1 ENS Live Breaking News

15నుంచి డెల్టాభూములకు సాగునీరు..

గోదావరి తూర్పు, పశ్చిమ డెల్టాల ఆయకట్టులకు జూన్ 15వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేస్తామని, ఈ లోగా సాధ్యమైనన్ని క్లోజర్ వర్క్స్  పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత నెల 27వ తేదీన  ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులతో  తాను, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సంయుక్తంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కాల్వలకు నీటి విడుదల, త్రాగునీటి ఎద్దడి నివారణ అంశాలపై సమీక్షించామన్నారు.  సమావేశంలో గోదావరి డెల్టాలకు జూన్ 15 నుండి ఖరీఫ్ పంటలకు నీరు విడుదలకు నిర్ణయించామని తెలిపారు. గత నవంబరు నెలలో వచ్చిన నివర్ తుఫాను కారణంగా రెండు జిల్లాల్లో రైతులు పంటలు వేసుకోవడం ఆలస్యమైందని, అందువల్ల దాదాపు ఏప్రియల్ నెలాఖరు దాకా కాల్వలకు నీరు ఇవ్వవలసి వచ్చిందన్నారు. రైతుల పంటలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడేందుకు ముఖ్యమంత్రి సీలేరు జలాలను పంటల అవసరాల కొరకు విడుదలకు ఆదేశించారన్నారు.  అలాగే వేగంగా జరుగుతున్న  పోలవరం కాపర్ డామ్ పనుల దృష్ట్టా  అనుకున్న దాని కంటే అదనంగా  కొద్ది రోజులు  కాలువలకు నీటి విడుదల ఆలస్యమైందన్నారు.  కాల్వల మూసివేత కాలం తక్కవ కావడం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ రెండవ వేవ్ పరిస్థితుల కారణంగా మంజూరు చేసిన క్లోజర్ నిర్వహణ, అభివృద్ది పనులు ఆశించిన స్థాయిలో సాధ్యం కాలేదని, ముఖ్యమైన, అత్యవసరమైన పనులను ఈ నెల 15న కాలువలు తెరిచే లోపు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరిగేషన్ అధికారులను ఆదేశించామన్నారు.  మిగిలి పోయిన పనులన్నిటినీ వచ్చే ఏడాది ప్రాధాన్యతగా చేపట్టి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు.  కాలువలు తెరిచే లోపు రెండు జిల్లాల త్రాగునీటి అవసరాలపై సమీక్షలో తూర్పు గోదావరి జిల్లాలో క్లోజర్ కు ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి స్థాయిలో నింపినందున త్రాగునీటికి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ తెలిపారని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ ఆవాసాల ప్రజలకు రవాణా ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని సూచించామన్నారు. కాలువలు తెరిచిన వెంటనే ఖరీఫ్ పంటలు చేపట్టేలా వ్యవసాయ శాఖ ద్వారా రైతులను సమాయత్తం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. 

Kakinada

2021-06-07 01:46:37

నరకం చూపిస్తున్న మొబైల్ నెట్వర్కులు..

కరోనా వైరస్ కంటే దారుణంగా మొబైల్ సెల్ నెట్వర్క్ లు వినియోగదారులను దారుణంగా పీడించేస్తున్నాయి. సమయానికి రీచార్జ్ చేయకపోతే ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కట్ కట్ చేసే మొబైల్ నెట్వర్క్ కంపెనీలు తీసుకున్న మొత్తానికి నాణ్యమైన వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వడం లేదు. పోనీ కస్టమర్ కేర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా కరోనా వైరస్ కారణంగా కష్టమర్ సర్వీసులన్నీ ఆన్ లైన్ లోనేనని చెప్పి తప్పించుకుంటున్నాయి సెల్ నెట్వర్క కంపెనీలు. అతి తక్కువ నెట్వర్క్ సిగ్నల్ వున్న కంపెనీల్లో ముందు వరుసలో జియో ఉండగా, రెండో స్థానంలో ఎయిర్ టెల్, మూడో స్థానంలో బీఎస్ఎన్ఎల్, నాలుగో స్థానంలో వీఐ(వొడాఫోన్,ఐడియా)లు ఉన్నాయి. ఇందులో కాస్త బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ వాయిస్ కాల్ విషయంలో ఇబ్బందులుు పెట్టినా ఇంటర్నెట్ స్పీడ్ 3జి పూర్తిస్థాయిలో అందిస్తుంది. మిగిలిన సెల్ నెట్వర్క్ కంపెనీలన్నీ 4జి పేరుతో వినియోగదారులను మోసం చేస్తూ..కనీసం 2జి నెట్ స్పీడ్ కూడా ఇవ్వడం లేదు. ఎంతదారుణమంటే జియో నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ కి కనీసం వాట్సప్ కూడా ఓపెన్ కావడంలేదు.  వాయిస్ కాల్స్ లో క్లారిటీని దారుణంగా తగ్గించేశారు.., ఇంటర్నెట్ స్పీడ్ ని దారుణంగా తగ్గించేసింది.. ఇక ఎయిర్ టెల్ అయితే గ్రామీణ ప్రాంతాలో రోజుకి కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఉదయం ఒక గంట, సాయింత్రం ఒక గంట మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలోనే వినియోగదారులు కాల్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఐడియా నెట్వర్క్ కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వకపోయినా వాయిస్ క్లారిటీ బాగానే ఇస్తుంది.

 అన్నింటి బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ క్లారిటీ లేకపోయినా ఇంటర్నెట్ స్పీడ్ ఖచ్చితంగా అందిస్తోంది. రీచార్జ్ గడువు అయిపోతుందని వారం రోజులు ముందునుంచే మెసేజ్ లో అలెర్ట్ చేసే మొబైల్ నెట్వర్క్ లు సేవల విషయంలో అత్యంత దారుణంగా మోసం చేస్తున్నాయి. ఈ మొబైల్ నెట్వర్క్ ల నియంత్రించే ట్రాయ్ గానీ, డాట్ కానీ కనీసం కలుగజేసుకోవడం లేదు. అంతేకాదు సమాచార మంత్రిత్వశాఖ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దీనితో సెల్ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు వినియోగదారులను నిట్టనిలువునా దోపీడికి గురిచేస్తున్నాయి. అదేమంటే తమ నియమ నిబంధనలన్నీ ఒప్పుకునే వినియోగదారులు మా మొబైల్ నెట్వర్క్ లను ఎంచుకుంటున్నారని తిరిగి బుకాయిస్తున్నాయి. వాస్తవం ఏంటంటే ఏదైనా ఒక సెల్ నెట్వర్క్ కంపెనీలో మొబైల్ నెంబరు తీసుకునే సమయంలో మనం పెట్టే సంతకాలే వారికి రక్షణగా నిలుస్తున్నాయి. అతిచిన్న అక్షరాల్లో వారికి తగ్గట్టుగా రాసుకున్న నిబంధనలకు వినియోగదారులు అంగీకరిస్తూ సంతకాలు చేయడంతో వారికి నచ్చినట్టు వినియోగదారులను మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందరికీ మొబైల్ ఫోన్లు అలవాటైపోవడంతో వినియోగదారుల వీక్ నెస్ ను మొబైల్ నెట్వర్క్ కంపెనీలు సొమ్ముచేసుకుంటున్నాయి..

