1 ENS Live Breaking News

ఆ ఆసుపత్రికి రూ.22.55లక్షలు జరిమానా..

డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, రూ.4,50,000 వ‌సూలు చేసినందుకు కాకినాడ‌లోని ఇనోద‌య ఆసుప‌త్రికి అయిదు రెట్లు మొత్తాన్ని రూ.22,50,000 పెనాల్టీగా విధించిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆరోగ్య‌శ్రీ కింద కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుప‌త్రిలో చేర్చుకున్న‌ప్ప‌టికీ త‌మ నుంచి రూ.4,50,000 మొత్తాన్ని వ‌సూలు చేశారంటూ రోగి ఎం.స‌త్తిరాజు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును జేసీ (డీ) కీర్తి చేకూరి నేతృత్వంలోని డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్ట్ జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీసీసీ) ప‌రిశీలించింది. వివిధ ఆధారాల‌ను ప‌రిశీలించిన క‌మిటీ  రోగి నుంచి వ‌సూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఆయ‌న‌కు చెల్లించ‌డ‌మే కాకుండా.. రూ.22,50,000 పెనాల్టీ మొత్తాన్ని డీసీసీ, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ పేరిట డీడీ తీసి అంద‌జేయాల‌ని లేదా నిర్దేశ ఖాతాకు బ‌దిలీ చేయాల‌ని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చిన‌ట్లు జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. అదే విధంగా కోవిడ్ చికిత్స నుంచి ఆసుప‌త్రిని డీనోటిఫై చేసి, క్రిమినల్ కేసు బుక్ చేశ మని,  సంబందిత ఆరోగ్య‌మిత్ర కె.నాగ‌మ‌ణికి షోకాజు నోటీసులు జారీచేసిన‌ట్లు కీర్తి చేకూరి తెలిపారు.

Kakinada

2021-05-28 15:51:53

బ్లాక్ ఫంగస్ పై మరింత అప్రమత్తం..

కరోనాతో కోలుకున్న తరువాత వచ్చే బ్లాక్ ఫంగస్ అనే కొత్త రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్యులకు సూచించారు.  శుక్రవారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై  వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వ్యాధి జిల్లాలో ప్రబలుతున్నందున దాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధిబారిన పడిన వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, బెడ్లు, ప్రత్యేక వార్డులు వంటి కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  బ్లాక్ ఫంగస్ వివిధ ప్రాంతాల్లో విస్తృతం అవుతుందని, జిల్లాలో  బ్లాక్ ఫంగస్ విస్తృతి కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా బాధితులకు వైద్యులు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమైన కల్చర్ టెస్ట్ నిర్వహించి దానిని పరిశీలన ఆధారంగా చికిత్స చేపట్టే అవకాశాన్ని కూడా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మ్యుకోర్ ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని, కావున కోవిడ్ బాధితుల రోగ నిరోధక శక్తి పెరుగుటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. మ్యుకోర్మికోసిస్ వల్ల కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నందున, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల ఆధారంగా తగు సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్,సుపరింటెండెంట్ కృష్ణమూర్తి,ఆర్.ఎం.ఓ అరవింద్, రిమ్స్ నోడల్ ఆఫీసర్ చలమయ్య, ప్రొఫెసర్ పరశురాం, ప్రొఫెసర్ జ్యోతిర్మయి,ప్రొఫెసర్ ఉషారాణి,ప్రొఫెసర్ ప్రభాకర్,ప్రొఫెసర్ పాపరత్నం,డాక్టర్ కళ్యాణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-28 15:46:56

ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవేక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ బంగ్లా దరి గల ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. అర్బన్ మెడికల్ ఆఫీసర్  డా. కె.కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, వృద్ధాశ్రమంలోని 40 మంది వృద్ధులకు కోవిషీల్డ్ వేక్సినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో వేక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కాకుండా కోవిడ్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తొలిదశలో  60 ఏళ్లు పైబడినవారికి, ప్రంట్ లైన్ వారియర్స్ కు వేక్సినేషన్ చేసారు. మలిదశలో 45 ఏళ్లకు పైబడి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధిగ్రస్తులకు కూడా అవకాశం కల్పించిన సంగతి అందరికి విదితమే. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి    తొలి ప్రాధాన్యతను ఇస్తూ, 45 నుండి 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వేక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం జె.ఆదిలక్ష్మీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ సిహెచ్.ఐశ్వర్య, ఆశా వర్కర్ బి.జ్యోతి, వాలంటీర్ జి.ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-05-28 15:45:06

