1 ENS Live Breaking News

సమిష్టి కృషితో గృహనిర్మాణాలు పూర్తి..

శ్రీకాకుళం జిల్లాలోని జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్త ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 741 లేఅవుట్లు ఉన్నాయని, వాటిని వచ్చే మార్చి నాటికి అన్ని హంగులతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. ఇందుకు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో ముందుకుసాగాలని దిశా నిర్ధేశం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల సమిష్టి కృషితోనే గృహనిర్మాణాలు సకాలంలో పూర్తికాగలవని ఆయన అభిప్రాయపడ్డారు. గృహనిర్మాణాలకు అవసరమైన సామాగ్రి, ఇతరత్రా ఏర్పాట్లను ఎప్పటికపుడు సరిచూసుకుంటూ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. గృహనిర్మాణాలను పూర్తిచేయడంలో ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలను అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులకు గుర్తుచేసారు. ఎట్టిపరిస్థితిల్లోనూ మొదటి దశలో జిల్లాకు కేటాయించిన  90 వేల 716 గృహాలు అనుకున్న సమయానికి పూర్తికావాలని, ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మ ఆర్థికంగా పరిపుష్టి చెందాలనేదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆయన ఆశయసాధనకు ప్రతీ అధికారి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో ప్రోగ్రెస్ తక్కువగా ఉన్న మండలాలు, గ్రామాలపై అధికారులు ముందుగా దృష్టిసారించాలని, ప్రతీ రోజూ గృహనిర్మాణాల పనితీరుపై జె.సి(హౌసింగ్) సమీక్షిస్తారని, ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే జె.సి దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ లేనివిధంగా గృహనిర్మాణ శాఖపై నమ్మకం ఉంచారని, అందువలన ప్రతీ అధికారి కలిసికట్టుగా పనిచేసి శాఖకు మంచిపేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

          ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ మరియు మౌళికవసతుల కల్పన ఓ.ఎస్.డి యం.ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో మొదటివిడతలో 742 లేఅవుట్లకు గాను 658 లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలియజేసినట్లు చెప్పారు. ఈ లేఅవుట్లలో గృహనిర్మాణాలతో పాటు సి.సి.రోడ్లు, 1500 కంటే ఎక్కువ గృహాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, 1500 కంటే తక్కువ గృహాలు కలిగినచోట ఓపెన్ డ్రైనేజీలను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. అలాగే 550 కంటే ఎక్కువ గృహాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, లేనిచోట ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సిస్టంను ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీతో పాటు ఏ.పి.ఫైబర్ నెట్ కూడా ఉంటుందని, వీటితో పాటు పార్కులు, ఇతరత్రా వసతులు కూడా కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. వీటికి సంబంధించి ఆయా శాఖల ద్వారా డి.పి.ఆర్ లను కోరడం జరిగిందని, కొన్ని శాఖలు ఇప్పటికే డి.పి.ఆర్ లు అందజేసాయన్నారు. ఇంజినీరింగ్ అధికారులు రోజువారీ ప్రోగ్రెస్ వివరాలను ఎప్పటికపుడు ఆన్ లైన్ నందు నమోదుచేయాలని కోరారు.

          ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, చీఫ్ ఇంజినీర్ పి.శ్రీరాములు, పథక సంచాలకులు టి.వేణుగోపాల్, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-06-14 16:34:26

సచివాలయాలు నేడు అత్యంత కీలకం..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయాలు నేడు అత్యంత కీలకంగా మారాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్త అన్నారు. సోమవారం శ్రీకాకుళం  నగరంలోని కంపోస్టు కాలనీ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందించేందుకు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అనంతరం సచివాలయంలో గృహనిర్మాణ శాఖకు సంబంధించిన డేటా ఎంట్రీలను స్వయంగా పరిశీలించారు. డేటా ఎంట్రీలలో ఎటువంటి సమస్యలు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని, తద్వారా మార్పులు చేసేందుకు అవకాశం కల్పించబడుతుందని ఆయన చెప్పారు. అనంతరం వాలంటీర్లతో మాట్లాడుతూ గృహ లబ్దిదారులను ఎంపికచేయడంలో వాలంటీర్లు విశేష కృషిచేసారని, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆదిశగా వాలంటీర్లు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు ఇంకా మెరుగైన సేవలు అందించి ప్రభుత్వం ప్రకటించిన సేవా రత్న, సేవా వజ్ర పురష్కారాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు డా. కె.శ్రీనివాసులు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ రామ్మోహన్, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డా. వెంకటరావు, సిబ్బంది గణేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం, Andhra Pradesh, India

