1 ENS Live Breaking News

దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు..

 దేవాలయాల అద్భివృద్ధి , ఆస్తుల పరిరక్షణ పై పూర్తి స్థాయి లో దృష్టి పెదుతున్నట్లు రాష్ట్ర  దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.  జిల్లాలో ఏ ఏ దేవాలయాలు అభివృద్ధికి అవకాశం ఉందో  నియోజక వర్గం వారీగా  ఎమ్మెల్యే  అంగీకారం తో ప్రతిపాదనలు పంపాలని దేవాలయాల అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి కలెక్టరేట్ ఆడిటోరియం లో ప్రజాప్రతినిధులతో కలసి దేవాదాయ శాఖ  అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేవాలయాల భద్రతకు సి సి కెమెరాలు,  పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  నియోజక వర్గం వారీగా  ఉన్న దేవస్థానాల స్థితి గతుల పై పూర్తి నివేదికను 15 రోజుల్లోగా అందించాలని, తదుపరి  ఏ గుడికి ఎలాంటి అభివృద్ధి అవసరం , ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. అన్ని  దేవాలయాల ఈ.ఓ లు ఆయా ప్రజా ప్రతినిధులతో మాట్లాడి నివేదిక నివ్వాలన్నారు. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని  భక్తుల మనో భావాల కనుగుణంగా  భక్తులను భగవంతుని సన్నిధికి చేర్చేలా ఈ-పూజ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని  తెలిపారు.  టి టి డి ఆధ్వర్యం లో ఉత్తరంధ్రకు చెందిన మూడు జిల్లాల్లో వెయ్యి దేవాలయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 100 కుటుంభాలు ఉన్న ఛోట 10 లక్షల వ్యయం తో  ఎస్.సి., ఎస్.టి , బి.సి , మత్స్యకార  గ్రామాల్లో  అక్కడి ప్రజల కోరిక మేరకు హిందూ దేవాలయాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమం క్రింద జిల్లా నుండి కనీసం 100  ప్రాంతాలను ఎంపిక చేసి 15 రోజుల్లో  నివేదిక పంపాలని అన్నారు. 
జగనన్న కాలనీల్లో  దేవాలయాల నిర్మాణం:      రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి 
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం అబినందనీయమని టీటీడీ  ఆధ్వర్యం లో చేపట్టనున్న దేవాలయాలను జగనన్న కాలనీలలో కూడా నిర్మించాలని    రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. రాష్ట్రం లో 17 వేల  జగనన్న కాలనీలు గ్రామాలుగా మారాయని, అన్నీ సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, ఈ కాలనీలు వర్ణ, జాతి బేధాలు లేకుండా అందరికీ సమానంగా నిర్మించడం జరిగిందని, అక్కడ టీటీడీ ద్వారా ప్రజలు  కోరిన విధంగా దేవాలయాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. మొదటి దశ లో కనీసం 100  దేవాలయాల నిర్మాణాలకు శాసన సభ్యుల అంగీకారంతో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.  దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం ముఖ్యమని,  దేవాలయాల సిబ్బంది, అధికారులు వారి పరిధి లోనున్న  ప్రతి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి దేవాలయాల భూములు, ఆభరణాలు,ఇతర  ఆస్తుల పై  సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.  ఏ ఏ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు లు ఏర్పాటు చేయవలసి ఉందో శాసన సభ్యుల సిఫార్శు లతో ప్రతిపాదనలు మంత్రివర్యులకు పంపాలని సూచించారు.  విజయనగరం ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లోకి దేవాలయం పక్కనున్న దుకాణాలను తరలించి అబివృద్ధి చేయడానికి   దేవాదాయ శాఖ సహకరించాలని కోరారు.  రహదారి విస్తరణకు 5 అడుగులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, మరో 5 అడుగులు ఇస్తే సమస్య తీరిపోతుందని అన్నారు.  దుకాణాల వారికి ఇబ్బంది లేకుండా, పండగల్లో ఇరుకుగా లేకుండా అందరికీ  సౌకర్యవంతంగా ఉంటుందని, మరో  5 అడుగులు వెనక్కు వెళ్లడానికి దేవాదాయ కమిషనర్ అనుమతిని ఇవ్వాలని కోరారు.  
పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ , నెల్లిమర్ల శాసన సభ్యులు బద్దుకొండ అప్పల నాయుడు, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు,  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు ,  ఎస్.కోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాస రావు వారి నియోజక వర్గాల్లో నున్న దేవాలయాల సమస్యలు,  అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. 
ఈ సమావేశం లో   సంయుక్త కలెక్టర్ జి.సి. కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు,  ప్రత్యేక అధికారి భ్రమరాంబ,  డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాధవి, మాన్సాస్ ఈ.ఓ వేంకటేశ్వర రావు,  జిల్లా సహాయ కమిషనర్ వినోద్ కుమార్, పలు దేవాలయాల ఈ.ఓ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-09 12:32:03

జనవరి నాటికి రామతీర్ధ ఆలయం..

