1 ENS Live Breaking News

కోవిడ్ త‌గ్గినా జాగ్ర‌త్త‌లు పాటించాలి..

కోవిడ్ త‌గ్గిన‌ప్ప‌టికీ, కొన్నిరోజుల‌పాటు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, ధైర్యంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సూచించారు. నెల్లిమ‌ర్ల మిమ్స్ కోవిడ్ ఆసుప‌త్రి నుంచి, ప‌దిరోజుల చికిత్స అనంత‌రం, వ్యాధిని న‌యం చేసుకొని 22 మంది గురువారం డిస్‌ఛార్జి అయ్యారు. వీరికి జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో వైద్య బృందం వీడ్కోలు ప‌లికింది. వారికి వాహ‌నాలు ఏర్పాటు చేసి, స్వ‌స్థ‌లాల‌కు పంపించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్‌ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, రోగుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వ్యాధికి చికిత్స చేసుకున్న‌ప్ప‌టికీ, క‌నీసం ప‌దిరోజుల‌పాటు అయినా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.  వీలైనంత‌వ‌ర‌కూ ఇంట్లోనుంచి రాకుండా, ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని అన్నారు. వ్యాధిని ఎదుర్కొనాలంటే, మ‌నోధైర్యం చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వారికి వైద్యం ఏవిధంగా అందిందీ, మందులు, ఇంజ‌క్ష‌న్లు ఇచ్చిందీ లేనిదీ వాక‌బు చేశారు. సిబ్బంది సేవ‌ల‌పై ఆరా తీశారు. కొన్నిరోజుల‌పాటు మందులను జాగ్ర‌త్త‌గా వాడాల‌ని సూచించారు. వారికి డ్రైఫ్రూట్స్‌, అవ‌స‌ర‌మైన మందులను పంపిణీ చేశారు.

               కార్య‌క్ర‌మంలో మిమ్స్ మెడిక‌ల్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ హ‌రికిష‌న్ సుబ్ర‌మ‌ణ్యం, మెడిక‌ల్ సూప‌రింటిండెంట్ ఐ.భాస్క‌ర‌రాజు, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ సి.రఘురామ్‌, ప్రిన్సిపాల్ సిహెచ్ ల‌క్ష్మీకుమార్‌, హెచ్ఆర్ నుంచి శ్రీ‌నివాస్‌, వెల్ఫేర్ ఆఫీస‌ర్ గిరిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-27 10:20:44

వైద్య‌క‌ళాశాల శంకుస్థాప‌న‌కు ఏర్పాట్లు చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల నిర్మాణానికి ఈనెల 30న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శ్రీ‌కారం చుడుతున్నార‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఈ క‌ళాశాల శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి ప‌క‌డ్భంధీగా ఏర్పాట్లు చేయాల‌ని, సంబంధిత అధికారుల‌ను  క‌లెక్ట‌ర్ ఆదేశించారు. శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మీక్షించారు.   ఆ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి ఆన్‌లైన్ ద్వారా, బోధ‌నాసుప‌త్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తార‌ని చెప్పారు. క‌ళాశాల నిర్మాణానికి గాజుల‌రేగ‌వ‌ద్ద సేక‌రించిన స్థ‌లంలోనూ, క‌లెక్ట‌రేట్ వీడియో కాన్ఫ‌రెన్స్ మందిరం వ‌ద్దా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిక‌రాలను మందుగానే సిద్దం చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొంటార‌ని తెలిపారు. కార్య‌క్ర‌మానికి నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేట‌ట్లు చూడాల‌న్నారు. త‌క్ష‌ణ‌మే స్థ‌లాన్ని చ‌దునుచేసి, ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు.  వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ స‌మ‌న్వ‌యంతో, ప‌క‌డ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

                  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు, ఎపిహెచ్ఎంఐడిసి ఎస్ఇ కె.శివకుమార్‌, ఇఇ ఎం.స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, ఐఅండ్ పిఆర్ డిఇ ర‌మ‌ణ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర్‌, ఎపి స్వాన్‌, బిఎస్ఎన్ఎల్‌, క‌లెక్ట‌రేట్ త‌దిత‌ర శాఖ‌ల సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-27 10:17:54

అప్పన్న ఆలయ అభివృద్ధికి క్రుషి చేయండి..