గృహ నిర్మాణాలు ప్రారంభం కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం కావాలని అన్నారు. మోడల్ హౌసింగ్ కాలనీ లేఅవుట్ లో వారం రోజులలో అన్ని గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. జిల్లాలో 742 లేఅవుట్లు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ పూర్తయిన మేరకు నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న లబ్ధిదారులకు మంజూరైన గృహాలను కూడా తక్షణం ప్రారంభించాలని వారికి సిమెంటు, ఇనుము అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో వివిధ పథకాల కింద మొత్తం లక్షా పది వేల గృహాలు మంజూరు అయ్యాయని ఆయన వివరించారు. లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి నిర్మాణ ప్రక్రియను గూర్చి అవగాహన కలిగించాలని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం 20 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత సీజన్లో గృహ నిర్మాణ పనులు చేసుకునే అవకాశం ఉందని, లబ్ధిదారులు సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొంటూ గృహ నిర్మాణ పనులు చేసుకునే లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం క్రింద వేతనంగా దాదాపు 18 వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. పొజిషన్ సర్టిఫికెట్ అందని వారికి త్వరితగతిన అందించుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో కనీసం 25 వేల గృహ నిర్మాణ పనులు వారం  రోజుల్లో ప్రారంభం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గృహాన్ని మ్యాపింగ్ చేయాలని, ఇప్పటి వరకు జిల్లాలో 91 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగిందని ఆయన పేర్కొంటూ మ్యాపింగ్ జరిగిన వాటిలో 80 శాతం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి జరిగిందని మిగిలిన వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పాలకొండ, ఇచ్చాపురం ప్రాంతాల్లో పనులు ప్రారంభంలో వెనుకబడి ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జగనన్న ఆదర్శ కాలనీలలో పనుల చేపట్టుటకు నీటి సౌకర్యం అవసరమని, అన్ని కాలనీల్లో అవసరం మేరకు బోర్లను వేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే 504 బోర్లను వేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు గుర్తించాలని అందుకు అనుగుణంగా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రతి లేఅవుట్ వద్ద విద్యుత్, నీరు ఉండాలని తదనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చని అన్నారు. విద్యుత్తును ఈ నెలాఖరు నాటికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించిందని, అతి త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని విద్యుత్  ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. లేఅవుట్ ల వద్ద వేసిన బోర్లకు తక్షణం విద్యుత్ సౌకర్యం కల్పించి నీటిని నిల్వ చేసే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు బోర్ల కోసం రిజిస్ట్రేషన్ చేయని వాటికి తక్షణం రిజిస్ట్రేషన్ చేయించాలని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే విద్యుత్తును అందించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాస రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. మశిలామణి, డిఇ జిటి ప్రసాద్, ఏడిఇ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-28 15:38:26

అంగన్వాడీలో నాడు నేడు పనులు..

 అంగన్వాడీ భవనాలను నాడు నేడు క్రింద ఆధునికీకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో మరమ్మతులు చేపట్టి ఆధునీకరణ చేయుటకు నిర్ణయించిందన్నారు. ఒక భవనాన్ని 9 అంశాల్లో మరమ్మతులు చేయుటకు అవకాశం కల్పిస్తూ రూ.6.90 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. జిల్లాలో 190 అంగన్వాడీ భవనాలు మొదటి దశలో చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ భవనాలలో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, పైకప్పు మరమ్మతులు, ఫ్లోరింగ్, మంచి విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, గ్రీన్ చాక్ బోర్డు, వాష్ బేసిన్, కిచెన్, విద్యుత్ కనెక్షన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. వీటని చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి అంశంలో నాణ్యత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మరమ్మతులకు సంబంధించిన అంచనాలు వేయాలని, వాటిని ఫోటోలతో సహా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నాడు నేడు క్రింద పాఠశాలల్లో అత్యంత ఆహ్లాదకరంగా తయారు చేయడం జరిగిందని అవసరమైతే వాటిని సందర్శించి చక్కని వాతావరణంలో అంగన్వాడీ కేంద్రాలు ఉండే విధంగా మరమ్మతులు చేపట్టి చిన్నారులను ఆకర్షించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తించాలని, అందుకు అనుగుణంగా చిన్నారులను దృష్టిలో పెట్టుకొని పైకప్పు మరమ్మతులు చేపట్టడంలో గాని, తలుపులు, కిటికీలు అమర్చడంలో గాని రాజి వుండరాదని అన్నారు. ఫ్లోరింగ్ చక్కగా ఉండే విధంగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో మంజూరు చేసిన నిధులతో ప్రహరీ గోడలు నిర్మించరాదని స్పష్టం చేశారు. ప్రహరీ గోడలను ఉపాధి హామీ పథకంలో మాత్రమే నిర్మించాలని ఆయన అన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.వేణుగోపాల్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.జయదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, విద్యుత్ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.మశిలామణి, డిఈ జి.టి ప్రసాద్, ఏడిఇ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-28 15:36:23

ఆ ఎంపీడీఓ డిడీగా ఎక్కడ పనిచేశారో..?

