1 ENS Live Breaking News

9మందికి సర్వీసు ప్రొబేషన్ రెగ్యులైజేషన్..

కాకినాడ జిల్లాలోని మరో 9 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొభేషన్ రెగ్యులర్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జిల్లాలోని ఆయా గ్రామసచివాలయ మహిళా పోలీసుల పనిచేసే సచివాలయాలకు ఈ ఉత్తర్వులు చేరాయి. ప్రస్తుతం వీరంతా సర్వీసులో ఉండగా మెటర్నటీ లీవు తీసుకున్న సందర్భంగా వీరి సర్వీసు ఆరునెలలు అదనంగా ప్రభుత్వం పొడిగించింది. దీనితో పోయిన నెలలో ఉద్యోగులందరితో పాటు వీరికి సర్వీసు రెగ్యులర్ కాలేదు. ఆగస్టు నెలలో వివిధ తేదీల్లో వారికి రెండేళ్లు సర్వీసు ప్రొభేషన్ పూర్తికావడంతో వారందరికీ ఒకేసారి ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు అందుకున్నవారంతా ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో సీఎఫ్ఎంఎస్ ఐడీల ద్వారా ఉత్తర్వులను ఆన్ లైన్ చేయించుకున్నారు. రేపటితో సాలరీ బిల్లులు పెట్టడానికి సమయం ముగిసిపోవడంతో అంతా ఒకేసారి జిల్లా పోలీసు శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఆన్ లైన్ చేయించుకున్నారు. దీనితో 9మందికి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయి సెప్టెంబరు నెల నుంచి పూర్తిస్థాయి పేస్కేలు పొందనున్నారు.

Kakinada

2022-08-24 07:09:23

రక్తదాతలే నిజమైన ప్రాణ దాతలు..

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు.  బుధవారం ఆమె సీతమ్మధార ఓ ప్రైవేటు కార్యాలయం వద్ద నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం వలన మరో ప్రాణం నిలబెట్ట వచ్చుని తెలిపారు. అందుకు పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాపిడ్ బైక్ టాక్స్ సంస్థను మేయర్ అభినందించారు. రాపిడ్ సంస్థ అంటే ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడమే కాకుండా ఇటువంటి సామాజిక సేవ చేయడం అభినందించదగినదని తెలుపుతూ ఆ సంస్థ ప్రతినిధులైన ఎం వి ప్రసాద్, పి మురళి లను అభినందించారు.  ఇటువంటి సామాజిక సేవ తో ముందుకు వచ్చిన ప్రతి సంస్థను, ఆర్గనైజింగ్ వారిని ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని, ఇటువంటి రక్తదాన శిబిరాలను ప్రతి చోట ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకులలో  నిల్వలు పెంచాలని, రక్తం దొరకలేదని ఏ ఒక్కరూ మరణించ కూడదని తెలిపారు.

Visakhapatnam

2022-08-24 06:59:23

కాకినాడ జిల్లాలోనే రూ.9కోట్లుకు పైగా..

కాకినాడ జిల్లాలో వ్యవసాయశాఖలో మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా బినామీ ఈ-క్రాప్ బుకింగ్, చెల్లింపులకు సంబంధించి ఇప్పటి వరకూ 80 మందికి షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఈఎన్ఎస్ తో ఫోనులో మాట్లాడారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన 80 మందికీ ఆయా మండలాలు, ఆర్బీకేల పరిధిలో ఎంతెంత మొత్తాలకు సంబంధించి చెల్లింపులు జరిగాయనే విషయమై షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం నోటీసులు తీసుకున్న గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు సంజాయషీలు ఇస్తున్నప్పటికీ అవి సత్యదూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. కొన్ని చోట్ల సచివాలయ వ్యవసాయ సహాయకులు చేసిన ఈ-క్రాప్ బుకింగ్ కు, రెవిన్యూ రికార్డుల ద్వారా విచారణ చేసిన దానికి పొంతన కుదరడం లేదని తెలియజేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్నవారి వివరాలను.. పూర్తిస్థాయి విచారణ జరిపి..వాస్తవాలను జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కి నివేదికలు సమర్పించనున్నట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ వివరించారు.

