1 ENS Live Breaking News

అలిపిరి వరకు గరుడవారధి..

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పూర్తయ్యే ప్రాంతంలో జరుగుతున్న పనులను టిటిడి చైర్మన్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్లేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా, నడచి వెళ్లేవారు అలిపిరి కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  టిటిడి చైర్మన్ వెంట చీఫ్ ఇంజినీర్  రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tirupati

2021-05-27 17:10:39

కోవిడ్ చికిత్స మరింత మెరుగుపరచాలి..

కోవిడ్ ఇన్‌పేషెంట్ రక్షణ మరియు చికిత్స నిర్వహణ మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం రిమ్స్‌లో ఈ విషయంపై కోవిడ్ డ్యూటీ డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేషెంట్‌కేర్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీలులేదన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మానసికంగా ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. చికిత్స చేస్తున్న వైద్యులను దేవుళ్లుగా బాధితులు భావిస్తున్నారని, వైద్య ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా
కఠినచర్యలు తప్పవని చెప్పారు. బెడ్ మేనేజ్‌మెంట్ పకడ్భందీగా ఉండాలని కలెక్టర్ పునరుద్ఝాటించారు. రోగుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూవుండాలని, కోలుకున ్నవారిని వెంటనే డిశ్చార్జీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలవల్ల ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదని ఆయన ప్రకటించారు. ఆక్సిజన్ వినియోగంలో వృధాను అరికట్టాలని చెప్పారు. కోవిడ్ విధుల్లో పాల్గొంటున్న జూనియర్ డాక్టర్లకు, ఇతర కింది స్థాయి సిబ్బందికి ఒక రోల్‌మోడల్‌గా నిలువాలని వైద్యులకు ఆయన సూచించారు. నోడల్ ఆఫీసర్ గా వున్న జాయింట్ కలెక్టర్ కె. క్రి ష్ణవేణి మాట్లాడుతూ వైద్య సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులు త్వరగా కోలుకుంటారని అన్నారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అందరూ మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం వుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డిప్యూటి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణారెడ్డి, ఆర్.ఎమ్.ఓ. వేణుగోపాల రెడ్డి, ఎ.పి.ఎమ్.ఎస్. ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-05-27 10:54:50

రేపు డిసిసి సమావేశం-కలెక్టర్..

ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశం 28వ  తేదీన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్పందన సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ, కట్టడి చర్యలు, ఆయా కార్యకలాపాలపై  సమీక్ష జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఇంన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  పి. విశ్వరూప్, రాష్ట్ర విద్యుత్, అటవి శాస్త్ర సాంకేతిక పర్యావరణశాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాలోని శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొంటున్నారని కలెక్టర్ చెప్పారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరుకావాలని ఆయన తెలిపారు.

Ongole

2021-05-27 10:40:40

కేలండర్ ప్రకారమే సంక్షేమ పథకాలు..

రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ కేలండ‌ర్ ప్ర‌కారం వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని, పూర్తిస్థాయిలో వీటి ఫ‌లితాలు ల‌బ్ధిదారుల‌కు స‌రైన స‌మ‌యంలో అందించ‌డంలో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాల్సి  ఉంటుందని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి సంప్ర‌దింపుల క‌మిటీ (డీసీసీ) స‌మావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగింది. జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి పాల్గొన్న ఈ స‌మావేశంలో వివిధ ప‌థ‌కాలు, వార్షిక రుణ ప్ర‌ణాళిక కింద వివిధ రంగాల్లో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో బ్యాంక్ సంబంధిత అంశాల్లో పురోగ‌తిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మ‌ధ్యాహ్నం 12 గం. వ‌ర‌కు జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌ను బ్యాంకుల‌లోకి అనుమ‌తించి, ఆపై సాయంత్రం 5 గం. వ‌ర‌కు అందుబాటులో ఉన్న స‌మ‌యాన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం, అంత‌ర్గ‌త బ్యాంకు వ్య‌వ‌హారాల‌కు ఉప‌యోగించాల‌ని సూచించారు. స‌మాచార మార్పిడికి సంబంధిత విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కార్య‌క‌లాపాలు సాగించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో బ్యాంకులు క్రియాశీల‌పాత్ర పోషించాల‌ని, రుణాల మంజూరు, ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం త‌దిత‌ర అంశాల్లో పురోగ‌తిపై ప్ర‌తివారం స‌మీక్షించ‌నున్న‌ట్లు తెలిపారు. 2021, మే 26 నాటికి జ‌గ‌న‌న్న తోడు (గ్రామీణ‌) కింద 96.26 శాతం మేర రుణాల పంపిణీ పూర్త‌యింద‌ని, అదే విధంగా పీఎం స్వానిధి కింద 19,464 మందికి రుణాలు మంజూరైన‌ట్లు తెలిపారు. వైఎస్సార్ బీమాకు సంబంధించి డేటా ఎన్‌రోల్‌మెంట్ ప్ర‌క్రియ‌ను వెంట‌నే పూర్తిచేయాల‌ని సూచించారు.
   వైఎస్సార్ సున్నా వ‌డ్డీ పంట రుణాల ప‌థ‌కం కింద ఎక్కువ మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గాలంటే ఖ‌రీఫ్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకోవాలని, స‌మ‌యాన్ని ఆదాచేసేందుకు ఆర్‌బీకేల స్థాయిలో డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. ఇందులో వీఏఏలు, బిజినెస్ క‌ర‌స్పాండెంట్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కలెక్టర్ సూచించారు.  స‌మావేశంలో ఎల్‌డీఎం జె.ష‌ణ్ముఖ‌రావు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, వివిధ బ్యాంకుల కోఆర్డినేట‌ర్లు, కంట్రోల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-27 10:35:24

సర్వేయర్లకు రోవర్స్ తో సర్వేలో శిక్షణ..

రోవర్స్ అనే ఆధునిక పరికరంతో భూ సర్వేపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని సర్వే శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర రావు తెలిపారు. ఆధునిక పరికరాలు లభ్యతతో భూ సర్వే సమర్ధవంతంగా చేపట్టవచ్చని ప్రభాకర చెప్పారు. శిక్షణా కార్యక్రమాన్ని ఆర్ అండ్ బి అతిధి గృహం సమీపంలోగల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సర్వేయర్లు రోవర్స్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేసారు. ఒక ప్రాంతంలో రోవర్స్ పరికరం గాలిలో వినియోగించడం వలన ఆ ప్రాంతంలోని భూ సర్వే చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ కె.ఈశ్వర దొర, డిప్యూటి ఇన్ స్పెక్టర్లు జి.వెంకట రావు, సారంగ పాణి, కొండల రావు, మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-27 10:29:32

ట్రాన్స్ జెండర్స్ కు ఆర్థిక సహాయం..

ట్రాన్స్ జెండర్స్ కు ఆర్థిక సహాయం అందజేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు కె.జీవనబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు కరోనా కష్ట సమయంలో రూ.1500 ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. ఆర్ధిక సహాయం పొంఫుటకు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. దరఖాస్తును  http://www.nisd.gov.in  వెబ్ సైట్ లో సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంకు పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ తదితర వివరాలను సమర్పించాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ అందరు సద్వినియోపరచు కోవాలని ఆయన కోరారు.

Srikakulam

2021-05-27 10:27:31

దివ్యాంగులకు సుగమ్యా భారత్ యాప్..

