1 ENS Live Breaking News

ఈ కోవిడ్ లో పెద్ద మనసుతో పనిచేయాలి..

కోవిడ్ సమయంలో అధికారులు, వైద్యులు, సిబ్బంది పెద్ద మనసుతో పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ప్రత్యేకమైన సమయమని, ప్రతి ఒక్కరు గమనించి పెద్ద మనసుతో పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. కోవిడ్ బాధితులకు మంచి వైద్య సేవలు అందాలని, ఎక్కడా పర్యవేక్షణ లోపం ఉండరాదని ఆయన అన్నారు. కర్ఫ్యూ సక్రమంగా అమలు కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 23.69 లక్షల మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి అయిందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఉపాధి హామీ క్రింద కనీసం కోటి పని దినాలు కల్పించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగరాదని ఆయన స్పష్టం చేసారు. ఈ నెల 30న 16 బోధన ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గృహ పట్టాలు పంపిణీ చేయాల్సిన వారికి వెంటనే పంపిణీ చేయాలని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ప్రతి అంశంలో సహాయకారిగా ఉండాలన్నారు. రైతు సంతోషంగా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని సూచనగా ఉంటుందని తెలిపారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఎస్ఇ భాస్కరరావు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-26 15:18:22

కరోనా నియంత్రణలో గ్రామ కమిటీలే కీలకం..

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ సూచించారు. కోవిడ్ మేనేజ్మెంట్ పై బుధవారం సాయంత్రం దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లోని మండలస్థాయి అధికారులకు దర్శిలోని పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కోసం ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడడం అత్యంత కీలకమన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికే పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో విలేజ్ కోవిడ్ మేనేగ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి నోడల్ ఆఫీసరుగా ఉంటారని, వార్డు సభ్యులు, వాలంటీర్లు, వీవోఏ ప్రతినిధి, ఇతర సంఘాల నుంచి ప్రతినిధులు సభ్యులుగా ఉండేలా మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు తహసీల్దార్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఎమ్.ఈ.వో, ఐసీడీసీ నుంచి సీడీపీవో లతో 
మండల స్థాయిలో 'కోవిడ్ వార్ రూము'లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మండలాన్ని క్లస్టర్లుగా విభజించుకుని వార్ రూము సభ్యులు బాధ్యత తీసుకుని విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు కోవిడ్ కట్టడి చర్యలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలోని కమిటీల పనితీరును మండలస్థాయి కమిటీ పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. 
              గ్రామస్థాయిలో కోవిడ్ అనుమానితుల  క్వారంటైన్, బాధితుల ఐసోలేషన్ పై విలేజ్ కమిటీలు దృష్టి పెట్టాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. హోమ్ ఐసోలేషన్ కు అవకాశం లేనివారి కోసం  కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ కేసులను ముందుగానే గుర్తిస్తే పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స అందించడం ద్వారా త్వరగా పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీని భాగస్వామిని చేయడం ద్వారానే కోవిడ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయగలమన్నారు. ఈ దిశగా కమ్యూనిటీని సన్నద్ధత చేయాలన్నారు. 
             ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్, ఎస్.సీ. కార్పొరేషన్ ఈ.డీ. శ్రీనివాస్ విశ్వనాథ్, ఐ.సీ.డీ.ఎస్. పీడీ లక్ష్మీదేవి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎం.ఈ.వో.లు, ఐ.సీ.డీ.ఎస్. సీడీపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Addanki

2021-05-26 14:19:32

30న భోదనాసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం..

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో  ఈ నెల 30న  బోధ‌నాసుప‌త్రి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. విజ‌య‌న‌గ‌రంతో స‌హా రాష్ట్రంలోని మొత్తం 16 బోధ‌నాసుప‌త్రుల నిర్మాణ ప‌నుల‌ను ఆరోజు ప్రారంభించ‌నున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, కోవిడ్ నియంత్ర‌ణ‌, గ్రామీణ ఉపాధిహామీ, గృహ‌నిర్మాణం, ఖ‌రీఫ్‌కు, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్‌ వాహ‌న మిత్ర త‌దిత‌ర ప‌థ‌కాల‌పై స‌మీక్షించారు.   రాష్ట్రంలోని మూడు జిల్లాలు మిన‌హా, మిగిలిన ప్రాంతంలో కోవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు.  ఆసుప‌త్రిలో ఎంఎన్ఓల నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తీఒక్క‌రూ కోవిడ్ క‌ట్ట‌డిలో భాగ‌స్వాములు అయ్యార‌ని అభినందించారు. అయిన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మందులు, ఇంజ‌క్ష‌న్లు, ఆక్సీజ‌న్‌కు ఎక్క‌డా కొర‌త రాకుండా చేశామ‌ని అన్నారు. ఆసుప‌త్రుల్లో చేరిన కోవిడ్ రోగుల్లో సుమారు 78శాతం మందికి ఉచితంగా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం క్రింద వైద్యం అందించిన‌ట్లు తెలిపారు. ఆక్సీజ‌న్ వృధా కాకుండా, వినియోగంపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, జూన్‌లోగా ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. రైతు భ‌రోసా కేంద్రాల ప‌నుల‌ను పూర్తిచేసి, జులై 8 రైతు దినోత్స‌వం నాటికి సిద్దం చేయాల‌ని అన్నారు. విత్త‌నం పంపిణీ నుంచి పంట‌ కొనుగోలు వ‌ర‌కూ, రైతుకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలూ రైతు భ‌రోసా కేంద్రాల ద్వారానే జ‌ర‌గాల‌ని సూచించారు. రైతు సంతోష‌మే మ‌నంద‌రి ధ్యేయం కావాల‌ని అన్నారు.