Kakinada

2022-08-24 06:32:07

ముద్దాలపురం ప్లాంట్ ను పరిశీలన..

అనంతపురం నగరానికి సరఫరా అవుతున్న త్రాగునీరు పూర్తిస్థాయిలో శుద్ధి చేసి  పూర్తి స్థాయిలో నగర ప్రజలకు శుద్ధి చేసిన నీటి సరఫరా చేయాలని అధికారులకు   నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం సూచించారు.నగర మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య ,కోగటం విజయ భాస్కర్ రెడ్డి లతో కలసి మంగళవారం నగరానికి మంచి నీటి సరఫరా చేసే ముద్దాలపురం వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. నగరంలో రంగుమారిన నీరు సరఫరా అవుతుండటంతో మేయర్, డిప్యూటీ మేయర్లు అధికారులతో కలిసి ముద్దాలపురం వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించారు.పూర్తి స్థాయిలో ఫిల్టరేషన్ ప్లాంట్ లో నీటిని తొలగించి ట్యాంక్ ను శుభ్రపరచి నీటి సరఫరా చేపట్టడంతో ఆ పక్రియ ను వారు పరిశీలించారు.అదే విధంగా అలం,క్లోరినేషన్ పక్రియ ను పరిశీలించారు. 

నీటి శుభ్రతను పరిశీలించి పూర్తి స్థాయిలో నీటి శుభ్రతను చేసిన తర్వాతే  నగరానికి నీటి సరఫరా చేయాలని అధికారులను మేయర్ వసీం సూచించారు.ఇటీవల కురిసిన వర్షాల వల్ల పీఏబీఆర్ డ్యాం నుండి ముద్దలాపురం ప్లాంటుకు సరఫరా అవుతున్న నీరు రంగుమారి వస్తోందని,పదే పదే శుభ్రం చేసినా రంగు మారిన నీరే వస్తుండటంతో ట్యాంక్ లోని నీరు పూర్తిగా తొలగించి ట్యాంక్ ను శుభ్రం చేయడం జరిగిందని అధికారులు మేయర్ కు వివరించారు.అంతేకాకుండా గతంలో కంటే ఎక్కువగా ఆలం, క్లోరినేషన్ వినియోస్తున్నా మని అధికారులు తెలిపారు.మేయర్‌ వెంట కార్పొరేటర్‌లు  సైఫుల్లా బేగ్,కమల్‌ భూషణ్‌, అనిల్‌ కుమార్‌ రెడ్డి,,ఎస్ఈ నాగమోహన్,ఆడిషనల్ కమిషనర్ రమణా రెడ్డి , డిఇ నరసింహులు,నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-08-23 11:16:20

ప్రాధాన్యత పథకాలకు తొలిప్రాధాన్యత

ఏపీ సీఎం సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి దిశా నిర్దేశం మేరకు జిల్లాలో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు అమలులో మరింత నిబద్దత గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఉపాధిహామీ, ప్రాధాన్యత భవనాలు, స్కూల్స్, ఆసుపత్రుల నాడు నేడు పనులు, టిడ్కో హౌసింగ్, జగనన్న భూ రక్ష, భూ హక్కు పథకం, స్పందన, భూ సేకరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం అమలులో సగటు వేతనం రూ.240 ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు.  ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనులు మరింత వేగవంతం చేయడానికి, ఇప్పటికే నిర్మాణాల్లో స్టేజ్ కన్వర్షన్ కూడా దృష్టి పెట్టాలని ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. అర్భికెలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ సంబందించిన భవనాల్లో పనులను పూర్తి చెయ్యడం, అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 390 గ్రామ సచివాలయ భవనాల్లో 238, అర్భికెల్లో 373 లో 168, హెల్త్ క్లినిక్స్ 337 లో 101 పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఇంకా 11 చోట్ల సచివాలయ, 18 చోట్ల అర్భికే, 38 చోట్ల హెల్త్ క్లినిక్స్ కు స్థల సేకరణ చెయ్యాల్సి ఉందన్నారు.