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై గత ఏడాది డిసెంబర్ లో కొందరు దుండగుల దాడిలో దెబ్బతిన్న రామస్వామి వారి ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది(2022) జనవరి నాటికి పూర్తి చేసి సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు వెల్లడించారు. ఆలయాన్ని ప్రారంభించేందుకు జనవరిలో ముహూర్తాన్ని చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేవాలయాన్ని రాతి కట్టడంగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చిలకలూరిపేట వద్ద రాతి నిర్మాణాలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు.  జనవరి నాటికి ఆలయ నిర్మాణాన్నిత్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. కొండపై ఆలయాన్ని నిర్మించడంలో చాలా ఇబ్బందులు వున్నాయని, నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించడం, విద్యుత్ సరఫరా, నీటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు వున్నా వాటిని పరిష్కరించేందుకు దేవాదాయ శాఖ ప్రాంతీయ కమీషనర్ భ్రమరాంభ ను ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో వున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ సంస్థను కుడా ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా పూర్తి శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం, విగ్రహాల పునఃప్రతిష్ఠ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో కొండపై ఆలయంలో ఘటన జరిగిన వెంటనే నెల రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సీతారాముల విగ్రహాలను తయారు చేయించి ఇక్కడకు రప్పించామన్నారు. వెనువెంటనే రాతి కట్టడంగా ఆలయాన్ని నిర్మించేందుకు మూడు కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ ప్రతిపాదనలు రుపొందించగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినపుడే ఒక ఏడాదిలో ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.

రామతీర్థంలోని రామస్వామి వారి ఆలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడుతో కలసి మంత్రి ఆలయంలో పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండపై నిర్మించనున్న ఆలయ నమూనా చిత్రపటాలను విడుదల చేశారు.

మీడియాతో మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, దీనిలో భాగంగా ఆలయాల్లో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలను రాజకీయం చేయడం తగదని మంత్రి చెప్పారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట దేవాదాయ శాఖ కమీషనర్ అర్జున రావు, దేవాదాయ శాఖ జాయింట్ కమీషనర్ భ్రమరాంభ, ప్రాంతీయ కమీషనర్ సురేష్ బాబు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, సహాయ కమీషనర్లు డి.వి.ప్రసాదరావు, వినోద్ కుమార్, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇ.ఓ. కిశోర్ కుమార్, ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం డి.ఇ. సైదా, ఏ.ఇ. కృష్ణ, నెల్లిమర్ల తహశీల్దార్ రాము తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-09 09:54:01

ఈవిఎంల భద్రతకి పటిష్టచర్యలు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, క‌ట్టుదిట్ట‌మైన ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో త‌నిఖీలు చేప‌ట్టి నివేదిక‌లు రూపొందిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం,  ఎస్‌.అప్పారావు (బీఎస్‌పీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజ‌శేఖ‌ర్ (సీపీఎం), డీఎన్‌వీ భ‌ద్ర‌రావు (తెదేపా), ఆర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు (వైఎస్సార్ సీపీ) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-09 09:39:22

చీని, నిమ్మ సంవత్సరంగా 2021-22..

చీని, నిమ్మ సంవత్సరంగా ఈ  ఏడాది (2021-22) ని ప్రకటిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ,  సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం సిట్రస్ పంటల విస్తరణ అంశంపై నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్ లో  మంత్రి  తమ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం చేకూర్చడమే  కాకుకండా, గ్రామాల్లో ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే నిమ్మ , బత్తాయి (చీని ) పంటల సాగుకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దేశానిర్దేశం చేశారన్నారు. తదనుగుణంగా బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ  ఏడాదిని "నిమ్మ, బత్తాయి సంవత్సరంగా" ప్రకటించాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంచి లాభదాయకమైన ఉత్పత్తుల సాధనకు ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే శాస్త్రీయ పరమైన యాజమాన్య, సాగు పద్దతులపై రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్ బి కె ల ద్వారా నిమ్మ మరియు బత్తాయి సాగు శిక్షణ , సమగ్ర యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.  సిట్రస్ జాతి పండ్ల ఉత్పత్తిలో మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానంలో వుందని, మన రాష్ట్ర బత్తాయి , నిమ్మ పండ్ల దేశీయ రకాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో  మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమ్మ, బత్తాయి జాతి కాయలు, పండ్లు రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయని, వాటిని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చి స్థానిక వినియోగాన్ని పెంచాలని కోరారు.  సిట్రస్ పంటల విస్తరణ ప్రణాళికలపై పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, నిమ్మ,బత్తాయి సాగు చేస్తున్న రైతులతో మంత్రి కన్నబాబు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ జానకి రామ్ , ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-08 15:01:22

ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని దివ్యాంగులకు (వివిధ ప్రతిభావంతులు)  ప్రత్యేక వ్యాక్సినేషన్ ను ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో వేస్తారని నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రతిభావంతులు నగర మేయర్ ను క్యాంప్ ఆఫీసులో కలసి వారి సమస్యలపై,  కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. నగర మేయర్ వెంటనే స్పందించి జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో మాట్లాడి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో దివ్యాంగుల కొరకు ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్ ను తెరవాలని ఆదేశించారు. స్పందించిన వైద్యాధికారి, రేపటి(బుధవారం) నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని పరిశీలించి అవి అమలయ్యే విధంగా చూస్తానని మేయర్ వారికి హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు సురేష్ మేనన్,  రామదాసు శ్రీనివాస రావు,  తిరుపతి, మోహన రావు, 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.   

Arilova

2021-06-08 13:53:03

చివరి వ్యక్తి వరకూ ఫలాలు అందాలి..

 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్ అన్నారు. ఆ మేరకు ప్రతి ఒక్కరూ ఉత్తమ సేవలు అందించాలని కోరారు. మంగళవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శాఖల ప్రగతిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బృందంగా (టీమ్ వర్క్) పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుందామని ఆయన పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల గుండెల్లో నిలుద్దామని ఉద్బోధించారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రత కనిపించాలన్నారు. పంచాయతీల పనితీరుకు పరిశుభ్రత సూచికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక రీచ్ ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, దానిపై వివిధ శాఖల నిర్మాణాలు ఆధార్ ఉంటాయని ఆయన చెప్పారు. మత్స్యకారుల భరోసా క్రింద ఖాతాల్లో జమకాని అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులు తమ శాఖల కార్యకలాపాలను వివరించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ పిఓ సిహెచ్.శ్రీధర్, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, డిఆర్ఓ బి.దయానిధి, ఆర్డీఓలు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ బి.లక్ష్మీపతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, నగర పాలక సంస్థ కమీషనర్ కె.శివ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-08 13:48:33

జిల్లా స‌మ‌గ్రాభివృద్దికి స‌త్వ‌ర చ‌ర్య‌లు..

విజ‌య‌న‌గ‌రంజిల్లా వెనుకబాటు త‌నాన్ని రూపుమాపి, స‌మ‌గ్రాభివృద్దికి స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ‌శాఖామాత్యులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉత్త‌రాంధ్ర ప్రాంతం తీవ్ర నిర్ల‌క్ష్యానికి గుర‌య్యింద‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతాభివృద్దిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ అధ్య‌క్ష‌త‌న జిల్లా స‌మీక్షా  స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లోని ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, గిరిజ‌న శాఖామాత్యులు పాముల పుష్ప‌శ్రీ‌వాణి, మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు హాజ‌ర‌య్యారు. జిల్లాలో కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, ఖ‌రీఫ్ స‌న్న‌ద్ద‌త‌, ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌, నీటి పారుద‌ల ప్రాజెక్టులు, గ్రామీణ ఉపాధిహామీ ప‌నుల ప్ర‌గ‌తి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి, ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ రెండోద‌శ నియంత్ర‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌లు, మూడోద‌శ‌కు స‌న్న‌ద్ద‌త‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతం జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని, రాష్ట్రంలోనే అతి త‌క్కువ‌గా 6శాతం పాజిటివిటీ రేటు న‌మోద‌య్యింద‌న్నారు. ఈ నెల 15 నాటికి పాజిటివిటీ రేటును 5శాతానికి త‌గ్గించ‌డానికి కృషి చేస్తున్నామ‌న్నారు. ఫీవ‌ర్ స‌ర్వే, టెస్టులు, వేక్సినేష‌న్‌, హోమ్ ఐసోలేష‌న్‌, కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, వ్యాధికి చికిత్స త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. జిల్లాలో ఆక్సీజ‌న్‌కు ఎటువంటి కొర‌తా లేద‌ని అన్నారు. బ్లాక్ ఫంగ‌స్ కేసులు జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 13 న‌మోదు కాగా, ఒక‌రిని డిస్‌ఛార్జి చేశామ‌ని, ముగ్గురిని శ‌స్త్ర‌చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. మిగిలిన‌వారికి స్థానికంగానే చికిత్స చేస్తున్నామ‌ని, బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ చికిత్స కోసం జిల్లా కేంద్రాసుప‌త్రిలో 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక వార్డును ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్‌ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వివ‌రించారు. మ‌రో 8,300 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం మిగిలిఉంద‌ని, ఈ నెల 15 లోగా సేక‌ర‌ణ పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

              ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి మాట్లాడుతూ, ఈ-క్రాప్ న‌మోదు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేద‌ని, దీనివల్ల రైతులు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. న‌మోదులో సిబ్బంది బాధ్య‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. అలాగే దీర్ఘ‌వ్యాదిగ్ర‌స్తుల‌కు ఇచ్చే పింఛ‌న్ల మంజూరులో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. చాలామంది అర్హుల‌కు ఈ పింఛ‌న్లు అంద‌టం లేద‌ని, ఇదే స‌మ‌యంలో కొంద‌రు అన‌ర్హులు పింఛ‌న్లు పొందుతున్నార‌ని చెప్పారు. వీటిపై స‌మ‌గ్ర విచార‌ణ చేసి, అర్హుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

             మున్సిప‌ల్ శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, వివిధ అంశాల‌పై కూలంకుషంగా స‌మీక్షించారు. కోవిడ్ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి, పిల్ల‌ల వ‌య‌సుల వారీగా వివ‌రాలు సేక‌రించి, వ‌ర్గీక‌ర‌ణ చేసి, దానికి అనుగుణంగా ప్రణాళిక‌ను సిద్దం చేయాల‌ని సూచించారు.  రైతుకు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, ఎరువుల కొర‌త రాకుండా చూడాల‌ని వ్య‌వ‌సాయాధికారుల‌ను ఆదేశించారు. త‌మ‌ది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని, ఎట్టిప‌రిస్థితిలోనూ రైతుకు న‌ష్టం వాటిల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై స‌మీక్షిస్తూ, మిల్లుల సామ‌ర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, స‌మ‌గ్ర విధానాన్ని రూపొందించాల‌ని సూచించారు. గ్రామీణ ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, రెండుమూడు రోజుల్లో పెండింగ్ బిల్లుల‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు. ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంపై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచేందుకు, ఇళ్ల నిర్మాణాన్ని స‌కాలంలో పూర్తి చేసేందుకు, ప‌ట్ట‌ణాల్లో ప‌బ్లిక్‌హెల్త్ ఇంజ‌నీర్లు, వార్డు ఎమినిటిస్ కార్య‌ద‌ర్శుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

              ఎంఎల్‌సి పివిఎన్ మాధ‌వ్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా అధికారులు తీసుకున్న చ‌ర్య‌ల‌ను అభినందించారు.  ఏప్రెల్ 26న జిల్లా కేంద్రాసుప‌త్రిలో జ‌రిగిన సంఘ‌ట‌ను ప్ర‌స్తావిస్తూ, మృతులు ఎవ‌రైనా ఉంటే, వారికి ప్ర‌భుత్వం నుంచి పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ఆ నాటి సంఘ‌ట‌న‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ ఎవ‌రూ చ‌నిపోలేద‌ని, సాధార‌ణ మ‌ర‌ణాలేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ కార‌ణంగా సుమారు 48 మంది ఉపాధ్యాయులు మ‌ర‌ణించార‌ని, కారుణ్య నియామ‌కాల్లో వారికి త‌గిన ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని కోరారు. బొబ్బిలి శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, గ‌త ఖ‌రీఫ్‌లో 1121 ర‌కం వ‌రి విత్త‌నాలు ఇచ్చార‌ని, దీనివ‌ల్ల జిల్లా రైతుల‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని అన్నారు. జిల్లా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, రైతుకు లాభ‌దాయ‌కంగా ఉండే ర‌కాల‌ను ఇవ్వాల‌ని కోరారు. పార్వ‌తీపురం ఎంఎల్ఏ అల‌జంగి జోగారావు మాట్లాడుతూ, స‌బ్‌ప్లాన్ మండ‌లాల్లోని గిరిజ‌న రైతుల‌కు 90శాతం స‌బ్సిడీపై విత్త‌నాలు ఇస్తున్నార‌ని, ఈ అవ‌కాశాన్ని జిల్లాలోని గిరిజ‌న రైతులంద‌రికీ వ‌ర్తింప‌జేయాల‌ని కోరారు. పార్వ‌తీపురంలో గ‌త రెండు నెల‌లుగా విద్యుత్ స‌మ‌స్య ఉంద‌ని, సీతాన‌గ‌రం వంతెన నిర్మాణ ప‌నులు ఆగిపోయాయ‌ని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఎస్‌.కోట ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే మెరుగైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని అన్నారు. ఎస్‌కోట‌లో ఎల‌క్ట్రిక‌ల్ ఏఇ పోస్టు ఏడాది కాలంగా ఖాలీగా ఉంద‌న్నారు.