Kakinada

2021-06-07 01:38:34

విశాఖనగరంలో వేక్సిన్ వేసే ప్రాంతాలివే..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని సోమవారం (07.06.2021) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గుర్తించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "కోవేక్సిన్" మొదటి డోసు 45 సంవత్సరాలు పైబడిన వారికి, రెండవ డోసు 28 రోజులు పైబడిన వారికి ఈకేంద్రాలలో వ్యాక్సినేషన్ వేస్తున్నామన్నారు. అల్లిపురం, భీమునిపట్టణం, బుచ్చిరాజుపాలెం, చెంగల్రావు పేట, చిన్న వాల్తేర్, జ్ఞానాపురం, మద్దిలపాలెం, నరవ, వన్ టౌన్, ఆర్.పి.పేట, సాగర్ నగర్, స్వర్ణభారతి స్టేడియం, అనకాపల్లి, మల్కాపురం, విద్యుత్ నగర్, ఫిషర్మెన్ కోలనీ, కప్పరాడ, లక్ష్మీ నగర్, ప్రసాద్ గార్డెన్స్, తగరపువలస, బర్మా క్యాంపు, పాత గాజువాక, పెదగంట్యాడ, శ్రీహరిపురం, ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు), "కోవీషీల్డ్" వ్యాక్సినేషన్ మొదటి డోసు 45సంవత్సరాలు పైబడిన వారికి మరియు రెండవ డోసు 84రోజులు పైబడిన వారికి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు), మధురవాడ, శ్రీహరిపురం(ఎఫ్.ఆర్.యు.), గాజువాక, కణితి, పెదగంట్యాడ, ఆర్.హెచ్.సి. సింహాచలం,  ఆర్.టి.సి. ఎం, దువ్వాడ, గోపాలపట్నం ప్రాంతాలలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని కమిషనర్ తెలిపారు.  ప్రజలు ఈవిషయాన్ని గమనించి ఆయా కేంద్రాలలో భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో కోరారు.

GVMC office

2021-06-06 17:01:57

నిషేధ వ్యూహం..ఆపై ఆదాయం..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపల అమ్మకాలను ఆదివారం నిషేధిస్తున్నట్టు కమిషనర్ డా.జి.స్రిజన రెండు రోజులు ముందునుంచే ఆదేశాలు జారీచేసి ప్రచారం చేసినా పట్టించుకోని వారి నుంచి భారీగా అపరాద రుసుము వసూలు చేశారు. ఆదివారం యధా స్థితిగా కొందరు మాంసం చేపల దుఖాణాలు తెరిచారు. దీనితో ఆకస్మికంగా తనిఖీలు చేసిన జివిఎంసీ సిబ్బంది దుకాణాదారులు నుంచి రూ.96,380/- అపరాధ రుసుం విధించినట్లు జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు తెలిపారు.  కరోనా  తీవ్రత దృష్ట్యా ఆదివారం  మాంసాహారపు అమ్మకాలు నిషేధించినా..ఆ  నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని అలాంటి వారిపై జివిఎంసి పరిధిలోని ప్రత్యేక స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా ఈ అపరాధ రుసుముతో పాటు 86కేజీల మేక మాంసం, 180 కేజీల చికెన్, 60 కేజీల చేపలు, 43కేజీల రొయ్యలు, 20కేజీల పీతలు సీజ్ చేయడమైనదని, వీటిని జివిఎంసి వెటర్నరి డాక్టర్ ఎన్.కిషోర్,  శానిటరి ఇన్స్పెక్టర్ ఎన్.వాసు ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్వాడ్ బృందం మధురవాడ  డంపింగ్ యార్డుకు తరలించి ఫినాయిల్ వేసి పూడ్చి పెట్టినట్టు  అదనపు కమిషనర్ తెలిపారు. 

విశాఖ సిటీ

2021-06-06 14:21:02

పురోగ‌మిస్తున్న వైద్య ఆరోగ్య వ్య‌వ‌స్థ‌..

ప్ర‌జ‌ల సంక్షేమ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయంగా మారింది. ఒక‌వైపు వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే, విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో పెద్ద ఎత్తున‌ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఫ‌లితంగా ఆయా రంగాల్లో స‌మూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైద్యారోగ్య రంగం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతోంది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే సుమారు రూ.760.89 కోట్ల రూపాయ‌ల‌తో ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ‌, కొత్త ఆసుప‌త్రుల ఏర్పాటుకు కృషి జ‌రుగుతోంది. వైద్య సేవ‌లు ప్ర‌జ‌ల ముంగిట‌కే వ‌చ్చి చేరుతున్నాయి. వివిధ దీర్ఘ‌కాలిక రోగులు 5,178 మందికి పింఛ‌న్లు అందించి ఆదుకోవ‌డం జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు కార్పొరేట్ ఆసుప‌త్రిలో వైద్య‌మంటే, సామాన్యుడికి ఊహ‌ల్లో కూడా లేని విష‌యం. ఈ ఆధునిక వైద్యాన్ని ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా పేద‌ల ద‌రికి చేర్చిన‌వారు దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. దానిని మ‌రింత చేరువచేసి, ప్ర‌జ‌ల ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పించారు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా సుమారు 1100 వ్యాధుల‌కు మాత్ర‌మే చికిత్స అంద‌గా, ప్ర‌స్తుతం వ్యాధుల సంఖ్య‌ను సుమారు 2,400 కు పెరిగింది. జిల్లాలో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి  6ల‌క్ష‌లా, 99వేల‌, 852 మంది అర్హులుగా ఉన్నారు. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 35,972 మంది ఈ రెండేళ్ల కాలంలో ఆరోగ్య‌శ్రీ ద్వారా జిల్లాలోని 28 నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల్లో రూ.84.88 కోట్ల విలువైన వైద్య‌చికిత్సలు పొందారు. అవ‌స‌ర‌మైన వారికి ఆరోగ్య‌శ్రీ ద్వారా, పూర్తిగా ఉచితంగా చికిత్స‌ను అందించ‌డ‌మే కాకుండా, శ‌స్త్ర చికిత్స చేయించుకున్‌సవారు కోలుకొనే వ‌ర‌కూ , ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం ద్వారా వారికి రోజుకు రూ.225 చొప్పున‌,  నెల‌కు రూ.5వేలు వ‌ర‌కూ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్ర‌భుత్వం. ఇలా ఈ రెండేళ్ల‌లో సుమారు 24,589 మంది ఆస‌రా ద్వారా 15 కోట్ల రూపాయ‌ల సాయాన్ని పొందారు.

