1 ENS Live Breaking News

కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం

కొండ శిఖర , మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు మండలం నందా - పగులుచిన్నూరు రోడ్ నుంచి చోర గ్రామం మీదుగా కొదమ వరకు అర్.సి.పి.ఎల్.డబ్ల్యు.ఇ నిధులు అంచనా వ్యయం రూ.11.36 కోట్లతో సుమారు 10.8 కిలోమీటర్ల మేర బిటి రోడ్ నిర్మాణానికి జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమక్షంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర శుక్ర వారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైదానం ప్రాంతం వలే కొండ శిఖర, మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారులు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గిరిజనులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు ఎక్కడా జాప్యం లేకుండా చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. యువకులు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కొండ ప్రాంతంలో గ్రామ సచివాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. 

కొన్ని రహదారి పనులు ఫారెస్ట్ అనుమతుల కోసం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే వాటిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన గిరిజనులకు అటవిహక్కు భూపట్టాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. వైద్యం, విద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తుద్ధితో పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గ్రామానికి రహదారులు కల్పించాలన్న  ఎన్నో దశాబ్దాల గిరిజనుల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు.  జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం ఆకాక్షిస్తుందన్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడాలని తద్వారా అభివృద్ధి కానవస్తుంది చెప్పారు. జిల్లా పరిషత్ నుండి తాగు నీరు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పనకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలకు అండగా ఉండే ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన చెప్పారు. 

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 
మాట్లాడుతూ కొదమ రహదారికి అనుసంధానం చేస్తూ 22 గ్రామాలకు రహదారులు నిర్మించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. తద్వారా రెండు వేల జనాభాకు చక్కని రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రూ.180 కోట్లతో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. రహదారుల నిర్మాణం వలన సామాజిక, ఆర్థిక అభివృద్ధి వస్తుందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి పద్మావతి, మక్కువ జెడ్ పిటిసి డి. శ్రీనివాస రావు, కొదమ ఎంపిటిసి, సర్పంచ్ లు కూనేటి గిందే, తాడంగి సుసుమ,  పంచాయితి రాజ్ ఈ ఈ డా,ఎమ్.వి.జె. కృష్ణాజి,  గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ఓ.ప్రభాకర రావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్ర రావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతిశ్వర రావు, తాసిల్దార్ రామ స్వామి, ఎమ్ పి డి ఓ పి.పార్వతీ, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-08-26 13:19:25

మంత్రి మెరుగు నాగార్జున జిల్లాకు రాక

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున ఈ నెల 27వ తేదీ శనివారం మధ్యాహ్నం జిల్లాకు వస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు నగరంలోని జెడ్పీ అతిథి గృహానికి చేరుకొని మధ్యాహ్నం 4.00 గంటలకు డి.ఎస్.డబ్ల్యు.ఓ., ఇ.డి., ఎస్.సి.కార్పొరేషన్, జిల్లా అంబేడ్కర్ గురుకులాల సమన్వయ అధికారులతో జెడ్పీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 వరకు నగరంలోని ఎస్.సి.లబ్దిదారులకు మంజూరు చేసిన యూనిట్లను, వారికి కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ లను, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ను పరిశీలిస్తారు. సాయంత్రం 7 గంటలకు విశాఖ బయలుదేరి వెళ్లనున్నారు.

Vizianagaram

2022-08-26 13:14:27

ఆర్.బి.కే స్థాయిలో సమావేశాలు జరగాలి

రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశం విధిగా జరగాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు అన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. నెలలో మొదటి శుక్ర వారం ఆర్.బి.కె స్థాయిలో, రెండవ శుక్ర వారం మండల స్థాయిలో జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ కు బిందు సేద్యం అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ పంట మార్పిడి విధానంపై రైతులను చైతన్య పరచాలని చెప్పారు. వన్ ధన్ కేంద్రాల ద్వారా పంటలకు కొంత సహాయ సహకారాలు అందించుటకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ ఏడాది ధాన్యం సేకరణలో సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎరువుల విక్రయంలో అవకతవలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఏనుగుల వలన కలుగుతున్న పంట నష్టానికి తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిలో సలహా మండలి సమావేశం పక్కాగా జరగాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో అన్ని గ్రామాలకు సబ్సిడీ ఒకే విధంగా ఉండాలని ఆమె కోరారు. ధాన్యం సేకరణలో సమస్యలు లేకుండా చూడాలని ఆమె అన్నారు. రైతులకు సెరీకల్చర్ దిశగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 

జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇ పంట నమోదు 56 వేల ఎకరాలలో జరిగిందన్నారు. సెప్టెంబరు 10 వరకు నమోదుకు గడువు ఉందని చెప్పారు. రోజుకు 50 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 2,31,324 లక్షల ఎకరాల  వ్యవసాయ భూమి, 99,905 ఎకరాల ఉద్యాన పంటల భూమి వెరసి 3,31,226 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,87,784 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ లో 22,759 క్వింటాళ్ల వరి, 1902 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. 48,700 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయుట లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 36,915 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఎరువులు అక్రమంగా విక్రయించే వారిపైన, ఎక్కువ ధరలకు విక్రయించే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అక్రమాలపై వచ్చే పిర్యాధులపై విచారణ చేస్తామని ఆయన చెప్పారు. కిసాన్ డ్రోన్లను మండలానికి మూడు చొప్పున మంజూరు అయ్యాయని, ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు పైలట్ శిక్షణకు దరఖాస్తు చేయవచ్చని ఆయన వివరించారు. 

సలహా మండలి సభ్యులు పారి నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏనుగుల వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని, వాటి వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర సభ్యులు మాట్లాడుతూ పాలకొండలో గతంలో సొసైటీకి వెళ్లి ఎరువులు తీసుకునే వారమని, అదే విధానం కొనసాగితే మంచిదని కోరారు. ఈ సలహా మండలి సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య, ఇపిడిసిఎల్ డిఇ కె. వెంకట రత్నం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి. నాయక్, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-26 13:11:13

మందస ఎం.ఇ.ఓ కి షోకాజ్ నోటీస్ జారీ

కన్సిస్టెంట్  రిధం పనులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి, పనుల నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లాలో నిర్వహిస్తున్న కన్సిస్టెంట్  రిధం పనుల పురోగతిపై నందిగాం, సంతబొమ్మాళి, మందస, సోంపేట , రణస్థలం మండలం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎ.ఎన్.ఎం, మహిళా పోలీసులు తమ పరిధిలో ఉన్న పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన పరిశీలించి కన్సిస్టెంట్  రిధం యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందు నిమిత్తం పాఠశాల నిధుల నుండి గాని గ్రామ పంచాయతీ నిధుల నుండి పరిష్కరించాలని. మీ స్థాయిలో పరిష్కారం కానీ పనుల పరిష్కారానికి పై అధికారులకు పంపించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. నేటికీ చేట్టిన పనులపై పాఠశాలల వారీగా నివేదికలు చూపించాలని అదేశించారు. పనుల నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు. అలాగే పనుల నిర్వహణలో అత్యధిక పెండెన్సి శ్రీకాకుళం జిల్లా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణలో పురోగతి చూపని మందస ఎం.ఇ.ఓ కి షోకాజ్ నోటీస్ జారీ చేయమని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పరిషత్ సి.ఇ ఓ వెంకటరమణ, నందిగాం, సంతబొమ్మాళి, మందస, సోంపేట, రణస్థలం, హిరమండలం మండలాల ఎం.పి డి.ఓ లు, మండల విద్యాశాఖాధికారులు హాజరయ్యారు.

