1 ENS Live Breaking News

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..

 తిరుచానూరు అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మా వతి అమ్మవారి దర్శ నార్థం ఆలయ మహా ద్వారం వద్ద కు చేరు కున్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఎన్.వి.రమణ దంపతులకు తిరు పతి,తిరుమల దేవ స్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,గౌ.  చంద్రగిరి శాసన సభ్యు లు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జేఈఓ సదా భార్గవి, టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి,ఏఈఓప్రభాకర్ రెడ్డి లు పుష్ప గుచ్ఛా  లతో స్వాగతం పలకగా వేద పండితులు పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనా లతో తీర్థప్రసాదాలు  అంద జేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట ఏపీ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె. లలిత కుమారి,గౌ.జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు,గౌ. ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్ లతోతిరుపతి అర్బన్ అడిషనల్  ఎస్.పి సుప్రజ వీరి వెంట పాల్గొన్నారు.

Tirumala

2021-06-11 09:12:28

పార్టీలు చూడరు..రాజకీయం చేయరు..

 రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల న్నింటినిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూర్చాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఏ పథకంలోనైనా లబ్దిదారుల ఎంపికలో ముఖ్యమంత్రి పార్టీలు చూడరని, రాజకీయం చేయరని కితాబిచ్చారు. రైతు పక్షపాతిగా తాను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రైతులకు మేలు కలిగించే విధంగా తీసుకుంటున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న విధానంతో సీఎం పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కురుపాం నియోజకవర్గస్థాయి సబ్సిడీ వరివిత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తాను తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా రైతులకు మేలు కలిగేవిధంగా తీసుకుంటున్నారని, అనుక్షణం రైతుల మేలు గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తమ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రైతుభరోసా ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చినా, రైతులకు మరింత త్వరగా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే రైతు భరోసాను ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ప్రశంసించారు. రైతుభరోసా సాయాన్ని అందించడంలోనూ, పంటల భీమా పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయడంలోనూ ముఖ్యమంత్రి ఎక్కడా పార్టీలను చూడలేదని, రాజకీయం చేయలేదని స్పష్టం చేసారు. ఈ పథకాలు మాత్రమే కాకుండా ఏ సంక్షేమ పథకమైనా అర్హతకలిగిన ప్రతి ఒక్కరికీ చేరాలని, తమ పార్టీకి ఓటు వేయని వారికైనా అర్హత ఉంటే అన్ని పథకాల్లోనూ లబ్ది చేకూర్చాలన్నది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని అభిప్రాయపడ్డారు. రైతు భరోసా,పంటల భీమా మాత్రమే కాకుండా ఆర్బీకేల్లో విత్తనాలు పంపిణీ చేసే వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. గతంలో రైతులు  విత్తనాల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారని, మండలాల కార్యాలయాల చుట్టూ తిరిగేవారని గుర్తు చేసారు. ఇప్పుడు మండలాఫీసులకు వెళ్లనవసరం లేకుండా ప్రతి సచివాలయ పరిధిలో రైతుభరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామస్థాయిలోనే విత్తనాలను అందిస్తున్నారని, గ్రామ స్థాయిలోనే ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను నియమించారని పుష్ప శ్రీవాణి తెలిపారు.విత్తనాలతో పాటుగా నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులను కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇదికాకుండా రైతులకు ఉచిత విద్యుత్తు, వైయస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్ల కేటాయింపు, మార్కెట్లో వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు, గిరిజన రైతులకు 90 శాతం సబ్బిడీతో విత్తనాలను కూడా అందిస్తున్నారని వివరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధానంతో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అమలు చేసే ఏ పథకంలోనైనా అర్హత ఉంటేచాలు ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందన్నారు. ఏ పథకంలోనైనా అర్హత ఉండి కూడా లబ్ది కలగకపోతే సంబంధిత అధికారులకు, లేదా తమకు ఫిర్యాదు చేయాలని పుష్ప శ్రీవాణి సూచించారు. వైసీపీ మండల కన్వీనర్  మూడడ్ల గౌరీశంకర్ రావు, సర్పంచ్ కోట రమేష్ తోపాటుగా వ్యవసాయశాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జియ్యమ్మవలస

2021-06-11 08:23:46

జగన్న కాలనీల్లో పూర్తిస్థాయి వసతులు..