ఆప‌ద్భాంధ‌వి 108
                 కుయ్ కుయ్ కుయ్.... అంటూ అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వాలిపోయే 108 వాహనాలు జిల్లాలో విశేష‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఆప‌త్కాలంలో బాధితుల‌కు ఆదుకొని, ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇటీవ‌లే జిల్లాకు 108 వాహ‌నాలు 36 ను ప్ర‌భుత్వం కొత్త‌గా  స‌మ‌కూర్చింది. వీటిలో అడ్వాన్స్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 10, బేసిక్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 24, నియోనాట‌ల్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 2 ఉన్నాయి. వీటి ద్వారా సంఘ‌ట‌నా స్థ‌లానికి కేవ‌లం 20 నిమిషాల్లోనే వాహ‌నాలు చేరుకొని, క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి, వారి విలువైన ప్రాణాల‌ను నిల‌బెడుతున్నాయి.  ఈ వాహ‌నాల ద్వారా నెల‌కు సుమారుగా 3,500 నుంచి 4,500 మంది క్ష‌త‌గాత్రులు లేదా రోగులు లేదా గ‌ర్భిణుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 1700 మంది కోవిడ్ రోగుల‌ను  ఆసుప‌త్రుల‌కు చేర్చాయి.

ఈ ఏడాది 108 వాహ‌నాల ద్వారా త‌ర‌లించిన పేషెంట్లు
జ‌న‌వ‌రి    3,285
ఫిబ్ర‌వ‌రి   3,497
మార్చి      4,685
ఏప్రెల్    4,714
మే            4,100

గ్రామీణుల చెంత‌కు 104 వైద్యం
                నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌ను సామాన్యుల  ద‌రిచేర్చ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషి చేస్తోంది.  పేద‌ల ముంగిట‌కే వైద్య సేవ‌ల‌ను అందించేందుకు 104 వాహ‌నాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇవి గ్రామీణ వైద్యాల‌యాలుగా మారాయి. జిల్లాలో ప్రస్తుతం 33 వాహ‌నాలు సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ వాహ‌నాలు ద్వారా నెల‌కు స‌గ‌టున 30వేల మందికి వైద్యం అందుతోంది. కేవ‌లం వైద్య సేవ‌లే కాకుండా, దాదాపు 1800 ర‌కాల మందుల‌ను కూడా ఈ వాహానాల ద్వారా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.

104 వాహ‌నాల ద్వారా అందించిన ఓపి వివ‌రాలు ః
జ‌న‌వ‌రి   22,961
ఫిబ్ర‌వ‌రి  29,770
మార్చి     34,743
ఏప్రెల్    33,158
మే           33,000

వైద్య క‌ళాశాల‌తో భ‌రోసా
               జిల్లాలో సుమారు రూ.500 కోట్ల నాడూ-నేడు నిధుల‌తో, 500 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మితం కానుంది. విజ‌య‌న‌గ‌రం స‌మీపంలోని గాజుల‌రేగ వ‌ద్ద సుమారు 70 ఎక‌రాల్లో దీని నిర్మాణానికి ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. 30 నెల‌ల్లో దీని నిర్మాణం పూర్తి చేసుకొని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఫ‌లితంగా అన్ని ర‌క‌లా అధునాత‌న వైద్య సేవ‌లు జిల్లా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఇప్ప‌టిలా, విశాఖ కెజిహెచ్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

గిరిజ‌నుల చెంత‌నే ఆధునిక వైద్యం
               ఏజెన్సీకి ముఖ‌ద్వారం, డివిజ‌న్ కేంద్ర‌మైన పార్వ‌తీపురంలో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి ఇప్ప‌టికే అంకురార్ప‌ణ జ‌రిగింది. సుమారు 5 ఎక‌రాల విస్తీర్ణంలో, రూ.49.26 కోట్ల వ్య‌యంతో దీని నిర్మాణానికి కొద్ది నెల‌ల క్రితం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. టెండ‌ర్లు కూడా ఖ‌రార‌య్యాయి. ఈ ఆసుప‌త్రి నిర్మాణం పూర్త‌యితే, పార్వ‌తీపురం చుట్టుప్ర‌క్క‌ల మండ‌లాల ప్ర‌జ‌ల‌తోబాటు, 8 గిరిజ‌న మండ‌లాల్లోని గిరిపుత్రుల‌కు, ఒడిషా  రాష్ట్ర స‌రిహద్దు ప్ర‌జ‌ల‌కు కూడా ఈ ఆసుప‌త్రి సేవ‌లు అంద‌నున్నాయి.

