1 ENS Live Breaking News

ఆ వీఏఏల సమాధానాలు నమ్మసక్యంగా లేవు

కాకినాడ జిల్లాలో ఈ-క్రాప్ నమోదులో భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడిన గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ఇచ్చిన సమాధానాలు నమ్మసక్యంగా లేవని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా ఫోనులో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులకు అవకతవకలకు పాల్పడ్డారనే ప్రాధమిక సమాచారంపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆయనే పేర్కొన్నారు. అందులో శంఖవరం మండలం వీఏఏలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తరువాత ఇచ్చిన సమాధానంతో రెవిన్యూ సిబ్బంది ఇచ్చిన సమాధానాలకు పొంతన కుదరడం లేదని ప్రస్తుతం జిల్లా వ్యప్తంగా విచారణ జరుగుతోందని ఆయన వివరించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనలో కూడా నోటీసులు ఇచ్చిన ప్రాంతాలను తాము కూడా పరిశీలిన చేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు విషయంలో జరిగిన భారీ అవకతవకలపై చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లినట్టు జేడీఏ ఎన్.విజయ్ కుమార్ ఈఎన్ఎస్ కి వివరించారు.

నేటికీ షోకాజ్ నోటీసుల విషయం చెప్పని విఏఏలు
కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ అవకతవకలకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు నేటి వరకూ ఆ విషయాన్ని తాము పనిచేసే సచివాలయ డీడీఓలకు గానీ, మరికొందరు గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు గానీ తెలియజేయక పోవడం విశేషం. నోటీసులు అందుకున్న దగ్గర నుంచి చాలా మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులు సచివాలయాలకు కూడా హాజరు కాకుండా, అటు డీడీఓ  పంచాయతీ కార్యదర్శిలకు కూడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొన్నిచోట్ల గ్రేడ్-5 కార్యదర్శిలకు విషయం తెలిసినా..వారంతా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తుండటం విశేషం. అందునా తప్పుచేసింది వీఏఏలే అన్నట్టుగా..తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే మాట్లాడుతుండటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ శాఖలోని వ్యవసాయశాఖ వీఏఏలు దైర్యంగా ఈ-క్రాప్ బుకింగ్ విషయంలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడటం, అదే సమయంలో సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఈ భారీ స్కామ్ బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  ఇటు జిల్లా అధికారులు ఎంత మొత్తంలో అవినీతి జరిగిందనే విషయాన్ని, ఎంతెంత మొత్తాలకు వీఏఏలకు నోటీసులిచ్చారనే సమాచారాన్ని మీడియాకి తెలియజేస్తే తప్పా జిల్లా వ్యాప్తంగా ఎంతపెద్ద మొత్తంలో ఈ-క్రాప్ అవినీతి జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చూడాలి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ భారీస్కాములో కాకినాడ జిల్లాలో ఎంతమొత్తం వ్యవసాయశాఖ అధికారులు నిగ్గు తేల్చి.. ఎంతమందిని ఇంటికి పంపిస్తారనేది..!

Kakinada

2022-08-23 09:58:15

సింహాద్రి అప్పన్న అత్యంత మహిమాన్వితుడు

సింహాచలంలో శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) అత్యంత మహిమాన్వితుడని రాష్ట్ర గవర్నర్ భిష్వభూషణ్ హరిచందన్ అన్నారు. వరాహా, నారసింహ అవతారాలుతో కూడిన ఆ సింహాద్రినాధుడిని దర్శించుకోవడం భక్తులంతా తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారన్నారు. ఇటీవలే తాను కూడా సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామిని దర్శించుకోవడం జరిగిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.  ఈ మేరకు మంగళవారం  విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు సింహాద్రినాధుడి చందనోత్సవం విశిష్టతను తెలియజేస్తూ అప్పన్న చందనం ప్రసాదాన్ని అందజేశారు. శేష వస్త్రం సమర్పించారు.. అంతేకాకుండా ఆలయ చరిత్రను విపులంగా తెలియజేసే అంశాలుతో పాటు శ్రీ సింహాద్రినారసింహ స్ర్తోత్రమంజరి పుస్తకాలను శ్రీనుబాబు దంపతులు గవర్నర్ కు బహుకరించారు. సింహాద్రినాధుడి జ్ఞాపికను అందజేశారు. వరహా నరసింహ, చందనోత్సవం, నిజరూపం..నిత్య రూపం విశిష్ఠతను విపులము గా అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు. అయితే రాష్ర్ట ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పన్న క్షేత్ర మహత్యంకు సంబంధించి మరింత ప్రచారం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. భక్తుల్లో మరింతగా ఆధ్యాత్మిక భక్తిభావాలు పెంపొందించే విధంగా  తమ ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇటీవల ఆలయానికి భక్తులు తాకిడి ఘననీయంగా పెరిగిందన్నారు. గవర్నర్ ను కలిసి సింహాద్రినాధుడి చందనం ప్రసాదం , శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయడం సంతోషం కలిగించిందన్నారు.

