1 ENS Live Breaking News

హరిదాసులు హిందూ ధర్మ ప్రచారకులు

హరిదాసులు గ్రామాల్లో సనాతన హిందూ ధర్మ ప్రచారకులని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం నుంచి ప్రారంభించిన శ్రీవారి  త్రైమాసిక మెట్లోత్సవ శోభా యాత్ర మూడవ సత్రాల వద్దకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జెఈవో మాట్లాడారు.  హిందూ ధర్మప్రచారంలో దాస సాహిత్య ప్రాజెక్టు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 7200 భజన మండళ్లు ఉన్నాయన్నారు. వీరందరూ తమ గ్రామ పరిధిలో ఉన్న మిగిలిన అన్ని భజన మండళ్లను కలుపుకుని ప్రతి గ్రామంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని యువత తో పాటు చిన్నారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  ఆనంద తీర్థ  జెఈవోను సన్మానించారు.


Tirupati

2022-08-25 14:34:09

ప్లాస్టిక్ పై సమరానికి సర్వం సిద్దం

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని  తరిమికొట్టేందుకు నేడు తొలి అడుగు పడబోతోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, పార్లే స్వచ్ఛంద సంస్థ అంకురార్పణ చేయబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సుమారు 25 వేల మంది వాలంటీర్లు స్థానిక హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న 28 కిలోమీటర్ల నిడివి గల తీర ప్రాంతాల్లో ఉన్న  ప్లాస్టిక్ని  సేకరించి పార్లే సంస్థకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో శుక్రవారం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమాలు జరిగే ఏ.యూ కన్వెన్షన్ సెంటర్, ఏ.యూ కాన్ఓకేషన్ హాల్ లోని ఏర్పాట్లను మంత్రులు అమర్ నాథ్ , ఆదిమూలపు సురేష్,  ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్  తలశిల రఘురామ్ తదితరులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ, బీచ్  ప్లాస్టిక్ వలన జలచరాలు చనిపోతున్నాయని, అంతే కాకుండా పర్యావరణనికి హాని కలుగుతోoదని అన్నారు. 974 కి.మీ. తీర ప్రాంతoతో పాటు రాష్ట్రంలోని నదులలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించే ప్రక్రియ చేపడతామని మంత్రి అమర్ నాథ్ తెలియజేశారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ ను  పార్లే సంస్థకు అప్పగిస్తామని, ఆ ప్లాస్టిక్ ని  రీసైకిల్ చేసి అదిదాస్ సంస్థ ద్వారా  పాదరక్షల తయారీకి వినియోగం ఇస్తారని అమర్ నాథ్ వివరించారు.

 పార్లే సంస్థ అనేక దేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని అన్నారు. అయితే శుక్రవారం విశాఖ లో  సేకరించే ప్లాస్టిక్  ప్రపంచ రికార్డును సృష్టించ బోతోoదని ఆయన చెప్పారు. ఇక పార్లే సంస్థ ప్లాస్టిక్  రీసైకిల్ కి  25 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయమని కోరిందని, విశాఖ, అనకాపల్లిలో  భూములు చూపించామనీ, వారు ఎంచుకున్న చోట స్థలాన్ని  కేటాయిస్తామని అమర్ నాథ్ చెప్పారు. ఇదిలా వుండగా మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1,62,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనున్నారని, ఇప్పటివరకు 36000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, వారికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సర్టిఫికెట్లు అందచేయనున్నారని అమర్ నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో  నగర పాలక సంస్థ కమిషనర్ లక్ష్మిస,ఎమ్మెల్సీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-25 14:31:30

ఆర్.డి.ఓ.లు తహశీల్దార్ లకు కొత్త నెంబర్లు

విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ ల ఆర్.డి.ఓ.లు, 26 మండలాల తహశీల్దార్ లకు అధికారిక మొబైల్ నెంబర్ లు కేటాయిస్తూ వారికి ప్రభుత్వం తరపున సిమ్ కార్డులు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్  ఏ సూర్యకుమారి తెలిపారు. జిల్లా ప్రజానీకం రెవెన్యూ అధికారులను వివిధ సమస్యలపై సంప్రదించేందుకు ఈ అధికారిక ఫోన్ నెంబర్ లను వినియోగించ వచ్చని పేర్కొన్నారు. ఈ నంబర్ లకు వాట్సప్ కూడా ఏర్పాటు చేసుకొని జిల్లా యంత్రాంగం తోను, ప్రజలతోను దైనందిన అధికార కార్యకలాపాల్లో ఈ నంబర్ లనే వినియోగించాలని కలక్టర్ అధికారులకు సూచించారు. ఆయా రెవెన్యూ డివిజన్, మండలాల తహశీల్దారు లకు కేటాయించిన నంబర్లు ఆయా అధికారులు వేరొక చోటుకు బదిలీ అయినప్పటికీ మండలంలో అదే నంబర్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్, తహసిల్దార్ ల కొత్త మొబైల్ ఫోన్ నెంబర్ లు ఈ ప్రకటనకు జత చేయడం జరిగింది.

