1 ENS Live Breaking News

రుయా సీమకే తలమానికం కావాలి..

 వైద్యసేవలపై విమర్శలువద్దు, అకారణంగా వైద్య వృత్తి వారిపై నిందలు మోపితే దేవుడిపై నిందలు మోపినట్లేనని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలోని కోవిడ్ బారిన పడినటువంటి వారి పరిస్థితులను స్వయంగా వార్డులలో పర్యటించి  
ఆప్యాయతతో  పలకరిస్తూ,  భుజం తట్టి నేనున్నానని మనో   ధైర్యాన్ని , భయపడ వద్దని భరోసా ఇస్తూ రోగుల తరఫు బంధువులకు అభివాదం చేస్తూ  తాను అండగా ఉంటానని హామీనిచ్చారు.  రాష్ట్ర  ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందన్నదని, తిరుపతి రుయా కోవిడ్ సెంటర్  చికిత్స పొందుతున్న వారి  ఆరోగ్యస్థి, బాగోగులు వంటివి  వైద్యులును కూడా ఆరా తీస్తూ  వారికి మరింత  మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రిలో పర్యటన అనంతరం మీడియాకు వివరిస్తూ..కరోనా గత కొద్దిరోజులుగా తగ్గు ముఖం పట్టడం శుభ సూచికమని, పేదల ఆసుపత్రిగా  రుయా  చేరిన కొవిడ్ బారిన పడినటువంటివారిని ఎంతోమందిని  బ్రతికించిందని అన్నారు.  రుయాలో రుయా ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని, వైద్యసేవలతో పాటు వారి మానసిక స్థితి, అభిప్రాయాలు తెలుసుకుని మనోధైర్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చుకుంటే రుయా ఆసుపత్రి నుండి కరోనా నుండి ఆరోగ్యంగా వెళ్ళిన వారే ఎక్కువగా వున్నారని అన్నారు.  మన కళ్ళ ముందే మన ఆత్మీయులు మరణిస్తే ఆసుపత్రి నిర్లక్ష్యం అనడం తప్పని,  వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి  ప్రమాదం సంభవిస్తే  వారి బంధువులు, అటెండర్లు సంబంధిత  వారికి  ధైర్యం ఇవ్వాలే తప్ప, అకారణంగా వైద్యుల పై ఆరోపణల చేయడం వల్ల వైద్యుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసినట్లు అవుతుందన్నారు. రుయాలో అందిస్తున్న వైద్యసేవలకు సూపరింటెండెంట్ డా. భారతి వారి బృందాన్ని ఆబినందిస్తున్నానని అన్నారు. రుయాలో హోమ్ గార్డుల జీతాల ఆలస్యం విషయంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో మాట్లాడి చేస్తున్నారని , నేను కూడా  కోవిడ్ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రికి సూచించమని త్వరలో అందుతాయని అన్నారు. కలెక్టర్  ఉద్యోగులకు, వైద్యసిబ్బందికి  పని ఒత్తిడి పెంచుతున్నారనే అనడం సరికాదని వారు చక్కగా పనిచేస్తున్నారని అన్నారు.

Tirupati

2021-06-14 11:24:57

భవన నిర్మాణ పక్షోత్సవాలు విజయవంతం కావాలి..

 ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌న నిర్మాణాల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని, ఇందుకోసం జూన్ 17 నుంచి జులై 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న భ‌వన నిర్మాణ ప‌క్షోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసేందుకు జిల్లాస్థాయిలో ఏర్పాటైన ప్ర‌త్యేక క‌మిటీ జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనుసంధానంతో గ్రామ స‌చివాల‌యాల నిర్మాణాలు జూన్ 30 నాటికి, ఆర్‌బీకేల‌ను జులై 8 నాటికి, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల‌ను జులై 31 నాటికి, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (తొలిద‌శ‌)ను జూన్ 30 నాటికి పూర్తిచేయాల్సి ఉంద‌న్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల‌తో 4,492 భ‌వ నిర్మాణాలకు అనుమ‌తులు మంజూరుకాగా వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తికాగా మ‌రికొన్ని నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. జేసీ (ఆస‌రా) నేతృత్వంలో జిల్లాస్థాయి క‌మిటీ, ఎంపీడీవో/పీవో, ఈజీఎస్ నేతృత్వంలో మండ‌ల‌స్థాయి క‌మిటీ, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి (గ్రేడ్‌-1) నేతృత్వంలో గ్రామ‌స్థాయి క‌మిటీలు నిర్మాణ ప‌నుల స‌త్వ‌ర పూర్తికి కృషిచేస్తాయ‌ని వివ‌రించారు. శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణాలకు సంబంధించి మెటీరియ‌ల్‌, లేబ‌ర్ త‌దిత‌రాల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో క్షేత్ర‌స్థాయి అధికారుల స‌మ‌న్వ‌యంతో వెంట‌నే ప‌రిష్క‌రించాల్సి ఉంటుంద‌న్నారు. గ్రామ‌స్థాయి క‌మిటీలు రోజువారీ ప్ర‌గ‌తిని న‌మోదుచేసి, ఎప్ప‌టిక‌ప్పుడు మండ‌ల‌స్థాయి క‌మిటీల‌కు తెలియ‌జేయాల్సి ఉంటుంద‌న్నారు. అదే విధంగా మ‌డ‌ల‌స్థాయి క‌మిటీలు గ్రామాల్లో సంద‌ర్శించి.. ప్ర‌జాప్ర‌తినిధులు, సిబ్బందితో స‌మావేశ‌మై ప‌నుల పూర్తికి కృషిచేయ‌డంతో పాటు ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను నిర్దేశ ఫార్మాట్ల‌లో జిల్లాస్థాయి అధికారుల‌కు పంపాల్సి ఉంటుంద‌ని, అదే విధంగా మొబైల్ యాప్‌లో ఫొటోల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్‌లు, వార్డు స‌భ్యులను భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా నిర్మాణ ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని సూచించారు. వివిధ స్థాయుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, మార్గ‌నిర్దేశ‌నానికి జిల్లాస్థాయిలో ప్ర‌త్యేక కాల్‌సెంట‌ర్ కూడా ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. జిల్లాస్థాయి క‌మిటీ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు ప్ర‌గ‌తిపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో అల‌స‌త్వం వ‌హించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ బీఎస్ రవీంద్ర, వ్య‌వ‌సాయ శాఖ డీడీ ఎస్‌.మాధ‌వ‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-14 11:22:16

నీతి నిజాయితీలతో పనిచేయాలి..

 ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నీతి నిజాయితీల‌తో ప‌నిచేసి మంచి పేరు తెచ్చుకోవా ల‌ని జిల్లా క‌లెక్టర్డా.ఎం .హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ హిత‌వు ప‌లికారు. జిల్లాలో మ‌ర‌ణించిన ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో వారి వార‌సులు, కుటుంబ స‌భ్యుల‌కు వివిధ‌ ప్రభుత్వ శాఖ‌ల్లో ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిస్తూ ఐదుగురికి క‌లెక్టర్ సోమ‌వారం నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు. వీరిలో పెద‌కాపు అశోక్‌(స‌హ‌కార‌), మూల‌మండ్ల శైల‌జ‌(భూగ‌ర్భ జ‌లాలు), స‌బ్బవ‌ర‌పు ప్రదీప్ చంద్ర‌(రెవిన్యూ), నిమ్మక సంతోష్ కుమార్‌(ఖ‌జానా శాఖ) ల‌ను జూనియ‌ర్ అసిస్టెంట్‌లుగా, కొండ‌గొర్రి వంశీకి వ్యవ‌సాయ శాఖ‌లో కార్యాల‌య స‌హాయ‌కునిగా అవ‌కాశం క‌ల్పిస్తూ క‌లెక్టర్ నియామ‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యువ ఉద్యోగులు క‌ష్టప‌డి ప‌నిచేసే త‌త్వాన్ని అల‌వ‌ర‌చుకోవాల‌ని కోరారు. త‌మ‌కు ల‌భించిన ఈ అవ‌కాశాన్ని ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఉప‌యోగించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, క‌లెక్టరేట్ ఏ.ఓ. దేవ‌ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-14 11:18:53

ఓలమ్ ఆక్సిజన్ మిషన్లు వితరణ..