                 రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించ‌నున్న‌ 16 బోధ‌నాసుప‌త్రుల ప‌నుల‌ను ఈ నెల 30న ప్రారంభిస్తామ‌ని, ఏ జిల్లాలోనైనా భూసేక‌ర‌ణ పెండింగ్ ఉంటే, ఆ లోగా పూర్తి చేయాల‌ని సిఎం ఆదేశించారు. పేద‌లకు గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని చెప్పారు. ఈ నెలాఖ‌రు లోగా అన్ని లేఅవుట్ల‌లో నీరు, విద్యుత్ స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ల‌బ్దిదారుల రిజిష్ట్రేష‌న్ల‌ను కూడా త‌క్ష‌ణ‌మే పూర్తి చేయాల‌న్నారు. 90 రోజుల ప‌థ‌కం క్రింద కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారికి కూడా, ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేయాల‌న్నారు. నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను స్టాకు పెట్టుకోవాల‌ని సూచించారు. ఎంఐజి ప‌థ‌కానికి రాష్ట్రంలో 3ల‌క్ష‌ల‌కు పైగా  మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని, వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థ‌లాల‌ను  పంపిణీ చేయ‌డానికి వీలుగా, స్థ‌లాన్ని సేక‌రించాల‌ని  ఆదేశించారు. ప్ర‌స్తుత లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూల‌ను దృష్టిలో పెట్టుకొని, బ్యాంక‌ర్లే రైతు భ‌రోసా కేంద్రాల‌కు వెళ్లి, రైతుకు పంట రుణాలు ఇచ్చేవిధంగా క‌లెక్ట‌ర్లు కృషి చేయాల‌ని సిఎం కోరారు.

                   వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-26 14:10:52

45ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్ వేక్సిన్..

 ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు , వారి కుటుంభ సభ్యులు వెంటనే వాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు.   ఫ్రంట్ లైన్  వర్కర్స్   తో పాటు 45 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ వాక్షినేషన్  వేయడం జరుగుతుందని అన్నారు.  బుధవారం సంయుక్త కలెక్టర్ (హెల్త్) డా. మహేష్  కుమార్ తో కలసి జిల్లా అధికారులతో  కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఉద్యోగులు, , వారి కుటుంభ సభ్యులు  వెంటనే టీకా వేయించుకోవాలన్నారు. మంగళవారం 3 ప్రాంతాల్లో టీకా వేసినప్పటికి 700 మంది ఉద్యోగులు మాత్రమే వేయించుకున్నారని, మిగిలిన వారంతా వెంటనే వేయించుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు అందుకు సహకరించాలని , వందకు పైగా ఉద్యోగులున్న సంస్థ ల వద్దనే  టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరుగుతుందని అన్నారు.  అన్ని మున్సిపాలిటీలలోనూ,  మండలాల్లోనూ  టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలు  తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, వారి కోసం తాగు నీటిని, షెల్టర్ ను  ఏర్పాటు చేయాలని అన్నారు.  ఎంత మంది వస్తారో ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా టీకా వైల్స, కేంద్రాలను  అందుబాటు లో ఉంచాలన్నారు.  క్యూ లైన్ల నిర్వహణకు, భౌతిక దూరాన్ని పాటించేలా చూడడానికి మహిళా పోలీసు సహకారాన్ని తీసుకోవాలన్నారు.  టీకా ను వృధా చెయ్య వద్దని సూచించారు.  
సంయుక్త కలెక్టర్ డా.మహేష్  కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిషీల్డ్ మొదటి డోస్, మొదటి డోస్ వేసుకొని 84 రోజులు పూర్తి అయిన వారికి రెండవ డోస్ కోవిషీల్డ్ వేయడం జరుగుతుందని  స్పష్టం చేశారు.  కొ వాక్సిన్ మొదటి డోస్ ప్రస్తుతం అందుబాటు లో లేదని, అయితే రెండవ డోస్ అవసరమైన వారికి మొదటి డోస్ తీసుకున్న నెల రోజుల పూర్తి అయిన వారికి  వేయడం జరుతుందని అన్నారు.  కోవిడ్ పొజిటివ్ వచ్చిన వారు మూడు నెలల వరకు వాక్సిన్ తీసుకోకూడదని అన్నారు.  బాలింతలు కూడా వాక్సిన్ తీసుకోవచ్చని, గర్భిణీ లు తీసుకోకూడదని తెలిపారు.  జిల్లాకు సరిపడా స్టాక్ కోవిషీల్డ్ టీకా అందుబాటు లో ఉందని,  ఒకే సారి అందరూ వెళ్లకుండా, అందదేమోనని  ఆందోళన చెందకుండ 45 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరారు. 