                చివ‌రిగా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, అజెండాలోని అన్ని అంశాల‌నూ కూలంక‌షంగా చ‌ర్చించి, త‌గిన నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. జిల్లాలో కోవిడ్ సెకండ్‌వేవ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, మూడో ద‌శ‌వ‌స్తే, దానిని ఎదుర్కొనేందుకు కూడా జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉంద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి హాయంలో స‌కాలంలో రుతుప‌వ‌నాలు కూడా వ‌స్తున్నాయ‌ని, రైతుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ దృష్టికి తెచ్చిన స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తూ, రాజ‌కీయాల‌కు అతీతంగా జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డ‌ప‌డానికి కృషి చేస్తున్నామ‌ని వెలంప‌ల్లి స్ప‌ష్టం చేశారు.

                ఈ స‌మావేశంలో పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, గొడ్డేటి మాధ‌వి, ఎంవివి స‌త్య‌నారాయ‌ణ‌, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, ఎంఎల్ఏలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి జిల్లా ఛైర్మ‌న్ వాకాడ నాగేశ్వ‌ర్రావు, జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు రైతుల‌కు ఎరువులు, విత్త‌నాల‌ను మంత్రుల చేతుల‌మీదుగా అంద‌జేశారు.

Vizianagaram

2021-06-08 13:47:30

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

కరోనా విపత్తు సమయంలో నిరుపేదలకు సహాయం చేసే దాతల సేవలు మరువలేనివని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మంగళవారం నగర  పరిధిలోని ఇటీవల కోవిడ్  బారినపడి కోలుకున్ననిరుపేద కుటుంబాలకు స్వాంతన సేవా సమితి ఆధ్వర్యంలో మేయర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాంతన సేవా సమితి డైరెక్టర్ ప్రజ్ఞా కుమార్, అన్నా గ్రేస్ లకు ఈ నిత్యావసర సరుకులు సమకూర్చి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంతన సేవాసమితి డైరెక్టర్ ప్రజ్ఞా కుమార్, అన్నా గ్రేస్, 11వ వార్డు ఇంచార్జ్  గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-06-08 13:36:53

మహా విశాఖను స్వచ్ఛతగా ఉంచాలి..

విశాఖ మహా నగరాన్ని స్వచ్ఛతగా ఉంచాలని జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం  జివిఎంసి ప్రధాన ఆరోగ్య శాఖ అధికారులు, జోనల్ కమిషనర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన సేవ సౌలభ్యం కొరకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దీనిని బలోపేతం చేయాలని, మొదటిగా ప్రతి సచివాలయ పరిధిలో 1,000 నుండి 1,200 వందల ఇళ్ళు మించకుండా వుండాలని ఆ విధంగా ఈ-మ్యాపింగు చేయాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో చెత్త తరలించే వాహనం యొక్క రోడ్డు మ్యాప్ ఉండాలని, పిన్ పాయింట్ వారిగా కార్మికులను సర్దుబాటు చేయాలన్నారు. ఏ పనికి నిర్దేశించిన వారిని ఆ పనికి మాత్రమే కార్మీకులను వినియోగించాలని, త్వరలోనే జివిఎంసికి 690 వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతాయని అన్నారు. ప్రతీ రోజు కాలువలు, రోడ్లను శుభ్రం చేసి ఆ చెత్తను పోగులు పెట్టిన వెంటనే సంచులలో నింపాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయనీయరాదని, బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా చూడాలని, ప్రజా మరుగుదొడ్లు ప్రతి రోజూ శుభ్రంగా ఉంచాలని, వాటిని శుభ్రంగా ఉంచాలని, ప్రతి ఇంటికి మూడు రంగుల చెత్త బుట్టలను అందించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులకు హాజరు పక్కాగా అమలు చేయాలని పారిశుధ్య కార్మీకులు డెప్యుటేషన్ పై ఉంటే వారిని వెనక్కి పిలిపించి పారిశుధ్య పనులకు వినియోగించాలని ఆదేశించారు. ఎవ్వరు ఎక్కడ పనిచేస్తున్నారు, వారి వివరాలు సాయంత్రానికల్లా అందించాలని అధికారులను ఆదేశించారు.    