Srikakulam

2022-08-26 12:49:44

నిస్వార్ధ సేవకు ప్రతిరూపం మదర్ థెరిస్సా

నిస్వార్ధ సేవకు, మానవత్వపు విలువలకు ప్రతిరూపంగా మదర్ థెరిస్సా నిలుస్తారని జిల్లా ఫారెస్ట్ అధికారి నరేంధ్రన్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో కొలువుదీరిన మదర్ థెరిస్సా 112వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మదర్ థెరిస్సా విగ్రహానికి డిఎఫ్ఓ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితాన్ని అనాధలు, చిన్నారులు సేవకు అంకితమిచ్చిన మహనీయురాలు మదర్ థెరిస్సా అన్నారు. విదేశాల్లో జన్మించి భారతదేశంలో ఆపన్నుల సేవకు తపించిన మానవతామూర్తిగా ఆమె పేరుగాంచారని డిఎఫ్ ఓ తెలిపారు. ప్రేమ, దయ, సేవ మనిషి జీవిన విధానంగా మలుచుకోవడమే నిజమైన నివాళి అని నరేంధ్రన్ అన్నారు. భావితరాలకు సేవ, మానవత్వం
పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని గాంధీ మందిరం నిర్వాహకులు నటుకుల మోహన్ డిఎఫఓ కు వివరించారు. అనంతరం శ్రీకాకుళం నగరంలోని మదర్ థెరిస్సా హోమ్ ఆశ్రయం పొందుతున్నవారి కోసం రూ.15 వేలు విలువచేసే నిత్యావసర సరుకులను డిఎఫ్ ఓ తన తరపున అందజేశారు. గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డిఎఫ్ ఓ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జామి భీమశంకర్, నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్, బాఠాన దేవభూషణ్, జీఎన్ జ్యూయలరీ అధినేత గుడ్ల శ్యామ్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, నక్క గౌరీశంకరరావు, గుత్తు చిన్నారావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2022-08-26 06:35:19

ens న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లు కావలెను

భారతదేశపు తొలితెలుగు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ కి ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో పనిచేసేందుకు జిల్లా రిపోర్టర్లు, కెమెరామాన్లు, అడ్వర్ టైజ్ మెంట్ మేనేజర్లు కావలెను. కనీసం డిగ్రీ చదివి ఉండి.. తెలుగులో వార్తలు కంపోజ్ చేయగల సామర్ధ్యం, సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన కలిగిఉండాలి. యాడ్స్ మేనేజర్లకు అన్ని రకాల ప్రకటనలు సేకరించడంలో అవగాహన ఉండాలి. ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యంతో పాటు ఆకర్షణమైన జీతం, టార్గెట్లు ఉంటాయి.

Visakhapatnam

2022-08-26 03:02:36

హరిదాసులు హిందూ ధర్మ ప్రచారకులు

హరిదాసులు గ్రామాల్లో సనాతన హిందూ ధర్మ ప్రచారకులని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం నుంచి ప్రారంభించిన శ్రీవారి  త్రైమాసిక మెట్లోత్సవ శోభా యాత్ర మూడవ సత్రాల వద్దకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జెఈవో మాట్లాడారు.  హిందూ ధర్మప్రచారంలో దాస సాహిత్య ప్రాజెక్టు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 7200 భజన మండళ్లు ఉన్నాయన్నారు. వీరందరూ తమ గ్రామ పరిధిలో ఉన్న మిగిలిన అన్ని భజన మండళ్లను కలుపుకుని ప్రతి గ్రామంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని యువత తో పాటు చిన్నారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  ఆనంద తీర్థ  జెఈవోను సన్మానించారు.


