1 ENS Live Breaking News

పీఎం స్వ‌నిధి ప‌థ‌కానికి దరఖాస్తు చేసుకోవాలి..

ప్ర‌స్తుతం కోవిడ్ రెండోద‌శ స‌మ‌యంలో పీఎం స్వ‌నిధి ప‌థ‌కం ద్వారా 10,150 మంది ల‌బ్ధిదారుల‌కు త్వ‌రిత‌గ‌తిన రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), డీసీసీబీ ప‌ర్స‌న్ ఇన్‌ఛార్జ్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చిరువ్యాపారం, వీధివ్యాపారాలు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్న‌వారికి డీసీసీబీ ద్వారా రూ.10 వేలు చొప్పున రుణాలు మంజురు జ‌రుగుతుంద‌ని తెలిపారు. మ‌ధ్యాహ్నం 12 గం. నుంచి ఉద‌యం 6 గం. వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉన్నందున వీధి వ్యాపారులు, ఇత‌ర చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి ప్ర‌యోజ‌నం క‌లిగించే ఉద్దేశంతో పీఎం స్వ‌నిధి ప‌థ‌కం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం రుణాల మంజూరుకు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలో ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లోని 13 డీసీసీబీ శాఖ‌ల ద్వారా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జేసీ ల‌క్ష్మీశ తెలిపారు. 

ప‌థ‌కం వివ‌రాలు:
- ల‌బ్ధిదారుల నుంచి ఎలాంటి చ‌ర‌, స్థిర ఆస్తుల‌ను సెక్యూరిటీగా తీసుకోబ‌డ‌దు.
- మున్సిప‌ల్ విభాగం, మెప్మా ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ద్వారా ల‌బ్ధిదారుల గుర్తింపు జ‌రుగుతుంది.
- ల‌బ్ధిదారుల‌కు గుర్తింపు కార్డుతో పాటు లెట‌ర్ ఆఫ్ రిక‌మెండేష‌న్ (ఎల్‌వోఆర్‌) మంజూరు చేయ‌డం జ‌రుగుతుంది.
- ల‌బ్ధిదారుడు 12 స‌మాన సెల‌స‌రి వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలి.
- రుణాన్ని స‌కాలంలో చెల్లించిన వారికి ఏడు శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.
- ప‌థ‌కానికి క్రెడిట్ గ్యారెంటీ ట్ర‌స్ట్ ఫండ్, మైక్రో స్మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్ క్రెడిట్ గ్యారెంటీ వ‌ర్తిస్తుంది.
- ప‌థ‌కం ద్వారా మంజూరు చేసిన అప్పు మొత్తాన్ని నాబార్డు నుంచి బ్యాంక్ రీఫైనాన్స్ పొందొచ్చు.
- పొదుపు ఖాతా ప్రారంభింప‌జేయ‌డం, రుణ ద‌ర‌ఖాస్తు పూరించ‌డం, ఉద‌య్ మిత్రా పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేసే బాధ్య‌త‌ల‌ను మున్సిప‌ల్ వార్డు స‌చివాల‌య సిబ్బంది (సీవో, ఆర్‌పీ) నిర్వ‌ర్తిస్తారు. మే 31 లోగా రుణాల మంజూరు ల‌క్ష్యాలను చేరుకోవాల్సి ఉంది.

Kakinada

2021-05-29 12:43:24

మే 30న అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మే 30న స్వామివారి స్వర్ణపుష్పార్చన నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. శనివారం ఈ మేరకు ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారికి నిర్వహించే స్వర్ణ పుష్పార్చనలో భక్తులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన వచ్చునన్నారు. దానికి గాను ముందుగా టిక్కెట్టు చెల్లించిన వారికి ఆన్ లైన్ యూట్యూబ్ లింక్ పంపిస్తామని చెప్పారు. భక్తులు ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపూ టిక్కెట్టు మొత్తం ఆన్ లైన్ పేమెంట్ చేయవచ్చునన్నారు. దానికోసం భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని,  నిర్ణీత రుసుము చెల్లించి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొనవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-29 12:41:03