2021-06-14 16:14:34

పారిశుధ్యంపై ప్రత్యేకంగా ద్రుష్టిపెట్టాలి..

రాష్ట్రంలోని మోడల్ వార్డులలో పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎ & యుడి ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సోమవారం అమరావతి నుంచి నిర్విహించిన వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి నుంచి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్ డా.వి.సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్లాప్ (CLAP) పధకంలో భాగంగా పారిశుధ్య పనులు మరింత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మోడల్ వార్డులుగా ఎంపిక చేసి, ఆ వార్డులలో ఉన్న గృహాలకు చెత్త డబ్బాలు ఇచ్చి తడి–పొడి చెత్తను వేరు చేసి ఇచ్చే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలో చెత్త బిన్లను లేకుండా చేయాలని, చెత్త తరలించే వాహనాలను జి.పి.ఎస్. తో లింక్ చేసి రూట్ మ్యాప్ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఎ & యుడి ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మి క్లాప్(CLAP) పధకంలో భాగంగా మోడల్ వార్డులలో  పారిశుధ్య పనుల పరిస్థితులపై ఆరా తెసారు. అక్కడ మలేరియా, డెంగ్యూ మొదలగునవి విజృంభించకుండా   చర్యలు చేపట్టాలన్నారు. ఐ.ఇ.సి. యాక్టివిటీస్, పారిశుధ్య పనులు, వార్డులో తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తను వేరుచేసే విధానాలపై ఆరా తీశారు.  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ 572 సచివాలయాల నుండి డోర్ టు డోర్ చెత్తను సేకరించడం జరుగుతుందని, వాహానాలు వెళ్ళలేని ప్రాంతాలకు పుష్ కార్టుల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని, మోడల్ వార్డులో డంపర్ బిన్స్ లేకుండా వాహనమూల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని, ఏ పనికి కేటాయించిన వారిని ఆ పనికే ఉపయోగిస్తున్నామని, పారిశుధ్య పనులపై నివాస సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాల ద్వారా అవగాహనా కార్యక్రమాలను  నిర్వహిస్తున్నామని తెలిపారు.   

చెత్త తరలించే ప్రతి వాహనానికి రూట్ మ్యాపును తయారు చేయండి: 

అనంతరం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త తరలించే ప్రతి వాహనానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రతి జోన్ లోనూ చెత్త తరలించే వాహనాలను పార్క్ చేయుటకు ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆ ప్రదేశం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేసి ప్రతి వాహనము అక్కడే పార్కు చేయాలని సూచించారు. ప్రతి రెండు జోన్ లకు ఒక వాహన రిపేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. తడి-పొడిగా సేకరించిన చెత్తను కలపకుండా, డంపింగ్ యార్డ్ లో వేరు వేరుగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి వాహనము ఎన్నిసార్లు డంపింగ్ యార్డ్ కు చెత్తను తరలిస్తున్నదో పక్కా రికార్డు ఉండాలని ఆదేశించారు. వాహనాలు సమృద్ధిగా ఉన్న ప్రదేశాలలో లిట్టర్ బిన్స్ పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఏ పనికి కేటాయించిన వారిని మరియు వాహనాలను ఆ పనికే ఉపయోగించాలన్నారు. ప్రతి పారిశుద్ధ కార్మికులకి యాప్రాన్ బ్లౌజులు, గ్లౌజులు, కాలవలో పనిచేసే కార్మికులకు బూట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. ప్రతి లిట్టర్ బిన్స్ చుట్టూ బొంతలు, తలగడలు దర్శనమిస్తున్నాయని, వీటి కొరకు సచివాలయాల పరిధిలో వారంలో ఒక రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా, వాటిని  సేకరించాలన్నారు. నగరంలో పందుల సంచారం ఎక్కువగా ఉందని వాటిని నిర్మూలించాలని ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు.ఈ  సమావేశంలో అదనపు కమిషనర్ డాక్టర్ బి సన్యాసిరావు ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, ఏఎంఒహెచ్ రమణ మూర్తి పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-14 16:09:01

