1 ENS Live Breaking News

నాడు నేడు వచ్చే 20లోగా పూర్తికావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌న‌బ‌డి నాడు - నేడు తొలివిడ‌త లో చేప‌ట్టిన ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌ల ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను జూన్ 20లోగా పూర్తిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా, సంక్షేమం) జె.వెంకట‌రావు ఇంజ‌నీరింగ్ విభాగాల‌ను ఆదేశించారు. జిల్లాలో తొలివిడ‌త‌లో 1060 పాఠ‌శాల‌ల్లో ఆరు ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని వీటిల్లో చేపట్టిన పనులన్నీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాడు- నేడు పనులపై జె.సి. శనివారం కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో సమీక్షించారు. పాఠశాలల కు మెటీరియల్ సరఫరా చేసే సరఫరా దారు డ్యూయెల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డ్, తాగునీటి శుద్ధి పరికరాలు, టీవీ లు, ఫర్నిచర్ ఇప్పటికే అందజేసారనీ వాటి ఏర్పాటు జూన్ 6వ తేదీ నాటికీ పూర్తి కావాలన్నారు. వాల్ ఆర్ట్, పెయింటింగ్స్ 20 నాటికీ అన్ని స్కూళ్ళలో పూర్తికావాలని గిరిజన ప్రాంత పాఠశాలల్లో పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, సమగ్ర శిక్ష ఏపిఓ గోపి, ఇ.ఇ. శివానంద్, ఏ.పి.ఇ.డబ్ల్యు.డి.సి. శామ్యూల్, విఎంసి ఇ.ఇ. దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-29 11:38:07

జూన్2న అప్పన్న హుండీ లెక్కింపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం హుండీల లెక్కింపు జూన్2న చేపట్టనున్నట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు. ఈ మేరకు శనివారం దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ కమిషనర్ సూచనల మేరకు వచ్చే నెలలో లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. దీనికోసం కొండపైనా బేడా మండపంలో కోవిడ్ నిబంధనలు ద్రుష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేపట్టనున్నామన్నారు ఈఓ. ప్రస్తుతం నిబంధనలు అనుసరించి భక్తులకు స్వామివారి దర్శనాలు చేపడుతున్నామని చెప్పారు.

Simhachalam

2021-05-29 11:36:28

కరోనా కట్టడికి అందరి భాగస్వామ్యం అవసరం..

 కరోనా కట్టడికి అందరి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  శనివారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30  పడకల సామర్థ్యంతో జిల్లాలోనే ప్రప్రథమంగా నిర్మించిన  క్రౌడ్ ఫండెడ్ కోవిడ్ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ బాధితుల కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోందన్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఏప్రిల్ మొదటి వారంలో 3.10 శాతం, రెండో వారంలో 7.54, మూడో వారంలో 10.96,  నాలుగో వారంలో 21.43 శాతం, మే నెల మొదటి వారంలో 30.47 శాతం, రెండవ వారంలో 37.08, మూడోవారంలో 32.18, నాల్గవ వారంలో 24.70 శాతంగా పాజిటివ్ రేటు నమోదైందన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్ మొదటి వారం నుండి క్రమంగా పెరుగుతూ మే మూడో వారం నుండి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతల ఫీవర్ సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. 

తాడిపత్రి ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ బెడ్ లతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి, అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 250 ఆక్సిజన్ బెడ్లతో జర్మన్ హ్యాంగర్స్ పద్ధతిన తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాట్ల పనులు తుదిదశకు  చేరుకున్నాయన్నారు. గ్రామస్థాయిలో కరోనా కట్టడి చేయడానికి ప్రత్యేక వసతి సౌకార్యలు లేనివారికోసం ప్రతి గ్రామంలో విలేజ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు , దాతలను సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. కరోనా కట్టడికి సర్పంచుల ఆధ్వర్యంలో కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మండల,మున్సిపల్ స్థాయిలలో కరోనా కట్టడికి కరోనా వార్ రూములు కూడా ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో కరోనా వ్యాప్తి పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉండగా, రెండో దశలో గ్రామీణ ప్రాంతాలలో కూడా కరోనా వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో మరియు పట్టణంలోని దాతల సహకారంతో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు


 ప్రైవేట్ ఆస్పత్రుల పై కఠిన చర్యలు తప్పవు :జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరిక

కోవిడ్ రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులకు జరిమానా విధించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా రోగుల నుండి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు యాజమాన్యం వసూలు చేసిన ఫీజుకు పది రెట్లు అధికంగా జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మొదటి తప్పుగా జరిమానా అనంతపురం లోని నాలుగు ఆసుపత్రులపై  సుమారు రూ. 9లక్షల 55 వేలు జరిమానా విధించడం జరిగిందని, రెండోసారి తప్పులు చేస్తే ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ లింగాల నిర్మల, ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Dharmavaram

2021-05-29 11:23:44

2021-05-29 11:18:58

2021-05-29 11:18:30

2021-05-29 11:17:56

2021-05-29 11:17:24

2021-05-29 11:16:50

2021-05-29 11:16:15

జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు..