Vizianagaram

2021-05-26 14:07:53

వైద్యులు దేవుళ్లతో సమానం..

వైద్యులు దేవుళ్లతో సమానమని, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  అవంతి ఫంక్షన్ హాల్లో కోవిడ్ పై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వైద్యులకు చేతులెత్తి నమస్కారం చేయాలన్నారు.  ప్రభుత్వ అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య భద్రత పై సర్వే చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఏర్పాటు చేసిన క్వారయింటైన్ సెంటర్లు గూర్చి ప్రజలకు తెలియచేయాలని, నోడల్ ఆఫీసర్ల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.   ముఖ్యంగా సెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో భీమిలి నియోజక వర్గంలో ప్రతి ఒక్కరికి వ్యాక్షిన్ అందే విధంగా చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.  కర్ఫ్యూ విధించాకే కోవిడ్ మరణాలు తగ్గాయని, ప్రజలందరూ తమ బాధ్యతగా మాస్కులు తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ అదుపులోకి వచ్చే వరకు వేచి ఉండాలని తెలిపారు. వ్యాక్షినేషన్ అందరూ చేయించుకోవాలని, వ్యాక్షిన్ చేసుకున్నవారు ఎవ్వరు ఇప్పటి వరకు మరణించలేదని తెలిపారు.  వ్యాక్షిన్ రెండు దశలను పూర్తి చేసుకున్నామని ఉదాసీనంగా వుండొద్దన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన వారికి నివాళులర్పించి, మౌనాన్ని పాటించారు.
 5,6,7,8 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పి.హెచ్.సి వైద్య సిబ్బంది, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ వార్డు హెల్త్ సెక్రటరీలు, శానిటరీ హెల్త్ సెక్రటరీలతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించి కోవిడ్ నియంత్రణ కొరకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్త ముత్తంశెట్టి మహేష్, రూరల్ తాహసిల్దార్ ఆర్. నరసింహమూర్తి, జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాము, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కిషోర్, మధురవాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారినులు డాక్టర్. అశ్విని శైలజ, డాక్టర్ దీపిక, యు.పి.హెచ్.సి. డాక్టర్లు సునీల్, శ్రీదేవి, శృతి, వాణిపరమేశ్వరి, ఏ.పి.డి.దుర్గాప్రసాద్, సి.ఓ లు ఎస్.ఉమ, టి.విజయలక్ష్మి, ఆర్. అప్పలకొండ, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, శానిటేషన్, వెల్ఫేర్ సెక్రటరీలు  నాయకులు గాదె రోసిరెడ్డి, ఈ.ఎన్.ఎస్.చంద్రరావు, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, సంజీవ్ యాదవ్, పిళ్ళా రమణ బాబు, పోతిన ఎల్లాజి, వంకాయల మారుతీ ప్రసాద్, పోతిన సురేష్, పోతినప్రసాద్, జె.ఎస్.రెడ్డి, ముచ్చి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-26 14:03:03

కోవిడ్ లో వైద్యసిబ్బంది సేవలు అమోఘం..

వైద్యులు, వైద్య సిబ్బంది కోవిడ్ - 19  రోగులకు అందించిన వైద్య సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.  జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో బుధవారం ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బంది, తదితరు లందరూ ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు చాలా బాగా అందించారన్నారు.  ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలన్నారు.  నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.  ఆక్సిజన్ సరఫరా, మందులు, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ, తదితర కోవిడ్ అంశాలపై సమీక్షించారు. కోవిడ్ నివారణ, NREGS,  అర్బన్ క్లినిక్ లు,  హౌసింగ్,  ఇళ్ల పట్టాలు, రానున్న ఖరీఫ్ లపైన, ఈ నెలలో ప్రారంభించనున్న జగనన్న తోడు, వాహనమిత్ర తదితర పథకాల పై ఆయన సమీక్షించారు.