లిట్టర్ బిన్స్ శుభ్రంగా ఉంచాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో లిట్టర్ బిన్స్ ను పరిశుభ్రంగా ఉండాలని జివిఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జివిఎంసీ పరిధిలోని 2వ జోన్ 12వ వార్డు పరిధిలోని ఆరిలోవలో కనక మహాలక్ష్మి కోలనీ, రవీంద్రనగర్, విశాలాక్షి నగర్, మరియు 3వ జోన్ లోని ఎంవిపి కోలనీ, టిటిడి కళ్యాణ మండపం, ఉషోదయ జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జోన్ లోనూ లిట్టర్ బిన్స్ చుట్టుపక్కల చెత్త ఉంచకూడదని, లిట్టర్ బిన్స్ ను శుభ్రంగా ఉంచాలని, వాటి చుట్టూ బ్లీచింగ్ చల్లాలని  శానిటరి అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని  మ్యాన్ హోల్సు  పొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ బి. రాము, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిరంజీవి, శంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంశి, అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, శానిటరి  సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ సిటీ

2021-06-14 16:00:12

కాకినాడ సేవా కమిటీ సేవలు భేష్..

కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడమే కాకుండా బంధుత్వాలు కూడా దూరమౌతున్న పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకొనేందుకు తామున్నామని ముందుకు వచ్చి కాకినాడ ఖిద్మత్ కమిటి ( కాకినాడ సేవా కమిటి ) చేస్తున్న సేవలను నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను కమీషనర్ స్వప్నిల్ దినాకర్ లాంఛనంగా ప్రారంభించారు.  సోమవారం మద్యాహ్నం కాకినాడ కార్పోరేషన్ కార్యాలయ ఆవరణలో కాకినాడ ఖిద్మత్ కమిటి ( కాకినాడ సేవా కమిటి ) నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది . కమిటీ సభ్యులు హస్సేన్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నగర పాలక సంస్థకమీషనర్  పాల్గొని కమిటీ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు . కాకినాడ  ఖిద్మత్ కమిటి కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు చేస్తున్న సేవలను కమిటి సభ్యులు కమీషనరుకు తెలియజేసారు.ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు ఖిద్మత్  కమిటి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ అంబులెన్స్ సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిటి సభ్యులు హస్సేన్ షరీఫ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో  ప్రజలు పడుతున్న  ఇబ్బందులను చూసి వారికి అవసరమైన సేవాలందించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ ఖిద్మత్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగిందన్నారు.  ప్రధానంగా అంబులెన్స్ ఉచిత సేవల ఏర్పాటుకు దాతల అందించిన సహకారం మరువలేనిదన్నారు.   

     'మా ',  'మేవా ' సంస్థలు అంబులెన్స్ కొనుగోలుకు సగభాగం నిధులను అందించి ప్రోత్సహించగా, దాతలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళలను అందించారన్నారు. ఈ సత్కార్యానికి సహకరించిన దాతలందరికి ఆయన  ప్రత్యేకంగా  కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుండి అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా నీరు పేదలకు సహాయం అందించడం , రక్తదాన శిబిరాలను నిర్వహించడం , పేద విద్యార్థులను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం వంటి కార్యక్రమలను కూడా చేపట్టనున్నట్లు హస్సేన్ షరీఫ్ వివరించారు . ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ నాగనరసింహరావు , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్ ,  రెడ్ క్రాస్ జిల్లా విభాగం చైర్మన్ వై.దశరథ రామారావు , కమిటి సభ్యులు ముజాహిద్ , అజార్ , అజు , అలీం , గౌస్ , ఎండి నోమ్ , ఖాలీషా , ఆసిఫ్.ఈతిషామ్ , బాషా , సయ్యద్ హుస్సేన్ , షరీస్, కమల్ , మసూద్ .. సీనియర్ పాత్రికేయులు చిష్టి , చేయూత అధ్యక్షులు రవికుమార్  తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-14 15:54:24

ప్రతీ నిరుపేదకు సొంతిల్లే లక్ష్యం..