జగనన్న కాలనీలు సదుపాయాలకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్ అన్నారు. ఆదేశించారు. 2022 మార్చి నాటికి మొదటి దశ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయుటకు కృషి చేయాలన్నారు. దసరా నాటికి సిద్ధం చేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. జిల్లాలో జగనన్న కాలనీలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై రెవెన్యూ జాయింట్ కలెక్టర్ తో సంప్రదించాలని ఆయన ఆదేశించారు. సమయం వృధా కాకుండా పనులు కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే వాటిపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. కాలనీల్లో ప్రతి సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని లే అవుట్లలో విద్యుత్తు స్తంభాలు, ఇతర పరికరాల వివరాలు అంచనా వేయాలని ఇపిడిసీల్ ఎస్.ఇ ని ఆదేశించారు. లే అవుట్లలో సరఫరా చేసిన సామగ్రి వివరాలు ప్రతి రోజు జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని ఆయన అన్నారు.

లే అవుట్ లో మౌళిక సదుపాయాలు కల్పించలేదు అంటే కనీసం వంద నుండి రెండు వందల కుటుంబాలకు సౌకర్యాలు లేదని గ్రహించాలని ఆయన సూచించారు. అన్ని లే అవుట్లలో సౌకర్యాలు కల్పించుటకు డిపిఆర్ లు తయారు చేయాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 24 లే అవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పించుటకు తయారు చేసిన డిపిఆర్ ల కాపీలను గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్ కు ఆయన ఆదేశించారు. జియో టాగింగ్ అన్ని ప్లాటులకు పూర్తి కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యం వహించేవారిని, పనులు సకాలంలో పూర్తి చేయని వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ అన్నారు. లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలని చెప్పారు. పాలకొండ, పలాస లలో కొంత వరకు బాగా జరిగిందని ఇంకా మెరుగుపడాలని ఆయన పేర్కొన్నారు. లే అవుట్లలో మోడల్ గృహాలు నిర్మించాలని ఆయన ఆదేశించారు. శాఖలకు అవసరమైన సామగ్రి ఆయా శాఖలు సమకూర్చుకొని పనులు వేగవంతం కావడానికి శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. లే అవుట్ల వారీగా అవసరమైన సిమెంట్, ఇనుము, ఇసుక తదితర సామగ్రి వివరాలు అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి లే అవుట్ వారిగా ఇసుక రేవులను మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. టెక్కలి లే అవుట్ లో ఇసుక లేదని తెలిపారని దానిని పరిష్కరించాలని గనుల శాఖ డిడిని ఆదేశించారు. వివిధ పథకాల క్రింద నిర్మిస్తున్న ఇళ్ల పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు పూర్తి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

 

గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 752 జగనన్న కాలనీల లే అవుట్లు ఉన్నాయని వాటిలో 729 లే అవుట్లలో చదును చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 663 లే అవుట్లు పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పారు.  41,243 ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు.

ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఇ వి.వి.ఈశ్వర రావు మాట్లాడుతూ 520 లే అవుట్లలో నీటి సౌకర్యం కల్పించుటకు

ఇపిడిసీల్ లో విద్యుత్తుకు రిజిస్ట్రేషన్ చేసామని, 55 లే అవుట్లకు ఇప్పటికే విద్యుత్తు సరఫరా జరిగిందని తెలిపారు.