 కె.జి.హెచ్.లో కోవిడ్-19 పేషెంట్లకు అందిస్తున్న వైద్య  సేవలు గూర్చి స్టాఫ్ నర్సు జి. విజయలక్ష్మి ముఖ్య మంత్రికి వివరిస్తూ సంవత్సరంన్నర నుండి కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 500 మంది వరకు కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని, కోవిడ్ తో ఆసుపత్రిలో చేరడానికి వచ్చిన పేషెంట్లకు 15 నుండి 20 నిమిషాలలో పడక కేటాయిస్తున్నట్లు ఆమె వివరించారు.  క్యాస్ లెస్ వైద్య సేవలు అందించడం జరుతోందని, రెమిడెసివర్ ఇంజక్షన్లు పేషెంట్లకు వాడుతున్నట్లు చెప్పారు.  ఆరోగ్య శ్రీ లోనూ కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రతీ రోజు పేషెంట్లు వద్దకు వెళ్లి వారిని పలుకరించి వారి బాగోగులు తెలుసుకొని, శానిటేషన్ చేయించి బెడ్ షీట్లు మార్పిస్తున్నట్లు తెలిపారు. ఎపి టూరిజం నుండి సమయానికి నాణ్యమైన ఆహారం సరఫరా చేస్తున్నారని వివరించారు. పేషెంట్లు ఆక్సిజన్ వృధా చేయకుండా ఆక్సిజన్ వాడకం పై అవగాహన పర్చుతున్నామని చెప్పారు. కోవిడ్ - 19 పేషెంట్లైన 300 మంది గర్భిణులకు ప్రసవాలు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళితే సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు గా వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించారని తెలిపారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ మీరు చేస్తున్న సేవలు ఎవరూ చేయరని, ప్రాణాలను లెక్క చేయకుండా, కోవిడ్ వస్తుందని భయం లేకుండా ధైర్యంగా సేవలందిస్తున్న సిబ్బంది అందరని అభినందించారు. తనవంతు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. 

 రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి యాస్ తుఫాన్  పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో చర్చించారు.   ఎలాంటి పరిస్థితి నైనా పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దతతో ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి కి వివరించారు.

      ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్పి బి. కృష్ణారావు, జివిఎంసి కమిషనర్ జి. సృజన,  విఎంఆర్డీఎ కమిషనర్ కోటీశ్వరరావు, జెసి లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు,ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, జెసి-3 ఆర్. గోవిందరావు, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, డ్వామా పీడీ సందీప్, ఎస్ఇ పిఆర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-26 13:57:35

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు..

కోవిడ్ ను ఎదుర్కోవడానికి వైద్యఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందించారు. రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌, వ్య‌వ‌సాయం త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి సీఎం వైఎస్ జగన్ బుధ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, జిల్లాస్థాయి ఉన్న‌తాధికారుల‌తో స్పంద‌న వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజ‌కుమారి, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రులు హాజరయ్యారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవిడ్-19 ప‌రిస్థితి, వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, బాధితుల‌కు అందిస్తున్న వైద్య‌, ఇత‌ర సేవ‌ల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. వివిధ జిల్లాల‌కు చెందిన వైద్య నిపుణులు, న‌ర్సు, ఎంఎన్‌వోల‌తో వర్చువ‌ల్‌గా మాట్లాడారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో ప్రాణాల‌ను ప‌ణంగాపెట్టి సేవ‌లందిస్తున్న వైద్య‌, ఆరోగ్య సిబ్బందికి శాల్యూట్ చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. ఫీజులు, ఆరోగ్య‌శ్రీ సేవ‌లు త‌దిత‌రాల‌పై నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. 104 కాల్‌సెంట‌ర్ వ్య‌వ‌స్థ చాలా కీల‌క‌మైంద‌ని, ఈ వ్య‌వ‌స్థ ద్వారా బాధితుల‌కు స‌రైన స‌మ‌యంలో సేవ‌లందేలా చూడాల‌న్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల స్థ‌లాల లేఅవుట్ల‌లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు, డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు త‌దిత‌రాల నిర్మాణాలు; ఖ‌రీఫ్‌-2021 స‌న్న‌ద్ధ‌తపై ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. సంక్షేమ క్యాలెండ‌ర్ ప్ర‌కారం జూన్‌లో జ‌గ‌న‌న్న తోడు, వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, వైఎస్సార్ చేయూత కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, వీటికోసం ల‌బ్ధిదారుల ఎంపిక‌, సోష‌ల్ ఆడిట్ వంటి ప్ర‌క్రియ‌ల‌ను పూర్తిచేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

Kakinada

2021-05-26 13:51:44

అనాధపిల్లల ఖాతాల్లోకి రూ.10 లక్షలు..