కోవిడ్ రెండోద‌శ‌లో రోగుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో సామాజిక బాధ్య‌త‌గా ఓల‌మ్ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ జిల్లాకు ప‌ది ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉద‌యం క‌లెక్ట‌రేట్‌లో సంస్థ ప్ర‌తినిధులు కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌క్షంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి దాదాపు రూ.13 ల‌క్ష‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అంద‌జేశారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న బాధితుల‌కు ప్రాణ‌వాయువును అందించేందుకు ఉప‌యోగ‌ప‌డే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన ఓల‌మ్ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ‌కు క‌లెక్ట‌ర్‌, శాస‌న‌స‌భ్యులు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాకినాడ పోర్టు శ్రామికుల‌కు మ‌ల్టీ విట‌మిన్ టాబ్లెట్లు, శానిటైజ‌ర్లు, మాస్కులు వంటివి కూడా అందిస్తున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఓల‌మ్ సంస్థ మేనేజ‌ర్ ఛార్లెస్‌, క‌స్ట‌మ్స్ బ్రోక‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, షిప్పింగ్ ఇన్‌ఛార్జ్ వెంక‌టేశ్, శ్రీనివాస్‌రెడ్డి, క‌ళ్యాణ్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-14 09:36:19

రక్తదాతలే నిజమైన దేవుళ్లు..

 ప్ర‌తీఒక్క‌రూ ముందుకు రావాల‌ని ఇండియ‌న్‌ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్ కెఆర్‌డి ప్ర‌సాద‌రావు కోరారు. ఆరోగ్య‌వంతులైన వారు ప్ర‌తీ మూడు నెల‌ల‌కూ ఒక‌సారి ర‌క్త‌దానం చేయ‌వ‌చ్చున‌ని సూచించారు.  ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా  స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో సోమ‌వారం ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ప‌లువురు స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఛైర్మ‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, ర‌క్త‌దానానికి స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని కోరారు. ర‌క్త‌దానంపై అపోహ‌ల‌ను విడ‌నాడాల‌ని, ఆరోగ్య‌వంతులంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి, ర‌క్త దాత‌లుగా త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.  ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా, ర‌క్త‌దాత‌ల‌ను స‌త్క‌రించారు.
             ఈ కార్య‌క్ర‌మంలో జూనియ‌ర్ రెడ్‌క్రాస్ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త ఎం.రామ్మోహ‌న్‌,  మేనేజింగ్ క‌మిటీ స‌భ్యులు పి.రామ‌కృష్ణారావు,  రెడ్డి ర‌మ‌ణ‌,   జిల్లా బాలల హ‌క్కుల క‌మిటీ మాజీ ఛైర్మ‌న్‌ కేస‌లి అప్పారావు, నాల్గ‌వ త‌ర‌గ‌తి ఉద్యోగుల సంఘం జిల్లా నాయ‌కులు మువ్వ‌ల గంగాప్ర‌సాద్ త‌దిత‌ర లైఫ్ మెంబ‌ర్లు,  రెడ్‌క్రాస్ వైద్యులు డాక్ట‌ర్ బి.కామేశ్వ‌ర్రావు, ఏపిఆర్ఓ ఎం.రాము, ఫీల్డ్ ఆఫీస‌ర్ డి.గౌరీశంక‌ర్‌, ఎన్‌.చంద్ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌క్త‌దానం చేసిన స‌మాచార‌శాఖ ఎడి ర‌మేష్‌
           ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా, జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ దున్న ర‌మేష్ స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ర‌క్త‌దానం చేశారు.  ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీలో సోమ‌వారం ర‌క్తాన్ని ఇచ్చారు. ర‌మేష్‌ను  రెడ్‌క్రాస్ సొసైటీ  జిల్లా ఛైర్మ‌న్ కెఆర్‌డి ప్ర‌సాద‌రావు అభినందించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు ర‌మేష్ బాట‌లో న‌డిచి, ర‌క్త‌దానానికి ముందుకు రావాల‌ని ప్ర‌సాద్‌ విజ్ఞ‌ప్తి చేశారు.

Vizianagaram

2021-06-14 08:35:27

స్వచ్ఛ శంఖారావం విజయవంతం కావాలి..