కాకినాడ జీజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యుల‌తో పాటు యువ నోడ‌ల్ అధికారులు, వైద్య‌, ఆరోగ్య సిబ్బందితో కోవిడ్ బాధితుల‌కు మెరుగైన సేవ‌లందిస్తున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. శ‌నివారం ఉద‌యం జాయింట్ క‌లెక్ట‌ర్ కాకినాడ జీజీహెచ్‌ను సంద‌ర్శించారు. ట్ర‌యాజింగ్ సెంటర్‌ను ప‌రిశీలించి, అక్క‌డి బాధితుల‌తో మాట్లాడారు. ఆసుప‌త్రిలో కోవిడ్ రోగుల‌కు అందిస్తున్న వైద్య‌, ఇత‌ర సేవ‌ల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ స‌హాయంతో ఇటీవ‌ల ఏర్పాటుచేసిన 10 కేఎల్ సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ ట్యాంకు ప‌నితీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉండ‌టంతో రోగుల‌కు స‌జావుగా వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో వివిధ సంస్థ‌లు, వ్య‌క్తులు సామాజిక బాధ్య‌త‌గా జిల్లాకు దాదాపు 300 వ‌ర‌కు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించార‌ని, వీటిని కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ), గిరిజ‌న ప్రాంతాల్లోని స్థిరీక‌ర‌ణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌
డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద పేద‌ల‌కు ఉచితంగా కోవిడ్ వైద్య సేవ‌లందించ‌డంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప్రైవేటు కోవిడ్ ఆసుప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో కోవిడ్ ఆసుప‌త్రుల్లోని వైద్య సేవ‌ల‌పై నిరంత‌ర స‌మీక్ష జ‌రుగుతోంద‌ని, ఆరోగ్య‌శ్రీ యేత‌ర కోవిడ్ చికిత్స‌కు ప్ర‌భుత్వం నిర్దేశించిన మేర‌కు మాత్ర‌మే ఫీజులు వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఎక్క‌డైనా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు తేలితే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు, డీనోటిఫై చ‌ర్య‌ల‌తో పాటు లైసెన్సు కూడా ర‌ద్దుచేసేందుకు వెనుకాడబోమ‌ని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై ఎవ‌రైనా ఫిర్యాదు చేయొచ్చ‌ని, ఈ ఫిర్యాదుల‌ను జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీడీసీ) ప‌రిశీలించి, చ‌ర్య‌లకు సిఫార్సు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన డీసీసీబీ:
జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ రోగుల‌కు ఆపన్న‌హ‌స్తం అందించేందుకు అయిదు లీట‌ర్ల సామ‌ర్థ్య‌మున్న ప‌ది ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జీజీహెచ్‌కు అందించింది. ఈ మేర‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), డీసీసీబీ ప‌ర్స‌న్ ఇన్‌ఛార్జ్ డా. జి.ల‌క్ష్మీశ చేతుల‌మీదుగా డీసీసీబీ అధికారులు జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌కు కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. దాదాపు రూ.ఏడు ల‌క్ష‌ల విలువైన కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన డీసీసీబీకి జేసీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. మ‌రింత మంది సామాజిక బాధ్య‌త‌గా ముందుకొచ్చి కోవిడ్ చికిత్స‌లో కీల‌క‌మైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌తోపాటు ఇత‌ర వైద్య ఉప‌క‌ర‌ణాల‌ను అందించాల్సిందిగా జాయింట్ క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి  సూర్యప్ర‌వీణ్‌చాంద్‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, డీసీసీబీ సీఈవో పి.ప్రవీణ్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-29 11:12:31

31న ఆన్ లైన్ లో ఆసుపత్రుల శంఖుస్థాన..