డిజిటల్ లైబ్రరీ లకు డిసెంబర్ 2022 చివరి నాటికి ఫైబర్ ఆప్టికల్ లైన్స్ పూర్తి చెయ్యాలని, ఇందుకు స్థానికంగా ఉండే వెండర్స్ ద్వారా కనెక్షన్స్ ఇచ్చేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా  చర్యలు పూర్తి చెయ్యాలన్నారు. బల్క్ మిల్క్ యూనిట్స్ భవనాలు పనులు, భూసేకరణ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సచివాలయ, అర్భికే, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ భవనాలు, స్కూల్స్ చేపడుతున్న నాడు నేడు పనుల ద్వారా ప్రజలకు చేకూర్చగలిగే  ప్రయోజనం దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగిందన్నారు. మన బడి, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల లోనాడు నేడు పనుల విషయంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వ్యక్తిగత శ్రద్ద తీసుకొనవలసి ఉండాలన్న ఆదేశాలు నేపథ్యంలో ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రాధాన్యత కు అనుగుణంగా పనిచేయ్యాలని కలెక్టర్ డా మాధవీలత పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులు, ఇతర ప్రాధాన్యత నిర్మాణాల విషయం లో నాణ్యత ప్రమాణాలకు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు.

స్కూల్స్ లో చేపట్టే టాయ్ లేట్, స్కూల్స్ నిర్వహణ నిధులను ఖర్చు చెయ్యడంలో ప్రామాణికత పాటించాలని సూచించారన్నారు. వీటి నిర్వహణ విషయాన్ని ప్రశ్నించే విధానంలో సంబందించిన నిర్వాహకుల టెలి ఫోన్ నంబర్ బహిరంగ గా ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో చేపట్టే పనుల విషయంలో కూడా ఇదే తరహా భాధ్యత తో వ్యవహరించాలన్నారు. నవరత్నాలు పేద లందరికీ ఇళ్లు పథకం కింద చేపడుతున్న పనుల విషయంలో కన్వర్షన్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మంజూరు అయినా 48,143 ఇళ్లలో 9841 ఇళ్ళు పూర్తి అయినా , కన్వర్షన్ దశలో ఉన్న వాటి లో పురోగతి పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఇంకా పనులు ప్రారంభం కానీ సుమారు 280 ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు.

టిడ్కో ఇళ్ళ కి సంబంధించి 7936 ఇళ్ల కి సంబంధించి 4,733 ఇళ్లు లబ్దిదారుల పేరున రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన ఇళ్ల ను డిసెంబర్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి, లబ్దిదారుల పేరున రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం లో పురోగతి చూపాలని స్పష్టం చేశారు. లే అవుట్ లకు సంబంధించి అభివృద్ది సామర్ధ్య పెంచుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా రహదారులు, విద్యుత్, త్రాగునీరు పరంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం గా దిశా నిర్దేశనం చేశారని, ఆ విధానం లో క్షేత్ర స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.

హౌసింగ్ సైట్స్  సంబంధించి కేటాయింపు విషయంలో ఆడిట్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో భాగంగా లబ్ధిదారులకు పట్టా ఇవ్వడం, అందులోకి లబ్దిదారుని పొజిషన్ లోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకో గలిగితే ఆడిట్ పూర్తి చేసినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగిందన్నారు. జగనన్న భూరక్ష, భూ హక్కు పథకం కింద ప్రోటోకాల్ ప్రకారం సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు.  స్పందన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో నాణ్యతతో రెడ్రెసెల్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఎంతో భాద్యతతో  ప్రజల నుంచి వచ్చే స్పందన ధరఖాస్తులు పరిష్కారం చూపాలన్నారు. ప్రతి బుధవారం స్పందన దరఖాస్తుల పరిష్కారం నాణ్యత పై సమీక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆమె తెలిపారు. స్పందనలో పరిష్కారం చేసిన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఫోటోలు  వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలన్నారు. అప్పుడే స్పందన పరిష్కారం లో పారదర్శకతకు ఆస్కారం వుంటుందని తెలియచేశారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ , డ్వామా పిడి జి ఎస్ రామ్ గోపాల్, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, డి ఈ వో ఎస్. అబ్రహం, ఆర్ ఎం సి ఈ ఈ ఆర్ వి ఎస్ శేషగిరి రావు, పబ్లిక్ హెల్త్ ఈ ఈ -  వై. నరసింహరావు , ఆర్ అండ్ బి ఎస్ ఈ - బివి మధుసూదన రావు, హౌసింగ్ డి హెచ్ వో టి. తారాసింగ్, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-23 11:12:49