తడి పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. శనివారం జివిఎంసీ పరిధిలోని  రెండవ జోన్ 11వ వార్డు పరిధిలో ఆరిలోవలో శనివారం ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల ను ఆమె పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హెచ్.పి.సి.ఎల్ 23వేల డస్ట్ బిన్లను జివిఎంసికి అందించిందని మేయర్ తెలిపారు. విశాఖను సుందర నగరంగాను, చెత్త రహిత నగరంగాను తీర్చిదిద్దవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు.  ముఖ్యంగా మహిళలుగా ఆ బాధ్యత మనపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజు సిబ్బంది డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయడం జరుగుతుందని, తడి-పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్త వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని మేయర్ సూచించారు. చెత్తను రోడ్ల పైన కాలువలలోను వేయరాదని ప్రజలకు సూచించారు. ప్రతీ దుకాణాల ముందు మూడు డస్ట్ బిన్లు ఉండాలని సూచించారు. హెచ్.పి.సి.ఎల్. యాజమాన్యం ఈ డస్ట్ బిన్లను సమకూర్చిందని వారికి మేయర్ ధన్యవాదాలు  తెలియజేశారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి.రాము, వెటర్నరి డాక్టరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.     

విశాఖ సిటీ

2021-05-29 12:30:21

జూన్ 1నుంచి బలవర్ధపు బియ్యం పంపిణీ..

సూక్ష్మ పోషకాలున్న బలవర్దపు (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని జూన్ 1వ తేదీ నుండి జిల్లా అంతటా పంపిణీ చేయనున్నట్లు సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కీషోర్ కూమర్ తెలిపారు.  ప్రస్తుతం బొబ్బిలి, పార్వతిపురం తెర్లాం, సాలూరు నియోజక వర్గాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  శనివారం  కలెక్టరేట్ ఆడిటోరియం లో పాత్రికేయుల సమావేశం లో ఆయన మాట్లాడరు. ఈ బియ్యం పై ప్రజల్లో రక రకాల  అపోహలు ఉన్నాయని, నిజానికి ఈ బియ్యం సాధారణ బియ్యమేనని, అయితే మిల్లింగ్ సమయం లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12  ను జత చేయడం  జరుగుతుందని తెలిపారు.  దీని వలన రక్త హీనత రాకుండా చేయడమే కాకుండా, పోషకాలు  లభిస్తాయని, గర్భిణీ లలో పిండం అభివృద్ధి, నాడీ వ్యవస్థ పని తీరు సాధరణంగా ఉంటాయని తెలిపారు.  ప్రజల్లో  అపోహ పోయి, అవగాహన పెంచాలని అన్నారు. జూన్ 1 నుండి  జిల్లాలోనున్న  7 లక్షల కార్డు దారులకు ఈ బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
        ఈ ఏడాది మొక్క జొన్న ఇంతవరకు 38 వేల మెట్రి టన్నులు సేకరించడం  జరిగిందని,  గత ఏడాది 60 వేల మెట్రి టన్నులు సేకరించామని అన్నారు. పంట ఎక్కువ వచ్చినందున గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ చేస్తామని తెలిపారు.  రైస్ కార్డ్ లలో విభజనలు,  జత చేయడం తొలగింపులు,  సరండర్ చేయుటకు 10 రోజులు గడువు ఉందని,  ఇంతవరకు 1లక్ష 42 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు.  ఏం.డి.యు వాహనాల ద్వారా రేషన్ సరఫరా లో ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లా మొదటి స్థానం లో ఉందని పేర్కొన్నారు.   ఖరీఫ్ లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని రబీ లో ఇంతవరకు 26 వేలను  సేకరించడమైందని,  మరో 10 వేల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పండించిన ప్రతి గింజను కొంటామని, రైతులు ఆందోళన చందనవసరం లేదని అన్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని, విత్తనాలు,  పురుగుమందులు, , ఎరువులు అవసరమైనన్ని సరఫరాచేయడం  జరుగుతుందన్నారు.         ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా  రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-29 12:26:17

వైఎస్సార్ చేయూతకి ఆధార్ అనుసంధానం..