వైఎస్ఆర్ కంటివెలుగు
               అవ్వాతాత‌ల క‌ళ్ల‌లో వెలుగు నింప‌డానికి, చిన్నారుల కంటి చూపు కాపాడ‌టానికి ప్ర‌భుత్వం వైఎస్ఆర్ కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం చేప‌ట్టింది. దీనిలో భాగంగా వృద్దులు, చిన్న‌పిల్ల‌ల‌ను ముందుగానే కంటి స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి, కంటి ప‌రీక్ష‌ల‌ను మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించింది. మొద‌టి విడ‌త 2,92,462 మందికి ప్రాధ‌మిక‌ కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రెండో విడ‌త 12,991 మందికి కంటివ్యాధి నిపుణుల చేత 12,991 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వారికి క‌ళ్ల‌ద్దాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. మూడోవిడ‌త 48,130 మంది అవ్వాతాత‌ల‌కు కంటి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

స‌మ‌ర్థ‌వంతంగా కోవిడ్ క‌ట్ట‌డి
               ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన కోవిడ్ మ‌హ‌మ్మారిని ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా, జిల్లాలో స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డం జ‌రిగింది. దీనికోసం జిల్లాలో 27 కోవిడ్ ఆసుప‌త్రుల‌ను గుర్తించి, అవ‌స‌ర‌మైన‌ ఆక్సీజ‌న్‌, మందులును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. వీటిలో మొత్తం ప‌డ‌క‌లు 2608 కాగా, వీటిలో 463 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌లు, 209 ఐసియు ప‌డ‌క‌లను ఏర్పాటు చేసి, చికిత్స‌ను అందించ‌డం జ‌రిగింది. జిల్లా కేంద్రాసుప‌త్రిలో హుటాహుటిన 10 కెఎల్ ఆక్సీజ‌న్ ట్యాంకును ఏర్పాటు చేసి, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.  సుమారు 2వేల మందికి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా ఉచితంగా కోవిడ్ చికిత్స అందించ‌బ‌డింది.

మౌలిక వ‌స‌తుల‌కు పెద్ద‌పీట‌
                రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అధికారంలోకి రాగానే, విద్య‌, వైద్య రంగాల్లో మౌలిక వ‌సతుల‌కు క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు. దీనిలో భాగంగా భారీ ఎత్తున వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బందిని నియ‌మించారు. జిల్లాలో నాడూ-నేడు, నాబార్డు, డిఎంఇ, ఎన్‌హెచ్ఎం త‌దిత‌ర నిధులు సుమారు రూ.760.89 కోట్ల‌తో ఆసుప‌త్రుల నిర్మాణం, అభివృద్ది కార్య‌క్ర‌మాలు జోరందుకున్నాయి. దీనిలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌, పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రితోపాబాటుగా, ప్ర‌స్తుతం ఉన్న పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు కార్య‌క్రమాలు ఎపి వైద్య‌, ఆరోగ్య మౌలిక వ‌స‌తుల అభివృద్ది సంస్థ ఆధ్వ‌ర్యంలో చురుగ్గా  జ‌రుగుతున్నాయి. నాడూ-నేడు ప‌థ‌కం క్రింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 68 ప్రాధ‌మిక వైద్య కేంద్రాలను రూ.48.24 కోట్ల‌తో కొత్త భ‌వ‌నాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 510 డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్కులు నిర్మాణం జ‌రుగుతోంది. సుమారు రూ.59.57 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మితం అవుతున్న వీటిని పంచాయితీరాజ్ శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. వీటి నిర్మాణం పూర్తయితే, జిల్లాలోని వైద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటుచేసుకుంటాయి. ఇటు గ్రామ స్థాయి నుంచి అటు జిల్లా స్థాయి వ‌ర‌కూ మెరుగైన వైద్య‌ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.  

వైద్యులు, సిబ్బంది నియామ‌కం ః
                         రెండేళ్ల క్రితం        ఈ రెండేళ్ల‌లో నియామ‌కాలు
వైద్యులు               138                              40
న‌ర్సులు               128                             193
ఎఎన్ఎం               382                             598
ఇత‌ర సిబ్బంది     542                               89
ఆశా వ‌ర్క‌ర్లు         2542                              32
               

చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ః
1) గ‌జ‌ప‌తిన‌గ‌రం సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1700 ల‌క్ష‌లు.
2) సాలూరు సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1700 ల‌క్ష‌లు.
3) ఎస్‌కోట‌ సిహెచ్‌సి 50 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1260 ల‌క్ష‌లు.
4) కురుపాం సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 300 ల‌క్ష‌లు.
5) బాడంగి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 881 ల‌క్ష‌లు.
6) భ‌ద్ర‌గిరి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 895 ల‌క్ష‌లు.
7) పార్వ‌తీపురం జిల్లా ఆసుప‌త్రి 100 ప‌డ‌క‌ల నుంచి 150 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 2115 ల‌క్ష‌లు.
8) నెల్లిమ‌ర్ల‌ 30 ప‌డ‌క‌ల సిహెచ్‌సి అభివృద్ది రూ. 442 ల‌క్ష‌లు.
9) భోగాపురం 30 ప‌డ‌క‌ల సిహెచ్‌సి అభివృద్ది రూ. 395 ల‌క్‌ాలు.
10) బొబ్బిలి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 332 ల‌క్ష‌లు.
11) జిల్లా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణం రూ.50000 ల‌క్ష‌లు.
12) పార్వ‌తీపురం మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం రూ.4926 ల‌క్ష‌లు
13) డిఇఐసి-పార్వ‌తీపురం రూ.106ల‌క్ష‌లు
14) బ‌ర్త్ వెయిటింగ్ హోమ్‌, పార్వ‌తీపురం రూ.30ల‌క్ష‌లు
15) భ‌ర్త్ వెయిటింగ్ హోమ్‌, భ‌ద్ర‌గిరి, రూ.30ల‌క్ష‌లు
16) జిల్లా కేంద్రంలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ స్టోర్ అభివృద్ది రూ.196ల‌క్ష‌లు.


వైద్యారోగ్య రంగానికి వెచ్చించిన‌  నిధులు ః

నిధులు                                                ప‌నులు       వ్య‌యం(రూ. కోట్ల‌లో)

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల (నాడూ-నేడు)        1             500.00
నాబార్డు నిధులు                                           10             100.20
డిఎంఇ (పార్వ‌తీపురం మ‌ల్టీ స్పెషాలిటి)     1               49.26
నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్                                     4                 3.62
నాడూ.నేడు (పిహెచ్‌సిలు)                           68               48.24
నాడూ-నేడు (వెల్‌నెస్ సెంట‌ర్లు)               510               59.57
                                                                            మొత్తం 760.89 కోట్లు


మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను కల్పిస్తున్నాం ః క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌
                   జిల్లా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నాం. ప్ర‌స్తుతం సుమారు 760 కోట్ల రూపాయ‌ల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఎన్న‌డూ లేని విధంగా వైద్య రంగంలో ఖాలీల భ‌ర్తీ చేప‌ట్టాం. డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్కుల‌వ‌ల్ల గ్రామీణ ప్ర‌జ‌ల చెంత‌కే వైద్య సేవ‌లు అందుతాయి. జిల్లాలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణం పూర్త‌యితే, వైద్య సేవ‌ల‌కోసం ఇత‌ర జిల్లాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. వైద్య రంగంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా, వ‌స‌తులు పెరిగి, కోవిడ్‌ను జిల్లాలో స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాం.