Visakhapatnam

2022-08-23 09:31:07

ఈవీఎం గోదాముల భద్రతకు పటిష్ట చర్యలు

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  డా.కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ, ఎన్నికలు, పోలీసు, అగ్నిమాపక శాఖ‌ల అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. వ‌ర్షాలు తరుచుగా కురుస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని తీసుకోవాల‌ని కలెక్టర్ ఈ సంద‌ర్భంగా సూచించారు.  కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి రమణ, పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు జేవీఆర్.రమేష్, ఎం.జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-23 08:59:23

ఆయన తమ్ముడివా..ఈయన దత్త పుత్రుడివా

ఒక సిద్ధాంతం.. ఆలోచన లేని.. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా  ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా  వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడా? చంద్రబాబు దత్తపుత్రుడా? అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పాలని  అమర్నాథ్ డిమాండ్ చేశారు.సోమవారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు బట్టి  చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు మధ్య డీల్ కుదిరినట్టు అర్థమవుతోందని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడే ఆ పార్టీ చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత పెట్టిన పార్టీ అని అప్పుడే చెప్పామని అమర్ నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి చెయ్యమని పవన్ కళ్యాణ్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019లో జనసేన టీడీపీ నుంచి  రాష్ట్ర ప్రజలు తమను తాము కాపాడుతున్నారని అమర్ ఎద్దేవా చేశారు.  ఆ రోజు ఫలితాలు చూసి తమకు రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్  భావించి ఉంటారని అన్నారు.  చంద్రబాబుతో తాను కలిసి లేనని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్పుకోలేక పోతున్నారని అమర్ నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ మాటలు బట్టి ఆయన చంద్రబాబు ప్రొడక్షన్లో పనిచేస్తున్నారని స్పష్టం అవుతోందని అమర్ నాథ్ అన్నారు.

 ఈ రెండు పార్టీలు వస్తే సంక్షేమ పథకాల నుంచి ప్రజలను దూరం చేస్తారన్నది నిజమని అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా క్షేమం కోసం ఖర్చు చేయలేదని అన్నారు.అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ ఎలా కలిసుండాలని భావిస్తున్నారని అమర్ నాథ్ ప్రశ్నించారు.  జగన్ మోహన్ రెడ్డి లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పార.  ఇవి పవన్ కళ్యాణ్ కి  కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కళ్ళుండీ చూడలేక పోతున్నారని మంత్రి అన్నారు. పరిశ్రమలు రావాలంటే కప్పం కట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను అమర్ నాథ్ తీవ్రంగా ఖండించారు. ఏ పారిశ్రామికవేత్త అయినా ఫలానా నాయకుడికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ డబ్బులు ఇచ్చినట్లు చెప్పగలరా?  అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరినీ బెదిరించ వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడి పవన్ కళ్యాణ్ ఆయన చెంత చేరని అమర్ నాథ్ అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉండగా చిరంజీవి అంటే తమకు ఎంతో అభిమానమని ఆయన పుట్టిన రోజు నాడు ఆయన కించపరిచే విధంగా పవన్ మాట్లాడడం తనకు బాధాకరంగా ఉందని అమర్ నాథ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు  కలత చెంది పవన్ ను కొణెదల పవన్ కళ్యాణ్ అని  పిలవాలా?  లేక నారా నాదెండ్ల పవన్ కళ్యాణ్ అని పిలవాలా? అర్థం కావట్లేదని అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన వచ్చే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి నే  తిరిగి ముఖ్యమంత్రి గా చేయాలని రాష్ట్ర ప్రజలు  నిర్ణయిoచు కున్నారు అని అమర్ నాథ్ స్పష్టం  చేశారు.