విశాఖలోని  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలే అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు గురువారం విజయ్ సాయిరెడ్డి ని శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం విజయ్ సాయిరెడ్డి కి సింహాచలం అప్పన్న స్వామి శేష వస్త్రం..చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ సాయిరెడ్డి శ్రీనుబాబును అభినందిస్తూ.. సింహాచలం పుణ్యక్షేత్రాన్ని మరింత పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని విజయ్ సాయిరెడ్డి పేర్కొన్నారు. స్వామి సేవ చేసుకునే  అవకాశం కల్పించిన విజయసాయిరెడ్డికి శ్రీనుబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Visakhapatnam

2021-05-27 10:12:36

జగనన్న తోడు పనులు వేగవంతం కావాలి..

చిరు వ్యాపారాలు  చేసే వారికి  ఆర్ధిక సహకారాన్ని అందించే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు పధకం క్రింద అందిన దరఖాస్తులను వేగంగా గ్రౌండింగ్ చేయాలని  సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ కుమార్ బ్యాంక్ అధికారులను కోరారు.  గురువారం ఆయన చాంబర్ లో మెప్మా, డి.ఆర్,డి.ఏ అధికారులు, బాంకర్లతో సమీక్ష  సమావేశం  నిర్వహించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ తోడు పధకం క్రింద  ఇచ్చిన లక్ష్యాలను త్వరగా చేరుకోవడం లో బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు.  రీ వెరిఫికేషన్  పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్ధుల దరఖాస్తులను బాంకర్ల  లాగిన్ లో కి పంపడం జరిగిందని, ఆ దరఖాస్తులన్నిటిని  వెంటనే  గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు.   గ్రామీణ  ప్రాంతాలకు సంబంధించి 12 వేల 173 దరఖాస్తులు అందగా వాటి లో 2641 మంది ఆసక్తిని చూపించారని,  అందులో 947 దరఖాస్తులను  రీ వెరిఫికేషన్  చేసి  బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు.   అదే విధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా ద్వారా 3వేల 973 దరఖాస్తులు అందగా  వెరిఫికేషన్ అనంతరం 459 దరఖాస్తులను బాంక్ లకు పంపడం జరిగిందన్నారు.  మొత్తం 1406 దరఖాస్తుదారులకు ప్రస్తుతం  గ్రౌండింగ్ చేయవలసి ఉందని, వీరికి   వెంటనే బ్యాంక్ అధికారులు రుణాలు  మంజూరు  చేయాలని జె.సి సూచించారు.  ఆసక్తి చూపిన మరో 1797 మందికి  స్త్రీ నిధి క్రింద రుణాలను అందించాలని అన్నారు. 
జగనన్న తోడు పధకం  గురించి అవగాహన కల్పించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల సహకారం తో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్  ల ద్వారా  లబ్ధి దారుల గుర్తింపు  చేయాలని తెలిపారు.  ఈ పధకం పై  గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం వలన చిరు వ్యాపారులను ఎక్కువ మందిని కవర్ చేయవచ్చని అన్నారు. వాలంటీర్ లకు, వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ లకు అవ్గహన కోసం వెంటనే  టెలీ  కాన్ఫరెన్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. 
ఈ సమావేశం లో  లీడ్ జిల్లా మేనేజర్ స్రినివస రావు,  మెప్మా పి.డి సుగుణకార రావు డి.ఆర్.డి.ఏ అదనపు పి.డి సావిత్రి, పలు  బ్యాంక్ ల ప్రతినిధులు  పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-27 07:40:15

దేశంలోనే మొదటి ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్..

దేశంలోనే ఆసుపత్రి ఆవరణంలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు కలిగిన మొట్టమొదటి ఆస్పత్రిగా హిందూ పురం జిల్లా ఆసుపత్రి రికార్డు సొంతం చేసుకుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  బుధవారం సాయంత్రం హిందూపురం జిల్లా ఆసుపత్రిలో 1000 ఎల్పీఎం(లీటర్ పర్ మినిట్) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఎన్.హెచ్.ఏ.ఐ, డీఆర్డీవో సంయుక్త సహకారంతో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణాన్ని అతితక్కువ సమయంలో నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. ఈ జెనరేషన్ ప్లాంటు ద్వారా రోజుకు 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్ అందించే అవకాశం ఉందన్నారు. జెనరేషన్ ప్లాంటు నిర్వహణకు 125 కెవి సబ్ స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్ అందించనున్నామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అందించిన రూ. 20 లక్షల నిధులతో జెనరేటర్ ఏర్పాటు చేసుకుని నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి కొనసాగేలా చూస్తామన్నారు. 