Vizianagaram

2021-06-06 08:12:52

శానిటేషన్ సిబ్బంది సేవలు కీలకం..

కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. నగరంలోని  జోన్ 16వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  కరోనా కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు.  తల్లి తమ పిల్లలకు ప్రేమతో ఏ విధమైన సేవ చేస్తుందో అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది  మన చెత్తను గాని కాలువలోని చెత్తను గాని తీస్తారని,  అందుకే ప్రతి పారిశుద్ధ కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, వారికి మనం ఎప్పుడూ ఋణపడి ఉంటామని,  పారిశుద్ధ్య కార్మికులు ఎండనకా, వాననకా  కష్ట పడతారని వారికి   ప్రజలు సహకారం అందించాలని మేయర్ తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆ వార్డులో మేయర్, వార్డు కార్పొరేటర్ తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్  మొల్లి లక్ష్మి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్,  ఎ.ఎం.ఒ.హెచ్ రమణ మూర్తి,  శానిటరి సూపర్వైజర్ జనార్ధన్,  శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ సిటీ

2021-06-05 15:52:58

పోర్టు భూసేకరణ వేగవంతం చేయండి..

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగంగా చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్) జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు.రామాయపట్నం పోర్టు భూసేకరణపై ప్రకాశం భవ నంలోని జె.సి. ఛాంబర్లో సంబ ంధిత అధికారులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున భూముల
కేటాయింపుల్లో మరింత వేగం పెంచాలని జె.సి. మురళి తెలిపారు. పోర్టు కోసం 323 ఎకరాల ప్రభుత్వ భూమిని, 220 ఎకరాల చుక్కల భూమిని, 43 ఎకరాల అసైన్డ్ భూమిని పోర్టు అధికారులకు అప్పగించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 45.94 ఎకరాల భూమి రామాయ పట్నం పోర్టుకోసం
ఇచ్చేశామని ఆయన స్పష్టం చేశారు. మరో 90 ఎకరాలు వారంరోజుల్లోగా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 220 ఎకరాల చుక్కల భూమిలో ప్రస్తుతం 180 ఎకరాలను 15 రోజుల్లోగా పోర్టు అధికారులకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని ఆయన వివరించారు. చేవూరు
గ్రామంలో 120 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరగనున్నందున ఇళ్లు, భూములు కోల్పోయిన వారికోసం రావులపాలెం, ఆవులవారిపాలెం గ్రామాలలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని జె.సి. మురళి చెప్పారు. నిర్వాసితులయ్యే 253 కుటుంబాలకు పునరావాస కాలనీ నిర్మించాల్సి ఉందన్నారు. ఆ
రెండు గ్రామాలలో సుమారుగా 40 నుంచి 50 ఎకరాలు భూసేకరణ చేయాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. రామాయపట్నం పోర్టు పరిధిలోకి వచ్చే భూముల సేకరణలో 70 ఎకరాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించనున్నాయని ఆయన తెలిపారు. ఆ భూములలో ఐదేళ్ల క్రితం
నుంచి సాగుచేస్తున్న పెద్ద, చిన్న రైతుల వివరాలను గూగుల్ లోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారం తో గుర్తించాలన్నారు. అలా గుర్తించిన వారి వివరాలపై నివేదిక పంపాలన్నారు. నిర్వాసితులయ్యే బాధితుల గృహాలు, భూముల కొలతలు ఖచ్చితత్వంగా ఉండాలన్నారు. పరిహారం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఆయన పలు సూచనలు చేశారు. పోర్టు పరిధిలోకి వచ్చే 44.4 ఎకరాలు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అక్కడ సాగుచేసుకుంటున్న వారికి ప్రత్యామ్నాయంగా పి.సి.పల్లి మండలం నేరేడుపల్లిలో 60 ఎకరాలు సాగుభూమి ఇవ్వడానికి అటవీ శాఖ సిద్దంగా ఉందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, డి.ఆర్.ఓ. తిప్పే నాయక్, ఆర్. అండ్. బి. ఎస్.ఇ. విజయరత్నం, ఉలవపాడు తహసిల్దార్ శిల్ప, పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Ongole

2021-06-05 15:50:01

అభ్యంతరాలు తెలియజేయొచ్చు..

సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ సీనియారిటీ జాబితా పై అభ్యంతరాలుంటే ఈ నెల 21వ తేదీ లోపు  తెలియచేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జేసి ( రెవిన్యూ) గౌతమితో కలసి సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ కల్పన విషయమై  సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ కల్పనకు సంభందించి గతంలో  9751 మందితో కూడిన ప్రాథమిక జాబితాను రూపొందించడం జరిగింది. అయితే  సోమశిల  ప్రాజెక్టు ముంపు వాసులు చేసిన ఫిర్యాదులను పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు సీనియారిటీ జాబితాలో సవరణలు, మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు గాను  ప్రస్తుత ఉద్యోగ సీనియారిటీ జాబితాను https://kadapa.ap.gov.in  వెబ్ సైట్ నందు ప్రదర్శించామన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఉన్న సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులు తమ పేర్లను  వెబ్ సైట్ లో పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు,  సవరణలు ఉంటే ఈ నెల 7వ తేదీ నుండి 21 వ తేదీ లోపు నెల్లూరు సోమశిల ప్రాజెక్టు సర్కిల్  కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నందు ...కార్యాలయపు పని వేళల్లో  దరఖాస్తు చేసుకుని రసీదును పొందవచ్చునన్నారు. సోమశిల నిర్వాసితుల నుండి స్వీకరించిన అభ్యంతరాలు,  సవరణలను పరిశీలించి తగు మార్పులు చేసి కొత్తగా సీనియారిటీ జాబితాను రొపొందిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు సర్కిల్ ఎస్ఈ ఎన్. కృష్ణారావు, స్పెషల్ కలెక్టర్ రామమోహన్ తదితరులు పాల్గొన్నారు. 