ఒక‌వైపు జిల్లాలో కోవిడ్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటూనే మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా కోవిడ్ ప్ర‌భావిత కుటుంబాల సంక్షేమానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద స‌మావేశ మందిరంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన, తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకు ముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ తో మరొకరు మరణించడం వల్ల  అనాథ‌లైన చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కార్యకమాన్ని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి ప్రారంభించారు. కాకినాడ గ్రామీణ మండ‌లం, తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల  చిన్నారితోపాటు రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన‌, ప్ర‌స్తుతం గోక‌వ‌రంలో సంర‌క్షుల వ‌ద్ద ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు చిన్నారుల సంర‌క్ష‌కుల‌కు డిపాజిట్‌కు సంబంధించిన ప‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ అందించారు.  

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కోవిడ్ విప‌త్తు కార‌ణంగా అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్షల ఎక్స్‌గ్రేషియాను గౌర‌వ ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల ప్ర‌క‌టించార‌ని, ఈ మేర‌కు జిల్లాలో అర్హుల‌ను గుర్తించి, వారికి ల‌బ్ధిచేకూర్చుతున్న‌ట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వ‌ర‌కు కోవిడ్ నియంత్ర‌ణ‌, నివార‌ణతో పాటు బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. విలేజ్ ఐసోలేష‌న్ కేంద్రాలు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఉచితంగా కోవిడ్, బ్లాక్‌ఫంగ‌స్ బాధితుల‌కు వైద్యం అందించేలా చూస్తున్నామ‌న్నారు. ఇన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ దుర‌దృష్ట‌వ‌శాత్తు కొన్ని కుటుంబాల్లో త‌ల్లిదండ్రులిద్ద‌రూ మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని, ఇది అత్యంత విచార‌క‌ర‌మ‌న్నారు. ఈ కుటుంబాల బాధిత చిన్నారుల‌కు దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేసే కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేస్తోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిహారానికి అర్హులైన వారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేసి, బాండ్‌ను వారికి అందించనున్న‌ట్లు తెలిపారు. చిన్నారుల‌కు 25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుంద‌ని, అప్ప‌టివ‌ర‌కు ఈ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీ మొత్తాన్ని నెల‌వారీగానీ, మూడు నెల‌ల‌కోసారి గానీ తీసుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. వ‌డ్డీ ద్వారా వ‌చ్చే సొమ్ము చిన్నారుల చ‌దువుకు, ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. చిన్నారుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం ఈ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. చిన్నారుల‌కు అధిక వ‌డ్డీ వెళ్లేలా బ్యాంక‌ర్ల‌కు కూడా విజ్ఞ‌ప్తి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. చిన్నారుల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు అందేలా ఆయా శాఖ‌ల అధికారుల‌కు ఆదేశాలిచ్చామ‌న్నారు. ఇలాంటి చిన్నారులు ఇంకా ఎవ‌రైనా ఉంటే మీడియాతో పాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ఐసీడీఎస్ అధికారుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ్రామ స్థాయిలో కోవిడ్ క‌ట్ట‌డి క‌మిటీల‌కు నేతృత్వం వ‌హిస్తున్న స‌ర్పంచ్‌లు ఈ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. 
    కాకినాడ గ్రామీణ మండ‌లం తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి శ‌ర‌ణ్య‌తో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బాగా చ‌దువుకొని, డాక్ట‌ర్ కావాల‌ని మార్గ‌నిర్దేశ‌నం చేశారు. కాకినాడ ఆర్ఎంసీలో వైద్య విద్య‌ను అభ్య‌సించాల‌ని ఆకాంక్షించారు. త‌ల్లిదండ్రులను కోల్పోవ‌డంతో నీకు ఎదురైన క‌ష్టం ఇంకెవ‌రికీ రాకుండా ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా డాక్ట‌ర్ కావాల‌ని చిన్నారి భ‌విష్య‌త్‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జేసీ (ఆర్) డా. జి. లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఐసీడీస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎంహెచ్‌వో ఎన్. ప్రసన్నకుమార్, డీసీపీవో వెంక‌ట్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మం ద్వారా ల‌బ్ధి పొందేందుకు అర్హ‌త‌లు:
- ద‌ర‌ఖాస్తు చేసుకునే తేదీ నాటికి 18 ఏళ్ల లోపు వ‌య‌సుండాలి.
- కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్ల‌లు.
- తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకు ముందే మరణించి, ఇప్పుడు కోవిడ్‌తో మరొకరు మరణించిన వారి పిల్ల‌లు.
- కుటుంబ ఆదాయం దారిద్ర్యరేఖ‌కు దిగువ‌న ఉండాలి.
- కోవిడ్ పాజిటివ్ రిపోర్టును స‌మ‌ర్పించాలి.
- ఇత‌ర బీమా సంస్థ‌ల నుంచి ల‌బ్ధిపొంద‌ని వారు అర్హులు.
- జిల్లాకు సంబంధించి చిన్నారుల వివ‌రాల‌ను టోల్‌ఫ్రీ నెంబ‌రు 1098కు కాల్‌చేసి, అందించ‌వ‌చ్చు.