అర్హత ఉంటే నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు

అర్హత ఉంటే చాలు నేరుగా అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు  శాసనసభ్యులు  అలజంగి  జోగారావు  తెలిపారు.   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  భాగంగా మంగళవారం ఉదయం పార్వతిపురం పురపాలక సంఘం, కొత్తవలస 4వ సచివాలయం పరిధిలో  9వ వార్డు విజయరామరాజు కాలనీ మరియు నిర్మల కాలనీలలో  పర్యటించారు. ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు అలజంగి జోగారావు   ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి నేరుగా ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి వారికి సీఎం  వై. యఎస్‌. జగన్  మోహన్  రెడ్డి  అమలు  చేస్తున్న  సంక్షేమ  పధకాలు ,  ప్రభుత్వం ఈమూడెళ్ళ పరిపాలనా కాలంలో చేసిన సహాయాన్ని  తెలియ చేస్తూ  కరపత్రాలు  అందజేశారు.   అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకున్న వారి వివరాలు తెలుసుకుని వాటిని నమోదు చేయించి వారికి రానున్న కాలంలో అర్హత మేరకు ఆయా పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్టానిక  సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసినదిగా  అధికారులకు  ఆదేశించారు.  ప్రతి  పేదవానికి  సంక్షేమ  పధకాలను  చేరవేస్తూ అవినీతి రహిత ప్రజారంజక పాలనను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం  మన  ప్రభుత్వం మని   తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ప్రజలు శాసనసభ్యులకు ఘనస్వాగతం  పలికారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్ కే రుక్మిణీ, వైస్ చైర్మన్ ఇండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవి కుమార్, ఏఏంసి వైస్ చైర్మన్ వి. శంకర్రావు, స్థానిక కౌన్సిలర్ సభ్యులు పొట్నురు జయంతి, మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ వార్డుల  కౌన్సిలర్ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, ఏఎంసి డైరెక్టర్లు, స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-23 11:09:38

ఘనంగా టంగుటూరి 151 వ జయంతి

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి సందర్భంగా విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్స్ కే.మాధవి, డా. రాణీ సుస్మిత, డీ.కీర్తి,   పరిపాలన అధికారి ఈశ్వరరావు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి. మణిరామ్ , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు టంగుటూరి దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

Visakhapatnam

2022-08-23 11:04:31

సచివాలయాల నిర్మాణాలు పూర్తికావాలి..

ఎన్ఆర్ఈజీఎస్ , గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్  వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్) తదితర నిర్మాణాలకు జిల్లా కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,  నాడు - నేడు పనులు , ఏఎంసియూ, బిఎంసియూల నిర్మాణం, వైయస్సార్ డిజిటల్ లెబ్రరీ బిల్డింగ్స్, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, ఏపి టిడ్కో ఇళ్లు  , జగనన్న భూహక్కు మరియు భూరక్ష(సర్వే), జాతీయ రహదారులు, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వము తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జివియంసి కమిషనర్ లక్ష్మీషా, డియమ్ &హెచ్ఓ, డిఇఓ,  పిడి హౌసింగ్, ఎడి సర్వే వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-23 10:59:50