Kadapa

2021-06-05 15:48:34

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని,  ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టుల సముదాయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా  ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఇతర న్యాయమూర్తులతో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు సముదాయాల్లోని పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు మొక్కలను నాటడం పరిపాటి అని, అయితే పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రస్తుతం ఫల మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా నేరేడు, జామ, ఉసిరి వంటి పలురకాల ఫల మొక్కలను తాము, తమ సిబ్బంది పాల్గొని నాటడం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో సమతుల్యత లోపించడం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయని,  తద్వారా ప్రతీ ఏడాది ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీల పెరుగుతూ వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవడమే ప్రధాన మార్గమని ఆయన సూచించారు. పర్యావరణం లోపించడం వలన ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్యం అధికమై చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే కరోనా వంటి పాండమిక్ సమయంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం గమనించామని, ఇందుకు కాలుష్యమే కారణమని ఆయన వివరించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను పెంచుకోవడం వలన వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, పచ్చదనాన్ని చూస్తే కళ్లకు అందంగా కనిపిస్తుందని చెప్పారు. ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఇండోర్ ప్లాంట్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, వీలైతే వాటినైనా పెంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార వదార్ధాలు ప్రకృతి నుండి లభించినవేనని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను నరికివేస్తున్నారని, పంట పొలాలను లే అవుట్లగా మారుస్తున్నారని, అడవులు కనుమరుగైపోతున్నాయని వీటివలన పర్యావరణం లోపిస్తుందని ఆయన గుర్తుచేసారు.  ఇటువంటి తరుణంలో విజ్ఞతతో తమ పుట్టినరోజున, ఇతర సందర్భాలలోనైనా ప్రతీ ఒక్కరూ తమ పెరటిలో గాని లేదా సమీప ప్రాంతంలో  ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.   పర్యావరణాన్ని రక్షించేందుకు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ప్రజలను కోరారు.

          ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ టి.వెంకటేశ్వర్లు,  జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ( స్పెషల్ మొబైల్ కోర్ట్ ) జి.లెనిన్ బాబు, ఫస్ట్ అడిషినల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కె.రాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యస్.రమేష్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-06-05 15:35:04

Rajahmundry

2021-06-05 14:53:13

ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు వితరణ..

శ్రీకాకుళం జిల్లాకు 50 ఆక్సిజన్ సిలిండర్లు, 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేసారు. ఈ మేరకు ఎంపీ జిల్లా కలెక్టర్ జె నివాస్ కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద శని వారం అందజేసారు. ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ –ఆంధ్ర ప్రదేశ్ విభాగం ఆరు జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించగా శ్రీకాకుళం జిల్లాకు కూడా అందించాలని పార్లమెంటు సభ్యులు కోరడంతో రూ.50 లక్షల విలువగల సామగ్రిని అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు జిల్లాకు ఉపయోగకరం అన్నారు. కోవిడ్ సమయంలో ఇటువంటి సౌకర్యాలు అందించడం పట్ల అభినందించారు. ప్రజలకు సరైన సమయంలో వినియోగించుటకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. ఆరోగ్య అవసరాలు ఇంకా అవసరమని గుర్తించామని దాంతో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచాలని ప్రయత్నించామని చెప్పారు. ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి రూ.50 లక్షల విలువైన సామగ్రి అందించడం జరిగిందని పేర్కొన్నారు.  అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేసి కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సౌకర్యం అందించాలని కలెక్టర్ ను కోరామని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మూడవ దఫా విజృంభించకుండా, జిల్లాలోకి ప్రవేశించకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-05 14:32:49

కోవిడ్ రోగులను తక్షణమే గుర్తించండి..

 కోవిడ్‌-19 మూడో వేవ్ విప‌త్తు పొంచిఉంద‌న్న సంకేతాల నేప‌థ్యంలో కేసుల స‌త్వ‌రం చేపట్టాలని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో కోవిడ్ మూడో ద‌శను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌ల్లో భాగంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌పై శ‌నివారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కేసుల గుర్తింపు.. ఆపై నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక వ‌స‌తుల‌ను గ్రామ స్థాయి నుంచే ప‌టిష్ట‌ప‌ర‌చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. చిన్నారుల‌కు మూడోద‌శ‌లో ముప్పు ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో చిన్న‌పిల్ల‌ల వైద్య నిపుణుల‌తో స‌హా వివిధ వైద్య విభాగాల నిపుణులు, జిల్లా వ్యాప్త వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి గ్రామంలోనూ సామాజిక ఐసోలేష‌న్ కేంద్రాల (ఎస్ఐసీ)ను ఏర్పాటుచేయ‌డం ద్వారా వైర‌స్ వ్యాప్తి ఉద్ధృతికి అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించ‌వ‌చ్చ‌ని, ఈ దిశ‌గా చేయాల్సిన ఏర్పాట్ల‌పై నివేదిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏఎన్ఎం స్థాయిలోనే ఐసోలేష‌న్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. 

మూడో వేవ్‌పై ప్ర‌జ‌ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని, ముఖ్యంగా భావి పౌరుల ఆరోగ్య భ‌ద్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌గా ప్ర‌జ‌లు గుర్తించేలా జ‌న‌జాగృతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. చిన్నారులు కోవిడ్ బారిన ప‌డిన ప‌రిస్థితుల్లో వారికి చికిత్స అందించే కేంద్రాల‌కు స‌మీపంలో త‌ల్లులు ఉండేలా వ‌స‌తి, ఇత‌ర ఏర్పాట్లు చేయాల‌ని, ఇందుకోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌, త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న ప‌డ‌క‌ల్లో 10 నుంచి 15 శాతం ప‌డ‌క‌ల‌ను పూర్తిస్థాయిలో చిన్నారుల‌కు వైద్య సేవ‌లందించేలా సిద్ధం చేయాల‌న్నారు. మేజ‌ర్ ఆసుప‌త్రుల‌తో పాటు ఏరియా ఆసుప‌త్రులు, సీహెచ్‌సీలు, ఇత‌ర ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ లైన్లను ఏర్పాటుచేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయాల‌ని, ఇందుకోసం టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ఆదేశించారు. కోవిడ్ మానిట‌రింగ్ ప్రొఫైల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అద‌న‌పు ల్యాబ్ సామ‌గ్రిని సిద్ధం చేసుకోవాల‌న్నారు. సీపీఏపీ, హెచ్ఎఫ్ఎన్‌సీ, పీడియాట్రిక్ సెంట్ర‌ల్‌, పీఐసీసీ లైన్స్ వంటి వాటి ఏర్పాటు ద్వారా పీడియాట్రిక్ ఐసీయూల‌ను బలోపేతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