Kakinada

2021-05-26 13:48:04

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ రెండవ దశ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. జివిఎంసి సిబ్బంది  కోవిడ్-19 సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున భవన నిర్మాణాలపై సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నార్నారు.  దీనిని ఆసరాగా తీసుకొని భవన నిర్మాణదారులు, అనధికారంగా గాని, నిబంధనలకు విరుద్ధంగా గాని అనధికార ఫ్లోర్లు నిర్మిస్తే అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి కట్టడాలను గుర్తించి అవి ఏ దశలో ఉన్నవైననూ వాటిపై చర్యలు చట్టపరంగా తీసుకుంటామని హెచ్చరించారు. సదరు భవన యాజమాన్యంపై అపరాధ రుసుం విధించచడంతో పాటు, క్రిమనల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.

GVMC office

2021-05-26 13:33:24

దోమల నివారణకు “డ్రై” డే పాటించాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా దోమల నియంత్రణకు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారానికి ఒక రోజుడ్రై పాటించాలని కమిషనర్ డా.జి.స్రిజన కోరారు. బుధవారం రెండవ జోన్ పరిధిలోని 7వ వార్డు మధురవాడ స్వతంత్ర నగర్ లో జివిఎంసి కమిషనర్  పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సీజనల్ వ్యాధులు దృష్టిలో పెట్టుకొని అందరు వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని, కుండీల లోని నీరు నిల్వ ఉంచకుండా ఎండబెట్టుకోవాలన్నారు. పరిసర ప్రాంతాల్లో కొబ్బరిబొండాలు, నీరు నిల్వ ఉండే వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి లాంటివి ఉండకుండా చూసుకోవాలన్నారు. కొందరి ఇంటివద్ద ఉన్న కుండీలను ఆమె స్వయంగా పరిశీలించి, మెలేరియా సిబ్బంది నిత్యం ప్రతి ఇంటిని పరిశీలించేలా చూడాలని  వెటర్నరి డాక్టరును ఆదేశించారు. తడి–పొడి చెత్త సేకరణ, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పై పారిశుధ్య సిబ్బంది వస్తున్నదీ లేనిదీ ఆరా తీసారు. రోడ్లు, కాలువలను, గెడ్డలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల ముందు డస్ట్ బిన్లు లేకపోవడంపై శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిని వివరణ కోరాలని జోనల్ కమిషనరును ఆదేశించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. ఫీవర్ సర్వే ఏ విధంగా జరుగుచున్నదని స్థానిక ప్రజలు అడిగితెలుసుకున్నారు. ఫీవర్ సర్వే బృందం వచ్చినప్పుడు వారికి సహకారం అందించి కరోనా వైరస్ ను అరికట్టాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, సహాయక ఇంజినీరు(వాటర్ సప్లై) శ్రీహరి, సహాయక ఇంజినీరు(వర్క్స్)   శ్రీనివాస్, వెటనరీ డాక్టరు కిషోర్, 7వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు. 