వైఎస్ఆర్ చేయూత ప‌థకం కోసం, 45 ఏళ్లు నిండి, కొత్త‌గా ఈ ఏడాది ద‌ర‌ఖాస్తు చేసుకొనే మ‌హిళ‌లు మాత్ర‌మే త‌మ ఆధార్‌కు సెల్ నెంబ‌ర్‌ను అనుసంధానం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. గ‌తేడాది ఈ ప‌థ‌కం కింద, రూ.18,750  ల‌బ్ది పొందిన‌వారికి మ‌ళ్లీ ఆధార్ లింకింగ్ అవ‌స‌రం లేద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది ఆగ‌స్టు 12 నాటికి 45 సంవ‌త్స‌రాలు నిండుతున్న వారు మాత్ర‌మే, ఆధార్ కేంద్రాల‌కు వెళ్లి, త‌మ ఫోన్ నెంబ‌రును లింక్ చేసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కానికి అర్హ‌త పొంది, ఇది వ‌ర‌కూ ఆధార్ లింక్ చేసుకున్న‌ మ‌హిళ‌లు, మ‌రోమారు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అలాగే ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్త‌యిన వారికి ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌ద‌ని, వారి పేర్లు తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని వాలంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పేందుకు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు కృషి చేయాల‌ని కోరారు. ఆధార్ అనుసంధాన కేంద్రాల‌కు వెళ్లేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, చేతుల‌ను శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

Vizianagaram

2021-05-29 12:17:11

ప్రజలు మెచ్చన ఏకైన సీఎం వైఎస్ జగన్..

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ నిజమైన లీడర్ అని, గడప వద్దకే మంచి పాలన తీసుకువచ్చిన ఆయన దేశంలోనే అత్యుత్తమ సీఎంగా చరిత్ర సృష్టించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రజా సంక్షేమ పాలనకు రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా అమరావతిలో సీఎం హాజరయ్యే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం బయలుదేరిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 95 శాతం అమలు చేసి, హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని, లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు- నేడు, విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ,, వైయస్సార్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు.  కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసి దేశ వ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసిపి అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లు అయిందన్నారు. 

పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర కష్టాలను చూసిన జగన్ మాట ఇచ్చిన విధంగానే ఇక్కడ అభివృద్ధికి కట్టుబడ్డారని చెప్పారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం రక్షిత మంచినీటి పథకం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, భావనపాడు పోర్టు, మూడు ఫిషింగ్ హార్బర్లు, నదుల అనుసంధానం, నేరడి బ్యారేజి నిర్మాణం, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నరసన్నపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆమదాలవలసలో వ్యవసాయ పాలిటెక్నిక్ సహా ఇంకా ఎన్నెన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని కృష్ణదాస్ వివరించారు.

రెవెన్యూ శాఖా మంత్రిగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూ రక్ష పథకం (రీ సర్వే) తన చేతుల మీదుగా అమలు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటానని కృష్ణ దాస్ పేర్కొన్నారు.

Srikakulam

2021-05-29 12:07:53

కరోనాను నియంత్రణలో NGOలు కీలకం..

శ్రీకాకుళం జిల్లాలో కరోనాను ఆరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు (ఎన్. జి.ఓ) కీలక పాత్ర పోషించాలని సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనువాసులు పిలుపునిచ్చారు. 32 ఎన్.జి.ఓల సభ్యులతో  సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనువాసులు సమీక్షాసమావేశం నిర్వహించారు. జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి 8 వందల సచివాలయాల్లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో  కోవిడ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన  సూచించారు.  45 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సినేషన్  అందేలా చూడాలని  ఆయన అన్నారు. 60 సంవత్సరాలు పైబడినవారికి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి  ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయితీ సర్పంచ్ లు , వాంటీర్లతో కలసి కరోనాపై  తీసుకోవలసిన జాగ్రత్తలు, వాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో కోవిడ్ భారీన పడిన వారికి  కోవిడ్ మెడికల్ కిట్స్ అందజేశామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కూడా మెడికల్ కిట్స్ అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కోవిడ్ బారిన పడిన వారికి వెంటనే  వైద్య సదుపాయాలు అందించడానికి సరిపడా అంబులెన్స్ లు, 104 వాహనాలు కూడా అదనంగా పెట్టామని  దీనిపై అవగాహన  కల్సించవలసిన భాద్యత ఎన్.జి.ఓలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల్లో సహజంగా దొరికే   నిమ్మ, తాజాకూరగాయలు, పండ్లు, పసుపు తదితర పౌష్టికాహారం తీసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జెసి అన్నారు. ప్రస్తుతం  పెళ్లిళ్ల సీజన్ అని విందులు, వినోదాల్లో ఎక్కువ జనం గుమికూడకుండా ఉండేటట్లు చూదాలని సూచించారు. పంచాయతీ సర్పంచులు, వలంటీర్స్ తో  కలసి సమన్వయం చేయాలని అన్నారు.  కరోనాతో ప్రతీ ఒక్కరూ సహజీవనం చేయవలసందేనని, కరోనా భారిన పడకుండా ఉండాలంటే బౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్కు ధరించడం చేయాలని సూచిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని అన్నారు.

