సాయంత్రానికి కట్టవలసి వచ్చేదని,   తన లాంటి వాళ్ళకు వడ్డీ భారం లేకుండా తోడు అమలు చేసి మంచి పని చేశారని ముఖ్యమంత్రిని కొనియాడారు.  ముఖ్యమంత్రి తండ్రి గారు స్వర్గీయ రాజ శేఖర్ రెడ్డి గారు పావలా  వడ్డీకి ఇచ్చిన రుణాలను తీసుకున్నామని, ఇప్పుడు సున్నా వడ్డీ ని అందజేసి తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని  పనులు సుళువుగా జరుగుతున్నాయని, గతం లో ఎం.ఆర్.ఓ కార్యాలయాల చుట్టూ పనుల కోసం తిరిగే వాళ్ళమని తెలిపారు.  వై.ఎస్.ఆర్ పెన్షన్, ఆసరా, ఇళ్ల స్థలం, అమ్మ వొడి,  ఇలా అనేక పధకాలతో తాను ఒక్క సంవత్సరం లో 84 వేల రూపాయల  లబ్ధి పొందినట్లు వివరించారు. కరోనా వలన  ప్రభుత్వానికి ఆదాయం లేకపోయిన  వెయ్యి రూపాయలతో పాటు  తమకు ఉచిత రేషన్  అందజేశారని, నాణ్యమైన బియ్యాన్ని అందించారని తెలిపారు. రెండేళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేశారు,  ఐదేళ్లలో మరెంతో చేస్తారని ఆశిస్తున్నామని, మా తరానికే కాదు, మా పిల్లల తరానికి కూడా మీరే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నామని  అన్నారు.

Vizianagaram

2021-06-08 08:20:10

జిల్లా కలెక్టర్ నివాస్ కు ఘన సన్మానం..

కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళుతున్న జె నివాస్ కు సోమవారం వివిధ ఉద్యోగ సంఘాలు ఘనంగా సత్కరించాయి. జిల్లా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జె నివాస్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీతి, న్యాయాన్ని నిలబెట్టాలన్నారు. బాధ్యతను అప్పగించారు అంటే మీ మీద నమ్మకంతో ఇచ్చారని భావించాలన్నారు. కోవిడ్ సమయంలో వలసల నుండి వచ్చిన వారిని క్వారంటీన్ లో విజయవంతంగా చేసారని చెప్పారు. ప్రతి ఉద్యోగిని నమ్మానని ఆయన తెలిపారు. బృందంగా పనిచేసామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అన్ని విషయాల్లో ముందుండాలని ఆలోచించానని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయడానికి, ఇళ్ల పట్టాల పంపిణీలో చక్కటి ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేశారన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి హృదయాలను టచ్ చేశారన్నారు. కోవిడ్ లో ప్రజలు ఇళ్లలో ఉన్నారు - మీరు రోడ్డు మీద ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. కోవిడ్ లో అనేక కొత్త విధానాలు జిల్లాలో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు ఎం. కాళీప్రసాద్ మాట్లాడుతూ విధులు నిర్వహణలో దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో శాయశక్తులా కృషి చేసి సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల పట్ల ప్రాణదాతగా నిలిచారని ప్రశంసించారు.

రెవెన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టివిఎస్ జి కుమార్, ఎస్డీసిలు బి.శాంతి, పి.అప్పారావు, సీతారామయ్య,టి. సవరమ్మ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎన్. నరేంద్ర బాబు, డీఎస్ ఓ డి.వి.రమణ, తహసీల్దార్లు మాట్లాడుతూ విధులు నిర్వహణలో వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. మహిళా అధికారులను ప్రోత్సహించి సమాజంలో మంచి గౌరవం పొందే విధంగా తోడ్పాటును అందించారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా మార్గదర్శకం వహించారని కొనియాడారు. మానవత్వానికి మారుపేరు నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-07 16:50:19

కోవిడ్ లో దాతల సహాయమే ముఖ్యం..

కోవిడ్ వంటి విపత్కరమైన తరుణంలో పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుంటూరు  జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య  పేర్కొన్నారు. సోమవారం గుంటూరు భారతీయ విద్యా భవన్ ఆవరణలో సుమారు 50 కుటుంబాల పేద కళాకారులు, అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటి ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వలన ఎంతోమందికి ఆరోగ్యం దెబ్బతిందని అన్నారు. పనులు లేక చాలామంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కష్ట కాలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నిర్వాహకులు  ఆపదలో ఉన్న ఒక్కో కుటుంబానికి  10 కేజిల బియ్యం, ఒక్కోకేజి చొప్పున కందిపప్పు, నూనె, చింతపండు,గోదుమ పిండి, గోదుమరవ్వ, పంచదారలను 50 కుటుంబాలకు పంపిణీ చేశారు. మొత్తం 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సన్నద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఉపాధ్యక్షులు రామచంద్ర రాజు, కోశాధికారి రవి శ్రీనివాస్, సినీ,నాటక రంగ నటులు, నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ మహ్మమారి త్వరిత గతిన తగ్గిపోవాలని కోరుకుంటున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. కోవిడ్ కారణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూను విధించిన నేపథ్యంలో పనులు లేక కళాకారులు,అర్చకులు పస్తులుంటున్నారు. దీంతో కళాకారులు, అర్చకులు జీవన విధానం కష్టతరమై పోతుందని గ్రహించిన దాతలు రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులు వెల్లడించారు. అర్చకులు, పేదకళాకారులకు ఎంతో కొంత సాయంచేసి ఆదుకోవాలన్న దృక్పదంతో ముందుకు వచ్చిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్రరాజు ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులతో పాటుగా సినీ,నాటక రంగ నటులు, నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ లు పాల్గొని రెడ్ క్రాస్ సొసైటి సేవలను కొనియాడారు.