 అదే సమయంలో ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ స్టోరేజీ మీద కూడా దృష్టి సారించామన్నారు. అనంతపురము సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తున్నామన్నారు.రానున్న రోజుల్లో జిల్లాలోని మరో మూడు ఆసుపత్రుల్లో ఇటువంటి ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామన్నారు. కదిరి ఏరియా ఆసుపత్రి, ఆనంతపురము సర్వజన మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మూడు జెనరేషన్ ప్లాంట్లను నిర్మిస్తామన్నారు. 

ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఆక్సిజన్ సప్లైలు, సిలిండర్ల మీద ఆధారపడిన అనంత జిల్లాను ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్లు నిర్మించుకుని 40 కిలో లీటర్ల ఆక్సిజన్ స్టోరేజీ చేసుకోగల సామర్థ్యం కలిగిన జిల్లాగా అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. జిల్లా వైద్య రంగంలో గత యాభై ఏళ్ల కాలంలో ఎప్పుడూ జరగనంత మౌలిక వసతుల అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో చేశామన్నారు. అదే అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ నెల 30వ తేదీన పెనుగొండ సమీపంలో 57 ఎకరాలలో హిందూపురం పార్లమెంటు నియోజక వర్గానికి మెడికల్ కలశాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంతో శ్రీకారం చుడతామన్నారు.

అతి తక్కువ సమయంలో ఆక్సిజన్ ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ, డీఆర్డీవో సంస్థలు, జేసీ సిరి బృందం, పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, సహకరించిన ప్రజా ప్రతినిధులు మరియు పుర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Hindupuram

2021-05-26 15:46:22

ఇక్కడి ఆక్సిజన్ ప్లాంట్ ప్రజలకే అంకితం..

హిందూపురం జిల్లా ఆసుపత్రి ఆవరణంలో నిర్మించిన 1000 ఎల్పీఎం ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఆసుపత్రిలో నిర్మించిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా హిందూపురం జిల్లా ఆసుపత్రి ఆవరణంలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజక వర్గ ప్రజాప్రతినిధుల సహకారంతో హిందూపురం జిల్లా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఒక ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేసే ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యున్నత సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నాడు-నేడు ద్వారా విద్యాలయాలు, ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన చేస్తోందన్నారు. కరోనా విపత్కాలంలో కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన వసతులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం కూడా అందిస్తోందన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో యాభై శాతం పేద ప్రజలకు పడకలు కేటాయిస్తున్నామన్నారు. 

Hindupuram

2021-05-26 15:42:37

60 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం మండల అధికారులు, వైద్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గురువారం 30 వేల మందికి కోవిడ్ టీకా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి టీకా వేయడం జరుగుతుందని అందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. అనంతరం 45 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో  170 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతంలో 25 సచివాలయాల పరిధిలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రోజుకు 150 మందికి మాత్రమే నిర్దేశిత ప్రదేశంలో టీకా కార్యక్రమం జరుగుతుందని వారికి ముందుగా సమాచారం అందించాలని ఎంపీడీవో లను ఆదేశించారు. ఏ ప్రదేశంలో జరుగుతుందో సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. టీకాకు వచ్చిన వారిని నిర్దేశించిన స్థలాల్లో కూర్చోబెట్టి సజావుగా టీకా వేయాలని ఎక్కడ రద్దీ జరగడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.  జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ పి హెచ్ సి వైద్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నదని, వైద్యులు తమ సిబ్బందిని నియమించాలని అన్నారు. ప్రతి మండలంలో 4 సచివాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని, 15 మండలాల్లో మాత్రం 5 సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. టీకా కార్యక్రమం ఉదయం 8 గంటలజూ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Srikakulam