 
రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ  కరోనా భారీన పడి మృతి చెందిన 160  మృతుదేహలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా దహన సంస్కారాలు చేశామన్నారు. అనాథ మృత దేహలను కూడా దహన సంస్కారాలు కార్యక్రమాలు చేశామన్నారు. అనేక మందికి ప్లాస్మా డోనేషన్ చేశామన్నారు. లాక్ డౌన్ సమయంలో  ప్రతి రోజు సుమారు వెయ్యి  మందికి భోజనం అందిస్తున్నామన్నారు. పేదలకు  మాస్కులు, శానిటేజర్స్ అందజేస్తున్నామన్నారు.  ప్లాస్మామా డోనర్స్ ఎవరైనా ఉంటే  మాకు తెలియపర్చాలని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ వలన కరోనాపై అవగాహన, వైద్య సదుపాయాలు, ప్రభుత్వం అందించే ఇతర సహాయ సహాకారాలు అందించడం వేగవంతంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. యూత్ క్లబ్ బెజ్జిపురం రెడ్ క్రాస్ సొసైటీకి రూ.20 వేలు చెక్కును అందజేశారన్నారు. ప్రభుత్వం తరుపున  సహాయ అందిస్తే   రెడ్ క్రాస్ తరపున  మరిన్నీ సహాయ కార్యక్రమాలు  చేపడతామన్నారు.

 
 బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు యం.ప్రసాద రావు మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో  కరోనా పై  అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. లావేరు మండల గ్రామాల్లో ఎం.డి ఒ, ఎం.ఆర్.ఓల  ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపణీ చేశామన్నారు. 120 అంగన్వాడీ కేంద్రాల్లో యోగ క్లాసులు నిర్వహించామన్నారు. 126  ప్రభుత్వ పాఠశాలలో  కరోనాపై అవగాహన, యోగ  క్లాసులు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో  92 మంది ట్రాన్స్ జండర్స్ కి  రూ.15 వందల ఆర్థిక సహాయంపై అవగాహన కల్పిస్తూ  ఆన్ లైన్  చేశామన్నారు. జిల్లాలో 9 మంది హెచ్.ఐ.వి భారిన పడిన వారికి ఇంటి వద్దకే  తీసికెళ్లి మందులు అందచేశామన్నారు. అలాగే తల్లిదండ్రులను కొల్పోయిన పిల్లలకు సహాయ సహాకారాలు అందిస్తున్నామని అన్నారు.

           సి.ఏ.వి.ఎస్ ఎన్.జి.ఓ వ్యవస్థాపకులు  పి.భూదేవి మాట్లాడుతూ  15 మంది సిబ్బందితో కలసి గ్రామాల్లో కరోనా పై అవగాహన కల్పిస్తూ  సిరిదాన్యాలు  అందజేశామన్నారు. జిల్లాలో 600 మెడికల్ కిట్స్ అందజేశామన్నారు. జిల్లాలో న్యూట్రిషన్ ఫుడ్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు చేయిస్తున్నామన్నారు.  ఈ సమావేశంలో ఇతర ఎన్.జి.ఓల సిబ్బంది  పాల్గొన్నారు.

Srikakulam

2021-05-29 12:03:05

మే 31న సుంద‌ర‌కాండ పారాయ‌ణం..