Tirupati

2022-08-25 14:34:09

ప్లాస్టిక్ పై సమరానికి సర్వం సిద్దం

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని  తరిమికొట్టేందుకు నేడు తొలి అడుగు పడబోతోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, పార్లే స్వచ్ఛంద సంస్థ అంకురార్పణ చేయబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సుమారు 25 వేల మంది వాలంటీర్లు స్థానిక హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న 28 కిలోమీటర్ల నిడివి గల తీర ప్రాంతాల్లో ఉన్న  ప్లాస్టిక్ని  సేకరించి పార్లే సంస్థకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో శుక్రవారం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమాలు జరిగే ఏ.యూ కన్వెన్షన్ సెంటర్, ఏ.యూ కాన్ఓకేషన్ హాల్ లోని ఏర్పాట్లను మంత్రులు అమర్ నాథ్ , ఆదిమూలపు సురేష్,  ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్  తలశిల రఘురామ్ తదితరులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ, బీచ్  ప్లాస్టిక్ వలన జలచరాలు చనిపోతున్నాయని, అంతే కాకుండా పర్యావరణనికి హాని కలుగుతోoదని అన్నారు. 974 కి.మీ. తీర ప్రాంతoతో పాటు రాష్ట్రంలోని నదులలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించే ప్రక్రియ చేపడతామని మంత్రి అమర్ నాథ్ తెలియజేశారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ ను  పార్లే సంస్థకు అప్పగిస్తామని, ఆ ప్లాస్టిక్ ని  రీసైకిల్ చేసి అదిదాస్ సంస్థ ద్వారా  పాదరక్షల తయారీకి వినియోగం ఇస్తారని అమర్ నాథ్ వివరించారు.

 పార్లే సంస్థ అనేక దేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని అన్నారు. అయితే శుక్రవారం విశాఖ లో  సేకరించే ప్లాస్టిక్  ప్రపంచ రికార్డును సృష్టించ బోతోoదని ఆయన చెప్పారు. ఇక పార్లే సంస్థ ప్లాస్టిక్  రీసైకిల్ కి  25 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయమని కోరిందని, విశాఖ, అనకాపల్లిలో  భూములు చూపించామనీ, వారు ఎంచుకున్న చోట స్థలాన్ని  కేటాయిస్తామని అమర్ నాథ్ చెప్పారు. ఇదిలా వుండగా మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1,62,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనున్నారని, ఇప్పటివరకు 36000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, వారికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సర్టిఫికెట్లు అందచేయనున్నారని అమర్ నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో  నగర పాలక సంస్థ కమిషనర్ లక్ష్మిస,ఎమ్మెల్సీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-25 14:31:30

ఆర్.డి.ఓ.లు తహశీల్దార్ లకు కొత్త నెంబర్లు

విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ ల ఆర్.డి.ఓ.లు, 26 మండలాల తహశీల్దార్ లకు అధికారిక మొబైల్ నెంబర్ లు కేటాయిస్తూ వారికి ప్రభుత్వం తరపున సిమ్ కార్డులు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్  ఏ సూర్యకుమారి తెలిపారు. జిల్లా ప్రజానీకం రెవెన్యూ అధికారులను వివిధ సమస్యలపై సంప్రదించేందుకు ఈ అధికారిక ఫోన్ నెంబర్ లను వినియోగించ వచ్చని పేర్కొన్నారు. ఈ నంబర్ లకు వాట్సప్ కూడా ఏర్పాటు చేసుకొని జిల్లా యంత్రాంగం తోను, ప్రజలతోను దైనందిన అధికార కార్యకలాపాల్లో ఈ నంబర్ లనే వినియోగించాలని కలక్టర్ అధికారులకు సూచించారు. ఆయా రెవెన్యూ డివిజన్, మండలాల తహశీల్దారు లకు కేటాయించిన నంబర్లు ఆయా అధికారులు వేరొక చోటుకు బదిలీ అయినప్పటికీ మండలంలో అదే నంబర్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్, తహసిల్దార్ ల కొత్త మొబైల్ ఫోన్ నెంబర్ లు ఈ ప్రకటనకు జత చేయడం జరిగింది.