ఇంకా కలెక్టర్ ఏమ‌న్నారంటే..
- గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో ఫీవ‌ర్ స‌ర్వేను అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. దీర్ఘ‌కాలిక వ్యాధులు, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల వివ‌రాలు సేక‌రించాలి.
- కంటైన్‌మెంట్ జోన్ల వ్య‌వ‌స్థ‌ను ఆధునికీక‌రించి, క‌రోనా క‌ట్ట‌డికి వ్యూహాలు రూపొందించాలి. సామాజిక ఐసోలేష‌న్ కేంద్రాలు, కంటైన్‌మెంట్ జోన్ల నిర్వ‌హణ వంటి వాటికి మార్గ‌ద‌ర్శ‌కాల రూప‌క‌ల్ప‌న‌పై క‌స‌ర‌త్తు చేయాలి.
- అంగ‌న్‌వాడీ కేంద్రాల సిబ్బందికి కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి. ఇందుకోసం మాడ్యూళ్ల‌ను రూపొందించాలి.
- చిన్నారుల్లో వ్యాధినిరోధ‌క సామ‌ర్థ్యం పెంచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. 
- వాలంటీర్ల ద్వారా స్లిప్‌ల పంపిణీ విధానం ద్వారా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా చూడాలి. మొద‌టి, రెండోద‌శ కోవిడ్ కేసుల వ్యాప్తి ఆధారంగా హాట్‌స్పాట్‌ల‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న టీకా కార్య‌క్ర‌మం పూర్త‌య్యేలా చూడాలి.
- కోవిడ్ ఆసుప‌త్రుల్లో చికిత్స కోసం నిర్దేశించిన ప్ర‌త్యేక ఔష‌ధాలు 24X7 అందుబాటులో ఉండేలా చూడాలి.
- కోవిడ్ వైద్య సేవ‌లు అందించ‌డంలో మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌ర‌చిన వాటిని మాత్ర‌మే నోటిఫై ఆసుప‌త్రులుగా ప్ర‌క‌టించాలి. నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా ప‌టిష్ట నిఘా ఉండేలా చూడాలి.
- డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌కు ఉచితంగా, ఎలాంటి వివ‌క్షా లేని కోవిడ్ సేవ‌లు అందించేలా చూడాలి. 
- అవ‌స‌రం మేర‌కు వైద్య‌, ఆరోగ్య సిబ్బంది నియామ‌కానికి చ‌ర్య‌లు తీసుకోవాలి. వాకిన్ల ద్వారా వెంట‌నే నియామ‌కాలు పూర్త‌య్యేలా చూడాలి.
- 108 అంబులెన్సులు, ప్రైవేటు అంబులెన్సుల‌ను అవ‌స‌ర‌మైన వారికి త‌క్ష‌ణ‌మే అందుబాటులో ఉంచేందుకు ఏకీకృత విధానం అమ‌లుపై దృష్టిసారించాలి.

స‌మావేశంలో జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి సూర్య‌ప్ర‌వీణ్‌చాంద్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, డీసీహెచ్ఎస్ డా. టి.ర‌మేశ్‌కిషోర్, జీజీహెచ్‌లోని వివిధ వైద్య విభాగాల అధిప‌తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-05 14:23:26

స్త్రీనిధి ద్వారా జగనన్నతోడు రుణాలు..

శ్రీకాకుళం జిల్లాలో చిరు వ్యాపారులకు స్త్రీనిధి  పథకం ద్వారా గ్రామ సంఘాలకు జగనన్న తోడు రుణాలు అందించుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ తెలిపారు. ప్రతి గ్రామ సంఘంలో కనీసం 12  మంది చొప్పున  1581 గ్రామ సంఘాలలో సుమారుగా 18 వేల మంది లబ్దిదారులకు రూ.18 కోట్లు  మంజూరు చేయుటకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ స్త్రీనిధి “జగనన్న తోడు “ రుణాలను ఈ నెల 8వ తేదీన సంక్షేమ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. అదే రోజున సభ్యుల ఖాతాలో  సొమ్ము జమ చేస్తారని పేర్కొన్నారు. ఈ కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులను  ఆదుకొనే నిమిత్తం  స్త్రీనిధి ద్వారా  జగనన్న తోడు రుణాలు అందజేయటం ఆనందంగా ఉందని ఆమె వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న తోడు రుణం స్త్రీనిధి ద్వారా  ప్రతీ సభ్యురాలికి రూ.10 వేలు చొప్పున 18 వేల మందికి సంఘాల ఖాతాకులో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రుణం జమ విషయం  లబ్దిదారుని ఫోన్ కు అందుతుందని చెప్పారు. జగనన్న తోడు  రుణం 12 వాయిదాలలో 11 శాతం వడ్డీతో కలిపి నెలకు  రూ.890/-లు చొప్పున  స్త్రీనిధికి లబ్దిదారులు చెల్లించ వలసి ఉంటుందని ఆమె వివరించారు. ప్రభుత్వం సున్నా వడ్డీ క్రింద చెల్లించిన వెంటనే సభ్యుల ఖాతాకు ప్రస్తుతం చెల్లించిన వడ్డీ జమ అవుతుందని పేర్కొన్నారు. సురక్ష పథకం క్రింద స్త్రీనిధి రుణం మొత్తానికి బీమా కవరేజ్ చేయడం జరుగుతుందని, బీమాతో కూడిన  రుణంగా పరిగణిస్తామని శాంతి శ్రీ చెప్పారు.రూ.175 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యం : 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో వివిధ రకాలైన జీవనోపాధులు మెరుగు పరుచుటకు సుమారు 35 వేల మంది సభ్యులకు స్త్రీనిధి ద్వారా రూ.175 కోట్లు రుణాలు మంజూరు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందని, ఇప్పటకే రూ.30 కోట్ల రుణాలకు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. 2020-21 సంవత్సరంలో స్త్రీనిధి రుణాలు లక్ష్యం రూ.108 కోట్లు కాగా, రూ.120 కోట్ల రుణాలు మంజూరు చేసామని, రికవరీ శత శాతం సాధించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రదమ స్థానంలో నిలిచిందని ఆమె వివరించారు. 48 గంటల్లో స్త్రీ నిధి రుణాలు : జగనన్న చేయూత పథకంలో స్త్రీనిధి ద్వారా 18 వందల మంది లబ్ధిదారులకు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కిరాణా మొదలగు వ్యాపారాలు స్థాపించుటకు  రుణాలు మంజూరు చేసి సభ్యులు ఆర్దికంగా నిలదొక్కుకొనే విధంగా స్త్రీనిధి రుణాలు కోరిన సభ్యులకు 48 గంటలలో మంజూరు చేయటం జరుగుతుందని శాంతి శ్రీ చెప్పారు.