స్వచ్ఛ గ్రామాలే అందరి సంకల్పం కావాలి

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే అందరి సంకల్పం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ (పిఆర్, అర్ డి) ప్రత్యేక కమీషనర్ డా. శాంతి ప్రియ పాండే పేర్కొన్నారు. మంగళ వారం జిల్లా గిరి మిత్ర భవన్ లో డివిజనల్ పంచాయితి అధికారులు, ఎంపీడీఓ లు, ఈ ఓ పిఆర్ డి, పంచాయితీ కార్యదర్శిలు, ఎమ్ అర్ సి లతో సిరా( సర్వెలియన్స్, ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్, ఎనాలిసిస్), ప్లాస్టిక్ వ్యర్దం, చెత్తా చెదారం వేసే స్పాట్, లెగసీ డంపింగ్, సామూహిక మరుగుదొడ్లు నిర్వహణ అంశాల పై జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా చెత్త డంపింగ్ చేసే అలవాటు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుందని, ప్రజల్లో అవగాహన కల్పించి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని  అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమం పక్కగా జరగాలని, పంచాయితీ కార్యదర్శి లు, ఈ ఓ పి అర్ డిలు, డివిజనల్ పంచాయితీ అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీఓ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. 

పారిశుధ్యం నిర్వహణ పనులను ఉన్నత స్థాయి నుంచి పర్యవేక్షించేందుకు పంచాయితి కార్యదర్శి లకు బాడీ కెమెరా లు ఏర్పాటు చేసి వీడియో కాల్ , ఫొటోస్ ద్వారా ఇంటి పరిసరాలు,పారిశుధ్య పనులు ఎంత మేర నిర్వహించింది పరిశీలించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ క్లాప్ మిత్ర(గ్రీన్ అంబాసిడర్) చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిది ప్రజల మొబైల్ సందేశం ద్వారా తెలుసుకుంటామన్నారు. గ్రామ పంచాయితీ ల్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలో ఉండాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. పాగింగ్ , ఇన్సినిరైటర్స్ యంత్రాలు వినియోగంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య మెరుగుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్ర రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ఓ.ప్రభాకర రావు, జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు, విజయనగరం డి.ఎఫ్.ఓ ఎస్. వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-23 10:52:50

భవన నిర్మాణాలపై ద్రుష్టిపెట్టండి..

గ్రామ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం సంభందిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, గృహ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయి భవనాల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష (రీ సర్వే) పనులు వేగవంతం చేయాలని, స్పందన వినతులు పరిష్కారం పక్కాగా జరగాలని ఆయన పేర్కొన్నారు.

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె.రాజ కుమార్,  ఇంఛార్జి జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, హౌసింగ్ డిఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-23 10:50:13

అభివ్రుద్ధి పనులు ఆపడానికి వీల్లేదు..

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జిల్లాలోని అభివృద్ధి ప‌నులు ఆగ‌డానికి వీల్లేద‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పంచాయ‌తీ రాజ్ ఇంజనీరింగ్‌ అధికారుల‌ను, గుత్తేదార్ల‌ను ఉద్దేశించి అన్నారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా ప‌నుల‌ను గుర్తించి ముందుగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రారంభంకాని ప‌నుల‌కు వ‌చ్చే నెల 7వ తేదీలోగా శంకుస్థాప‌న‌లు చేయాల‌ని నిర్దేశించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేల స‌హ‌కారంతో ప‌నుల‌ను ప్రారంభించాల‌ని, నిర్ణీత కాలంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు, గుత్తేదార్ల‌కు సూచించారు. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్రారంభంకాని, అసంపూర్తిగా నిలిచిపోయిన‌ ప‌నుల‌పై స‌మీక్షించే నిమిత్తం జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పంచాయ‌తీ రాజ్ ఇంజ‌నీరింగ్‌ అధికారులు, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం జిల్లాల‌కు చెందిన‌ గుత్తేదార్ల‌తో మంగ‌ళ‌వారం స్థానిక జ‌డ్పీ స‌మావేశ మందిరంలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తులు వ‌చ్చి వివిధ కార‌ణాలతో నిలిచిపోయిన ప‌నుల తాజా ప‌రిస్థితిపై ఆయన అధికారుల‌ను ఆరా తీశారు. ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అటు అధికారుల‌ను, ఇటు గుత్తేదార్ల‌ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక ప్ర‌క్రియ‌ల‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా ప‌నులను పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ప‌నుల‌ను నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేసి ప్ర‌జా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు గుత్తేదార్లు స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా జ‌డ్పీ ఛైర్మ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. గుత్తేదార్లు నిర్ణీత కాలంలో ప‌నులు పూర్తి చేస్తే.. సంబంధిత‌ బిల్లుల చెల్లింపు ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రిగేలా తాను బాధ్య‌త వ‌హిస్తాన‌ని ఛైర్మ‌న్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్యాకేజీల‌లో చేప‌ట్టిన ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు.