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య క‌ళాశాల‌కు ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మే 31న ఉద‌యం 11 గంట‌ల‌కు తన క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చ్యువ‌ల్‌గా శంకుస్థాప‌న చేయ‌నున్నార‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్లడించారు. ఈ శంకుస్థాప‌న కార్యక్ర‌మాన్ని గాజుల‌రేగ వ‌ద్ద వైద్య క‌ళాశాల ఏర్పాటుకోసం కేటాయించిన 70 ఎక‌రాల స్థలంలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నట్టు చెప్పారు. రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాట‌వుతోంద‌ని, క‌ళాశాల భ‌వ‌నాల నిర్మాణం ప‌నులు నిర్వహించేందుకు నిర్మాణసంస్థను కూడా ఖ‌రారు చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న ప‌నుల‌పై జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, వై.ఎస్‌.ఆర్‌.సి.పి. జిల్లా స‌మ‌న్వయ‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావుల‌తో క‌ల‌సి శ‌నివారం వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న స్థలాన్ని ప‌రిశీలించి ఏర్పాట్లపై అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. 150 మంది ప్రాంగ‌ణంలో కూర్చొని వీక్షించేలా మూడు ఎల్‌.ఇ.డి. స్క్రీన్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. కార్యక్రమం జ‌రిగే స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని విద్యుత్‌పంపిణీ సంస్థ అధికారుల‌ను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహ‌ణ‌కు వీలుగా ఫైబ‌ర్‌నెట్ ద్వారా ఇంట‌ర్నెట్ క‌నెక్షన్ ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. శంకుస్థాపన శిలాఫ‌ల‌కం, వేదిక‌ బ్యాక్ డ్రాప్ వంటి ఏర్పాట్లను ఏపి వైద్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేప‌ట్టాల‌ని ఇ.ఇ. స‌త్యప్రభాక‌ర్‌ను ఆదేశించారు. క‌ళాశాల భ‌వ‌నాల ఆకృతుల‌ను జిల్లా క‌లెక్టర్, వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నాయ‌కుల‌కు ఇ.ఇ. స‌త్య ప్రభాక‌ర్ చిత్రప‌టాల ద్వారా చూపించారు. 

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య ప‌ర‌మైన సౌక‌ర్యాలు త‌క్కువ‌గా వున్నందున‌ ఏ చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా విశాఖ‌లోని కె.జి.హెచ్‌.కు వైద్యం కోసం వెళ్లే ప‌రిస్థితి వుండేద‌ని, జిల్లాలోనే ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటు ద్వారా జిల్లాలో పూర్తిస్థాయిలో సూప‌ర్ స్పెషాలిటీ వైద్యసేవ‌లు కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి వ‌చ్చే ప‌రిస్థితి ఏర్పడింద‌న్నారు. జిల్లాకు చెందిన మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ‌వాణి, జిల్లా ఇన్ చార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుల చొర‌వ‌తో జిల్లాకు ముఖ్యమంత్రి వైద్య క‌ళాశాల మంజూరు చేశార‌ని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న‌ ఈ క‌ళాశాల ఏర్పాటు ప‌ట్ల జిల్లా ప్రజ‌లంతా ఎంతో సంతోషంగా వున్నార‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చిన  జిల్లాలోనే త‌గిన వైద్యం ల‌భించే ప‌రిస్థితి ఏర్పడుతోంద‌న్నారు. స‌కాలంలో వైద్య క‌ళాశాల భ‌వ‌నాలు పూర్తయి త్వర‌గా జిల్లా ప్రజ‌ల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

వై.ఎస్‌.ఆర్‌.సి.పి జిల్లా స‌మ‌న్వయ‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ జిల్లా ప్రజ‌ల చిర‌కాలం వాంఛ అయిన ప్రభుత్వ వైద్య క‌ళాశాల ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్ గారి నేతృత్వంలో నెర‌వేర‌డం ప‌ట్ల ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా జిల్లా ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెర‌వేరుస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌తంలోనూ ప‌లువురు ముఖ్య‌మంత్రులు వైద్య క‌ళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చినా అవి నెర‌వేరలేద‌ని, ఈ క‌ళాశాల ఏర్పాటు ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్ గారికే సాధ్యమయ్యింద‌న్నారు. వైద్యరంగంలో ఈ ప్రాంతం వెనుక‌బడి వుంద‌న్న భావ‌న‌తోనే జిల్లాకు ప్రభుత్వం ఈ ఉన్నత వైద్య విద్యా సంస్థను మంజూరు చేసింద‌ని, రానున్న రోజుల్లో జిల్లాలోని గిరిజ‌న ప్రాంత ప్రజ‌లు స‌హా అన్ని వ‌ర్గాల వారికీ పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవ‌లు అందించేందుకు ఈ వైద్య క‌ళాశాల దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దీని ప్రారంభోత్సవం కూడా జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

ఈ ప‌ర్యట‌న‌లో జాయింట్ క‌లెక్టర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌.డి.ఓ. బిహెచ్‌.భ‌వానీశంక‌ర్‌, జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వయ అధికారి డా.జి.నాగ‌భూష‌ణ రావు, త‌హ‌శీల్దార్ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-29 11:09:31

మత్స్యకారులంతా కోవిడ్ వేక్సిన్ వేసుకోవాలి..