ఇపిడిసీల్ ఎస్.ఇ ఎల్.మహేంద్రనాథ్ మాట్లాడుతూ లే అవుట్లలో అవసరమగు సౌకర్యాలను అంచనా వేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు,  గృహ నిర్మాణ సంస్థ ఇఇ పి.కూర్మి నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇఇ ఎస్.వీరభద్రరావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ జి.బ్రహ్మయ్య, భూగర్భ జలాలు, ఆడిటింగ్ శాఖ డిడి సి.సి.ఎస్ రావు, ప్రజారోగ్య శాఖ ఇఇ పి.సుగుణాకర రావు, డిపిఓ వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-11 08:17:10

బాల కార్మిక నిర్మూలన అందరి బాధ్యత..

అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం  జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె. వెంకట రావు కలెక్టర్ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జె. వెంకట రావు మాట్లాడుతూ బాల కార్మికులను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, యునిసెఫ్ లెక్కల ప్రకారం బాలకార్మికులు 160 మిలియన్ పెరిగినట్లు నివేదికలు ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.కరోనా సమయంలో తల్లిదండ్రులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలలు కార్మికులుగా మారిపోయే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. పిల్లలను పనిలో పెట్టినా, వారి చేత పని చేయించినా చట్టరీత్యా నేరం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భద్రత కల్పించాలి తప్ప, పిల్లలను పనికి పంపికూడదని తెలిపారు. బాల కార్మికులు ఎక్కడ, ఎవరికి కనిపించినా 1098,100,181 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ బాలలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ, ఈ బాలకార్మిక వ్యవస్థ ద్వారా బాలల హక్కుల ఉల్లంఘనలు జరుగుతుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరు వారి భద్రతకు భరోసా కల్పించాలని భాధ్యత ప్రతి ఒక్కరిదీ అని తెలిపారు. పేదరికం వలన ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను పెంచ లేని పరిస్థితుల్లో ఉంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారిని నేరుగా సంప్రదించాలని తెలిపారు. అటువoటివారికి విద్యా వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం  అధికారి సురగాల చిట్టిబాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సిబ్బంది బి.సాయి కుమార్, డిస్ట్రిక్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ సివికి కాలిబాబు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె వరలక్ష్మి, బవిరెడ్డి శంకర రావు తో పాటు వివిధ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ,తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-11 07:13:09

Simhachalam

2021-06-11 05:30:20

0-5 పిల్లల తల్లులకు కోవిడ్క్సి వేక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో  0 -5 ఏళ్ల వయస్సులోపు గల పిల్లల తల్లులకు కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.  ఇపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు  వయస్సు గల పిల్లల తల్లులకు వేక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన సందర్భంగా భాగంగా 0-5 ఏళ్ల వయస్సులోపు గల పిల్లల తల్లులకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డా. యస్.కె.చాందిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వేక్సినేషన్ తీసుకున్న తల్లులు వారం రోజుల పాటు తగు జాగ్రత్తలు పాటించాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే బలవర్ధకమైన ఆహారం, తాజా కాయగూరలు, పండ్లు తీసుకోవాలని చెప్పారు. వారంలోగా తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే పారసిటామాల్ మాత్రను మాత్రమే తీసుకోవాలని, ఇతర మందులు ఏమీ తీసుకోరాదని ఆమె సూచించారు. ఇంటివద్ద నున్న తల్లులు బరువైన పనులు మాని, తేలికపాటి పనులను మాత్రమే చేసుకోవాలని అన్నారు. ఇతర సమస్యలు ఏమైనా తలెత్తితే దగ్గరలోని వైద్యుని సంప్రదించాలని ఆమె తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ బి.విశ్వేశ్వరరావు, సూపర్ వైజర్ ఆర్.జె.నాయుడు, యన్.అప్పలరాజు, యస్.సంపత్ మరియు ఇతర సచివాలయ సిబ్బంది కలిసి ఇపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్ల లోపు గల పిల్లల తల్లులకు వేక్సినేషన్ చేశారు.

Srikakulam

2021-06-10 17:18:35

ఆపదలో ఆదుకున్నవారే నిజమైన దేవుళ్లు..