ఆ వివాదాస్పద ఎంపీడీఓ ఎస్.సుభాషిణి మరో కొత్త వివాధానికి తెరలేపారు. తూర్పుగోదావరి జిల్లాలోని కెఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తూ అవినీతి ఆరోపణలపై సస్పెండై 8నెలల తరువాత ఆమె విజయనగరం జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసి)గా విధుల్లోకి చేరారు. చేరిన రోజే తన సర్వీసులో ఎక్కడా డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేయకుండానే తాను డిప్యూటీ డైరెక్టర్ గా వివిధ హోదాల్లో పనిచేసినట్టుగా మీడియాకి సమాచారశాఖ ద్వారా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పుదోవ పట్టించి, నమ్మించడానికే ఈ అధికారిణి ఈ విధమైన తప్పుడు ప్రచారం చేసినట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి ఈమె రెండు నెలల క్రితం విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా చేరడానికి ప్రభుత్వ జీఓతో విశ్వప్రయత్నాలు చేసి వెనుతిరిగారు. అపుడు విశాఖ జిల్లా మంత్రి అవంతిశ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఈమెను విధుల్లోకి చేర్చుకోలేదు. అంతేకాకుండా కాకుండా తూ.గోజిల్లాలో పిడింగొయ్యి పంచాయతీ విషయంలో సుమారు రూ.73.50 లక్షల అవినీతి వివాదంలో ఆమె బాధ్యత వహించాలటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జారీచేసిన నోటీసు  లో (1363546/cpr&rd/a2/2021,dated-26-03-2021) జిల్లా పంచాయతీ అధికారి పేర్కన్న అంశాన్ని ప్రధానంగా తెలియజేశారు. కొన్ని శాఖపరమైన విచారణలు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ  ఈమె డిపీఓ(ఎఫ్ఏసి) జీఓ రద్దై,  ఓ అధికారిణి  వేసిన కోర్టు కేసు పెండింగ్ లో ఉండగానే, విజయనగరం జిల్లా పంచాయతీ అధికారిణా విధుల్లోకి చేరడం, అదేరోజు తాను ఎంపీడీఓతోపాటు, డిప్యూటీ డైరెక్టర్ గా హోదాల్లో పనిచేశానని చేయని హోదాకి మీడియాకి ప్రకటన ఇవ్వడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈమె తన సర్వీసులో కేవలం ఎంపీడీఓగా మాత్రమే పనిచేశారు తప్పా మరెక్కడా డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన దాఖలాలు గానీ, ప్రభుత్వ ఉత్తర్వులుగానీ ఎక్కడా లేవు. ఆ విషయం తూర్పుగోదావరి జిల్లా పిడింగొయ్యి పంచాయతీలో జరిగిన అవినీతి వ్యవహారంలో కమిషనర్ ఇచ్చిన లేఖలోనే ఈమెను ఎంపీడీఓగానే కమిషనర్ గిరిజాశంఖర్ కూడా పేర్కొన్నారు. అలాంటిది చేయని హోదా చేసినట్టు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో అర్ధం కాని ప్రశ్నగా మారింది.  ఈ ఎంపీడీఓ చేయని హోదాలో పనిచేసినట్టుగా ప్రకటించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జిల్లాలో డీపీఓగా జాయినింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ విధంగా ప్రజాప్రతినిధుల దగ్గర చెప్పినమ్మించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా 73,53,720 రూపాయలకు ఎంపీడీఓ ఎస్.సుభాషిణిని బాధ్యురాలిని చేయాలని కూడా కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం, ఈమె అవినీతిపై వచ్చిన వార్తలు, విశాఖలో డీపీఓగా చేరాలని ప్రయత్ని విఫలయత్నం చేసిన అంశం, జిల్లా  మంత్రి తిరస్కరించిన అంశం, ఈ తరుణంలో ఓ పత్రికకు పరువునష్టం దావా వేసిన అంశం యొక్క ఆధారాలన్నీ విజయగనం జిల్లాలోని కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను తప్పుదారి పట్టించే విధంగా చేసే అధికారిణి కమిషనరేట్ లో జిల్లా పంచాయతీ అధికారిణిగా ఎలా ఉత్తర్వులు ఇచ్చారనేది, ఆపై జిల్లాలో ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది..ఈ విషయంలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాలి..!