 ప్ర‌తి ఒక్క‌రూ సంక‌ల్పంతో ప‌ని చేసి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌ద‌ల‌చిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, చెత్తలేని చూడ‌చ‌క్క‌ని గ్రామాల‌ను తీర్చిదిద్దాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మం కార్యాచ‌ర‌ణ‌, ల‌క్ష్యాల‌ను వివ‌రించేందుకు పంచాయ‌తీ రాజ్ మంత్రి సోమ‌వారం రాష్ట్రంలోని వివిధ గ్రామాల స‌ర్పంచుల‌తో దూర‌దృశ్య స‌మావేశంలో మాట్లాడారు. ఈ క్ర‌మంలో స్వ‌ర్గీయ దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి రోజు నుంచి చేప‌ట్ట‌బోయే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేయ‌టం ద్వారా విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు. మూడు ద‌శ‌ల్లో జరిగే ఈ క్రతువులో గ్రామాల రూపు రేఖ‌ల‌ను మార్చాల‌ని పేర్కొన్నారు. స‌ర్పంచులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని, అప్ప‌డే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. స‌ర్పంచులు స్వ‌చ్ఛ సంక‌ల్పం ర‌థ‌సార‌థుల‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. జూలై 8వ తారీఖు నుంచి 100 రోజులు చేప‌ట్టే ఈ మ‌హోన్న‌త కార్య‌క్ర‌మ ఉద్దేశాల‌ను, ల‌క్ష్యాల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు. మంత్రితో పాటు పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ గిరిజాశంక‌ర్‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జి.కె. ద్వివేది సమావేశంలో పాల్గొన్నారు.

ముందుగా ప‌లువురు స‌ర్పంచుల‌తో మాట్లాడి వారి అభిప్రాయాల‌ను మంత్రి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి జొన్న‌వ‌ల‌స స‌ర్పంచ్ కంది ర‌మాదేవి మంత్రితో మాట్లాడారు. స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామంలో చేప‌ట్ట‌బోయే ప‌నుల గురించి తీసుకునే చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. గ్రామాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తాన‌ని, పారిశుద్ధ్య ర‌హిత గ్రామంగా తీర్చుదిద్దుతాన‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తాన‌ని తెలిపారు. అనంత‌రం జిల్లాలో 100 రోజుల పాటు చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల గురించి జిల్లా ప‌రిష‌త్ సీఈవో టి. వెంక‌టేశ్వ‌రరావు వివ‌రించారు. జిల్లా నుంచి కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ సీఈవోతో పాటు డీపీవో సుభాషిణి, జిల్లా కో-ఆర్డినేట‌ర్ స‌త్య‌న్నారాయ‌ణ‌, వివిధ గ్రామాల స‌ర్పంచులు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-14 08:27:50

గృహ నిర్మాణం పై మంత్రుల సమీక్ష..

విజయనగరం జిల్లా లో పెద్ద ఎత్తున చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలపై సమీక్షించేందుకు రాష్ట్ర మంత్రులు ఈనెల 15న జిల్లాకు వస్తున్నారు. ఆరోజు ఉదయం 10-30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగే సమీక్షా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. గృహ నిర్మాణం లో వున్న క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకొని వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం,వాటికి పరిష్కారం చూపడం ద్వారా జిల్లా గృహనిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Vizianagaram

2021-06-14 01:32:46

టీకా వేయించుకొని అవగాహన కల్పించారు..

0-5ఏళ్ల లోపు పిల్లల తల్లులంతా అపోహలు వీడి కోవిడ్ టీకా వేయిచుకోవాలనే చైతన్యం తల్లులలో తీసుకురావడానికి శంఖవరం సచివాలయ మహిళా పోలీసు జిఎన్ఎస్ శిరీష(7నెలల బిడ్డకు తల్లి) టీకా వేయించుకొని మరీ పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. సోమవారం శంఖవరం కరోనా టీకా కేంద్రంలో పీహెచ్సీ వైద్యులు డా.ఆర్వీవిసత్యన్నారాయణ ఆధ్వర్యంలో మహిళా పోలీసు టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన విధంగా 5ఏళ్ల లోపు పిల్లల తల్లులంతా టీకా వేయించుకోవడం ద్వారా కరోనా వైరస్ భారిన పడకుండా రక్షణగా ఉండొచ్చునన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ఇచ్చిన సూచనలు అన్ని అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తల్లులకు తెలియజేశామని అన్నారు. కొందరిలో ఉన్న అపోహలు పొగొట్టడానికి 7నెలల బిడ్డకు తల్లిగా వున్న తాను టీకా వేయించుకున్నానన్నారు. టీకా వేసిన తరువాత జర్వం, శరీరం నొప్పులు వచ్చినా వాటికి ముందుగానే టీకా వేసే సమయంలోనే వైద్య సిబ్బంది మందులు కూడా అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా చిన్నపిల్లల తల్లులంతా కోవిడ్ టీకా వేయించుకోవాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు. అదేవిధంగా 45సంవత్సరాలు దాటిన వారు కూడా ప్రభుత్వం అందించే ఈ ఉచిత టీకాను వేయించుకొని రక్షణ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శంఖవరం