Visakhapatnam

2022-08-22 16:08:45

జానపద కళలను కాపాడుకుందాం

గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదని ఏపి రాష్ర్ట భాషా సాంస్కృతిక మండలి ఛైర్మన్ వంగపండు ఉష అన్నారు. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖలోని పౌర గ్రంధాలయంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన వంగపండు ఉష మాట్లాడుతూ, రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు కోసేటప్పుడు, బిడ్డకు తల్లి అన్నం తినిపించేటప్పుడు ఆలపించే గీతాలే జానపదాలన్నారు. తన తండ్రి వంగపండు ప్రసాదరావు ఎక్కడ ప్రజలకు మేలు చేకూరుతుందంటే అక్కడే జానపదంతో వారికి అండంగా నిలేచేవారన్నారు. ఆ రోజుల్లో కనీసం వాయిద్య పరికరాలు కూడా లేవని కేవలం అగ్గిపెట్టితోనే సంగీతం సమకూర్చుకుని ఆలపించేవారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం కళాకారులకు అన్ని విదాల అండగా నిలుస్తుందన్నారు. గత ఏడాది అవార్డులు అందించి ఎంతో మందిలో స్పూర్తి నింపిందన్నారు. ఇక రాష్ర్ట శిష్టకరణం వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కంటి మహంతి అనూషాపట్నాయక్ మాట్లాడుతూ జానపద దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా స్నేహాంజలి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, పూర్వపు ఏడీసీపీ మహ్మద్ ఖాన్, పలు కళాసంస్థల గౌరవ అధ్యక్షులు కొనతాల రాజు, పణిస్వామి తదితరులంతా పాల్గొని కళాకారుల సేవలను కొనియాడారు.

 ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తమ సేవలను గుర్తించి సత్కరించడం తమలో మరింత బాధ్యత పెంచేలా చేసిందని సన్మానగ్రహీతలు నాగభూషణం, నరసింహమూర్తిలు అన్నారు. భవిష్యత్తులో కూడా తాము కళాకారులకు అండగా ఉంటామన్నారు. స్నేహాంజలి ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.ఎన్.మూర్తి సారధ్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇందులో భాగంగానే వంగపండు ఉష తన పాటలతో అలరించగా ప్రముఖ జానపద కళాకారుడు అసిరయ్య తన ఆట, పాటతో కేరింతలు కొట్టించాడు. అంతకు ముందు వ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.  ప్రతీ ఒక్కరూ జానపద కళలను కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సేవా పరులుగా పేరుగాంచిన మాతారికార్డింగ్ సెంటర్ అధినేతలు పల్లి నాగభూషణం, బిన్నాల నరసింహమూర్తులను ఘనంగా సత్కరించారు.  కార్యక్రమానికి భీశెట్టి వెంకటేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

Visakhapatnam

2022-08-22 15:34:30

స్పందన అర్జీలఅలసత్వంపై సహించేది లేదు

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని సహించబోమని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత హెచ్చరించారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగిన స్పందన వేదికలో ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం ద్వారా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచనలు జారీచేశారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన వేదిక అనంతరం అధికారులతో కమిషనర్ వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని కమిషనర్ స్పష్టం చేసారు. స్పెషల్ అధికారులంతా ప్రతీ వారం క్రమం తప్పకుండా తమకు కేటాయించిన సచివాలయాలను సందర్శించి, కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. స్పందన వేదిక సమయంలో కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందన వేదికలో ‘డయల్ యువర్ కమిషనర్’ ద్వారా 30, కార్యాలయం వేదికగా 29 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. స్పందన వేదికలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nellore

2022-08-22 13:30:56

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి..

వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పి.సత్యనారాయణ డిమాండ్ చేశారు .నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంధాలయంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిబంధనలు లోబడి   పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయకపోవడం తగదని, పెండింగ్ లో ఉన్న 
అక్రిడిటేషన్లను వెంటనే జారీ చేయాలన్నారు. అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ  కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 
5 లక్షల చొప్పున పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. 
స్థానిక దిన పత్రికలకు, పీరియాడికల్స్ కు సమాచార పౌర సంబంధాల శాఖ యాడ్స్ విడుదల చేసి ఆయా పత్రికలకు చేయూత నివ్వాలన్నారు . సీనియర్ జర్నలిస్టు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులకు అమలు చేయడం లేదని, జీఎస్టీ నిబంధన వల్ల స్థానిక పత్రికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే తొలగించాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు  బి.నారాయణ రావు మాట్లాడుతూ జీవో 142ను సవరించి జర్నలిస్టు సంఘాలకు అక్రిడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.సీనియర్ 
జర్నలిస్ట్ నేమాల హేమ సుందర రావు మాట్లాడుతూ జర్నలిస్టుల కాలనీలు నిర్మించి అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు,
సభ్యులు అర్.అబ్బాస్, చక్రవర్తి ,  రవికాంత్ ,వెంకట వేణు, తిర్లంగి హరి ,శివప్రసాద్,జి.ఆనంద్ , హరనాథ్,దొండా రమేష్, బాదంగీర్ సాయి, కొణతాల మోహనరావు,
బి.ఏ.నాయుడు,,మొల్లి కమల్ కుమార్ ,వి.గణేష్,నాయుడు యాదవ్,భగవాన్ , ఎం.శ్రీహరి వివిధ పత్రికల  సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-21 01:51:05

స్పందనలో ‘డయల్ యువర్ కమిషనర్

ప్రతీ సోమవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ ను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పై సమాచారం ఇవ్వాలనే ప్రజలు, పరిష్కారం నిమిత్తం కార్యాలయానికి రాలేని వారు సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 0861 – 2355678 నంబరుకు ఫోన్ చేసి సూచించిన గడువులోపు సంప్రదించాలని కోరారు. కార్యాలయంలో నిర్వహించే స్పందన వేదికలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. కావున అవసరమైన వారు ‘ డయల్ యువర్ కమిషనర్’ ద్వారా సేవలు పొందాలని కమిషనర్ ఆకాంక్షించారు.

Nellore

2022-08-20 07:35:09

దోమల నియంత్రణకు సహకరించాలి

దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి కోరారు. ప్ర‌పంచ దోమ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా, తమ కార్యాల‌యంలో శ‌నివారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ, దోమ‌ల‌వ‌ల్ల క‌లుగుతున్న అన‌ర్థాల‌ను వివ‌రించారు. దోమ అతిచిన్న కీట‌కమే అయిన‌ప్ప‌టికీ, మాన‌వాళికి దీనివ‌ల్ల ఎన్నో ర‌కాల ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయ‌ని చెప్పారు.  దోమ‌ల కార‌ణంగానే మ‌లేరియా వ్యాధి వ్యాప్తి చెందుతోంద‌ని, 1897లో స‌ర్ రోనాల్డ్ రాస్ ప్ర‌క‌టించార‌ని, అప్ప‌టినుంచి దోమ‌ల నివార‌ణా కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. మ‌లేరియా వ్యాధికి స‌కాలంలో స‌రైన‌ వైద్యం చేయించక‌పోతే, మ‌ళ్లీమ‌ళ్లీ వ‌చ్చి, చివ‌ర‌కు ప్రాణాంత‌క‌మ‌వుతుంద‌ని తెలిపారు. అందువ‌ల్ల దోమ‌ల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యం చూప‌కూడ‌ద‌ని, దోమ‌కాటువ‌ల్ల వ‌చ్చే వ్యాధుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