ప్ర‌జా అవ‌స‌రాల‌కు త‌గిన‌ ప్రాధాన్య‌త ఇవ్వండి

ప్ర‌జా అవ‌స‌రాల‌ను తీర్చే క్ర‌మంలో ప్ర‌భుత్వం గుర్తించిన ప‌నుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా జ‌డ్పీ ఛైర్మ‌న్ స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాల‌కు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాల‌కు తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. రోడ్లు, వంతెన‌ల‌కు సంబంధించిన ప‌నులను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించి నిర్ణీత కాలంలో అందుబాటులోకి తీసుకురావాల‌ని పేర్కొన్నారు. స్థ‌లానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌లువురు గుత్తేదార్లు జ‌డ్పీ ఛైర్మ‌న్ దృష్టికి తీసుకురాగా సంబంధిత సాంకేతిక ప్ర‌క్రియ‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని పంచాయ‌తీ రాజ్ ఇంజనీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు అన్నివిధాలా గుత్తేదార్ల‌కు స‌హాయ‌, స‌హ‌కారాలు అందించాల‌ని సూచించారు. ఒకే గుత్తేదారుకు అన్ని ప‌నులు కాకుండా విభజించి ప‌లువురికి అప్ప‌గించాల‌ని, నిర్ణీత కాలంలోగా ప‌నులు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటి

స‌మీక్ష‌లో భాగంగా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా ప‌నులు తాజా ప‌రిస్థితిని జ‌డ్పీ ఛైర్మన్ తెలుసుకున్నారు. పలుచోట్ల ఇంకా ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డానికి గల కార‌ణాల‌ను అధికారుల‌ను, గుత్తేదార్లను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల పంచాయతీ రాజ్ ఇంజ‌నీర్ల‌ను, ఎంపీడీవోల‌ను, గుత్తేదార్ల‌ను పిలిపించి నియోజ‌వ‌ర్గం వారీగా స‌మీక్షించారు.

స‌మావేశంలో పంచాయ‌తీ రాజ్ ఎస్‌.ఈ. ఆర్‌.ఎస్. గుప్తా, ఈఈ కేజీజీ నాయుడు, జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్‌, పంచాయ‌తీ రాజ్ విభాగానికి చెందిన డీఈలు, ఏఈలు, జేఈలు, ఉమ్మ‌డి జిల్లాకు చెందిన గుత్తేదార్లు పాల్లొన్నారు.

Vizianagaram

2022-08-23 10:46:21

ఆ వీఏఏల సమాధానాలు నమ్మసక్యంగా లేవు

కాకినాడ జిల్లాలో ఈ-క్రాప్ నమోదులో భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడిన గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ఇచ్చిన సమాధానాలు నమ్మసక్యంగా లేవని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా ఫోనులో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులకు అవకతవకలకు పాల్పడ్డారనే ప్రాధమిక సమాచారంపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆయనే పేర్కొన్నారు. అందులో శంఖవరం మండలం వీఏఏలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తరువాత ఇచ్చిన సమాధానంతో రెవిన్యూ సిబ్బంది ఇచ్చిన సమాధానాలకు పొంతన కుదరడం లేదని ప్రస్తుతం జిల్లా వ్యప్తంగా విచారణ జరుగుతోందని ఆయన వివరించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనలో కూడా నోటీసులు ఇచ్చిన ప్రాంతాలను తాము కూడా పరిశీలిన చేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు విషయంలో జరిగిన భారీ అవకతవకలపై చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లినట్టు జేడీఏ ఎన్.విజయ్ కుమార్ ఈఎన్ఎస్ కి వివరించారు.