Vizianagaram

2022-08-25 14:12:15

దిగులు పడకండి పంటలన్నీ కొంటాం

ఏం దిగులొద్దు మీరు పండించిన పంటలకు  మద్దతు  ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని టీటీడీ చైర్మన్   వైవి  సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతుకు భరోసా ఇచ్చారు. టీటీడీ శ్వేతా భవనం లో  గురువారం గోశాలల నిర్వాహకులు , ప్రకృతి వ్యవసాయ దారుల శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్నారు . అనంతరం శ్వేతా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా  తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన రైతు   జలగం శ్యామ్ టీటీడీ చైర్మన్ తో  మాట్లాడారు . తాను గో ఆధారిత వ్యవసాయం తో బియ్యం, కొన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానని చెప్పారు . ఖర్చు ఎక్కువ అవుతోందని , మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని వాపోయారు . బియ్యం కొనుగోలు చేయడానికి  జనం పెద్దగా ముందుకు రావడం లేదని , అయినా తాను ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నానని ఆవేదన చెందారు . ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే బియ్యం , బెల్లం ,సెనగలు లాంటి పంటలను టీటీడీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు . శ్యాం వద్ద ఉన్న పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు . మరింత మంది రైతులను ప్రోత్సహించాలని  శ్యామ్ కు సూచించారు.  చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన రైతు శ్రీ శేషాద్రి రెడ్డి  రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకుండా తయారు చేసిన బెల్లం చైర్మన్ , ఈవో కు రుచి చూపించారు . తమకు మద్దతు ధర ఇచ్చి చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు.

    ఈ  సందర్బంగా రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నవధాన్యాలు , ఆకు కూరలు , కూరగాయలతో వేసిన ముగ్గును చైర్మన్ పరిశీలించారు. అంతకు ముందు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నోడల్ గోశాలల నిర్వాహకులు  శశిధర్ (నంద గోకులం గోశాల నెల్లూరు )  హరి ప్రభు ( ఇస్కాన్ గోశాల చిన్న గొట్టిగల్లు )  హరి కృష్ణ స్వామి (ముక్తి ధామం గోశాల దువ్వూరు వై ఎస్ ఆర్ జిల్లా )   వెంకట రాఘవులు (ఉంగుటూరు పశ్చిమ గోదావరి జిల్లా ) కు  చైర్మన్ ,టీటీడీ ఈవో పంచగవ్య  మెడిషనల్ కిట్ అందించారు.

Tirumala

2022-08-25 13:59:28

అక్టోబరు నుంచి శతశాతం చెత్తసేకరణ

ఇంటింటి చెత్త సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు నాటికి శ‌త‌శాతం జ‌ర‌గాల‌ని, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ శాంతి ప్రియ పాండే ఆదేశించారు. దీనికోసం ఇప్ప‌టినుంచే అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాల‌ని సూచించారు. విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాలకు చెందిన‌ ఎంపిడిఓలు, ఈఓపిఆర్‌డిలు, గ్రామ కార్య‌ద‌ర్శుల‌కు స్థానిక జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో గురువారం వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ప‌లు అంశాల‌ను వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ శాంతి ప్రియ పాండే మాట్లాడుతూ, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పంలో భాగంగా చేప‌ట్టిన క్లాప్‌ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం, రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి కి ఎంతో ప్రియ‌మైన‌ద‌ని పేర్కొన్నారు. ఇది సంపూర్ణంగా విజ‌య‌వంతం కావాలంటే, ప్ర‌జ‌ల దృక్ఫ‌థంలో మార్పు తేవాల‌ని, అందుకు అధికారులు కృషి చేయాల‌ని కోరారు. ప్ర‌స్తుతం సుమారు 60 శాతం ఇళ్ల నుంచి మాత్ర‌మే చెత్త సేక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని, అక్టోబ‌రు నాటికి శ‌త‌శాతం జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప్ర‌తీ ఇంటికీ రెండు చెత్త బుట్ట‌ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని, వాటిని స‌క్ర‌మంగా వినియోగించేలా చైత‌న్య ప‌ర‌చాల‌న్నారు. ప్ర‌తీ ఇంటినుంచి చెత్త‌ను సేక‌రించ‌డంతోపాటు, వాటిని త‌డిచెత్త‌, పొడిచెత్త‌గా విభ‌జించి, త‌డిచెత్త‌నుంచి సేంద్రీయ ఎరువును త‌యారు చేయాల‌న్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్‌డ‌బ్ల్యూపిసి కేంద్రాల‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాల‌ని, అవి లేనిచోట తాత్కాలిక ఏర్పాట్లు ద్వారానైనా ఎరువును ఉత్ప‌త్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. సేక‌రించిన ప్లాస్టిక్‌ను నిర్ధేశిత కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని, ప్లాస్టిక్ ర‌హిత గ్రామాలుగా రూపొందించాల‌ని సూచించారు.