ప్రతి పేదవారికి స్వంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  సోమవారం ఆయన జీవీఎంసీ  4 వార్డు కాపులుప్పాడలో  168 ఇళ్ళతో నిర్మించనున్న జగనన్న కోలనీ  గృహాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన  సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దేశంలో కేవలం మన రాష్ట్రంలోనే  లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.  పేదవారికి 60 గజాల భూమిని ఇస్తే, ఇంతకుముందు భూములు కబ్జా చేసిన నాయకులు  అది చూసి  ఓర్వలేక పోతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా  ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా  జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి 4 వ వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు  పాల రమణ రెడ్డి  నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-14 15:35:01

రైతులందరికీ వైఎస్సార్ ఉచిత పంటల భీమా..

అనంతపురం జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అందించా లని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతును వైయస్సార్ ఉచిత బీమా పథకం లో చేర్పించాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగితే వారికీ నష్ట పరిహారం వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పంట కోతలో తక్కువ దిగుబడి నమోదు అయినప్పుడు వాటికి కూడా నష్ట పరిహారం వచ్చే విధంగా చూడాలన్నారు. జిల్లాలో వరి పంట సాగును తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అగ్రి అడ్వైసర్ బోర్డు సభ్యులుకు సూచించారు. వ్యవసాయ శాఖ మరియు సిపిఓ పంటల బీమాలో అన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2020 కి సంబంధించి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ శాఖ ద్వారా పంటల బీమా నమోదు మొదులుకొని పంపణీ వరకు వ్యవసాయ శాఖనే నిర్వహించడం జరిగిందని, ఇంకా మెరుగ్గా ఈ పథకం అమలు పరచడానికి జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించి సలహాలు మరియు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమీషనర్ కోరడమైనదని, అందులో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు పంట బీమా క్రింద నమోదు కాని ఆముదం, పెసలు, అలసందలు, ఉలవలు, ఉద్యానవన పంటలు బొప్పాయి, టమోటాను నమోదు చెయ్యవలసిందిగా కమిటీ సభ్యులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి అడ్వైసరీ బోర్డు చైర్మన్ T. రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి  వై.రామక్రిష్ణ, సిపిఓ ప్రేమచంద్ర, ఎల్డిఎం మోహన్ మురళి, ప్రోగ్రాం కోర్డినేటర్ డా.జూన్స్, కెవికె రెడ్డిపల్లి ప్రధాన శాస్త్రవేత్త సహదేవ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ, సహాయ వ్యవసాయ సంచాలకులు (రెగ్యులర్) మరియు ఇతర మండల అగ్రి అడ్వైసరీ బోర్డు చైర్మన్ లు, రైతులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-14 15:05:55

ఆదర్శవంతంగా జగనన్న కాలనీలు..

నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలను అన్ని విధాలా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని నూతన హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు.  సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో హౌసింగ్ నూతన జాయింట్ కలెక్టర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హౌసింగ్ అధికారులు, సిబ్బంది జేసీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.* 

*2017 ఐఏఎస్ బ్యాచ్ కు సంబంధించిన హౌసింగ్ జెసి నిశాంతి గారిని రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. అనంతరం పెనుగొండ సబ్ డివిజన్ నందు సబ్ కలెక్టర్ గా 25.9.2019 రోజున పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదోన్నతి పొంది జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా సోమవారం రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హౌసింగ్ జెసి  మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ కింద మొత్తం 1,11,099 మంజూరైన ఇళ్ల నిర్మాణపు పనులను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆప్షన్ 1, 2 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆప్షన్ 3 సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు వెలువడగానే ఇళ్ల నిర్మాణపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.  నవరత్నాలులో భాగంగా అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఈ నేపథ్యంలో రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్ తదితర శాఖల సమన్వయంతో జగనన్న కాలనీలలో అంగన్వాడిలు,  సచివాలయాలు, పీహెచ్ సిలు, పార్కులు తదితర వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకొని నిర్మాణపు పనులు పూర్తి చేస్తామన్నారు.