Srikakulam

2021-06-05 14:22:07

ఇవిఎం గోడౌన్ లను తనిఖీ చేసిన కలెక్టర్..

భారత  ఎన్నికల కమిషన్ ఆదేశాల  మేరకు ఇవియం గోడౌన్ లను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  తనిఖీ చేశారు.  శనివారం  గుంటూరు ఆర్ డి ఓ కార్యాలయం ఆవరణలోని ఇవియం గోడౌన్ ను, ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్  యార్డ్ లో  వివి పాట్ లను  భద్రపరచిన గోడౌన్ లను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  పరిశీలన చేశారు. గోడౌన్ల కు వేసిన తాళాల సీల్డ్ ను, గోడౌన్ల వద్ద ఉన్న అగ్నిమాపక పరికరాలను, సిసి కెమెరా లను, గార్డ్ డ్యూటీ లాగ్ బుక్ ను పరిశీలించారన్నారు.  ఇవియం ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఈవీఎం గోడౌన్ల నోడల్ ఆఫీసర్, అమరావతి – అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వి శైలజ, డిఆర్వొ కొండయ్య, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ తహశీలార్డు మోహన్ రావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-05 13:49:46

పేదలందరికీ సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సొంత గృహాలను అందించడమే లక్ష్యంగా  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని గృహనిర్మాణ శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్.ఎన్ భరత్ గుప్తా అన్నారు. శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం,పసుమర్రు గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పధకంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ తోపాటు, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని లు హాజరయ్యారు. కార్యక్రమానికి చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని అధ్యక్షత వహించారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల పండుగ సభలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా మాట్లాడుతూ ఒకే సారి ఎక్కువ సంఖ్యలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తక్కువ ధరలకు నిర్మాణ సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. దీంతో పాటుగా ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా 20 టన్నుల ఇసుకను అందించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.  గృహనిర్మాణ  ప్రాంతాల దగ్గరే గృహనిర్మాణశాఖతో పాటుగా అందుకు అనుబంధంగా పని చేస్తున్న శాఖల అధికారులకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బేస్ మెంట్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించేలా గ్రామ సచివాలయ అధికారులను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర మహిళలు సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

  గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 1వ తేది నుంచి 10 వ తేదిలోపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన 10 వేల ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. గత పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హత కలిగిన  అక్కచెల్లెమ్మలందరికీ నవరత్నాలు- పేదలకు ఇళ్ళు  పధకంలో భాగంగా ఇళ్ళ స్థలాలు కేటాయించారన్నారు. పేదలందరికీ  అనువైన ఇళ్ళ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి సంక్షేమ పధకాలు మరే ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం నుంచి ఇళ్ళ పట్టాలు అందుకున్న ప్రజలంతా ఏక కాలంలో ఇళ్ళు నిర్మించుకోవండం ద్వారా నిర్మాణ సామగ్రి తక్కువ ధరకు లభిస్తాయన్నారు.దీంతో పాటుగా స్థానికంగా ఉంటున్న ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయమని కలెక్టర్ వివేక్ యాదవ్ కొనియాడారు. ఒకే కాలంలో అటు ప్రజలకు ఆస్థులు పెరగడంతో పాటుగా, ఇటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అందివస్తున్న అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని మాట్లాడుతూ మాటలు చెప్పి, చేతులు దులుపుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ సమాజంలో పేద ప్రజల గురించి ఆలోచించి పనిచేసి చూపిన ఏకైక ముఖ్యమంత్రిని తాము కళ్ళారా చూస్తున్నామని అన్నారు. ఆయన నాయకత్వంలో తాను ఒక మహిళా శాసన సభ్యురాలుగా పని చేయడం గొప్పవరమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సంక్షేమ పధకాలే అందుకు నిదర్శనమన్నారు. నవరత్నాల్లో ఏ పధకం తీసుకున్నా ఆడిన మాట తప్పకుండా ప్రజలకు ఆ పధకాలు చేరేవరకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి భాగస్వామిని అవుతానని అన్నారు. ఈ సందర్భంగా పసమర్రు ప్రాంతంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పధకాలను శాసన సభ్యురాలు రజని వివరించి చెప్పారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. లభ్ధిదారులకు కూడా త్వరితగతిన ఇల్లు కట్టుకొని సొంత ఇంటి యజమానులుగా మారాలని పిలుపు నిచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారు మహబూబ్ బి అనే మహిళ స్థలం వద్ద సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.అనంతరం భూమిపూజ చేసి,నవధాన్యాలుచల్లి,నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

ఇళ్ళ నిర్మాణాల ప్రాంతంలోనే ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు బోర్లలో తొలి బోరును ఏర్పాటు చేసి, గృహ నిర్మాణాలకు అవసరమైన నీటి సౌకర్యాన్ని సంబధిత అధికారులు ఏర్పాటు చేయగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్,ఎన్ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజనిలు ప్రారంభించారు.  చిలకలూరిపేట నియోజక వర్గంలోని పసుమర్రు గ్రామంలో 41.63 ఎకరాల భూమిని లే అవుట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 1773 మంది లబ్ధదారులకు ప్లాట్లు కేటాయించారు. ఇందులో తొలివిడతగా పిఎంఎవై - వైయస్ఆర్ (అర్భన్) – బిఎల్ సి పధకాల ద్వారా 1565 మంది పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మొత్తం నిర్మాణాలు,మౌలిక వసతులు కలిపి ప్రాజెక్ఠ్ ఖర్చు రూ. 2817.60 లక్షలు. ఇళ్ళ నిర్మాణ ప్రాంతంలో మొత్తం మూడు బోర్లు ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక బోరును ఏర్పాటు చేసి,విద్యుత్తు సౌకర్యం కల్పించి భవన నిర్మాణాలకు నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. విద్యత్తు ఏర్పాటుకు అంచనా ఖర్చు  రూ.20.74 లక్షలు.

 సభా కార్యక్రమానికి ముందు మీడియాతో రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని లు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పధకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్, జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర,  మన్సిపల్ ఛైర్మన్ రఫాని, మార్కెట్ యార్డు ఛైర్మన్ చిన్నా, తహాశీల్థార్ సుజాత, ఎమ్పీడివొ హేమలతదేవి, పలుశాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-05 13:48:39