Vizianagaram

2022-08-25 14:12:15

దిగులు పడకండి పంటలన్నీ కొంటాం

ఏం దిగులొద్దు మీరు పండించిన పంటలకు  మద్దతు  ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని టీటీడీ చైర్మన్   వైవి  సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతుకు భరోసా ఇచ్చారు. టీటీడీ శ్వేతా భవనం లో  గురువారం గోశాలల నిర్వాహకులు , ప్రకృతి వ్యవసాయ దారుల శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్నారు . అనంతరం శ్వేతా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా  తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన రైతు   జలగం శ్యామ్ టీటీడీ చైర్మన్ తో  మాట్లాడారు . తాను గో ఆధారిత వ్యవసాయం తో బియ్యం, కొన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానని చెప్పారు . ఖర్చు ఎక్కువ అవుతోందని , మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని వాపోయారు . బియ్యం కొనుగోలు చేయడానికి  జనం పెద్దగా ముందుకు రావడం లేదని , అయినా తాను ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నానని ఆవేదన చెందారు . ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే బియ్యం , బెల్లం ,సెనగలు లాంటి పంటలను టీటీడీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు . శ్యాం వద్ద ఉన్న పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు . మరింత మంది రైతులను ప్రోత్సహించాలని  శ్యామ్ కు సూచించారు.  చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన రైతు శ్రీ శేషాద్రి రెడ్డి  రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకుండా తయారు చేసిన బెల్లం చైర్మన్ , ఈవో కు రుచి చూపించారు . తమకు మద్దతు ధర ఇచ్చి చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు.

    ఈ  సందర్బంగా రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నవధాన్యాలు , ఆకు కూరలు , కూరగాయలతో వేసిన ముగ్గును చైర్మన్ పరిశీలించారు. అంతకు ముందు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నోడల్ గోశాలల నిర్వాహకులు  శశిధర్ (నంద గోకులం గోశాల నెల్లూరు )  హరి ప్రభు ( ఇస్కాన్ గోశాల చిన్న గొట్టిగల్లు )  హరి కృష్ణ స్వామి (ముక్తి ధామం గోశాల దువ్వూరు వై ఎస్ ఆర్ జిల్లా )   వెంకట రాఘవులు (ఉంగుటూరు పశ్చిమ గోదావరి జిల్లా ) కు  చైర్మన్ ,టీటీడీ ఈవో పంచగవ్య  మెడిషనల్ కిట్ అందించారు.

Tirumala

2022-08-25 13:59:28

అక్టోబరు నుంచి శతశాతం చెత్తసేకరణ

ఇంటింటి చెత్త సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు నాటికి శ‌త‌శాతం జ‌ర‌గాల‌ని, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ శాంతి ప్రియ పాండే ఆదేశించారు. దీనికోసం ఇప్ప‌టినుంచే అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాల‌ని సూచించారు. విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాలకు చెందిన‌ ఎంపిడిఓలు, ఈఓపిఆర్‌డిలు, గ్రామ కార్య‌ద‌ర్శుల‌కు స్థానిక జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో గురువారం వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ప‌లు అంశాల‌ను వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ శాంతి ప్రియ పాండే మాట్లాడుతూ, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పంలో భాగంగా చేప‌ట్టిన క్లాప్‌ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం, రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి కి ఎంతో ప్రియ‌మైన‌ద‌ని పేర్కొన్నారు. ఇది సంపూర్ణంగా విజ‌య‌వంతం కావాలంటే, ప్ర‌జ‌ల దృక్ఫ‌థంలో మార్పు తేవాల‌ని, అందుకు అధికారులు కృషి చేయాల‌ని కోరారు. ప్ర‌స్తుతం సుమారు 60 శాతం ఇళ్ల నుంచి మాత్ర‌మే చెత్త సేక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని, అక్టోబ‌రు నాటికి శ‌త‌శాతం జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప్ర‌తీ ఇంటికీ రెండు చెత్త బుట్ట‌ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని, వాటిని స‌క్ర‌మంగా వినియోగించేలా చైత‌న్య ప‌ర‌చాల‌న్నారు. ప్ర‌తీ ఇంటినుంచి చెత్త‌ను సేక‌రించ‌డంతోపాటు, వాటిని త‌డిచెత్త‌, పొడిచెత్త‌గా విభ‌జించి, త‌డిచెత్త‌నుంచి సేంద్రీయ ఎరువును త‌యారు చేయాల‌న్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్‌డ‌బ్ల్యూపిసి కేంద్రాల‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాల‌ని, అవి లేనిచోట తాత్కాలిక ఏర్పాట్లు ద్వారానైనా ఎరువును ఉత్ప‌త్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. సేక‌రించిన ప్లాస్టిక్‌ను నిర్ధేశిత కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని, ప్లాస్టిక్ ర‌హిత గ్రామాలుగా రూపొందించాల‌ని సూచించారు.