అనంతరం హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి జగనన్న కాలనీ పనుల పురోగతిపై సమీక్షించి జాయింట్ కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వెంకటేశ్వర రెడ్డి, ఈఈలు చంద్రమౌళి రెడ్డి, కృష్ణయ్య, నారాయణమ్మ , శైలజ, పలువురు డిఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-14 11:29:56

రుయా సీమకే తలమానికం కావాలి..

 వైద్యసేవలపై విమర్శలువద్దు, అకారణంగా వైద్య వృత్తి వారిపై నిందలు మోపితే దేవుడిపై నిందలు మోపినట్లేనని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలోని కోవిడ్ బారిన పడినటువంటి వారి పరిస్థితులను స్వయంగా వార్డులలో పర్యటించి  
ఆప్యాయతతో  పలకరిస్తూ,  భుజం తట్టి నేనున్నానని మనో   ధైర్యాన్ని , భయపడ వద్దని భరోసా ఇస్తూ రోగుల తరఫు బంధువులకు అభివాదం చేస్తూ  తాను అండగా ఉంటానని హామీనిచ్చారు.  రాష్ట్ర  ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందన్నదని, తిరుపతి రుయా కోవిడ్ సెంటర్  చికిత్స పొందుతున్న వారి  ఆరోగ్యస్థి, బాగోగులు వంటివి  వైద్యులును కూడా ఆరా తీస్తూ  వారికి మరింత  మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రిలో పర్యటన అనంతరం మీడియాకు వివరిస్తూ..కరోనా గత కొద్దిరోజులుగా తగ్గు ముఖం పట్టడం శుభ సూచికమని, పేదల ఆసుపత్రిగా  రుయా  చేరిన కొవిడ్ బారిన పడినటువంటివారిని ఎంతోమందిని  బ్రతికించిందని అన్నారు.  రుయాలో రుయా ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని, వైద్యసేవలతో పాటు వారి మానసిక స్థితి, అభిప్రాయాలు తెలుసుకుని మనోధైర్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చుకుంటే రుయా ఆసుపత్రి నుండి కరోనా నుండి ఆరోగ్యంగా వెళ్ళిన వారే ఎక్కువగా వున్నారని అన్నారు.  మన కళ్ళ ముందే మన ఆత్మీయులు మరణిస్తే ఆసుపత్రి నిర్లక్ష్యం అనడం తప్పని,  వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి  ప్రమాదం సంభవిస్తే  వారి బంధువులు, అటెండర్లు సంబంధిత  వారికి  ధైర్యం ఇవ్వాలే తప్ప, అకారణంగా వైద్యుల పై ఆరోపణల చేయడం వల్ల వైద్యుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసినట్లు అవుతుందన్నారు. రుయాలో అందిస్తున్న వైద్యసేవలకు సూపరింటెండెంట్ డా. భారతి వారి బృందాన్ని ఆబినందిస్తున్నానని అన్నారు. రుయాలో హోమ్ గార్డుల జీతాల ఆలస్యం విషయంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో మాట్లాడి చేస్తున్నారని , నేను కూడా  కోవిడ్ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రికి సూచించమని త్వరలో అందుతాయని అన్నారు. కలెక్టర్  ఉద్యోగులకు, వైద్యసిబ్బందికి  పని ఒత్తిడి పెంచుతున్నారనే అనడం సరికాదని వారు చక్కగా పనిచేస్తున్నారని అన్నారు.

Tirupati

2021-06-14 11:24:57

భవన నిర్మాణ పక్షోత్సవాలు విజయవంతం కావాలి..

 ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌న నిర్మాణాల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని, ఇందుకోసం జూన్ 17 నుంచి జులై 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న భ‌వన నిర్మాణ ప‌క్షోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసేందుకు జిల్లాస్థాయిలో ఏర్పాటైన ప్ర‌త్యేక క‌మిటీ జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనుసంధానంతో గ్రామ స‌చివాల‌యాల నిర్మాణాలు జూన్ 30 నాటికి, ఆర్‌బీకేల‌ను జులై 8 నాటికి, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల‌ను జులై 31 నాటికి, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (తొలిద‌శ‌)ను జూన్ 30 నాటికి పూర్తిచేయాల్సి ఉంద‌న్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల‌తో 4,492 భ‌వ నిర్మాణాలకు అనుమ‌తులు మంజూరుకాగా వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తికాగా మ‌రికొన్ని నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. జేసీ (ఆస‌రా) నేతృత్వంలో జిల్లాస్థాయి క‌మిటీ, ఎంపీడీవో/పీవో, ఈజీఎస్ నేతృత్వంలో మండ‌ల‌స్థాయి క‌మిటీ, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి (గ్రేడ్‌-1) నేతృత్వంలో గ్రామ‌స్థాయి క‌మిటీలు నిర్మాణ ప‌నుల స‌త్వ‌ర పూర్తికి కృషిచేస్తాయ‌ని వివ‌రించారు. శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణాలకు సంబంధించి మెటీరియ‌ల్‌, లేబ‌ర్ త‌దిత‌రాల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో క్షేత్ర‌స్థాయి అధికారుల స‌మ‌న్వ‌యంతో వెంట‌నే ప‌రిష్క‌రించాల్సి ఉంటుంద‌న్నారు. గ్రామ‌స్థాయి క‌మిటీలు రోజువారీ ప్ర‌గ‌తిని న‌మోదుచేసి, ఎప్ప‌టిక‌ప్పుడు మండ‌ల‌స్థాయి క‌మిటీల‌కు తెలియ‌జేయాల్సి ఉంటుంద‌న్నారు. అదే విధంగా మ‌డ‌ల‌స్థాయి క‌మిటీలు గ్రామాల్లో సంద‌ర్శించి.. ప్ర‌జాప్ర‌తినిధులు, సిబ్బందితో స‌మావేశ‌మై ప‌నుల పూర్తికి కృషిచేయ‌డంతో పాటు ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను నిర్దేశ ఫార్మాట్ల‌లో జిల్లాస్థాయి అధికారుల‌కు పంపాల్సి ఉంటుంద‌ని, అదే విధంగా మొబైల్ యాప్‌లో ఫొటోల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్‌లు, వార్డు స‌భ్యులను భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా నిర్మాణ ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని సూచించారు. వివిధ స్థాయుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, మార్గ‌నిర్దేశ‌నానికి జిల్లాస్థాయిలో ప్ర‌త్యేక కాల్‌సెంట‌ర్ కూడా ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. జిల్లాస్థాయి క‌మిటీ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు ప్ర‌గ‌తిపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో అల‌స‌త్వం వ‌హించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ బీఎస్ రవీంద్ర, వ్య‌వ‌సాయ శాఖ డీడీ ఎస్‌.మాధ‌వ‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-14 11:22:16

నీతి నిజాయితీలతో పనిచేయాలి..

 ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నీతి నిజాయితీల‌తో ప‌నిచేసి మంచి పేరు తెచ్చుకోవా ల‌ని జిల్లా క‌లెక్టర్డా.ఎం .హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ హిత‌వు ప‌లికారు. జిల్లాలో మ‌ర‌ణించిన ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో వారి వార‌సులు, కుటుంబ స‌భ్యుల‌కు వివిధ‌ ప్రభుత్వ శాఖ‌ల్లో ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిస్తూ ఐదుగురికి క‌లెక్టర్ సోమ‌వారం నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు. వీరిలో పెద‌కాపు అశోక్‌(స‌హ‌కార‌), మూల‌మండ్ల శైల‌జ‌(భూగ‌ర్భ జ‌లాలు), స‌బ్బవ‌ర‌పు ప్రదీప్ చంద్ర‌(రెవిన్యూ), నిమ్మక సంతోష్ కుమార్‌(ఖ‌జానా శాఖ) ల‌ను జూనియ‌ర్ అసిస్టెంట్‌లుగా, కొండ‌గొర్రి వంశీకి వ్యవ‌సాయ శాఖ‌లో కార్యాల‌య స‌హాయ‌కునిగా అవ‌కాశం క‌ల్పిస్తూ క‌లెక్టర్ నియామ‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యువ ఉద్యోగులు క‌ష్టప‌డి ప‌నిచేసే త‌త్వాన్ని అల‌వ‌ర‌చుకోవాల‌ని కోరారు. త‌మ‌కు ల‌భించిన ఈ అవ‌కాశాన్ని ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఉప‌యోగించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, క‌లెక్టరేట్ ఏ.ఓ. దేవ‌ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-14 11:18:53

ఓలమ్ ఆక్సిజన్ మిషన్లు వితరణ..

కోవిడ్ రెండోద‌శ‌లో రోగుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో సామాజిక బాధ్య‌త‌గా ఓల‌మ్ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ జిల్లాకు ప‌ది ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉద‌యం క‌లెక్ట‌రేట్‌లో సంస్థ ప్ర‌తినిధులు కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌క్షంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి దాదాపు రూ.13 ల‌క్ష‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అంద‌జేశారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న బాధితుల‌కు ప్రాణ‌వాయువును అందించేందుకు ఉప‌యోగ‌ప‌డే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన ఓల‌మ్ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ‌కు క‌లెక్ట‌ర్‌, శాస‌న‌స‌భ్యులు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాకినాడ పోర్టు శ్రామికుల‌కు మ‌ల్టీ విట‌మిన్ టాబ్లెట్లు, శానిటైజ‌ర్లు, మాస్కులు వంటివి కూడా అందిస్తున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఓల‌మ్ సంస్థ మేనేజ‌ర్ ఛార్లెస్‌, క‌స్ట‌మ్స్ బ్రోక‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, షిప్పింగ్ ఇన్‌ఛార్జ్ వెంక‌టేశ్, శ్రీనివాస్‌రెడ్డి, క‌ళ్యాణ్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-14 09:36:19

రక్తదాతలే నిజమైన దేవుళ్లు..

 ప్ర‌తీఒక్క‌రూ ముందుకు రావాల‌ని ఇండియ‌న్‌ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్ కెఆర్‌డి ప్ర‌సాద‌రావు కోరారు. ఆరోగ్య‌వంతులైన వారు ప్ర‌తీ మూడు నెల‌ల‌కూ ఒక‌సారి ర‌క్త‌దానం చేయ‌వ‌చ్చున‌ని సూచించారు.  ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా  స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో సోమ‌వారం ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ప‌లువురు స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఛైర్మ‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, ర‌క్త‌దానానికి స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని కోరారు. ర‌క్త‌దానంపై అపోహ‌ల‌ను విడ‌నాడాల‌ని, ఆరోగ్య‌వంతులంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి, ర‌క్త దాత‌లుగా త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.  ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా, ర‌క్త‌దాత‌ల‌ను స‌త్క‌రించారు.
             ఈ కార్య‌క్ర‌మంలో జూనియ‌ర్ రెడ్‌క్రాస్ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త ఎం.రామ్మోహ‌న్‌,  మేనేజింగ్ క‌మిటీ స‌భ్యులు పి.రామ‌కృష్ణారావు,  రెడ్డి ర‌మ‌ణ‌,   జిల్లా బాలల హ‌క్కుల క‌మిటీ మాజీ ఛైర్మ‌న్‌ కేస‌లి అప్పారావు, నాల్గ‌వ త‌ర‌గ‌తి ఉద్యోగుల సంఘం జిల్లా నాయ‌కులు మువ్వ‌ల గంగాప్ర‌సాద్ త‌దిత‌ర లైఫ్ మెంబ‌ర్లు,  రెడ్‌క్రాస్ వైద్యులు డాక్ట‌ర్ బి.కామేశ్వ‌ర్రావు, ఏపిఆర్ఓ ఎం.రాము, ఫీల్డ్ ఆఫీస‌ర్ డి.గౌరీశంక‌ర్‌, ఎన్‌.చంద్ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌క్త‌దానం చేసిన స‌మాచార‌శాఖ ఎడి ర‌మేష్‌
           ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా, జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ దున్న ర‌మేష్ స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ర‌క్త‌దానం చేశారు.  ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీలో సోమ‌వారం ర‌క్తాన్ని ఇచ్చారు. ర‌మేష్‌ను  రెడ్‌క్రాస్ సొసైటీ  జిల్లా ఛైర్మ‌న్ కెఆర్‌డి ప్ర‌సాద‌రావు అభినందించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు ర‌మేష్ బాట‌లో న‌డిచి, ర‌క్త‌దానానికి ముందుకు రావాల‌ని ప్ర‌సాద్‌ విజ్ఞ‌ప్తి చేశారు.