దివ్యాంగులకు సుగమ్యా భారత్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సుగమ్యా భారత్ యాప్ ను జాతీయ స్థాయిలో ప్రారంభించారన్నారు. సమాజంలో తమ జీవన విధానంలో  వివిధ సదుపాయాల లభ్యతను దివ్యాంగులు తెలుసుకునే అవకాశం సుగమ్యా భారత్ యాప్ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్స్, వైద్య శాలల్లో సులభంగా నడిచే దారులు,   వాహానాల పార్కింగ్, సులభమైన భవన ప్రవేశ ద్వారాలు, అంతర్గత సదుపాయాలు, సులభమైన కారిడార్, రిసప్షన్, లిఫ్ట్ ఎలివేటర్, మరుగుదొడ్లు, మెట్ల మార్గం, మంచినీళ్ళ సదుపాయం, సులభమైన సంకేతాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. దివ్యాంగులు సుగమ్యా భారత్ యాప్ ను ఆన్ లైన్ ద్వారా తెరచి వారి సలహాలు, సూచనలు పొందుపరచ వచ్చని తెలిపారు. పొందుపర్చిన విషయాలను నేరుగా భారత ప్రభుత్వ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకొని చర్య చేపడుతుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా దివ్యాంగులు అందరూ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. యాప్ ను మోబైల్ ఫోన్ లో  ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని అన్నారు. డౌన్ లోడ్ అనంతరం భారత ప్రభుత్వం జారీ చేసే యూనిక్ డిజెబిలిటీ ఐడి కార్డు సెంటర్ తో అనుసంధానం అయి వినియోగించ వచ్చని సూచించారు.

Srikakulam

2021-05-27 10:24:17

కోవిడ్ త‌గ్గినా జాగ్ర‌త్త‌లు పాటించాలి..

కోవిడ్ త‌గ్గిన‌ప్ప‌టికీ, కొన్నిరోజుల‌పాటు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, ధైర్యంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సూచించారు. నెల్లిమ‌ర్ల మిమ్స్ కోవిడ్ ఆసుప‌త్రి నుంచి, ప‌దిరోజుల చికిత్స అనంత‌రం, వ్యాధిని న‌యం చేసుకొని 22 మంది గురువారం డిస్‌ఛార్జి అయ్యారు. వీరికి జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో వైద్య బృందం వీడ్కోలు ప‌లికింది. వారికి వాహ‌నాలు ఏర్పాటు చేసి, స్వ‌స్థ‌లాల‌కు పంపించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్‌ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, రోగుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వ్యాధికి చికిత్స చేసుకున్న‌ప్ప‌టికీ, క‌నీసం ప‌దిరోజుల‌పాటు అయినా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.  వీలైనంత‌వ‌ర‌కూ ఇంట్లోనుంచి రాకుండా, ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని అన్నారు. వ్యాధిని ఎదుర్కొనాలంటే, మ‌నోధైర్యం చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వారికి వైద్యం ఏవిధంగా అందిందీ, మందులు, ఇంజ‌క్ష‌న్లు ఇచ్చిందీ లేనిదీ వాక‌బు చేశారు. సిబ్బంది సేవ‌ల‌పై ఆరా తీశారు. కొన్నిరోజుల‌పాటు మందులను జాగ్ర‌త్త‌గా వాడాల‌ని సూచించారు. వారికి డ్రైఫ్రూట్స్‌, అవ‌స‌ర‌మైన మందులను పంపిణీ చేశారు.

               కార్య‌క్ర‌మంలో మిమ్స్ మెడిక‌ల్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ హ‌రికిష‌న్ సుబ్ర‌మ‌ణ్యం, మెడిక‌ల్ సూప‌రింటిండెంట్ ఐ.భాస్క‌ర‌రాజు, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ సి.రఘురామ్‌, ప్రిన్సిపాల్ సిహెచ్ ల‌క్ష్మీకుమార్‌, హెచ్ఆర్ నుంచి శ్రీ‌నివాస్‌, వెల్ఫేర్ ఆఫీస‌ర్ గిరిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-27 10:20:44

వైద్య‌క‌ళాశాల శంకుస్థాప‌న‌కు ఏర్పాట్లు చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల నిర్మాణానికి ఈనెల 30న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శ్రీ‌కారం చుడుతున్నార‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఈ క‌ళాశాల శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి ప‌క‌డ్భంధీగా ఏర్పాట్లు చేయాల‌ని, సంబంధిత అధికారుల‌ను  క‌లెక్ట‌ర్ ఆదేశించారు. శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మీక్షించారు.   ఆ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి ఆన్‌లైన్ ద్వారా, బోధ‌నాసుప‌త్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తార‌ని చెప్పారు. క‌ళాశాల నిర్మాణానికి గాజుల‌రేగ‌వ‌ద్ద సేక‌రించిన స్థ‌లంలోనూ, క‌లెక్ట‌రేట్ వీడియో కాన్ఫ‌రెన్స్ మందిరం వ‌ద్దా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిక‌రాలను మందుగానే సిద్దం చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొంటార‌ని తెలిపారు. కార్య‌క్ర‌మానికి నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేట‌ట్లు చూడాల‌న్నారు. త‌క్ష‌ణ‌మే స్థ‌లాన్ని చ‌దునుచేసి, ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు.  వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ స‌మ‌న్వ‌యంతో, ప‌క‌డ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