Srikakulam

2021-06-07 16:44:14

విద్యుత్ బిల్లుకు ధృవపత్రాలు అందించాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధికంగా వెనుకబడిన కులవృత్తులు యస్.సి, యస్.టి విద్యుత్ బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 సం.కు రాయితీ ప్రకటించిందన్నారు. కావున సదరు విద్యుత్ వినియోగదారులు అవసరమైన ధృవపత్రాలను దగ్గరలోని విద్యుత్ శాఖ నందు సమర్పించి రాయితీలను పొందాలని ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీర్ యల్.మహేంద్రనాధ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాయితీ పొందగోరు వినియోగదారులు తమ విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు , కులధృవీకరణ, తెలుపురేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రం, మొబైల్ నెంబరు, అద్దెకు ఉన్నట్లయితే యజమాని ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ ప్రతులను సమర్పించాలని అన్నారు. షెడ్యూల్డు కులాలు మరియు తెగలు వారికి 200 యూనిట్లు, లాండ్రీ షాపు / రజక మరియు నాయీబ్రాహ్మణ కులం  వారికి 150 యూనిట్లు, బంగారు ఆభరణాలు తయారీ, చేనేత కార్మికులు, అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబిసి) వారికి 100 యూనిట్లు వరకు రాయితీ లభించనుందని ఆయన చెప్పారు. జి.ఓ.యం.యస్.నెం.17, తేది08.06.2016 ప్రకారం బలవంతు/బహురూపి, బండారు, బుడబుక్కలు, దాసరి, దొమ్మర, గంగిరెడ్డువారు, జంగం, జోగి, కాటిపాపల, కురచ, మొండివారు, బాండ, మొండిబండ, పిత్చిగుంట్ల, వంశరాజ్, పాముల, పార్థి(నిషికారి), పంబల, దమ్మలి, దమ్మల, దమ్ముల, దమల్, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, వీరముష్టి, నెత్తికొట్ల, వీరభద్రీయ, గుడాల, కంజర-భీభట్ట, కోపమరే, రెడ్డికే, మొండిపట్ట, నొక్కారు, పరికిముగ్గుల, యాత, చోప్మారి, కైకది, జోపినందివాలస్, మందుల, కూనపులి, పాత్ర, రాజన్నల, రాజన్నలు, కసికపడి, కసికపూడి కులాలకు చెందినవారు అత్యంత వెనుకబడిన తరగతులు(ఎంబిసి) క్రింద వస్తారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన సమస్యలున్న 1912 నెంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. 

Srikakulam

2021-06-07 16:30:28

పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటుచేయాలి..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ 5వ జోన్ 53వ వార్డు పరిధిలోని మర్రిపాలెంలో సాయినగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. పిన్ పాయింట్ వారీగా సిబ్బందిని సర్దుబాటు చేయనందున శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనికి నిర్దేశించిన పారిశుధ్య సిబ్బందిని అదే పనికి వినియోగించాలని ఒకరికి రెండు, మూడు పనులు చెప్పరాదని ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, రోడ్లను శుభ్రం చేసిన చిన్న చిన్న చెత్త కుప్పలను వెను వెంటనే తోలగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని ఆదేశించారు. 24x7 మంచినీటి కొరకు తవ్విన రోడ్లను పూడ్చలేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రోడ్లను రిపేరు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, డిసిపి శిల్పి, ఎఎంఒహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.     

విశాఖ సిటీ

2021-06-07 16:19:05

పెండింగ్ అర్జీలు పరిష్కరించండి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తమ ఛాంబరు నుంచి  జివిఎంసి ఉన్నతాధికారులతోను, అందరు జోనల్ కమిషనర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాస్త్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలన, సంక్షేమం ప్రతీ పేదవాడికి అందాలనే ఉద్దేశ్యంతో వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, దీనిని బలోపేతం చేయాలన్నారు. ప్రజలు పెట్టుకునే అర్జీలను పెండింగు లేకుండా వెంట వెంటనే పరిష్కరించాలని, అర్జీలు ఎ స్థాయి అధికారి వద్ద పెండింగు ఉన్నాయో ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగులో ఉన్న జగనన్న చేయూత, వాహన మిత్ర, జగనన్న తోడు తోపాటు, పింఛను పధకం, రైసు కార్డులు, ఇళ్ళ స్థలాలు మొదలైన అర్జీలు సాయంత్రానికి పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.  స్పందనలో ట్విట్టర్ లాంటి సాంఘిక మాధ్యమాల ద్వారా వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని, పారిశుధ్యం, వీధి దీపాలు, మొక్కలు విభాగం, రెవెన్యూ మొదలైన విభాగాల అర్జీలు పెండింగులో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం పూర్తి అయిందని, ఇంకా వారి సర్వీసు రిజిస్టరు తెరవక పోవడంపై కమిషనర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రానికి అందరి సర్వీసు రిజిస్టర్లు తెరవాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన ఇంజినీరు పి. రవి కృష్ణ రాజు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, యుసిడి. (పి.డి.) వై.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు, అందరు జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.       

GVMC office

2021-06-07 16:14:31