క‌రోనా వ్యాధి నిర్మూలన‌కు శ్రీ వేంకటేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఇప్ప‌టివ‌ర‌కు అనేక ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని, ఇందులో భాగంగా మే 31వ తేదీన అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో గ‌ల ప్రార్థ‌నా మందిరంలో శ‌నివారం అఖండ పారాయ‌ణం ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని కోరారు.  అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ హ‌నుమంతుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం నుండి లంఘించి సీతాన్వేష‌ణ కోసం ఏవిధంగా అవిశ్రాంతంగా క‌ర్త‌వ్య‌దీక్ష చేశారో అదేవిధంగా ఉద‌యం 6 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు 16 గంట‌ల పాటు నిరంత‌రాయంగా అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇందుకోసం నాలుగు బృందాల్లో 40 మంది పండితులు పారాయ‌ణం చేసేందుకు వీలుగా ఇక్క‌డి ప్రార్థ‌నా మందిరంలో ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. హోమం ఏర్పాటు చేసి ప్ర‌తి శ్లోకం త‌రువాత హ‌వ‌నం చేస్తామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌ని, భ‌క్తులు త‌మ ఇళ్ల నుండే శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. పారాయ‌ణం చేయ‌లేని వారు శ్లోకాల‌ను వినాల‌ని కోరారు. అదేవిధంగా ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సార‌మ‌య్యే స‌మ‌యంలో టీవీ సౌండ్ పెంచ‌డం ద్వారా మంత్ర‌పూర్వ‌క‌మైన శ్లోకాల శ‌బ్ద త‌రంగాలు వాతావ‌ర‌ణంలో క‌లిసి శ్రీ‌వారి ఆనుగ్ర‌హం క‌లుగుతుంద‌న్నారు.  ఈ స‌మావేశంలో టిటిడి బోర్డు స‌భ్యులు  శివ‌కుమార్‌, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీబీసీ సీఈవో  సురేష్‌కుమార్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-05-29 11:59:56

వేదవిజ్ఞాన పీఠంలో పూర్వాషాడా నక్షత్రేష్టి..

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ‌నివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో పూర్వాషాడా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు.  ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పూర్వాషాడా మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు.  మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరుగనుంది. కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు  శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు.  ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు. కార్యక్రమంలో పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, టిటిడి బోర్డు స‌భ్యులు శివ‌కుమార్‌ పాల్గొన్నారు.

Tirupati

2021-05-29 11:55:52

కరోనా నిబంధనలు తప్పక పాటించాలి..

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ప్రభుత్వ నిబంధనలను, ఆరోగ్య జాగ్రత్తలను తూ. చ. తప్పకుండా పాటించాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో 30 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో జిల్లాలోనే మొట్టమొదటి 'క్రౌడ్ ఫండెడ్ కోవిడ్ హాస్పిటల్' జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారినుండి ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని, గుంపులుగుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారని అందువల్ల కరోనా ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు కూడా కరోనా కట్టడికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మవరం దాతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని , భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Dharmavaram

2021-05-29 11:52:59

సరిపడ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు సిద్దం..

కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) రోగుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. శ‌నివారం ఉద‌యం జేసీ (డీ) వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లిసి కాకినాడ జేఎన్‌టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సంద‌ర్శించారు. రిసెప్ష‌న్‌, రిజిస్ట్రేష‌న్ కేంద్రాన్ని ప‌రిశీలించిన అనంత‌రం బాధితుల‌తో మాట్లాడారు. అవ‌స‌రం మేర‌కు కాన్సంట్రేట‌ర్ల ద్వారా ఆక్సిజ‌న్ అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. కాన్సంట్రేట‌ర్ల‌లో స‌మ‌స్య‌లు త‌లెత్తితే వెంట‌నే తెలియ‌జేయాల‌ని, బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్ల స‌హాయంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని తెలిపారు. పారిశుద్ధ్యం, భోజ‌నం విష‌యంలో రాజీ లేకుండా ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. రోగుల ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అవ‌స‌రం మేర‌కు సేవ‌లు అందేలా చూడాల‌ని కీర్తి చేకూరి పేర్కొన్నారు. జేసీ (డీ) కీర్తి చేకూరి వెంట కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆర్ఎంవో) డా. ఆర్‌.సుద‌ర్శ‌న్‌బాబు త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2021-05-29 11:51:29

యుజిడీలో నగర వాసులు డైపర్స్ వేయకూడదు..