కరోనా లాంటి ఆపద  సమయంలో సహాయం చేయడానికి ముందుకి వచ్చిన దాతలు పేదల పాలిట నిజమైన దేవుళ్లని, అలాంటి వారి మేలు మరువరాదని ద్రోణంరాజు శ్రీవాత్సవ పేర్కొన్నారు. గురువారం విశాఖలోని  1 టౌన్ జగన్నాధస్వామి ఆలయంలో దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు జ్ఞాపకార్ధం వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద అర్చకులకు నిత్యవసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ,  సంఘం గౌరవాధ్యక్షులు టిఎస్సార్ పర్యవేక్షణలో ఇలాంటి మంచి కార్యక్రమం నాల్గవ దఫా చేయడం ఆనందంగా వుందన్నారు. కరోనా సమయంలో నిరుపేద అర్చకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకి వచ్చిన సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావురు చరణ్ కుమార్ , లక్ష్మీ కన్నతల్లి, కె. రాంభద్రుడు ,శంకర్ నీల్, విప్పాని మురళీకృష్ణ , ఆలయ ప్రధాన అర్చకులు  జగన్నాదాచార్యులు , ఆనంతాచార్యులు, అరుణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-10 17:14:03

రైతుల జాబితా అందజేయండి..

శ్రీకాకుళం జిల్లాలో ఏ ఏ రైతుకు ఏ ఏ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కావాలో మండలాల వారీగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ జెడి ని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన  వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలపై కంపెనీ డీలర్లుతో కమిటీ తో ఆయన సమావేశం నిర్వహించారు.  పరికరాలకు సంబంధించిన  40 శాతం సబ్సిడీ రైతులకు వస్తుందని ఆయన చెప్పారు.  పరికరాల తయారీ దారులతో ధరలపై మాట్లాడాలన్నారు. డీలర్లు ఫైనల్ ధరలను తెలియజేశారు.  డిసిసిబి బ్యాంకు నుండి బుణం ఆలశ్యం లేకుండా చూడాలని సిఇఓ కు చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్ ఎడి, రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డిడి రాబర్ట్ పాల్, ఆయా కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-10 15:52:57

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు..

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్థ పూర్వ,  గర్భస్థ దశలో పరీక్ష నిర్దారణ నిరోధక చట్టం -1994 సంవత్సరం మరియు దీనికి సంబంధించిన నిబంధనలు 1996 సంవత్సరం  నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె. యాస్మిన్ పేర్కొన్నారు.   గురువారం స్థానిక జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని  డియం అండ్ హెచ్ ఓ  ఛాంబర్ లో పీసీ అండ్ పీఎన్డిటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె.యాస్మిన్ అధ్యక్షతన  జరిగింది.  ఈ సమావేశంలో డా. జె. యాస్మిన్ మాట్లాడుతూ క్రొత్త స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ పై డియం అండ్ హెచ్ ఓ కు సమాచారం ఇవ్వవలసి వుంటుందన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ను 5 సంవత్సరాలకొకసారి రెన్యూవల్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్స్ ను రద్దు చేయడం జరుగుతుందన్నారు.  స్కానింగ్ సెంటర్లలో సిబ్బంది మార్పు జరిగినప్పుడు, క్రొత్త స్కానింగ్ మిషన్స్  కొనుగోలు అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 23 హోస్పిటల్స్ క్రొత్త రిజిస్ట్రేషన్స్ కొరకు, రెన్యూవల్ కొరకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు.  మిషన్స్  మార్పులు చేర్పుల రిజిస్ట్రేషన్స్ కొరకు 22 దరఖాస్తుల అందగా,  అనుమతి  కొరకు జిల్లా అప్రాప్రియేట్ ఆధారీటీ వారికి పంపడం జరిగింద న్నారు.  జిల్లాలో స్కానింగ్ సెంటర్స్ 372  ఉన్నట్లు తెలిపారు. ఏవైనా రిజిస్ట్రేషన్స్ లేని  స్కానింగ్ సెంటర్స్  వెనువెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. లేని పక్షంలో అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో పరీక్షలు చేసేటప్పుడు  పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయ అనే విషయం తల్లితండ్రులకు తెలియజేస్తున్నట్లు వైద్యాధికారి  దృష్టికి వస్తే  స్నానింగ్ సెంటర్స్ ను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసినా   టోల్ ఫ్రీ నెంబర్ 102, 104 కి ఫోన్ చేసి సమాచారం అందించ వచ్చాన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్ల పై సెక్షన్ల వారీగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.  
  ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి టీ. జయసింహా, గైనకాలజిస్ట్ హెచ్ ఓడి డా. పి.చంద్ర శేఖర్, పిల్లల డాక్టర్ జిజిహెచ్ డా. ఆర్. గిరీష్, అసిస్టెంట్ ప్రోపిసర్ మెడికల్ కళాశాల డా. సిహెచ్. సుధాకర్,  ఐద్వా తరపున ఎల్. అరుణ,  సీడ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 