Madhurawada

2021-05-26 13:28:55

పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లోని సచివలయాల వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె “సిస్కొ వెబెక్స్” (CISCO Webex)ద్వారా  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సచివాలయాలలో ఒక పారిశుధ్య కార్మికుడు ఉంటె మరికొన్ని సచివాలయాల పరిధిలో 22 మంది వరకు ఉన్నారని వారిని సర్దుబాటు చేయాలని, ప్రతి వార్డు సచివాలయాలలో 7 నుండి 8 మంది పారిశుధ్య కార్మికులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు ఎవ్వరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో మనం ఎంతమందికి జీతాలు చెల్లిస్తున్నామో పూర్తి వివరాలు తెలియపరచాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆదేశించారు.  డోర్ టు డోర్ చెత్త సేకరణ సరిగా చేయడం లేదని దాని వలన బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తున్నారని, దీనిని అడ్డుకట్ట వేసే బాధ్యత శానిటరి ఇన్స్పెక్టర్, పారిశుధ్య మేస్త్రి, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.  డోర్ టు డోర్ చెత్త నిర్వహించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తడి – పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, ఆలా ఇవ్వని యడల చెత్త తీసుకోరాదని  శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. చికెన్ సెంటర్లు, మార్కెట్లు, హోటల్స్, రెస్టారెంట్లు వద్ద ప్రతి రోజు చెత్తను నిల్వ ఉంచకుండా చూడాలన్నారు.  ట్రీ వేస్ట్, రోడ్లపై చెత్త, ఇళ్ళల్లోని వేస్ట్, EPDCL వారు కట్ చేసిన ట్రీ వేస్ట్ ను మధ్యాహ్నం 12.00  గంటలలోపు డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. చెత్త నిర్వహన సరిగా లేదని కంప్లైంటు ఏ  రూపంలో వచ్చిన వాటిని పరిష్కరించి రీ-జోయండర్సు ఇవ్వాలని ఆదేశించారు. యూజర్ చార్జీలు వసూలుకు యాప్ రూపొందించాలని అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు ఆదేశించారు. జివిఎంసి సిబ్బంది వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఎంతమంది వేయించుకోవాలో, రండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలో తెలియపరచాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. రోడ్ స్వీపింగు మెషీన్ సరిగా పనిచేయడం లేదని వాటిని పరిశీలించాలని కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవిని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్)  చిరంజీవిని ,ఎఎంఒహెచ్ లు, శానిటరి ఇన్స్పెక్టర్ల తోనూ పాల్గొన్నారు. 

GVMC office

2021-05-25 15:53:33

రాజమండ్రి

2021-05-25 15:19:57

సాగర్ సిమెంట్స్ కోవిడ్ విరాళం రూ.5 లక్షలు..

అనంతపురం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలకు తమవంతు సహాయంగా సాగర్ సిమెంట్స్ రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించింది. తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఈపీ రంగా రెడ్డి,  హెచ్ ఆర్ శ్రీమన్నారాయణలు ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరుకు గంధం చంద్రుడికి అందజేశారు. గతంలో కోవిడ్ పై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండుకు రూ.25 లక్షల రూపాయలు, పోలీసు శాఖకు రూ.2 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లను అందజేయడమే గాక తాజాగా ఐదు లక్షల రూపాయల విరాళం అందించిన సాగర్ సిమెంట్స్ మేనేజ్ మెంటును కలెక్టర్ అభినందించారు. కరోనా సమయంలో దాతల సహాయం కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.

Tadipatri

2021-05-25 14:40:53

ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి..

తాడిపత్రి అర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 పడకల తాత్కాలిక ఆసుపత్రిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం పచ్చదనంతో నిండిపోవాలన్నారు. మంగళవారం సాయంత్రం తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఆసుపత్రిలో స్వచ్ఛ వాతావరణం కనిపించాలన్నారు. వేస్ట్ మ్యానేజ్ మెంట్ పకడ్బందీగా నిర్వహించాలని, 500 పడకల ఆసుపత్రి నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలని తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ ను అదేశించారు. ఆసుపత్రిలో వాహనం అనేది కనిపించకూడదన్నారు. వాహనాల పార్కింగ్ పూర్తిగా ఆసుపత్రి అవరణం బయటే ఉండాలన్నారు. సహాయకుల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. సహాయకుల కోసం ప్రత్యేక భోజన శాల, వెయిటింగ్ హాల్ ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో సహాయకులను నియంత్రించేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని పోలీసు శాఖను అదేశించారు. సహాయకుల కోసం రిజిస్టర్ నిర్వహించుకుని బాధితుల వద్ద గడిపే సమయాన్ని నియంత్రించాలన్నారు. 

 పూర్తయిన సర్జ్ ట్యాంకు నిర్మాణం 
అర్జాస్ స్టీల్స్ వారు పూర్తి చేసిన సర్జ్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. సర్జ్ ట్యాంక్ వరకూ అనుకున్న సమయానికి ఆక్సిజన్ సరఫరా చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్జ్ ట్యాంకు నుంచి పడకలకు ఆక్సిజన్ సప్లై చేయడానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఏపీఎమ్ఎస్ ఐడీసీ ఈఈ ని ఆదేశించారు. కోవిడ్ బాధితులకు వైద్య అందించేందుకు అవసరమైన సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, మందులను సిద్ధం చేసి ఉంచామని డీఎంహెచ్వో తెలిపారు. 

జిల్లా కలెక్టర్ ఆసుపత్రి పర్యవేక్షణలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ తదితరులు పాల్గొన్నారు. 