               సిరా (స‌ర్వైలెన్స్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ రెస్పాన్స్ అనాల‌సిస్‌) ప్రాధాన్య‌త‌ను క‌మిష‌న‌ర్ వివ‌రించారు. పారిశుద్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం ఎంత ముఖ్య‌మో, వాటిని జెఎస్ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. క్షేత్ర‌స్థాయిలో చోటుచేసుకున్న లోపాల‌ను తొల‌గించడానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. పారిశుధ్యం అన్న‌ది ఒక అత్య‌వ‌స‌ర కార్య‌క్ర‌మని, ఇది సాంకేతిక ప‌ద్ద‌తుల్లో చేయాలే త‌ప్ప‌, సొంత ప‌ద్ద‌తుల‌ను అవ‌లంబించ‌వ‌ద్ద‌ని సూచించారు.  ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయ‌డం, వీడియో కాల్‌ ద్వారా ప‌ర్య‌వేక్షించ‌డం, సిటిజ‌న్ యాప్ ద్వారా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించ‌డం చేయాల‌న్నారు. త‌ర‌చూ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకొని, పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత మెరుగుప‌ర్చుకోవాల‌ని సూచించారు. అధికారులు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకొని పారిశుధ్యాన్ని ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. ఎంపిడిఓలు క‌నీసం రెండు నుంచి మూడు గ్రామాల‌ను, ఈఓపిఆర్డీలు, డిఎల్‌పిఓలు ఐదు గ్రామాల‌ను, డిపిఓ, జెడ్‌పి సిఇఓలు రెండు గ్రామాలు చొప్పున ద‌త్త‌త తీసుకోవాల‌ని కోరారు. గ్రామ కార్య‌ద‌ర్శ‌లు తాము ప‌నిచేస్తున్న గ్రామాల‌ను ద‌త్త‌త గ్రామాలుగా భావించి, అంకిత‌భావంతో పారిశుద్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు.

                ఈ వ‌ర్క్‌షాపులో జిల్లా పంచాయితీ అధికారి ఎస్‌.ఇందిరా ర‌మ‌ణ‌, జెడ్‌పి డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, శ్రీ‌కాకుళం జిల్లా జెడ్‌పి సిఇఓ రావాడ రామ‌న్‌, పంచాయితీ అధికారి వి.ర‌వికుమార్‌,  ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-25 13:32:43

నేతన్న నేస్తం పధకంతో 706 మందికి లబ్ధి

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద రాష్ట్రంలో అర్హులైన వైఎస్ ఆర్ నేతన్న నేస్తం" లబ్ధిదారులకు వరుసగా నాలుగవ  ఏడాది ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని  కృష్ణా జిల్లా,  పెడన మండలం తోటమూల గ్రామం నుండి గురువారం  బటన్ నొక్కి నగదు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జమ చేశారు. ఈ కర్యంక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియం లో లైవ్ ఏర్పాటు గావించారు.  ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, చేనేత శాఖ ఏ.డి మురళీ కృష్ణ, చేనేత కార్మికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమ చేసిన అనంతరం జిల్లాకు చెందిన 706 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 24 వేల రూపాయలు చొప్పున మొత్తం ఒక కోటి  81 లక్షల  రూపాయల  మెగా చెక్కును జిల్లా  కలెక్టర్, చైర్మన్ చేతుల మీదుగా  అందజేశారు. 

 అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీని వాస రావు మీడియా తో మాట్లాడుతూ  ఇచ్చిన మాట ప్రకారం నేతన్నలకు  వరుసగా నాల్గవ సారి కూడా  ఆర్ధిక సహాన్ని అందించడం ముఖ్య మంత్రి గారి చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. అంతే కాకుండా నేతన్నల శ్రమ, ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని వారికి  50 ఏళ్ళు నిండగానే  పింఛన్ సదుపాయాన్ని క్షల్పించిన  ముఖ్యమంత్రి కి బీసీ లందరూ అండగా నిలవాలని కోరారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కోన్నారు. నేతన్న నేస్తం క్రింద అందిన ఆర్ధిక సహాయం తో మగ్గాలు,అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని కొనుక్కొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. గతంలో పనిచేసిన  ప్రభుత్వం బలహీన వర్గాలను విస్మరించారని, బాధ్యత గా వ్యవహరించక పోవడం వలనే మరింత బలహీనులయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను , సమస్య లను గుర్తిస్తూ పని చేస్తున్నామని, అందుకు ప్రజలు మద్ధతు తెలపాలని కోరారు.