2021-06-14 01:27:16

మంత్రిని కలిసిన అనంత జిల్లా కలెక్టర్ ..

అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మీ సెల్వరాజన్  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గ్రుహంలో మంత్రిని కలిసి పూలమొక్క బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న పలు అంశాలు మంత్రి జిల్లా కలెక్టర్ తో చర్చించారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాకి మంచి పేరుందని మీ రాకతో దానిని మరింతగా ఇనుమడింప చేయాలని మంత్రి కలెక్టర్ కు  సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల  ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని కలెక్టర్ మంత్రికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలందరికీ అందేలా చూస్తామని, అదేవిధంగా అభివ్రుద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తామని చెప్పారు.

Anantapur

2021-06-12 16:30:15

2021-06-12 15:40:06

వేక్సినేషన్ లో అనంత ముందుండాలి..

అనంతపురం  జిల్లాలోని వైద్య రంగానికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు.  శనివారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు కోవిడ్ స్ట్రాటెజిక్ ప్లానింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా నిర్వహించి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేవిధంగా పనిచేయాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని, అదే సమయంలో వేగంగా ఫలితాలు వెల్లడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య రంగంలో ఉన్న పలు శాఖలకు చెందిన డీఎంహెచ్ఓ, సీసీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ, సీసీహెచ్ వంటి అధికారులందరూ సమన్వయంతో పని చేసి కోవిడ్ ను కట్టడి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ  చెయ్యాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను సందర్శించాలన్నారు. కరోనా పరీక్షల నమూనాలను గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సేకరించాలని ఆదేశించారు. కోవిడ్ మూడో వేవ్ రూపంలో మరో సారి విజృంభించినా సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. 

వ్యాక్సినేషన్ విధానంలో చేసిన మార్పులకు అనుగుణంగా జిల్లాలో వయస్సుతో నిమిత్తం లేకుండా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేయాలన్నారు. ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకాలు వేసే ప్రక్రియ పకడ్బందీగా సాగాలన్నారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. రోగి హోమ్ ఐసోలేషన్ ఉన్న సమయంలో ఉదయం 8 గంటల నుండి ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, జ్వరం, శ్వాస ప్రక్రియ, పల్స్ రేటు , బిపి, మరియు ఆక్సిజన్ స్థాయిలను గమనించి వాటి విలువలు చార్ట్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, తాత్కాలిక ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు-సరఫరా గురించి కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్ కేసులు, మరణాలు , వ్యాక్సినేషన్, హోమ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఫీవర్ సర్వే లపై డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ ,సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, కోవిడ్ నోడల్ ఆఫీసర్ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-12 15:33:12

సింహాద్రి అప్పన్నకు అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అంతరాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకుని, ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి  ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

Simhachalam

2021-06-12 15:31:30

అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి నిత్యన్నదాన పథకానికి విశాఖ  సీతమ్మధారకు చెందిన  దంపతులు  ఎస్వీఎస్ఎల్ఎన్  శాస్త్రి - ప్రభావతి  శనివారం రూ.1,00,116 విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఈఓ సూర్యకళకి దాతలు అందించారు.  తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా  జూన్ 12న అన్నదానం చేయాలని కోరారు. ఆ చెక్కుని ఆలయ ఈఓ ఎంవీసూర్యకలకు సమర్పించారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని పూజలు చేసి అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తుంటారని అలాంటి వారికి ఒక్కపూటైనా తమవంతుగా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ మొత్తాన్ని నిత్యన్నాధాన పథకానికి సమర్పిస్తున్నామన్నారు. ఆలయ అధికారులకు దాతలకు ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-12 15:29:53