2021-05-26 15:38:12

అంతర్జాతీయ ప్రమాణాలతో ముడసర్లోవ పార్కు అభివృద్ధి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ముడసర్లోవ నాచురల్ పార్కును ఓ సుందర నందనవనంగా రూపొందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఈ మహా విశాఖ నగరంలో మరో పర్యాటక మణిహారంగా తీర్చిదిద్దేందుకు దేశ విదేశాల్లో ఉన్న పార్కుల నమూనాల్ని పరిశీలించాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో జలాశయం, మరో 80ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పరచుకున్న ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పార్కుగా అభివృద్ధి చేసేలా ప్లాన్లు తయారు చేయాలనీ, దీనికి సంబంధించిన నిధుల గురుంచి ఆలోచించకుండా, అద్భుతమైన పార్కుగా మార్చేందుకు ప్రయత్నించాలన్నారు. పిపిపి పద్దతిలో గాని, కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దామని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. గతంలో విఎంఆర్ డిఎ ముడసర్లోవ పార్కు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలున్నాయని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, విఎంఆర్ డిఎ కమిషనర్ కోటేశ్వరరావు విజయసాయి రెడ్డికి వివరించారు. మీనియేచర్ ఎ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్, విఎంఆర్ డిఎ, జివిఎంసి సంయుక్తంగా ప్రాజెక్టుపై దృష్టి సారించాలని విజయసాయి రెడ్డి సూచించారు. దాదాపు 40శాతం వరకూ ఉన్న పచ్చని భారీ వృక్షాలని తొలగించకుండా, ఆకర్షణీయమైన ప్రాజెక్టు రూపొందించేందుకు ప్రయత్నించాలని విజయసాయి రెడ్డి ఆదేశించారు. నగరప్రజలకు ఆహ్ల్లాదకరమైన, ఆనందదాయకమైన వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. మీనియేచర్ విలేజ్, జంగిల్ బుక్ ట్రీ, ఫ్యామిలీ ప్లే ఏరియా, వాటర్ స్పోర్ట్స్ హబ్ మొదలైనవి ఉండేలా ప్లాన్స్ రూపొందించాలన్నారు. అదేవిధంగా, సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించిన రూట్ మ్యాప్ ని విజయసాయి రెడ్డి పరిశీలించారు.  గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలిత్తకుండా, సంబంధిత రూట్ ని ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని సింహాచలం ఇ.ఒ. సూర్యకళ, జివిఎంసి, విఎంఆర్ డిఎ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి డా. జి. సృజన, విఎంఆర్ డిఎ కమిషనర్ కోటేశ్వరరావు, జాయింటు కలక్టరు వేణుగోపాల రెడ్డి, ఎ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ జోనల్ మేనేజర్ మంగ, ప్రధాన ఇంజినీరు  ఎం. వెంకటేశ్వరరావు, సిసిపి విద్యుల్లత, ఎడిహెచ్ ఎం.దామోదర రావు, ఎస్.ఇ. గణేష్ బాబు, డిసిపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.   

Mudasarlova park

2021-05-26 15:32:00

ఈ కోవిడ్ లో పెద్ద మనసుతో పనిచేయాలి..

కోవిడ్ సమయంలో అధికారులు, వైద్యులు, సిబ్బంది పెద్ద మనసుతో పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ప్రత్యేకమైన సమయమని, ప్రతి ఒక్కరు గమనించి పెద్ద మనసుతో పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. కోవిడ్ బాధితులకు మంచి వైద్య సేవలు అందాలని, ఎక్కడా పర్యవేక్షణ లోపం ఉండరాదని ఆయన అన్నారు. కర్ఫ్యూ సక్రమంగా అమలు కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 23.69 లక్షల మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి అయిందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఉపాధి హామీ క్రింద కనీసం కోటి పని దినాలు కల్పించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగరాదని ఆయన స్పష్టం చేసారు. ఈ నెల 30న 16 బోధన ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గృహ పట్టాలు పంపిణీ చేయాల్సిన వారికి వెంటనే పంపిణీ చేయాలని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ప్రతి అంశంలో సహాయకారిగా ఉండాలన్నారు. రైతు సంతోషంగా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని సూచనగా ఉంటుందని తెలిపారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఎస్ఇ భాస్కరరావు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-26 15:18:22

కరోనా నియంత్రణలో గ్రామ కమిటీలే కీలకం..