 సాగర్ సిమెంట్స్ రూ.5 లక్షలు విరాళం 
జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలకు తమవంతు సహాయంగా సాగర్ సిమెంట్స్ రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించింది. తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఈపీ రంగా రెడ్డి,  హెచ్ ఆర్ శ్రీమన్నారాయణలు ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరుకు అందజేశారు. గతంలో కోవిడ్ పై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండుకు రూ.25 లక్షల రూపాయలు, పోలీసు శాఖకు రూ.2 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లను అందజేయడమే గాక తాజాగా ఐదు లక్షల రూపాయల విరాళం అందించిన సాగర్ సిమెంట్స్ మేనేజ్ మెంటును కలెక్టర్ అభినందించారు. 

Anantapur

2021-05-25 14:33:43

తుపానును సమర్ధవంతంగా ఎదుర్కోవాలి..

నైరుతి రుతుపవన కాలంలో ఎదురైయ్యే తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన విపత్తు నియంత్రణ ప్రణాళికలతో సంసిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజన్, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజాస్టర్ మిటిగేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ నుండి సెప్టెంబరు వరకూ నైరుతి రుతుపవన కాలంలలో తరచుగా తుఫానులు, వరదలు వంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు.  కాకినాడ, అమలాపురం, పెద్దపురం డివిజన్ల పరిధిలోని 13 తీర మండలాలు తుఫానుల వల్ల ప్రభావితమౌతుండగా, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని 27 మండలాలు వరదల తాకిడికి గురైతున్నాయన్నారు.  గత అనుభవాలను పరిగణలోకి గైకొంటూ తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల ద్వారా చేపట్టవలసిన  విధివిధానాలతో  ప్రమాణిక విపత్తు నియంత్రణ ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, ఈ ప్రణాళికల ప్రకారం అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తుఫాను, వరద ప్రభావానికి లోనైయ్యే అన్ని మండలాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూడాలని, విపత్తు నివారణ, నియంత్రణకు అవసరమైన సామాగ్రి నిల్వలను ఫ్లడ్ స్టోర్ లలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. విపత్తు హెచ్చరిక వెలువడిన వెంటనే నియంత్రణ అధికారులు అందరూ తమతమ మండల ప్రధాన కార్యస్థానాలకు చేరుకుని, సహాయ, పునరావాస యంత్రాగాన్ని  సంసిద్ధ పరచాలన్నారు. విపత్తు తాకిడి మండలాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కోవిడ్ రోగులకు ఆరోగ్య సేవలందిస్తున్న కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, విలేజి ఐసోలేషన్ సెంటర్లు ఇతర వ్యవస్థలకు విఘాతం కలుగకుండా అవసరమైన చర్యలుచేపట్టాలని, అవసరమైతే ముందే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలను ఆదేశించారు. అలాగే ఈ కేంద్రాలన్నిటిలో జనరేటర్లు విధిగా ఉండేలా చూడాలన్నారు.  అవసరమైన మందుల  నిల్వలను వైద్యఆరోగ్య అధికారులు, ఆహార, నిత్యావసర సరుకుల నిల్వలను పౌర సరఫరా అధికారులు విపత్తు తాకిడ్ మండలాల్లో తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  సహాయక చర్యల కొరకు లైసెన్స్డు బోట్లును పోర్టు, మత్స్య, టూరిజం శాఖల అధికారులు గుర్తించి ఉంచాలన్నారు. రహదారుల పునరుద్దరణకు అవసరమైన జెసిబిలు, పవర్ రంపాలను ఆర్ అండి బి అధికారులు, విద్యుత్ సరఫరా పునరుద్దరణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రిని ట్రాన్స్ అధికారులు సిద్దం చేయాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాలలో త్రాగునీటి సమస్య రాకుండా ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు తగు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు, వరద ముంపుల గురించి రైతులను సకాలంలో అప్రమత్తం చేసి, పంటలను కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. తుఫానుల గురించి  మత్య్సకారులను హెచ్చరించి, సురక్షితంగా తీరానికి చేరుకునేలా మత్య్సశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద కట్టలను నిశితంగా తనిఖీ చేసి బలహీనమైన గట్లను పటిష్టపరచాలని, వరద జల మట్టాల సమాచారాన్ని ఎప్పటికప్పడు రక్షణ, సహాయ యంత్రాంగానికి తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రభలకుండా మున్సిపల్ కమీషనర్లు, పంచాయితీ అధికారులు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లు, ఆయిల్ నిల్వలు ఉంచాలని వివిద సెల్యూలర్ కంపెనీల ఆపరేటర్లను ఆదేశించారు.
తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ప్రభావం జిల్లా పై అంతగా లేదని, అయినప్పటికి అప్రమత్తతను సడలించకుండా హై ఎలర్ట్ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. 
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐటిడిఏల పిఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలు, తహశిల్దారులు తదితరులు పాల్గొన్నారు.  

Kakinada

2021-05-25 14:24:43