                  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు, ఎపిహెచ్ఎంఐడిసి ఎస్ఇ కె.శివకుమార్‌, ఇఇ ఎం.స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, ఐఅండ్ పిఆర్ డిఇ ర‌మ‌ణ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర్‌, ఎపి స్వాన్‌, బిఎస్ఎన్ఎల్‌, క‌లెక్ట‌రేట్ త‌దిత‌ర శాఖ‌ల సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-27 10:17:54

అప్పన్న ఆలయ అభివృద్ధికి క్రుషి చేయండి..

విశాఖలోని  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలే అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు గురువారం విజయ్ సాయిరెడ్డి ని శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం విజయ్ సాయిరెడ్డి కి సింహాచలం అప్పన్న స్వామి శేష వస్త్రం..చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ సాయిరెడ్డి శ్రీనుబాబును అభినందిస్తూ.. సింహాచలం పుణ్యక్షేత్రాన్ని మరింత పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని విజయ్ సాయిరెడ్డి పేర్కొన్నారు. స్వామి సేవ చేసుకునే  అవకాశం కల్పించిన విజయసాయిరెడ్డికి శ్రీనుబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Visakhapatnam

2021-05-27 10:12:36

జగనన్న తోడు పనులు వేగవంతం కావాలి..

చిరు వ్యాపారాలు  చేసే వారికి  ఆర్ధిక సహకారాన్ని అందించే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు పధకం క్రింద అందిన దరఖాస్తులను వేగంగా గ్రౌండింగ్ చేయాలని  సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ కుమార్ బ్యాంక్ అధికారులను కోరారు.  గురువారం ఆయన చాంబర్ లో మెప్మా, డి.ఆర్,డి.ఏ అధికారులు, బాంకర్లతో సమీక్ష  సమావేశం  నిర్వహించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ తోడు పధకం క్రింద  ఇచ్చిన లక్ష్యాలను త్వరగా చేరుకోవడం లో బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు.  రీ వెరిఫికేషన్  పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్ధుల దరఖాస్తులను బాంకర్ల  లాగిన్ లో కి పంపడం జరిగిందని, ఆ దరఖాస్తులన్నిటిని  వెంటనే  గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు.   గ్రామీణ  ప్రాంతాలకు సంబంధించి 12 వేల 173 దరఖాస్తులు అందగా వాటి లో 2641 మంది ఆసక్తిని చూపించారని,  అందులో 947 దరఖాస్తులను  రీ వెరిఫికేషన్  చేసి  బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు.   అదే విధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా ద్వారా 3వేల 973 దరఖాస్తులు అందగా  వెరిఫికేషన్ అనంతరం 459 దరఖాస్తులను బాంక్ లకు పంపడం జరిగిందన్నారు.  మొత్తం 1406 దరఖాస్తుదారులకు ప్రస్తుతం  గ్రౌండింగ్ చేయవలసి ఉందని, వీరికి   వెంటనే బ్యాంక్ అధికారులు రుణాలు  మంజూరు  చేయాలని జె.సి సూచించారు.  ఆసక్తి చూపిన మరో 1797 మందికి  స్త్రీ నిధి క్రింద రుణాలను అందించాలని అన్నారు. 
జగనన్న తోడు పధకం  గురించి అవగాహన కల్పించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల సహకారం తో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్  ల ద్వారా  లబ్ధి దారుల గుర్తింపు  చేయాలని తెలిపారు.  ఈ పధకం పై  గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం వలన చిరు వ్యాపారులను ఎక్కువ మందిని కవర్ చేయవచ్చని అన్నారు. వాలంటీర్ లకు, వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ లకు అవ్గహన కోసం వెంటనే  టెలీ  కాన్ఫరెన్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. 
ఈ సమావేశం లో  లీడ్ జిల్లా మేనేజర్ స్రినివస రావు,  మెప్మా పి.డి సుగుణకార రావు డి.ఆర్.డి.ఏ అదనపు పి.డి సావిత్రి, పలు  బ్యాంక్ ల ప్రతినిధులు  పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-27 07:40:15

దేశంలోనే మొదటి ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్..