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ సూచించారు. కోవిడ్ మేనేజ్మెంట్ పై బుధవారం సాయంత్రం దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లోని మండలస్థాయి అధికారులకు దర్శిలోని పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కోసం ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడడం అత్యంత కీలకమన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికే పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో విలేజ్ కోవిడ్ మేనేగ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి నోడల్ ఆఫీసరుగా ఉంటారని, వార్డు సభ్యులు, వాలంటీర్లు, వీవోఏ ప్రతినిధి, ఇతర సంఘాల నుంచి ప్రతినిధులు సభ్యులుగా ఉండేలా మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు తహసీల్దార్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఎమ్.ఈ.వో, ఐసీడీసీ నుంచి సీడీపీవో లతో 
మండల స్థాయిలో 'కోవిడ్ వార్ రూము'లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మండలాన్ని క్లస్టర్లుగా విభజించుకుని వార్ రూము సభ్యులు బాధ్యత తీసుకుని విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు కోవిడ్ కట్టడి చర్యలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలోని కమిటీల పనితీరును మండలస్థాయి కమిటీ పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. 
              గ్రామస్థాయిలో కోవిడ్ అనుమానితుల  క్వారంటైన్, బాధితుల ఐసోలేషన్ పై విలేజ్ కమిటీలు దృష్టి పెట్టాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. హోమ్ ఐసోలేషన్ కు అవకాశం లేనివారి కోసం  కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ కేసులను ముందుగానే గుర్తిస్తే పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స అందించడం ద్వారా త్వరగా పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీని భాగస్వామిని చేయడం ద్వారానే కోవిడ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయగలమన్నారు. ఈ దిశగా కమ్యూనిటీని సన్నద్ధత చేయాలన్నారు. 
             ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్, ఎస్.సీ. కార్పొరేషన్ ఈ.డీ. శ్రీనివాస్ విశ్వనాథ్, ఐ.సీ.డీ.ఎస్. పీడీ లక్ష్మీదేవి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎం.ఈ.వో.లు, ఐ.సీ.డీ.ఎస్. సీడీపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Addanki

2021-05-26 14:19:32

30న భోదనాసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం..

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో  ఈ నెల 30న  బోధ‌నాసుప‌త్రి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. విజ‌య‌న‌గ‌రంతో స‌హా రాష్ట్రంలోని మొత్తం 16 బోధ‌నాసుప‌త్రుల నిర్మాణ ప‌నుల‌ను ఆరోజు ప్రారంభించ‌నున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, కోవిడ్ నియంత్ర‌ణ‌, గ్రామీణ ఉపాధిహామీ, గృహ‌నిర్మాణం, ఖ‌రీఫ్‌కు, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్‌ వాహ‌న మిత్ర త‌దిత‌ర ప‌థ‌కాల‌పై స‌మీక్షించారు.   రాష్ట్రంలోని మూడు జిల్లాలు మిన‌హా, మిగిలిన ప్రాంతంలో కోవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు.  ఆసుప‌త్రిలో ఎంఎన్ఓల నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తీఒక్క‌రూ కోవిడ్ క‌ట్ట‌డిలో భాగ‌స్వాములు అయ్యార‌ని అభినందించారు. అయిన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మందులు, ఇంజ‌క్ష‌న్లు, ఆక్సీజ‌న్‌కు ఎక్క‌డా కొర‌త రాకుండా చేశామ‌ని అన్నారు. ఆసుప‌త్రుల్లో చేరిన కోవిడ్ రోగుల్లో సుమారు 78శాతం మందికి ఉచితంగా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం క్రింద వైద్యం అందించిన‌ట్లు తెలిపారు. ఆక్సీజ‌న్ వృధా కాకుండా, వినియోగంపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, జూన్‌లోగా ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. రైతు భ‌రోసా కేంద్రాల ప‌నుల‌ను పూర్తిచేసి, జులై 8 రైతు దినోత్స‌వం నాటికి సిద్దం చేయాల‌ని అన్నారు. విత్త‌నం పంపిణీ నుంచి పంట‌ కొనుగోలు వ‌ర‌కూ, రైతుకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలూ రైతు భ‌రోసా కేంద్రాల ద్వారానే జ‌ర‌గాల‌ని సూచించారు. రైతు సంతోష‌మే మ‌నంద‌రి ధ్యేయం కావాల‌ని అన్నారు.