               జిల్లా మ‌లేరియా అధికారి తుల‌సి మాట్లాడుతూ, దోమ‌వ‌ల్ల క‌లుగుతున్న అన‌ర్ధాల‌ను వివ‌రించారు. దోమ‌వ‌ల్ల కేవ‌లం మ‌లేరియా మాత్ర‌మే కాకుండా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, ఫేలేరియా, మెద‌డు వాపు త‌దిత‌ర వ్యాధులు వ‌స్తాయ‌ని తెలిపారు. వీటిప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిరంత‌రం తెలియ‌జేస్తూ, ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తోంద‌ని చెప్పారు. దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో క‌లిసి కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ముఖ్యంగా దోమ‌ల‌ను నివారించడానికి ప్ర‌జ‌ల స‌హ‌కారం చాలా అవ‌స‌ర‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ శుక్ర‌వారం త‌ప్ప‌నిస‌రిగా డ్రైడే నిర్వ‌హించాల‌ని, ఇంటిలోప‌ల‌, ఇళ్ల చుట్టుప్ర‌క్క‌లా నీరు నిల్వ ఉండ‌కుండా చూడాల‌ని సూచించారు. నీళ్ల కుండీల‌ను, నీరు నిల్వ ఉంచే పాత్ర‌ల‌ను నిరంత‌రం శుభ్రం చేయాల‌ని చెప్పారు. జిల్లాలో మ‌లేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు అదుపులోనే ఉన్నాయ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.
             జిల్లా స‌హాయ మ‌లేరియా అధికారి డి.వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ, వ్యాధులు విజృంభించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నిరంత‌రం అప్ర‌మ‌త్తం చేస్తున్న‌ట్లు చెప్పారు. దోమ‌ల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల ప‌ట్ల  అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. జాతీయ‌ కీట‌క జ‌నిత వ్యాధుల నివార‌ణా కార్య‌క్ర‌మానికి సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు.

Vizianagaram

2022-08-20 07:19:25

ప్రతివారం విధిగా" ఫ్రైడే - డ్రైడే" పాటించండి

 మహా విశాఖ నగరంలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు  ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా, ప్రతివారం విధిగా "ఫ్రైడే – డ్రైడే"పాటించేలా విశాఖ నగర వాసులకు వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ ఆదేశించారు. శనివారం ఆయన 3వ జోన్, 24వ వార్డు, వినాయక నగర్ పరిసర ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను  ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తూ పర్యటించారు. ఈ పర్యటనలో కమిషనర్ ప్రతి ఇంటి ముందు నిలువ చేసుకున్న నీటి నిల్వలలో దోమల వృద్ధికి సంబంధించిన లార్వాలను గుర్తించి, వాటిని వెంటనే ఖాళీ చేయించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎన్నో ప్రచార, ప్రసార కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ప్రజలకు వాటిని తెలియపరచడంలో వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు విఫలమవుతుండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి నిల్వలలో దోమలు వృద్ధి చేసే లార్వాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ, అందుకు తగిన అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అందించడం లేదని వార్డు  శానిటరీ కార్యదర్శి, వాలంటీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి దోమల వృద్ధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై అవగాహన కల్పిస్తున్నదీ, లేనిదీ పలు నివాసిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించడంపై విఫలమైనందుకు గాను ఆ వార్డు కార్యదర్శికి మెమోను జారీ చేయవలసినదిగా జోనల్ కమిషనర్ శివ ప్రసాద్ ను కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆరోగ్య రక్షణకు కావలసిన చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రజారోగ్య వ్యవస్థదేనని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జోనర్ కమిషనర్ ను కమిషనర్ ఆదేశించారు. అనంతరం దోమలు ఎక్కువగా వృద్ధి చెందే వస్తువులను ప్రదర్శించి, నినాదాలతో అవగాహనా ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడవ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, సహాయ వైద్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఏసిపి వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-20 06:18:17

సంస్కృతి మూలాలను తెలియజేయండి

భారతీయ సంప్రదాయం, సంస్కృతి మూలాలను పిల్లలకు తెలియజేసి పిల్లల్లో సేవాభా వాన్ని  పెంపొందించే బాధ్యత ప్రతి తల్లితండ్రుల పై ఉందని జిల్లా కలెక్టర్ డా కే. మాధ వీలత పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు కుటుంబ సభ్యుల సమేతంగా  ఇస్కాన్ దేవాలయానికి వొచ్చి  పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరికీ శ్రీ కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఇస్కాన్ సంస్థ వారు మన సంస్కృతి, సంప్రదాయాలను వ్యాప్తి చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో, ప్రకృతి విపత్తుల సమయంలో  ఇస్కాన్ సంస్థ వారు భాగస్వామ్యం అవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు. మన దేశ సంప్రదాయం, సంస్కృతి తో పాటు సేవా కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే మూడు కార్యక్రమాలు ఎంతో నిబద్దతతో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈరోజు ఇంత మంది చిన్నారులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం అన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లవాడిని ఏ స్కూల్ లో చేర్పించాలి? ఎలా చదివించాలి ? అనే కాకుండా సేవ భావం, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకూనేలా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. ఈపోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలెక్టర్ అభినందించారు. 