దేశంలోనే ఆసుపత్రి ఆవరణంలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు కలిగిన మొట్టమొదటి ఆస్పత్రిగా హిందూ పురం జిల్లా ఆసుపత్రి రికార్డు సొంతం చేసుకుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  బుధవారం సాయంత్రం హిందూపురం జిల్లా ఆసుపత్రిలో 1000 ఎల్పీఎం(లీటర్ పర్ మినిట్) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఎన్.హెచ్.ఏ.ఐ, డీఆర్డీవో సంయుక్త సహకారంతో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణాన్ని అతితక్కువ సమయంలో నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. ఈ జెనరేషన్ ప్లాంటు ద్వారా రోజుకు 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్ అందించే అవకాశం ఉందన్నారు. జెనరేషన్ ప్లాంటు నిర్వహణకు 125 కెవి సబ్ స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్ అందించనున్నామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అందించిన రూ. 20 లక్షల నిధులతో జెనరేటర్ ఏర్పాటు చేసుకుని నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి కొనసాగేలా చూస్తామన్నారు. 

 అదే సమయంలో ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ స్టోరేజీ మీద కూడా దృష్టి సారించామన్నారు. అనంతపురము సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తున్నామన్నారు.రానున్న రోజుల్లో జిల్లాలోని మరో మూడు ఆసుపత్రుల్లో ఇటువంటి ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామన్నారు. కదిరి ఏరియా ఆసుపత్రి, ఆనంతపురము సర్వజన మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మూడు జెనరేషన్ ప్లాంట్లను నిర్మిస్తామన్నారు. 

ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఆక్సిజన్ సప్లైలు, సిలిండర్ల మీద ఆధారపడిన అనంత జిల్లాను ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్లు నిర్మించుకుని 40 కిలో లీటర్ల ఆక్సిజన్ స్టోరేజీ చేసుకోగల సామర్థ్యం కలిగిన జిల్లాగా అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. జిల్లా వైద్య రంగంలో గత యాభై ఏళ్ల కాలంలో ఎప్పుడూ జరగనంత మౌలిక వసతుల అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో చేశామన్నారు. అదే అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ నెల 30వ తేదీన పెనుగొండ సమీపంలో 57 ఎకరాలలో హిందూపురం పార్లమెంటు నియోజక వర్గానికి మెడికల్ కలశాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంతో శ్రీకారం చుడతామన్నారు.

అతి తక్కువ సమయంలో ఆక్సిజన్ ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ, డీఆర్డీవో సంస్థలు, జేసీ సిరి బృందం, పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, సహకరించిన ప్రజా ప్రతినిధులు మరియు పుర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Hindupuram

2021-05-26 15:46:22

ఇక్కడి ఆక్సిజన్ ప్లాంట్ ప్రజలకే అంకితం..

హిందూపురం జిల్లా ఆసుపత్రి ఆవరణంలో నిర్మించిన 1000 ఎల్పీఎం ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఆసుపత్రిలో నిర్మించిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా హిందూపురం జిల్లా ఆసుపత్రి ఆవరణంలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజక వర్గ ప్రజాప్రతినిధుల సహకారంతో హిందూపురం జిల్లా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఒక ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేసే ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యున్నత సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నాడు-నేడు ద్వారా విద్యాలయాలు, ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన చేస్తోందన్నారు. కరోనా విపత్కాలంలో కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన వసతులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం కూడా అందిస్తోందన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో యాభై శాతం పేద ప్రజలకు పడకలు కేటాయిస్తున్నామన్నారు. 