                 రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించ‌నున్న‌ 16 బోధ‌నాసుప‌త్రుల ప‌నుల‌ను ఈ నెల 30న ప్రారంభిస్తామ‌ని, ఏ జిల్లాలోనైనా భూసేక‌ర‌ణ పెండింగ్ ఉంటే, ఆ లోగా పూర్తి చేయాల‌ని సిఎం ఆదేశించారు. పేద‌లకు గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని చెప్పారు. ఈ నెలాఖ‌రు లోగా అన్ని లేఅవుట్ల‌లో నీరు, విద్యుత్ స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ల‌బ్దిదారుల రిజిష్ట్రేష‌న్ల‌ను కూడా త‌క్ష‌ణ‌మే పూర్తి చేయాల‌న్నారు. 90 రోజుల ప‌థ‌కం క్రింద కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారికి కూడా, ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేయాల‌న్నారు. నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను స్టాకు పెట్టుకోవాల‌ని సూచించారు. ఎంఐజి ప‌థ‌కానికి రాష్ట్రంలో 3ల‌క్ష‌ల‌కు పైగా  మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని, వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థ‌లాల‌ను  పంపిణీ చేయ‌డానికి వీలుగా, స్థ‌లాన్ని సేక‌రించాల‌ని  ఆదేశించారు. ప్ర‌స్తుత లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూల‌ను దృష్టిలో పెట్టుకొని, బ్యాంక‌ర్లే రైతు భ‌రోసా కేంద్రాల‌కు వెళ్లి, రైతుకు పంట రుణాలు ఇచ్చేవిధంగా క‌లెక్ట‌ర్లు కృషి చేయాల‌ని సిఎం కోరారు.

                   వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-26 14:10:52

45ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్ వేక్సిన్..

 ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు , వారి కుటుంభ సభ్యులు వెంటనే వాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు.   ఫ్రంట్ లైన్  వర్కర్స్   తో పాటు 45 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ వాక్షినేషన్  వేయడం జరుగుతుందని అన్నారు.  బుధవారం సంయుక్త కలెక్టర్ (హెల్త్) డా. మహేష్  కుమార్ తో కలసి జిల్లా అధికారులతో  కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఉద్యోగులు, , వారి కుటుంభ సభ్యులు  వెంటనే టీకా వేయించుకోవాలన్నారు. మంగళవారం 3 ప్రాంతాల్లో టీకా వేసినప్పటికి 700 మంది ఉద్యోగులు మాత్రమే వేయించుకున్నారని, మిగిలిన వారంతా వెంటనే వేయించుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు అందుకు సహకరించాలని , వందకు పైగా ఉద్యోగులున్న సంస్థ ల వద్దనే  టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరుగుతుందని అన్నారు.  అన్ని మున్సిపాలిటీలలోనూ,  మండలాల్లోనూ  టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలు  తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, వారి కోసం తాగు నీటిని, షెల్టర్ ను  ఏర్పాటు చేయాలని అన్నారు.  ఎంత మంది వస్తారో ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా టీకా వైల్స, కేంద్రాలను  అందుబాటు లో ఉంచాలన్నారు.  క్యూ లైన్ల నిర్వహణకు, భౌతిక దూరాన్ని పాటించేలా చూడడానికి మహిళా పోలీసు సహకారాన్ని తీసుకోవాలన్నారు.  టీకా ను వృధా చెయ్య వద్దని సూచించారు.  
సంయుక్త కలెక్టర్ డా.మహేష్  కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిషీల్డ్ మొదటి డోస్, మొదటి డోస్ వేసుకొని 84 రోజులు పూర్తి అయిన వారికి రెండవ డోస్ కోవిషీల్డ్ వేయడం జరుగుతుందని  స్పష్టం చేశారు.  కొ వాక్సిన్ మొదటి డోస్ ప్రస్తుతం అందుబాటు లో లేదని, అయితే రెండవ డోస్ అవసరమైన వారికి మొదటి డోస్ తీసుకున్న నెల రోజుల పూర్తి అయిన వారికి  వేయడం జరుతుందని అన్నారు.  కోవిడ్ పొజిటివ్ వచ్చిన వారు మూడు నెలల వరకు వాక్సిన్ తీసుకోకూడదని అన్నారు.  బాలింతలు కూడా వాక్సిన్ తీసుకోవచ్చని, గర్భిణీ లు తీసుకోకూడదని తెలిపారు.  జిల్లాకు సరిపడా స్టాక్ కోవిషీల్డ్ టీకా అందుబాటు లో ఉందని,  ఒకే సారి అందరూ వెళ్లకుండా, అందదేమోనని  ఆందోళన చెందకుండ 45 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరారు. 