భూగర్భ మురుగునీటిలో నగర వాసులు డైపర్స్ వేయకూడదని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన సూచించారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎనిమిదవ జోన్ పరిధిలోని 98వ వార్డు వేపగుంట సింహపురి కోలనీ లో శనివారం కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ మురుగునీరు కొన్ని చోట్ల బ్లాక్ అయి పొంగుచున్నదని ముఖ్యంగా గృహాలలో మహిళలు, పిల్లలు వాడే డైపర్స్ లు వేయటంవలన డ్రైనేజి లో అడ్డంకులు ఏర్పడి మురుగునీరు బ్లాక్ అయి ఎక్కడికక్కడ పొంగి పోతుందని అందువలన డైపర్స్ లాంటివి డ్రైనేజి లో వేయరాదని సూచించారు. వెంటనే మ్యాన్ హొల్స్ తెరచి వాటి అడ్డంకులను తొలగించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. కాలువలు, రోడ్లను శుభ్రంగా చేయాలని, ప్రతిరోజూ చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. తడి-పొడి చెత్త వేరు వేరుగా పారిశుధ్య సిబ్బందికి అందించాలనారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని రోడ్లు మరియు కాలువలో చెత్త వేస్తే ఆ చుట్టు ప్రక్కలున్న ఇళ్ళకు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. కారులు పెట్టుకొనుటకు రోడ్లను ఆక్రమించి షెడ్లు నిర్మించడం గమనించి వెంటనే వాటిని తొలగించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. అందరు కోవిడ్ నిబంధనలను పాటించాలని కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటెనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుకుమార్, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.  

Vepagunta

2021-05-29 11:49:09

ఇళ్ల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలి..

పేదలందరికీ ఇళ్ళ పథకం  లే అవుట్ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసి లబ్దిదారుల ఇళ్ళు నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నర్సరావుపేటలో ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ను, నర్సరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటరును, మేడికొండూరు మండలం జంగంగుంట్ల పాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. నర్సరావుపేట ఉప్పలపాడు వద్ద పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నర్సరావుపేట శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివారెడ్డి, నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.  లే ఆవుట్లో ప్లాట్ మార్కింగ్, అదనపు భూమి సమీకరణపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ అప్రూవల్ కు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లే అవుట్ ప్లాన్ను వెంటనే తయారు చేసి జిల్లా కమిటీ వద్ద అనుమతి తీసుకొని మార్పుల పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే  మార్కింగ్ చేసిన ప్లాట్లను జియో ట్యాగింగ్ చేసి , ఇళ్ళ నిర్మాణంను ప్రారంభించాలన్నారు. లే అవుట్ విస్తరణకు అవసరమైన భూముల సమీకరణ వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ యజమానులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు వారిని ఒప్పించి భూములు సమీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నర్సరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను, జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటరును పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి కోవిడ్ కేర్ సెంటరును వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ మేడికొండూరు మండలంలోని జంగంగుంట్ల పాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలను పరిశీలించారు. నిర్దేశిత సమయంలో భవనాల నిర్మాణం పూర్తి అయ్యేలా పనులు  వేగవంతం చేయాలని  అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్ల భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, బీఎంసీలు, ఏఎంసీల నిర్మాణానికి  అవసరమైన భూములు గుర్తించేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహశీల్దారు రమణా నాయక్, ఎంపీడీవో బూసిరెడ్డి, మేడికొండూరు తహశీల్దారు కరుణ కుమార్, ఎంపీడీవో శోభారాణి , పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Narasaraopeta

2021-05-29 11:45:45

వేక్సిన్ కు డబ్బులు తీసుకుంటారా..?

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్లో ఆశా వర్కర్ డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదు పై జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి స్పందించి కేంద్రాన్ని సందర్శించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు వస్తున్నా ఫిర్యాదుపై మేయర్ ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం పరుస్తూ తక్షణమే విచారణ చేపట్టాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు విచారణలో తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ జివిఎంసి అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలోను, ఆరిలోవ మరియు మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లోను వేయబడుచున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జివిఎంసి అన్ని సెంటర్లలోను ఉచితంగా వ్యాక్సిన్ వేయబడుచున్నదని, వ్యాక్సిన్ కొరకు ఎవ్వరూ ఎటువంటి డబ్బులు చెల్లించనవరసం లేదని, ఎవ్వరైనా వ్యాక్సినేషన్ కొరకు డబ్బులు డిమాండ్ చేసినయడల వెంటనే జివిఎంసి టోల్ ఫ్రీ నెం. 1800 4250 0009 లేదా 0891-2869100కి తెలియపరచవలెనని, వారిపై వెంటనే కఠినచర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ఎటువంటి అపోహలకు పోకుండా 45సంవత్సరములు దాటిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ వేసే సిబ్బందికి సహకరించాలని మేయర్ ప్రజలకు సూచించారు.    

Arilova

2021-05-29 11:42:34