విజయనగరం

2021-05-28 15:31:30

జిల్లా పంచాయితీ అధికారిణిగా సుభాషిణి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా పంచాయితీ అధికారి(ఎఫ్ఏసీ)గా ఎస్‌.సుభాషిణి శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆమె ఇంత‌కుముందు తూర్పుగోదావ‌రి జిల్లాలో డిప్యుటీ డైరెక్ట‌ర్ హోదాలో, ఎంపిడిఓగా విధులు నిర్వ‌హిస్తూ జిల్లాకు డిపిఓగా బ‌దిలీపై వచ్చారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను క‌లిసి, అనుమ‌తి తీసుకున్న అనంత‌రం, స్థానిక పంచాయితీ కార్యాల‌యంలో విధుల‌ను చేప‌ట్టారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా, స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన‌ సేవ‌లను అందించేందుకు కృషి చేస్తామ‌ని, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు ప‌రుస్తామ‌ని, కోవిడ్ నిర్మూల‌నా కార్య‌క్రమాల‌ను వేగ‌వంతం చేస్తామ‌ని, ఈ సంద‌ర్భంగా సుభాషిణి తెలిపారు.

Vizianagaram

2021-05-28 14:21:56

సింహాద్రి అప్పన్నకు అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత రెండవ సారి స్వామికి చందనం సమర్పించిన స్వామివారిని మంత్రి దర్శించుకుని, ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు.  ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి  ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

Simhachalam

2021-05-28 14:02:13

ఆదివారం మాంసం అమ్మకాలు నిషేధం..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధిస్తున్నాట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

GVMC office

2021-05-28 13:54:14

పార్కు అభివ్రుద్ధి కౌన్సిల్ ఆమోదం పొందింది..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఇటీవల ముడసర్లోవ పార్కు అభివృద్ధి కి సంబంధించి రాజ్యసభ సభ్యులు   విజయసాయి రెడ్డి, జివిఎంసి కమిషనర్, విఎంఆర్ డి ఎ కమిషనర్, జాయింట్ కలక్టరు, ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు. ఈ పర్యటనకు సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయానని తెలిపారు. జనసేన పార్టి కార్పొరేటర్  పి.ఎల్.వి. నారాయణమూర్తి సామాజిక మాధ్యమాలలోను, కొన్ని మీడియా గ్రూపులలోను కార్పొరేటర్లు మరియు అఫీసర్సు వాట్స్ యాప్ గ్రూపులలోను ముడసర్లోవ పార్కు అభివృద్ధి పై జరిగిన పర్యటనపై అసత్య ఆరోపణలు చేసారని వాటిని ఖండిస్తున్నానని మేయర్ తెలిపారు. ముడసర్లోవలోని పర్యటనకు ముందస్తు సమాచారం ఉందని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు వలన మీటింగుకు హాజరు కాలేకపోయానని, ముడసర్లోవ పార్కుకు సంబంధించిన డి.పి.ఆర్.ను కౌన్సిల్ ఇప్పటికే ఆమోదించిందని తెలిపారు. ఈ ఆమోదానికి లోబడి మాత్రమె పార్కును సందర్సించడమైనదని, కాబట్టి ఇందులో ఎటువంటి కుట్రలు మరియు కబ్జాలు లేవని, చేయవలసిన అవసరం కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వారికి లేదని ఇందుమూలంగా తెలియజేయడమైనదని, ఈ విషయంపై ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత అధికారులతో చర్చించి స్పష్టత తీసుకోనవచ్చునని మేయర్ తెలిపారు.  

Visakhapatnam

2021-05-28 13:48:28

అర్హులందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలి..

విశాఖ జిల్లాలో  45 సం.లు దాటిన వారందరూ కోవిడ్ టీకా తప్పక వేయించుకోవాలని జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరెడ్డి పిలుపు నిచ్చారు.  శుక్రవారం ఆయన పరవాడ, అచ్యుతాపురం లలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాలను పరిశీలించారు. వాక్సినేషన్ కు వచ్చినపుడు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని,  మాస్కు ధరించాలన్నారు.  టీకా వేసుకున్న తరువాత  కూడా కరోనా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.  ప్రజలందరికీ ఈ విషయాలపై క్షుణ్ణమై అవగాహ కలిగించాలని అధికారులను ఆదేశించారు.   ముందుగా ఆయన  పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వాక్సినేషన్ ను పరిశీలించారు.  అనంతరం  అచ్యుతాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.  వాక్సినేషన్ జరుగుతున్న తీరును గూర్చి వైద్యాధికారులతో మాట్లాడారు.  వారికి సూచలు చేశారు.  జేసీ వెంట  అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Paravada

2021-05-28 13:41:33

అప్పన్నకు సేవచేసే యోగం రావడం ఎంతో అదృష్టం..