ఆన్లైన్ వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టం(OWMS) జరగలేదని ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్లి ట్యాగ్ చేయాలని ఆదేశించారు. రోడ్డు స్వీపింగు పక్కాగా జరగాలని స్వీపింగు చేసేటప్పుడు మిషన్ నుండి ధూళి  బయటకు వస్తుందని, దానిని నివారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్.హెచ్.జి. గ్రూప్ ద్వారా సేంద్రీయ ఎరువు తయారీ చేయు విధానం ప్రోత్సహించాలని, సచివాలయాల పరిధిలో బ్లీచింగు, శానిటేషన్ చేయాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులకు దుస్తులు, రైన్ కోట్లు, శానిటరి సామగరి ఇచ్చామని ఇంకా ఎవరైనా తీసుకొనియడల వాటిని వెంటనే అందించాలని, చీపుర్లు, పారలు కూడా కార్మీకులకు అందించాలని, గమ్ బూట్లు, కాలువలో పనిచేసే శానిటరి సూపర్వైజర్లకు పారిశుధ్య కార్మీకులు అందించాలన్నారు. నైట్ శానిటేషన్ పక్కాగా జరగాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల సర్వే కొరకు సచివాలయాల వారికి డ్యూటీలను వేయాలని అందరి హెచ్.ఒ.డి.లకు కమిషనర్ ఆదేశించారని అది ఎంత వరకు అమలు చేశారని ఆరా తీసారు. వెంటనే అందరికి డ్యూటీలు వేయాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అందరు జోనల్ కమిషనర్లు, ఎఎంఓహెచ్లు, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు, ఎం.ఎస్.ఎఫ్.  ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.  

GVMC office

2021-06-08 13:32:37

దేవాదాయ ఆస్తులను పరిరక్షించాలి..

దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు, పునరుద్దరణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆధికారులను ఆదేశించారు.   మంగళవారం మద్యాహ్నం మంత్రి కురసాల కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్/ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్ ,తహసీల్దార్, సర్వేయర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్, కాకినాడ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్యాక్రంతమైన  నూకాలమ్మ, సర్పవరం భావనారాయన స్వామి దేవాలయాల అస్తులను ఆక్రమణదారుల చెరనుండి రక్షించి, పదిల పరచేందుకు, ఆదాయ వనరులు అభివృద్ది చేసేందుకు చేపట్ట వలసిన చర్యలను ఆయన అధికారులకు సూచించారు.  అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న నిధులు, కామన్ గుడ్ ఫండ్ నిధులతో జిల్లాలో  దేవాలయాల నిర్మాణం, జీర్ణస్థితికి చేరిన దేవాలయాల పునరుద్దరణానికి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.  ఈ సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ యం.విజయరాజు, అసిస్టెంట్ కమీషనర్ కెఎన్డివి ప్రసాద్, డిఈఈ గోపాలకృష్ణంరాజు, తహశిల్దారు శిరీష, సర్వేయర్లు సీతారామాచారి, రూప తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-08 13:29:26

ప్ర‌జా సంక్షేమ‌మే ప్రభుత్వం లక్ష్యం..

ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాల‌న సాగుతోంద‌ని.. సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు అర్థం లేనివని ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖా మంత్రి బొత్స స‌త్యనారాయణ వ్యాఖ్యానించారు. కుటుంబ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌ట‌మే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాల ఉద్దేశం అని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఎంతో మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని, కుటుంబ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఆద‌ర్శంగా తీసుకొని కేంద్రం కూడా కొన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని గుర్తు చేశారు. వీధి వ్యాపారులు, తోపుడు బ‌ళ్ల వ్యాపారుల సంక్షేమార్థం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కంలో భాగంగా అంద‌జేసిన ఆర్థిక సాయం జిల్లాలో 46వేల మందికి అందింద‌ని, ఈ సాయం ఎన్నో కుటుంబాల‌కు అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. ఆర్థిక వేత్త‌ల అభిప్రాయం ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే లోపభూయిష్ట‌మైన‌ ఆస్తి ప‌న్ను విధానాన్నిస‌వ‌రించి నూత‌న పన్నుల‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని విలేకరుల‌డిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా చెప్పారు. నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఎలాంటి అవినీతికి తావులేకుండా, సిఫార్సుల అవ‌స‌రం లేకుండా ప‌న్నుల విధానం అమల‌వుతోంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు అర్థంలేనివ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసు, క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ సురేష్ బాబుచ, ఎమ్మెల్యేలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, శంబంగి చిన‌వెంట‌క అప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, త‌దిత‌రులు ఉన్నారు.

Vizianagaram

2021-06-08 13:24:00

చిరువ్యాపారుల అభివ్రుద్ధికే జగనన్నతోడు..