Guntur

2021-06-10 15:33:12

కోవిడ్ లో విద్యాకార్యదర్శిల సేవలు అమోఘం..

కోవిడ్-19 కాలంలో విద్యా కార్యదర్శుల సేవలు మరువరానివని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డి.ఇ.ఒ. శ్రీనివాస్,   వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో ధైర్యంతో విద్యా కార్యదర్శులు 104కాల్స్ ను తీసుకోవడం, మొబైల్ వ్యానుల ద్వారా సచివాలయ పరిధిలో కరోనా సోకిన వారికి   సేవ చేయడం, ప్రతి పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ టెస్టులుకు ఐ.డి. క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్ సెంటర్లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనులు చాల బాగా నిర్వహించారని కొనియాడారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పై స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని అందరు సర్వీసు రిజిస్టర్లు తెరవాలని, ఇంకా సర్వీసు రిజిస్టర్లు తెరవని వారు వెంటనే అధికారులకు తెలియాజేయాలని తెలిపారు. కార్యదర్శులు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజల నుంచి మన్ననలు పొందాలని తెలిపారు.
అనంతరం డి.ఇ.ఒ. శ్రీనివాస్ మాట్లాడుతూ కోవిడ్ లాంటి కష్టకాలంలో విద్యా కార్యదర్శులు నిబద్దతతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేశారని తెలిపారు. సచివాలయాలలో కార్యదర్శులకు అవసరమైన మౌళిక  సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, త్వరలోనే మీ ద్వారా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడతామని తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డి.ఇ.ఒ. శ్రీనివాస్, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-10 14:31:56

జలక్రీడలపై నివేదిక సమర్పించండి..

విజయనగరం జిల్లాలో జల క్రీడల్లో శిక్షణ పునరుద్ధరించే విషయమై తనకు నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె. వెంకటరావు సెట్ విజ్ సి ఇ ఓ ను ఆదేశించారు. జామి మండలం తాటిపూడి జలాశయం వద్ద నిర్మాణంలో ఉన్న జల క్రీడల అకాడమీ భవనాన్ని జె.సి. వెంకటరావు గురువారం సందర్శించి ఈ అకాడమీ ప్రస్తుత పరిస్థితి పై సిఇఓ విజయ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. యువతకు కయాకింగ్, కన్నోయింగ్ తదితర జల క్రీడల్లో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు గతంలో మంజూరు చేశారని వివరించారు. ఈ అకాడమీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని జె.సి. పేర్కొన్నారు. ఏ.పి. సంక్షేమ మౌళిక సదుపాయాల సంస్థ ఈ.ఈ. కూడా పర్యటనలో పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-10 14:02:27

సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపండి..