Vizianagaram

2021-06-14 08:35:27

స్వచ్ఛ శంఖారావం విజయవంతం కావాలి..

 ప్ర‌తి ఒక్క‌రూ సంక‌ల్పంతో ప‌ని చేసి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌ద‌ల‌చిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, చెత్తలేని చూడ‌చ‌క్క‌ని గ్రామాల‌ను తీర్చిదిద్దాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మం కార్యాచ‌ర‌ణ‌, ల‌క్ష్యాల‌ను వివ‌రించేందుకు పంచాయ‌తీ రాజ్ మంత్రి సోమ‌వారం రాష్ట్రంలోని వివిధ గ్రామాల స‌ర్పంచుల‌తో దూర‌దృశ్య స‌మావేశంలో మాట్లాడారు. ఈ క్ర‌మంలో స్వ‌ర్గీయ దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి రోజు నుంచి చేప‌ట్ట‌బోయే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేయ‌టం ద్వారా విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు. మూడు ద‌శ‌ల్లో జరిగే ఈ క్రతువులో గ్రామాల రూపు రేఖ‌ల‌ను మార్చాల‌ని పేర్కొన్నారు. స‌ర్పంచులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని, అప్ప‌డే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. స‌ర్పంచులు స్వ‌చ్ఛ సంక‌ల్పం ర‌థ‌సార‌థుల‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. జూలై 8వ తారీఖు నుంచి 100 రోజులు చేప‌ట్టే ఈ మ‌హోన్న‌త కార్య‌క్ర‌మ ఉద్దేశాల‌ను, ల‌క్ష్యాల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు. మంత్రితో పాటు పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ గిరిజాశంక‌ర్‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జి.కె. ద్వివేది సమావేశంలో పాల్గొన్నారు.

ముందుగా ప‌లువురు స‌ర్పంచుల‌తో మాట్లాడి వారి అభిప్రాయాల‌ను మంత్రి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి జొన్న‌వ‌ల‌స స‌ర్పంచ్ కంది ర‌మాదేవి మంత్రితో మాట్లాడారు. స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామంలో చేప‌ట్ట‌బోయే ప‌నుల గురించి తీసుకునే చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. గ్రామాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తాన‌ని, పారిశుద్ధ్య ర‌హిత గ్రామంగా తీర్చుదిద్దుతాన‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తాన‌ని తెలిపారు. అనంత‌రం జిల్లాలో 100 రోజుల పాటు చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల గురించి జిల్లా ప‌రిష‌త్ సీఈవో టి. వెంక‌టేశ్వ‌రరావు వివ‌రించారు. జిల్లా నుంచి కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ సీఈవోతో పాటు డీపీవో సుభాషిణి, జిల్లా కో-ఆర్డినేట‌ర్ స‌త్య‌న్నారాయ‌ణ‌, వివిధ గ్రామాల స‌ర్పంచులు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-14 08:27:50