దేవాలయాల్లో సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని
 రాష్ట్ర  పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల సింహాచలం ట్రస్టుబోర్డుకి ప్రత్యేక ఆహ్వానితులు నియమితులైన సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కలిసి మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు అద్యాత్మిక, ప్రశాంతతకు మారు పేరు అని అన్నారు. అంతేకాకుండా ఆ భగవంతుని సేవ చేసుకోవడానికి  సభ్యులకు చక్కని అవకాశం కలిగిందన్నారు.  సభ్యులు దేవున్ని స్మరించుకుంటూ భక్తులకు మెరుగైన సేవలందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి అందరు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీసుబాబు , మేడిద మురళీకృష్ణ , దశమంతుల మాణిక్యాలరావు మంత్రికి సింహాద్రినాధుడి జ్ఞాపికను బహుకరించి స్వామివారి శేషవస్త్రాన్ని అందజేశారు.

Seethammadara

2021-05-28 09:18:45

తక్షణమే కాలువలు శుభ్రం చేయండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లోని కాలువలు తక్షణ శుభ్రం చేయాలని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఐదవ జోన్, 61వ వార్డు నందు పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. రోడ్లను, కాలువలను శుభ్రం చేసి వెంటవెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని శానిటరి సూపర్వైజర్ ను ఆదేశించారు. కాలువలలోను,   రోడ్లపైన ఎక్కడా చెత్త కనిపించకూడదని, ప్రతిరోజూ  శానిటరి ఇన్స్పెక్టర్ మరియు వార్డు సచివాలయ శానిటరి  కార్యదర్శిలు వారి పరిధిలోని రోడ్లను, కాలువలను పరిశీలించాలని, పారిశుద్ధ్య సిబ్బందికి తడి-పొడి చెత్త వేరువేరుగా తీసుకునే విధంగా  సూచనలు ఇవ్వాలని, స్థానిక ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని, రోడ్డుపైన, కాలువలలోను చెత్త వేసినచో   ఆ చుట్టు ప్రక్కల ఉన్నఇళ్లకు, దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతీ దుకాణం ముందు మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు దృష్టిలో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా, కుండీలలోని నీరు ఎక్కువకాలం నిల్వ ఉంచకూడదని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఇంటి ఆవరణలో కొబ్బరి బొండాలు గాని, ప్లాస్టిక్ వస్తువులు గాని లేకుండా చూడాలని, పూల కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిని ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-05-27 17:25:12

ప్రారంభమైన మొటి డోసు కోవిడ్ టీకా..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేస్తున్నట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, ఆరిలోవ, మల్కాపురం FRU సెంటర్ల లోను, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేస్తున్నట్టు తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేయించుకుని 84 రోజులు పూర్తయిన వారికి రెండవ డోస్ వేయడం జరుగుతుందని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా, ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని 45సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించి, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్ తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద రద్దీ దృష్ట్యా పోలీసుల సహాయం తీసుకోవాలని, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి ని ఆదేశించారు.    

GVMC Park

2021-05-27 17:22:16

పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య నిర్వహణ..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పిన్ పాయింట్ విధానంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఐదవ జోన్ 44వ వార్డు పరిధిలోని  రామచంద్ర నగర్ తదితర ప్రాంతాలలో  కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని ఉండేలా చూడాలని ఎఎంఓహెచ్ ను ఆదేశించారు. ఎవరికి నిర్దేశించిన పాయింట్ లో వారే విధులు నిర్వహించాలని, ఒక్కొక్క పిన్ పాయింట్ లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని వారిని సర్దుబాటు చేయాలని వారే డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని తెలిపారు.  తడి-పొడి చెత్త వేరువేరుగా తీసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరువేరుగా ఇచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలని ఆవిధంగా ఎవరైనా చెత్త వేసినచో ఆ చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ళకు మరియు దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని, ప్రతి దుకాణం ముందు డస్ట్    బిన్లు ఉండేలా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రజల కోరిక మేరకు ఎవరైనను యుజిడి కనెక్షన్ తీసుకుని లేనియెడల వారికి కొత్తగా కనెక్షన్ ఇవ్వాలని పర్యవేక్షక ఇంజనీర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అయిదవ జోనల్ కమిషనర్ సింహాచలం,  పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాలరావు, ఎఎంఓహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజనీర్ (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2021-05-27 17:19:54