Vizianagaram

2022-08-25 13:30:13

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన  కాకినాడ 9వ డివిజన్‌ గొడారిగుంట సీతారామనగర్‌తోపాటు సాంబమూర్తినగర్‌ ప్రాంతాల్లో ఎంహెచ్‌వో డాక్టర్‌ ఫృద్వీచరణ్‌తో కలిసి పర్యటించారు. అక్కడక్కడ డెంగీ కేసులు నమోదు అవుతున్న నేపద్యంలో ఆయా ప్రాంతాల్లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్, దోమలు వృద్ధి చెందకుండా తీసుకుంటున్న చర్యలను కమిషనర్‌ సమీక్షించారు. స్వయంగా దోమల నియంత్రణ కోసం చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  దోమల నియంత్రణ, కు నగరపాలక సంస్థ ద్వారా తీసుకునే చర్యలకు తోడు ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన నీటిలో డెంగీ కారక దోమ వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగించి పక్కన పెట్టిన కొబ్బరి బొండాలు, టైర్లు, పూలకుండీలు వంటిచోట్ల వర్షపునీరు నిలిచి ఉంటే అక్కడ  డెంగీ కారక దోమ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.  ఎప్పటికప్పుడు అటువంటి నీటిని తొలగించడంతోపాటు  స్వచ్ఛమైన నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఏఏ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఉందో సంబంధిత ఎఎన్‌ఎంలు, మెడికల్‌ ఉద్యోగులు ద్వారాను, యాప్‌లు ద్వారా గుర్తిస్తున్నామన్నారు. వెంటనే గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ చెప్పారు.

Kakinada

2022-08-25 12:59:18

స్పందన పై 2రోజులు శిక్షణా తరగతులు

స్పందన వినతులు పరిష్కారంపై ఆగస్టు 30, సెప్టెంబరు 1వ తేదీన రెండు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారంపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో గ్రామ, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శిక్షణా తరగతులు నిర్వహించాలని అన్నారు. శాఖల వారీగా ఎక్కువగా వచ్చే వినతులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. వాటిని పక్కాగా, నాణ్యతతో పరిష్కారానికి సమగ్రమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన చెప్పారు. శిక్షణ అనంతరం స్పందన వినతులు పరిష్కారంలో సంతృప్తికర వాతావరణం రావాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపి సంతృప్తి చెందాలని ఉద్బోధించారు. ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో శాఖలు చేపడుతున్న చర్యలను గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుండి స్వయంగా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది నుండి అందరికీ స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-25 12:25:22

శత శాతం పనులు గ్రౌండింగ్ కావాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు క్రింద మంజూరైన భవన నిర్మాణ పనులు శత శాతం గ్రౌండింగ్ కావాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు. విద్యాశాఖ మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనుల పురోగతిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్  సురేష్ కుమార్ తో కలసి  గురువారం  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రభుత్వ  జూనియర్ కళాశాలలు, అంగన్వాడి, పాఠశాల భవనాలు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పాలనా అనుమతులు, రివాల్డింగ్ ఫండ్ జమ చేయాలని అన్నారు. లక్ష్యాల పూర్తికి పనుల వేగం పెంచాలన్నారు.   స్కూల్ నిర్వహణ నిధులతో పాటశాలల మరామత్తులను చేపట్టేందుకు వినియోగించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నాడు నేడు క్రింద మంజూరైన పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ గౌరీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఓ.ప్రభాకర రావు,  గిరిజన సంక్షేమ శాఖ ఈఈ జె. శాంతిశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-25 12:22:55