నేటికీ షోకాజ్ నోటీసుల విషయం చెప్పని విఏఏలు
కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ అవకతవకలకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు నేటి వరకూ ఆ విషయాన్ని తాము పనిచేసే సచివాలయ డీడీఓలకు గానీ, మరికొందరు గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు గానీ తెలియజేయక పోవడం విశేషం. నోటీసులు అందుకున్న దగ్గర నుంచి చాలా మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులు సచివాలయాలకు కూడా హాజరు కాకుండా, అటు డీడీఓ  పంచాయతీ కార్యదర్శిలకు కూడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొన్నిచోట్ల గ్రేడ్-5 కార్యదర్శిలకు విషయం తెలిసినా..వారంతా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తుండటం విశేషం. అందునా తప్పుచేసింది వీఏఏలే అన్నట్టుగా..తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే మాట్లాడుతుండటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ శాఖలోని వ్యవసాయశాఖ వీఏఏలు దైర్యంగా ఈ-క్రాప్ బుకింగ్ విషయంలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడటం, అదే సమయంలో సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఈ భారీ స్కామ్ బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  ఇటు జిల్లా అధికారులు ఎంత మొత్తంలో అవినీతి జరిగిందనే విషయాన్ని, ఎంతెంత మొత్తాలకు వీఏఏలకు నోటీసులిచ్చారనే సమాచారాన్ని మీడియాకి తెలియజేస్తే తప్పా జిల్లా వ్యాప్తంగా ఎంతపెద్ద మొత్తంలో ఈ-క్రాప్ అవినీతి జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చూడాలి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ భారీస్కాములో కాకినాడ జిల్లాలో ఎంతమొత్తం వ్యవసాయశాఖ అధికారులు నిగ్గు తేల్చి.. ఎంతమందిని ఇంటికి పంపిస్తారనేది..!

Kakinada

2022-08-23 09:58:15

సింహాద్రి అప్పన్న అత్యంత మహిమాన్వితుడు

సింహాచలంలో శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) అత్యంత మహిమాన్వితుడని రాష్ట్ర గవర్నర్ భిష్వభూషణ్ హరిచందన్ అన్నారు. వరాహా, నారసింహ అవతారాలుతో కూడిన ఆ సింహాద్రినాధుడిని దర్శించుకోవడం భక్తులంతా తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారన్నారు. ఇటీవలే తాను కూడా సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామిని దర్శించుకోవడం జరిగిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.  ఈ మేరకు మంగళవారం  విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు సింహాద్రినాధుడి చందనోత్సవం విశిష్టతను తెలియజేస్తూ అప్పన్న చందనం ప్రసాదాన్ని అందజేశారు. శేష వస్త్రం సమర్పించారు.. అంతేకాకుండా ఆలయ చరిత్రను విపులంగా తెలియజేసే అంశాలుతో పాటు శ్రీ సింహాద్రినారసింహ స్ర్తోత్రమంజరి పుస్తకాలను శ్రీనుబాబు దంపతులు గవర్నర్ కు బహుకరించారు. సింహాద్రినాధుడి జ్ఞాపికను అందజేశారు. వరహా నరసింహ, చందనోత్సవం, నిజరూపం..నిత్య రూపం విశిష్ఠతను విపులము గా అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు. అయితే రాష్ర్ట ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పన్న క్షేత్ర మహత్యంకు సంబంధించి మరింత ప్రచారం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. భక్తుల్లో మరింతగా ఆధ్యాత్మిక భక్తిభావాలు పెంపొందించే విధంగా  తమ ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇటీవల ఆలయానికి భక్తులు తాకిడి ఘననీయంగా పెరిగిందన్నారు. గవర్నర్ ను కలిసి సింహాద్రినాధుడి చందనం ప్రసాదం , శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయడం సంతోషం కలిగించిందన్నారు.