 ఉన్నతాధికారులు తమ అధికారాన్ని సామాన్యుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, వెలుగులు నింపేందుకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ భవన్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అధికారుల సహకారంతోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగానన్నారు. కోవిడ్ పై పోరాటంలో కుటుంబ సభ్యుల్లాంటి అధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తాను చేపట్టిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక ఎజెండానే స్ఫూర్తి అన్నారు. "అనంతపురము జిల్లా వాసుల మాట కటువు, మనసు వెన్న- ఈ ప్రాంతంలో దొరికేటంత రుచికరమైన పండ్లు మరో చోట  దొరకవు" అన్నారు. జిల్లాను కుటుంబం లాగానే భావించానన్నారు. అనంత జిల్లాను వెనుకబడిన జిల్లాగా పరిగణించ కూడదనుకున్నానని, అభివృద్ధి చెందిన జిల్లాగా ఉండాలనే తపనతో అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందని ఆలోచించడం తన నైజమన్నారు. అందుకే కోవిడ్ సమయంలో వైద్య రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయగలిగేందుకు కృషి చేశానన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లాలో పనిచేయడం గొప్ప సంతృప్తి ఇచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ,  మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-10 13:50:56

అనంత ఆత్మీయత ఎన్నటికీ మరువలేనిది..

 ప్రభుత్వ ఉద్యోగికి వృత్తిరీత్యా బదిలీ కావడం సహజమని అయితే తన జీవితంలో అనంతపురం జిల్లా ప్రజలు , అధికారులు , ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు తదితర వర్గాలు చూపిన ఆత్మీయత ఎన్నటికీ మరువలేనని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయిన నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలవడానికి అనేకమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు , సేవా సంస్థల ప్రతినిధులు,  జర్నలిస్టులు, కవులు, రచయితలు, విద్యార్థులు, కియా మోటార్స్ ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొని  ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ప్రజల ఆత్మీయత మరువలేనిదని ఇంతటి ప్రజల అభిమానం చూరగొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ అభిమానం మరింత బాధ్యతను కూడా  పెంచిందని తెలిపారు. తాను జిల్లా నుండి బదిలీ పై వెళ్లే క్రమంలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన సహకారం ఎనలేనిదని తెలియజేస్తూ ఒక సందర్భంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై ఉన్న అభిమానంతో ఎంతోమంది స్వచ్ఛందంగా వీడ్కోలు పలుకడానికి తరలి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ గా అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యంతో అమలు చేయడం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నానన్నారు.

 కరువు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంలో భాగంగా   సామాజిక ,ఆర్థిక అజెండాలను  ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క జీవన విధానాలను వారి అభ్యున్నతి వైపు పయనింప చేసేందుకు కృషి చేశానన్నారు. తాను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉరవ కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ,  కియాప్రతినిధులు , పలువురు ఉద్యోగులు , ఎమ్మార్పీఎస్, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు , విద్యార్థి సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు . ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలతో కూడిన వినతులను కలెక్టర్ కు అందజేశారు. 

Anantapur

2021-06-10 13:43:52

కొండవాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి..

 మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో చెత్తవేయకుండా చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మోరకు ఎనిమిదవ జోన్ 94వ వార్డు వేపగుంట పరిధిలోని గౌతమ్ నగర్, బి.సి.కోలనీ తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ స్థానిక కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావుతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కోలనీ వాసులతో మాట్లాడుతూ, కొండవాలు ప్రాంతం పైన నివసిస్తున్న వారు కాలువలో చెత్త వేయరాదని, దాని వలన కొండ దిగువ భాగంలో చెత్త పేరుకుపోయి కాలువలు పొంగిపోతాయని తెలిపారు. ప్రతీ రోజు తడి-పొడి చెత్తను విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూడాలని, ప్రతీ రోజు త్రాగు నీరు సమయానికి వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం అధికారులతో మాట్లాడుతూ, రానున్నది వర్షాకాలమని, కాలువలలో నీరు సాఫీగా ప్రవహించే విధంగా చూడాలని, ప్రధాన కాలువలోను చెత్తను, రోడ్లపైన ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఖాళీ  స్థలాలలో తుప్పలు, చెత్త పేరుకు పోకుండా ఆ  స్థల యజమానిచే శుభ్రం చేయించాలని, లేకుంటే వారికి జరిమానా విధించాలని, పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, భూ గర్భ డ్రైనేజీ నుండి మురికి నీరు బయటకు పొంగకుండా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఇంటికి వెళ్లి సీజనల్ వ్యాధులపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధు కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-10 13:36:35