Hindupuram

2021-05-26 15:42:37

60 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం మండల అధికారులు, వైద్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గురువారం 30 వేల మందికి కోవిడ్ టీకా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి టీకా వేయడం జరుగుతుందని అందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. అనంతరం 45 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో  170 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతంలో 25 సచివాలయాల పరిధిలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రోజుకు 150 మందికి మాత్రమే నిర్దేశిత ప్రదేశంలో టీకా కార్యక్రమం జరుగుతుందని వారికి ముందుగా సమాచారం అందించాలని ఎంపీడీవో లను ఆదేశించారు. ఏ ప్రదేశంలో జరుగుతుందో సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. టీకాకు వచ్చిన వారిని నిర్దేశించిన స్థలాల్లో కూర్చోబెట్టి సజావుగా టీకా వేయాలని ఎక్కడ రద్దీ జరగడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.  జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ పి హెచ్ సి వైద్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నదని, వైద్యులు తమ సిబ్బందిని నియమించాలని అన్నారు. ప్రతి మండలంలో 4 సచివాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని, 15 మండలాల్లో మాత్రం 5 సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. టీకా కార్యక్రమం ఉదయం 8 గంటలజూ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Srikakulam

2021-05-26 15:38:12

అంతర్జాతీయ ప్రమాణాలతో ముడసర్లోవ పార్కు అభివృద్ధి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ముడసర్లోవ నాచురల్ పార్కును ఓ సుందర నందనవనంగా రూపొందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఈ మహా విశాఖ నగరంలో మరో పర్యాటక మణిహారంగా తీర్చిదిద్దేందుకు దేశ విదేశాల్లో ఉన్న పార్కుల నమూనాల్ని పరిశీలించాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో జలాశయం, మరో 80ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పరచుకున్న ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పార్కుగా అభివృద్ధి చేసేలా ప్లాన్లు తయారు చేయాలనీ, దీనికి సంబంధించిన నిధుల గురుంచి ఆలోచించకుండా, అద్భుతమైన పార్కుగా మార్చేందుకు ప్రయత్నించాలన్నారు. పిపిపి పద్దతిలో గాని, కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దామని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. గతంలో విఎంఆర్ డిఎ ముడసర్లోవ పార్కు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలున్నాయని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, విఎంఆర్ డిఎ కమిషనర్ కోటేశ్వరరావు విజయసాయి రెడ్డికి వివరించారు. మీనియేచర్ ఎ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్, విఎంఆర్ డిఎ, జివిఎంసి సంయుక్తంగా ప్రాజెక్టుపై దృష్టి సారించాలని విజయసాయి రెడ్డి సూచించారు. దాదాపు 40శాతం వరకూ ఉన్న పచ్చని భారీ వృక్షాలని తొలగించకుండా, ఆకర్షణీయమైన ప్రాజెక్టు రూపొందించేందుకు ప్రయత్నించాలని విజయసాయి రెడ్డి ఆదేశించారు. నగరప్రజలకు ఆహ్ల్లాదకరమైన, ఆనందదాయకమైన వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. మీనియేచర్ విలేజ్, జంగిల్ బుక్ ట్రీ, ఫ్యామిలీ ప్లే ఏరియా, వాటర్ స్పోర్ట్స్ హబ్ మొదలైనవి ఉండేలా ప్లాన్స్ రూపొందించాలన్నారు. అదేవిధంగా, సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించిన రూట్ మ్యాప్ ని విజయసాయి రెడ్డి పరిశీలించారు.  గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలిత్తకుండా, సంబంధిత రూట్ ని ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని సింహాచలం ఇ.ఒ. సూర్యకళ, జివిఎంసి, విఎంఆర్ డిఎ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి డా. జి. సృజన, విఎంఆర్ డిఎ కమిషనర్ కోటేశ్వరరావు, జాయింటు కలక్టరు వేణుగోపాల రెడ్డి, ఎ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ జోనల్ మేనేజర్ మంగ, ప్రధాన ఇంజినీరు  ఎం. వెంకటేశ్వరరావు, సిసిపి విద్యుల్లత, ఎడిహెచ్ ఎం.దామోదర రావు, ఎస్.ఇ. గణేష్ బాబు, డిసిపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.   

Mudasarlova park

2021-05-26 15:32:00