విజయనగరం జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన మత్స్యకారులంతా ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ వేక్సిన్ వేసుకొని సురక్షితంగా ఉండాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి కోరారు. శనివారం ఈ మేరకు ఆమె మీడియాకి ప్రకటన విడుదలచేశారు. మత్స్యకార గ్రామాల్లో అందరూ ఒకే చోట గుమిగూడి సమావేశాలు పెట్టుకోవద్దని, ఖచ్చితంగా మనిషికి మనిషికీ మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు తరువాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. వేక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే తక్షణమే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం 104 కాల్ సెంటరు ను సంప్రదించాలన్నారు.

Vizianagaram

2021-05-29 03:28:55

గోకుల్ పార్కును అభివ్రుద్ధి చేయండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నాలుగవ జోన్ పరిధిలోని 29వార్డులో గల గోకుల్ పార్కును అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారితో కలసి బీచ్ రోడ్లో ఉన్న గోకుల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోకుల్ పార్కును అభివృద్ధి పరచి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేయాలని ఆదేశించారు. యాదవలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఒక సామాజిక భవనం నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెల్తామని హామీఇచ్చారు. అనంతరం బీచ్ రోడ్డులో ఉన్న రాదాకృష్ణ మందిరానికి సందర్శించారు. ఈ పర్యటనలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఒమ్మి సన్యాసిరావు, మొల్లి అప్పారావు, 29వ వార్డు కార్పొరేటర్ ఉరికిటి నారాయణ రావు, 11 వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాస్, యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-05-28 15:59:17

హిందూస్తాన్ లీవర్ 50 ఆక్సిజన్ మిషన్లు వితరణ..

 కోవిడ్ వైర‌స్ క‌ట్ట‌డికి, రోగుల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌-హార్లిక్స్ ఫ్యాక్ట‌రీ (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) 50 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌ను క‌లిసి ఫ్యాక్ట‌రీ సైట్ హెడ్ శ్రీధ‌ర్‌, హెచ్ఆర్ హెడ్ స‌తీష్‌కుమార్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి త‌దిత‌రులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో జేసీ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌) కింద కోవిడ్ రోగుల‌కు ప్రాణ‌వాయువును అందించే దాదాపు రూ.25 ల‌క్ష‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన హార్లిక్స్ ఫ్యాక్ట‌రీకి అభినంద‌న‌లు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. వైర‌స్ ఉద్ధృతి అధికంగా ఉన్న రోగులకు ప్రాణ‌వాయువు అందించేందుకు ఈ కాన్సంట్రేట‌ర్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని.. వీటిని కోవిడ్ కేర్ కేంద్రాల‌తో పాటు గిరిజ‌న ప్రాంతాల్లోని స్థిరీక‌ర‌ణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌-హార్లిక్స్ ఫ్యాక్ట‌రీకి జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌న్నారు. ఈ సంస్థ‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్ అనుప‌మ అంజ‌లి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-05-28 15:54:56

డార్విన్ మరో 5 ఆక్సిజన్ మిషన్లు వితరణ..

డార్విన్ ఫార్మా (విజ‌య‌వాడ‌) సంస్థ.. జిల్లాకు మ‌రో అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సంస్థ ప్ర‌తినిధి ఎస్‌సీవీ ర‌త్నారెడ్డి శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారిని క‌లిసి కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. కోవిడ్ బాధితులకు అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు స‌మ‌కూర్చిన డార్విన్ ఫార్మాకు జాయింట్ క‌లెక్ట‌ర్ (డ‌బ్ల్యూ) అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో డార్విన్ ఫార్మాకు చెందిన డా. వి.ర‌వికుమార్‌, డా. ఎన్‌.ముర‌ళిలు యూఎస్ ఇండియా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఫౌండేష‌న్‌, వెస్ట్ టెక్సాస్ ఇండియ‌న్ డాక్ట‌ర్స్ గ్రూప్ స‌హ‌కారంతో ఒక్కోటి రూ.లక్షా ప‌దివేలు విలువైన అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌తో పాటు రెండు వెంటిటేర్ల‌ను ఇటీవ‌ల జిల్లాకు అందించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-28 15:53:28