ఇస్కాన్ దేవాలయం లో జరిగిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ లు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీకృష్ణుడు మానవాళి అంతటకు మార్గదర్శకుడు, ఆదర్శ ప్రాయం అన్నారు. కళలకి కాణాచి అయిన రాజమహేంద్రవరం లో ఇస్కాన్ దేవాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తారన్నారు. పిల్లలందరూ కృష్ణా రాధల వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి అభినందనను తెలియచేశారు.

Rajamahendravaram

2022-08-19 11:48:51

కొవ్వూరులో జిల్లాస్థాయి స్పందన

తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజక వర్గ స్థాయి స్పందన కార్యక్రమం ఆగస్ట్ 22 సోమవారం కొవ్వూరు మునిసిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం దిశగా వచ్చే సోమవారం నాడు కొవ్వూరు నియోజక వర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆగస్ట్ 22 వ తేదీ సోమవారం కొవ్వూరు  లో "స్పందన"  ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు కొవ్వూరు లో జరిగే స్పందన కార్యక్రమంలో  ఉదయం పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం చెందిన కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి ప్రజలు ఈ స్పందన కార్యక్రమంకు హాజరు కావాలని  కలెక్టర్ మాధవీలత కోరారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ద్వారా  ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను  ప్రజల నుంచి స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ లో స్పందన..
రాజమండ్రిజిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి సంబందించిన శాఖల రెండవ స్థాయి అధికారులు హాజరై యధాతధంగా స్పందన దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం  హర్లిక్స్ ఫ్యాక్టరీ  సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఆర్టీసి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలిపారు.

Rajamahendravaram

2022-08-19 11:38:34

ప్రతీఇంట్లోనూ నిత్యం గోపూజ జరగాలి..

గోకులాష్టమి రోజునే కాకుండా రోజూ ప్రతి ఆలయం, ప్రతిఇంట్లో గోపూజ జరగాలన్నదే టీటీడీ లక్ష్యమని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు. గోపూజ నిర్వహించే ఆలయాలకు ఆర్థిక వనరులు లేకపోతే వాటికి తోడ్పాటు అందించే  ఆలోచన కూడా చేస్తామని ఆయన చెప్పారు. గోకులాష్టమి సందర్భంగా శుక్రవారం టీటీడీ గోసంరక్షణ శాలలో గోకులాష్టమి -  గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ కి  కళాకారులు కోలాటాలు, పిల్లనగ్రోవులు, భజన బృందాలు ఘనంగా స్వాగతం పలికాయి.  గజరాజులకు పండ్లు అందించిన అనంతరం సుబ్బారెడ్డి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించారు.

      అనంతరం విద్యార్థులను ఉద్దేశించి  సుబ్బారెడ్డి మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులతో అందరూ బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 200 ఆలయాలకు గోవులు, దూడలను దానంగా ఇచ్చామన్నారు. ఇంకా ఆలయాలు, మఠాలు ముందుకు వస్తే గోమాత దూడను ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.  గో పూజ విశిష్టతను భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అలిపిరి వద్ద సప్తగో ప్రదక్షణ  మందిరాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. తిరుమలలో గత ఏడాది  గోకులాష్టమి సందర్భంగా, నవనీత సేవను ప్రారంభించి భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ,  రైతులకు ఆవులు, ఎద్దులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.  గో ఆధారిత వ్యవసాయంతో పండిస్తున్న పంటలను రైతుల నుంచి టిటిడినే కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు.