Vizianagaram

2021-05-26 14:07:53

వైద్యులు దేవుళ్లతో సమానం..

వైద్యులు దేవుళ్లతో సమానమని, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  అవంతి ఫంక్షన్ హాల్లో కోవిడ్ పై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వైద్యులకు చేతులెత్తి నమస్కారం చేయాలన్నారు.  ప్రభుత్వ అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య భద్రత పై సర్వే చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఏర్పాటు చేసిన క్వారయింటైన్ సెంటర్లు గూర్చి ప్రజలకు తెలియచేయాలని, నోడల్ ఆఫీసర్ల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.   ముఖ్యంగా సెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో భీమిలి నియోజక వర్గంలో ప్రతి ఒక్కరికి వ్యాక్షిన్ అందే విధంగా చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.  కర్ఫ్యూ విధించాకే కోవిడ్ మరణాలు తగ్గాయని, ప్రజలందరూ తమ బాధ్యతగా మాస్కులు తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ అదుపులోకి వచ్చే వరకు వేచి ఉండాలని తెలిపారు. వ్యాక్షినేషన్ అందరూ చేయించుకోవాలని, వ్యాక్షిన్ చేసుకున్నవారు ఎవ్వరు ఇప్పటి వరకు మరణించలేదని తెలిపారు.  వ్యాక్షిన్ రెండు దశలను పూర్తి చేసుకున్నామని ఉదాసీనంగా వుండొద్దన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన వారికి నివాళులర్పించి, మౌనాన్ని పాటించారు.
 5,6,7,8 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పి.హెచ్.సి వైద్య సిబ్బంది, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ వార్డు హెల్త్ సెక్రటరీలు, శానిటరీ హెల్త్ సెక్రటరీలతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించి కోవిడ్ నియంత్రణ కొరకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్త ముత్తంశెట్టి మహేష్, రూరల్ తాహసిల్దార్ ఆర్. నరసింహమూర్తి, జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాము, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కిషోర్, మధురవాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారినులు డాక్టర్. అశ్విని శైలజ, డాక్టర్ దీపిక, యు.పి.హెచ్.సి. డాక్టర్లు సునీల్, శ్రీదేవి, శృతి, వాణిపరమేశ్వరి, ఏ.పి.డి.దుర్గాప్రసాద్, సి.ఓ లు ఎస్.ఉమ, టి.విజయలక్ష్మి, ఆర్. అప్పలకొండ, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, శానిటేషన్, వెల్ఫేర్ సెక్రటరీలు  నాయకులు గాదె రోసిరెడ్డి, ఈ.ఎన్.ఎస్.చంద్రరావు, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, సంజీవ్ యాదవ్, పిళ్ళా రమణ బాబు, పోతిన ఎల్లాజి, వంకాయల మారుతీ ప్రసాద్, పోతిన సురేష్, పోతినప్రసాద్, జె.ఎస్.రెడ్డి, ముచ్చి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-26 14:03:03

కోవిడ్ లో వైద్యసిబ్బంది సేవలు అమోఘం..

వైద్యులు, వైద్య సిబ్బంది కోవిడ్ - 19  రోగులకు అందించిన వైద్య సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.  జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో బుధవారం ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బంది, తదితరు లందరూ ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు చాలా బాగా అందించారన్నారు.  ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలన్నారు.  నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.  ఆక్సిజన్ సరఫరా, మందులు, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ, తదితర కోవిడ్ అంశాలపై సమీక్షించారు. కోవిడ్ నివారణ, NREGS,  అర్బన్ క్లినిక్ లు,  హౌసింగ్,  ఇళ్ల పట్టాలు, రానున్న ఖరీఫ్ లపైన, ఈ నెలలో ప్రారంభించనున్న జగనన్న తోడు, వాహనమిత్ర తదితర పథకాల పై ఆయన సమీక్షించారు.