నిరుపేదలు, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ అవస్థలు, అష్టకష్టాలు పడుతున్న వారికి మంచి చేసేందుకే జగనన్న తోడు పధకం రెండో దశకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో జగనన్న తోడు పథకం నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  జగనన్న తోడు పథకం రెండో విడత 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేలు వడ్డి లేని రుణం మొత్తం రూ.370 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి  అక్కచెల్లెమ్ములు, అన్నదమ్ముల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారాలు చేసే వారు  పెట్టుబడి కోసం గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద వందకు పది రుపాయిలు వడ్డీ తీసుకొని ఇబ్బంది పడుతున్నారని గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టామన్నారు. జగనన్న తోడు పథకం తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ. 10 వేలు చోప్పున రుణాలు ఇచ్చామన్నారు. జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే తొలి విడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయని, మిగిలిన 3.70 లక్షల మందికి బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీనిధి వంటి బ్యాంకులను రంగంలోకి దింపి ఈ రోజు రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకుల నుంచి లభించిన రుణాలను వడ్డీతో సహా సకాలంలో చిరువ్యాపారులు బ్యాంకులకు చెల్లిస్తే వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని  నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. దీని వలన రుణం తీసుకున్న వారికి తిరిగి సకాలంలో చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. రుణం మొత్తం చెల్లించిన లబ్దిదారులకు తిరిగి మళ్ళీ వడ్డీ లేని రుణం పొందే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న వారు సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వెరిఫికేషన్  చేసి ప్రతి  మూడు నెలలకు ఒకసారి అర్హత పొందిన దరఖాస్తులకు ఆరునెలలకు ఒకసారి తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్రంలోని 9.05 లక్షల మంది చిరువ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
  గుంటూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్ధాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 28,463 మంది లబ్ధిదారులకు రూ.28.46 కోట్లు అందిస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు అందిస్తున్న రూ.10 వేలు వడ్డీ లేని రుణం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగనన్న తోడు చిరు వ్యాపారులకు జగమంత తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సందేశంతో కూడిన  కరపత్రాన్ని ఆవిష్కరించారు. 

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడికొండ గ్రామానికి చెందిన లబ్దిదారు సరళాదేవి మాట్లాడుతూ  కరోనా కష్టకాలంలో జగనన్న తోడు పథకం ద్వారా రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందించి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నారని తెలిపారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే అన్నారు. వాలంటీర్ ఇంటికి వచ్చి  చిరు వ్యాపారం చేస్తున్న నాకు  జగనన్న పథకం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నట్లు చెబితే సంతోషపడ్డాను అన్నారు. గతంలో గత్యంతరం లేక వడ్డీలకు అప్పులు తీసుకొని వాటిని తీర్చలేక వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితుల్లో ఇంటిలో దాక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  మా పెద్ద కుమార్తెకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రిలో ఉచితంగా కాన్పు చేయటంతో పాటు, ఇంటి వద్దకు వదిలి పెట్టి ఆపరేషన్ చేయించుకున్నందుకు రూ.3000 నగదు ఇచ్చారన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా  ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు పక్కా ఇళ్ళు కట్టి ఇస్తున్నారన్నారు. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తూ కరోనా కష్ట సమయంలోను ఆదుకుంటున్న మీకు     ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. మీరు చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలన్నారు.

      జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా గ్రామీణ పరిధిలోని 22180 మంది లబ్ధిదారులకు  రూ.22.18 కోట్లు, పట్టణ పరిధిలోని 6283 లబ్ధిదారులకు రూ.6.28 కోట్లు చెక్కులను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్ధాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

      వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారాలు, సాంప్రదాయ వృత్తులు చేసుకునే పేదలు 28,463 మందికి రూ.10 వేలు వడ్డీలేని రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా జగనన్నతోడు పధకం రెండు దశలలో 9.05 లక్షలు మందికి వడ్డీలేని రుణాలు అందించామన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలోను పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు అన్ని సంక్షేమ పథకాలు చెప్పిన తేదీకి ఖచ్చితంగా అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధే ధ్యేయంగా అన్ని పథకాలు ద్వారా   ఆర్దిక సాయం అందిస్తున్నారన్నారు. చిరువ్యాపారులు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.10,000  అప్పు చేస్తే వడ్డీ కింద రూ.3000 మినహాయించుకొని రూ.7000 మాత్రమే ఇస్తున్నారని ముఖ్యమంత్రి సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారుల  కష్టాలను తెలుసుకొని  రూ.10వేలు వడ్డీలేని రుణం ఇచ్చేందుకు జగనన్న తోడు పథకంను మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. చిరు వ్యాపారులకు  హామీ లేకుండా బ్యాంకులు రూ.10వేలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నందుకు లబ్ధిదారుల తరుపున ముఖ్యమంత్రికి ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు అన్ని రకాల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. 

      ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి ) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, డిఆర్ఓ పి. కొండయ్య,  డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-08 12:41:11

సేంద్రియ వ్యవసాయంతో ఎంతో లాభం..

సేంద్రీయ వ్యవసాయంతో రైతుకు అధిక లాభం చేకూరుతుందని ఉద్యానవన శాఖ కమీషనర్ యస్.యస్.శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల మండలం కొంగరాంలో 2వేల చదరపు అడుగుల్లో జి.కృష్ణప్రసాద్ నెలకొల్పిన ఫామ్ హౌస్ ను ఆయన సందర్శించారు.  ఫామ్ హౌస్ లో పండించిన కాయగూరలు, పూలమొక్కలను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకున్న ఆయన సేంద్రీయ పద్ధతిలో పంటలను పండిస్తున్న కృష్ణప్రసాద్ ను అభినందించారు. జిల్లాలో చామంతి, బంతి వంటి పూలసాగు విస్తారంగా ఉందని, రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు  చామంతి, బంతి వంటి పూలసాగును మరింత విస్తరింపచేసి ఉద్యానవన శాఖ తరపున రైతులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తే పంటకు అయ్యే ఖర్చులు తగ్గి రాబడి పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పారు. సాంప్రదాయ పద్ధతులే కాకుండా ఆధునిక పద్ధతిలో కూడా ఉద్యానవన పంటలను సాగుచేసి డ్రిప్, పోలీహౌస్  షెడ్ మెట్ లను ప్రభుత్వం అందించే సహకారంతో రైతులు ఏర్పాటుచేసుకొని మరింత అధిక లాభాలను ఆర్జించాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ పర్యటనలో  ఏ.పి.ఎం.ఐ.పి పథక సంచాలకులు ఏ.వి.యస్.వి. జమదగ్ని, ఏ.పి.డి వరప్రసాద్, హెచ్.ఓ స్వాతి, వి.ఏ.ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-08 12:36:10

ఆర్అండ్ఆర్ పనులు పూర్తిచేయాలి..

విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ పరిధిలోని గూడెపువలస, పోలిపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఆర్ & ఆర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవేన్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ పి. కోటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆర్&ఆర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్ లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అన్ని పనులను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జేసీ కిషోర్ కుమార్ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై వివరించారు. ముందుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవేన్, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరరావు లను జేసీ, ఆర్డీవో పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వి.ఎం.ఆర్.డి. ఎ. కమిషనర్ పి.కోటేశ్వరరావు, జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో బి.హెచ్. భవానీ శంకర్, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Bhogapuram

2021-06-08 12:24:11

సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించాలి..

మహావిశాఖ నగర ప్రజలకు సేంద్రీయ ఎరువుల తయారీపై  అవగాహన పెంపొందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలో ఆమె 6వ జోన్ 72వ వార్డు నడుపూర్  ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సేంద్రీయ ఎరువుల తయారీలో మహిళలకు పొదుపు సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని, ఇంటిలో వాడే కూరగాయల తొక్కలు లాంటివి ఉపయోగించి ఎరువులు తయారు చేసే విధానం తెలియపరచి, వాటి నుండి సేంద్రీయ ఎరువు తయారు చేసి పెరటలోని మొక్కలకు ఉపయోగించుకోవచ్చన్నారు. డోర్ టు డోర్ తడి-పొడి చెత్త సేకరణను చేసే విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కోలనీలో త్రాగునీరు సమయం ప్రకారం ఇస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతీ శుక్రవారం “డ్రై” డే పాటించాలని ఇళ్ళలో ఉండే మనీ ప్లాంట్స్, ఫ్రిజ్ వెనుక భాగంలో నిల్వ ఉన్న నీరు, పరిసరాలలో ఉండే కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వస్తువులలోని  నీరు, నీటి కుండీలలోని నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అప్పుడే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. కోలనీ వాసులు పలు సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకు రాగా వాటిని పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.                                
అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రతీ భవనం యొక్క ప్లాన్ వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శుల వద్ద ఉండాలని, అనధికార నిర్మాణాలు ఉండరాదని, ప్రతీ ప్లానింగు కార్యదర్శులు వార్డులో ప్రతీ రోజు తిరగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్ బాబు, సహాకయక ఇంజినీరు సుబ్బారావు, టౌన్ ప్లానింగు అధికారులు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్, వర్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-06-08 12:22:12