   అనంతరం  సుబ్బారెడ్డి గోసంరక్షణ శాల లో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర దివ్య మహా మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత  శ్రీ వేంకటేశ్వరదివ్య మహామంత్ర లిఖిత జపం పుస్తకాలను స్వామివారికి సమర్పించారు. అంతకుముందు అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరంలో  వైవి సుబ్బారెడ్డి గోపూజలో పాల్గొన్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామివారి పూజలో పాల్గొని గోమాతలకు దాణా, మేత, పండ్లు అందించారు. అనంతరం పండితులు ఆయనకి వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు  పోకల అశోక్ కుమార్,  మొరం శెట్టి రాములు, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు  శేఖర్ రెడ్డి,  ఎస్ వి గో సంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి, జెఈవోలు  మతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tirumala

2022-08-19 11:20:55

నగర రవాణా వ్యవస్థపై టాడ్ మీటింగ్..

జివిఎంసి పరిధిలో రోడ్లు, కూడళ్లను అభివృద్ధికి సంబంధించి రవాణా ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలపై జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ గురువారం తన ఛాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, బిల్డర్లు, ఇంజనీర్లతో కలసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలో గల రోడ్లు, కూడళ్లను అభివృద్ధి పరచుటకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా ఆధారిత అభివృద్ధి  ( ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్- TOD) కార్యక్రమం సంబంధించి నగరంలో గల బిల్డర్లు, ఎల్టిపీలు, ఆర్కిటెక్ట్లు, నేరేడ్కో క్రెడాయ్ ప్రతినిధులకు అవగాహన కల్పించుటకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టీఓడీ పాలసీ ఉపయోగాలకు సంబంధించి వాటి
రూపకల్పన, నమూనా పటములు, విధి విధానములను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  చీఫ్ సిటీ ప్లానర్ వివరించిన అంశములకు సంబంధించి, బిల్డర్లు, ఆర్కిటెక్ట్లు నరేడ్ ట్కో , క్రెడాయ్ ప్రతినిధులు అవగాహన పరుచుకొని ఈ నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిపి సురేష్, సిటీ ప్లానర్, ఇంజనీర్లు, ఆర్కిటెట్లు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-18 15:15:15

బర్డ్ ఆసుపత్రిలో ఓపీకి ప్రత్యేక యాప్

బర్డ్ ఆసుపత్రిలో ముంద‌స్తుగా ఓపి బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్‌ను త్వ‌రిత‌గ‌తిన రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి బ‌ర్డ్‌లో గురువారం సాయంత్రం బ‌ర్డ్ ఆస్పత్రి నిర్వహణపై ఈవో సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఎంతో నాణ్యమైన వైద్య సేవలు బ‌ర్డ్ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఓపి ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పద్ధతిలో బర్డ్ ఆసుపత్రిలోని ల్యాబ్‌ల‌ను అభివృద్ధి చేయాలని, ల్యాబ్‌ల‌కు అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న భోజ‌నం నాణ్య‌త మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ‌ర్డ్ ఆసుపత్రిలో సెంట్రల్ యూపిస్‌ ఏర్పాటు చేయాలని, ఆటోమేషన్‌ ఆఫ్ ల్యాబ్ రిపోర్ట్స్ అందించే ప‌నులు పూర్తి చేయాలన్నారు. ల్యాబ్ మెటీరియల్స్, బ్లడ్ బ్యాంక్‌కు సంబంధించిన యంత్ర పరికరాలు తదితరాలను టెండర్ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఫుల్లీ ఆటో మేటెడ్‌ బయో కెమిస్ట్రీ మిషన్ ప్రారంభం
తిరుపతికి చెందిన  సాయి పవిత్ర మెడికల్ సర్వీసెస్ అధినేత‌  కటారు సుబ్రహ్మణ్యం బ‌హూక‌రించిన ఐదు లక్షల విలువ చేసే ఫుల్లీ ఆటో మేటెడ్ బయో కెమిస్ట్రీ మిషన్‌ను ఈవో గురువారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు ఈవో ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి విద్యార్థునుల‌ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థునుల‌ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణము త్వరితగతిన పూర్తి చేయాలని, ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయుర్వేద ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలతో ఆయ‌న మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.  జెఈవో  వీరబ్రహ్మం, బ‌ర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్ట‌ర్‌ రెడ‌ప్ప‌రెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్ట‌ర్‌ మురళీకృష్ణ, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

Tirupati

2022-08-18 14:43:28