 కె.జి.హెచ్.లో కోవిడ్-19 పేషెంట్లకు అందిస్తున్న వైద్య  సేవలు గూర్చి స్టాఫ్ నర్సు జి. విజయలక్ష్మి ముఖ్య మంత్రికి వివరిస్తూ సంవత్సరంన్నర నుండి కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 500 మంది వరకు కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని, కోవిడ్ తో ఆసుపత్రిలో చేరడానికి వచ్చిన పేషెంట్లకు 15 నుండి 20 నిమిషాలలో పడక కేటాయిస్తున్నట్లు ఆమె వివరించారు.  క్యాస్ లెస్ వైద్య సేవలు అందించడం జరుతోందని, రెమిడెసివర్ ఇంజక్షన్లు పేషెంట్లకు వాడుతున్నట్లు చెప్పారు.  ఆరోగ్య శ్రీ లోనూ కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రతీ రోజు పేషెంట్లు వద్దకు వెళ్లి వారిని పలుకరించి వారి బాగోగులు తెలుసుకొని, శానిటేషన్ చేయించి బెడ్ షీట్లు మార్పిస్తున్నట్లు తెలిపారు. ఎపి టూరిజం నుండి సమయానికి నాణ్యమైన ఆహారం సరఫరా చేస్తున్నారని వివరించారు. పేషెంట్లు ఆక్సిజన్ వృధా చేయకుండా ఆక్సిజన్ వాడకం పై అవగాహన పర్చుతున్నామని చెప్పారు. కోవిడ్ - 19 పేషెంట్లైన 300 మంది గర్భిణులకు ప్రసవాలు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళితే సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు గా వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించారని తెలిపారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ మీరు చేస్తున్న సేవలు ఎవరూ చేయరని, ప్రాణాలను లెక్క చేయకుండా, కోవిడ్ వస్తుందని భయం లేకుండా ధైర్యంగా సేవలందిస్తున్న సిబ్బంది అందరని అభినందించారు. తనవంతు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. 

 రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి యాస్ తుఫాన్  పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో చర్చించారు.   ఎలాంటి పరిస్థితి నైనా పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దతతో ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి కి వివరించారు.

      ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్పి బి. కృష్ణారావు, జివిఎంసి కమిషనర్ జి. సృజన,  విఎంఆర్డీఎ కమిషనర్ కోటీశ్వరరావు, జెసి లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు,ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, జెసి-3 ఆర్. గోవిందరావు, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, డ్వామా పీడీ సందీప్, ఎస్ఇ పిఆర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-26 13:57:35

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు..

కోవిడ్ ను ఎదుర్కోవడానికి వైద్యఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందించారు. రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌, వ్య‌వ‌సాయం త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి సీఎం వైఎస్ జగన్ బుధ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, జిల్లాస్థాయి ఉన్న‌తాధికారుల‌తో స్పంద‌న వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజ‌కుమారి, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రులు హాజరయ్యారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవిడ్-19 ప‌రిస్థితి, వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, బాధితుల‌కు అందిస్తున్న వైద్య‌, ఇత‌ర సేవ‌ల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. వివిధ జిల్లాల‌కు చెందిన వైద్య నిపుణులు, న‌ర్సు, ఎంఎన్‌వోల‌తో వర్చువ‌ల్‌గా మాట్లాడారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో ప్రాణాల‌ను ప‌ణంగాపెట్టి సేవ‌లందిస్తున్న వైద్య‌, ఆరోగ్య సిబ్బందికి శాల్యూట్ చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. ఫీజులు, ఆరోగ్య‌శ్రీ సేవ‌లు త‌దిత‌రాల‌పై నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. 104 కాల్‌సెంట‌ర్ వ్య‌వ‌స్థ చాలా కీల‌క‌మైంద‌ని, ఈ వ్య‌వ‌స్థ ద్వారా బాధితుల‌కు స‌రైన స‌మ‌యంలో సేవ‌లందేలా చూడాల‌న్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల స్థ‌లాల లేఅవుట్ల‌లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు, డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు త‌దిత‌రాల నిర్మాణాలు; ఖ‌రీఫ్‌-2021 స‌న్న‌ద్ధ‌తపై ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. సంక్షేమ క్యాలెండ‌ర్ ప్ర‌కారం జూన్‌లో జ‌గ‌న‌న్న తోడు, వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, వైఎస్సార్ చేయూత కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, వీటికోసం ల‌బ్ధిదారుల ఎంపిక‌, సోష‌ల్ ఆడిట్ వంటి ప్ర‌క్రియ‌ల‌ను పూర్తిచేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

Kakinada

2021-05-26 13:51:44