Visakhapatnam

2022-08-23 09:31:07

ఈవీఎం గోదాముల భద్రతకు పటిష్ట చర్యలు

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  డా.కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ, ఎన్నికలు, పోలీసు, అగ్నిమాపక శాఖ‌ల అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. వ‌ర్షాలు తరుచుగా కురుస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని తీసుకోవాల‌ని కలెక్టర్ ఈ సంద‌ర్భంగా సూచించారు.  కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి రమణ, పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు జేవీఆర్.రమేష్, ఎం.జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-23 08:59:23

ఆయన తమ్ముడివా..ఈయన దత్త పుత్రుడివా

ఒక సిద్ధాంతం.. ఆలోచన లేని.. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా  ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా  వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడా? చంద్రబాబు దత్తపుత్రుడా? అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పాలని  అమర్నాథ్ డిమాండ్ చేశారు.సోమవారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు బట్టి  చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు మధ్య డీల్ కుదిరినట్టు అర్థమవుతోందని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడే ఆ పార్టీ చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత పెట్టిన పార్టీ అని అప్పుడే చెప్పామని అమర్ నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి చెయ్యమని పవన్ కళ్యాణ్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019లో జనసేన టీడీపీ నుంచి  రాష్ట్ర ప్రజలు తమను తాము కాపాడుతున్నారని అమర్ ఎద్దేవా చేశారు.  ఆ రోజు ఫలితాలు చూసి తమకు రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్  భావించి ఉంటారని అన్నారు.  చంద్రబాబుతో తాను కలిసి లేనని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్పుకోలేక పోతున్నారని అమర్ నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ మాటలు బట్టి ఆయన చంద్రబాబు ప్రొడక్షన్లో పనిచేస్తున్నారని స్పష్టం అవుతోందని అమర్ నాథ్ అన్నారు.

 ఈ రెండు పార్టీలు వస్తే సంక్షేమ పథకాల నుంచి ప్రజలను దూరం చేస్తారన్నది నిజమని అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా క్షేమం కోసం ఖర్చు చేయలేదని అన్నారు.అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ ఎలా కలిసుండాలని భావిస్తున్నారని అమర్ నాథ్ ప్రశ్నించారు.  జగన్ మోహన్ రెడ్డి లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పార.  ఇవి పవన్ కళ్యాణ్ కి  కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కళ్ళుండీ చూడలేక పోతున్నారని మంత్రి అన్నారు. పరిశ్రమలు రావాలంటే కప్పం కట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను అమర్ నాథ్ తీవ్రంగా ఖండించారు. ఏ పారిశ్రామికవేత్త అయినా ఫలానా నాయకుడికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ డబ్బులు ఇచ్చినట్లు చెప్పగలరా?  అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరినీ బెదిరించ వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడి పవన్ కళ్యాణ్ ఆయన చెంత చేరని అమర్ నాథ్ అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉండగా చిరంజీవి అంటే తమకు ఎంతో అభిమానమని ఆయన పుట్టిన రోజు నాడు ఆయన కించపరిచే విధంగా పవన్ మాట్లాడడం తనకు బాధాకరంగా ఉందని అమర్ నాథ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు  కలత చెంది పవన్ ను కొణెదల పవన్ కళ్యాణ్ అని  పిలవాలా?  లేక నారా నాదెండ్ల పవన్ కళ్యాణ్ అని పిలవాలా? అర్థం కావట్లేదని అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన వచ్చే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి నే  తిరిగి ముఖ్యమంత్రి గా చేయాలని రాష్ట్ర ప్రజలు  నిర్ణయిoచు కున్నారు అని అమర్ నాథ్ స్పష్టం  చేశారు.

Visakhapatnam

2022-08-22 16:08:45