               సిరా (స‌ర్వైలెన్స్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ రెస్పాన్స్ అనాల‌సిస్‌) ప్రాధాన్య‌త‌ను క‌మిష‌న‌ర్ వివ‌రించారు. పారిశుద్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం ఎంత ముఖ్య‌మో, వాటిని జెఎస్ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. క్షేత్ర‌స్థాయిలో చోటుచేసుకున్న లోపాల‌ను తొల‌గించడానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. పారిశుధ్యం అన్న‌ది ఒక అత్య‌వ‌స‌ర కార్య‌క్ర‌మని, ఇది సాంకేతిక ప‌ద్ద‌తుల్లో చేయాలే త‌ప్ప‌, సొంత ప‌ద్ద‌తుల‌ను అవ‌లంబించ‌వ‌ద్ద‌ని సూచించారు.  ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయ‌డం, వీడియో కాల్‌ ద్వారా ప‌ర్య‌వేక్షించ‌డం, సిటిజ‌న్ యాప్ ద్వారా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించ‌డం చేయాల‌న్నారు. త‌ర‌చూ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకొని, పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత మెరుగుప‌ర్చుకోవాల‌ని సూచించారు. అధికారులు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకొని పారిశుధ్యాన్ని ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. ఎంపిడిఓలు క‌నీసం రెండు నుంచి మూడు గ్రామాల‌ను, ఈఓపిఆర్డీలు, డిఎల్‌పిఓలు ఐదు గ్రామాల‌ను, డిపిఓ, జెడ్‌పి సిఇఓలు రెండు గ్రామాలు చొప్పున ద‌త్త‌త తీసుకోవాల‌ని కోరారు. గ్రామ కార్య‌ద‌ర్శ‌లు తాము ప‌నిచేస్తున్న గ్రామాల‌ను ద‌త్త‌త గ్రామాలుగా భావించి, అంకిత‌భావంతో పారిశుద్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు.

                ఈ వ‌ర్క్‌షాపులో జిల్లా పంచాయితీ అధికారి ఎస్‌.ఇందిరా ర‌మ‌ణ‌, జెడ్‌పి డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, శ్రీ‌కాకుళం జిల్లా జెడ్‌పి సిఇఓ రావాడ రామ‌న్‌, పంచాయితీ అధికారి వి.ర‌వికుమార్‌,  ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-25 13:32:43

నేతన్న నేస్తం పధకంతో 706 మందికి లబ్ధి

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద రాష్ట్రంలో అర్హులైన వైఎస్ ఆర్ నేతన్న నేస్తం" లబ్ధిదారులకు వరుసగా నాలుగవ  ఏడాది ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని  కృష్ణా జిల్లా,  పెడన మండలం తోటమూల గ్రామం నుండి గురువారం  బటన్ నొక్కి నగదు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జమ చేశారు. ఈ కర్యంక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియం లో లైవ్ ఏర్పాటు గావించారు.  ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, చేనేత శాఖ ఏ.డి మురళీ కృష్ణ, చేనేత కార్మికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమ చేసిన అనంతరం జిల్లాకు చెందిన 706 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 24 వేల రూపాయలు చొప్పున మొత్తం ఒక కోటి  81 లక్షల  రూపాయల  మెగా చెక్కును జిల్లా  కలెక్టర్, చైర్మన్ చేతుల మీదుగా  అందజేశారు. 

 అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీని వాస రావు మీడియా తో మాట్లాడుతూ  ఇచ్చిన మాట ప్రకారం నేతన్నలకు  వరుసగా నాల్గవ సారి కూడా  ఆర్ధిక సహాన్ని అందించడం ముఖ్య మంత్రి గారి చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. అంతే కాకుండా నేతన్నల శ్రమ, ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని వారికి  50 ఏళ్ళు నిండగానే  పింఛన్ సదుపాయాన్ని క్షల్పించిన  ముఖ్యమంత్రి కి బీసీ లందరూ అండగా నిలవాలని కోరారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కోన్నారు. నేతన్న నేస్తం క్రింద అందిన ఆర్ధిక సహాయం తో మగ్గాలు,అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని కొనుక్కొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. గతంలో పనిచేసిన  ప్రభుత్వం బలహీన వర్గాలను విస్మరించారని, బాధ్యత గా వ్యవహరించక పోవడం వలనే మరింత బలహీనులయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను , సమస్య లను గుర్తిస్తూ పని చేస్తున్నామని, అందుకు ప్రజలు మద్ధతు తెలపాలని కోరారు.

Vizianagaram

2022-08-25 13:30:13

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన  కాకినాడ 9వ డివిజన్‌ గొడారిగుంట సీతారామనగర్‌తోపాటు సాంబమూర్తినగర్‌ ప్రాంతాల్లో ఎంహెచ్‌వో డాక్టర్‌ ఫృద్వీచరణ్‌తో కలిసి పర్యటించారు. అక్కడక్కడ డెంగీ కేసులు నమోదు అవుతున్న నేపద్యంలో ఆయా ప్రాంతాల్లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్, దోమలు వృద్ధి చెందకుండా తీసుకుంటున్న చర్యలను కమిషనర్‌ సమీక్షించారు. స్వయంగా దోమల నియంత్రణ కోసం చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  దోమల నియంత్రణ, కు నగరపాలక సంస్థ ద్వారా తీసుకునే చర్యలకు తోడు ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన నీటిలో డెంగీ కారక దోమ వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగించి పక్కన పెట్టిన కొబ్బరి బొండాలు, టైర్లు, పూలకుండీలు వంటిచోట్ల వర్షపునీరు నిలిచి ఉంటే అక్కడ  డెంగీ కారక దోమ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.  ఎప్పటికప్పుడు అటువంటి నీటిని తొలగించడంతోపాటు  స్వచ్ఛమైన నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఏఏ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఉందో సంబంధిత ఎఎన్‌ఎంలు, మెడికల్‌ ఉద్యోగులు ద్వారాను, యాప్‌లు ద్వారా గుర్తిస్తున్నామన్నారు. వెంటనే గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ చెప్పారు.

Kakinada

2022-08-25 12:59:18

స్పందన పై 2రోజులు శిక్షణా తరగతులు

స్పందన వినతులు పరిష్కారంపై ఆగస్టు 30, సెప్టెంబరు 1వ తేదీన రెండు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారంపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో గ్రామ, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శిక్షణా తరగతులు నిర్వహించాలని అన్నారు. శాఖల వారీగా ఎక్కువగా వచ్చే వినతులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. వాటిని పక్కాగా, నాణ్యతతో పరిష్కారానికి సమగ్రమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన చెప్పారు. శిక్షణ అనంతరం స్పందన వినతులు పరిష్కారంలో సంతృప్తికర వాతావరణం రావాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపి సంతృప్తి చెందాలని ఉద్బోధించారు. ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో శాఖలు చేపడుతున్న చర్యలను గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుండి స్వయంగా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది నుండి అందరికీ స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-25 12:25:22

శత శాతం పనులు గ్రౌండింగ్ కావాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు క్రింద మంజూరైన భవన నిర్మాణ పనులు శత శాతం గ్రౌండింగ్ కావాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు. విద్యాశాఖ మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనుల పురోగతిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్  సురేష్ కుమార్ తో కలసి  గురువారం  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రభుత్వ  జూనియర్ కళాశాలలు, అంగన్వాడి, పాఠశాల భవనాలు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పాలనా అనుమతులు, రివాల్డింగ్ ఫండ్ జమ చేయాలని అన్నారు. లక్ష్యాల పూర్తికి పనుల వేగం పెంచాలన్నారు.   స్కూల్ నిర్వహణ నిధులతో పాటశాలల మరామత్తులను చేపట్టేందుకు వినియోగించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నాడు నేడు క్రింద మంజూరైన పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ గౌరీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఓ.ప్రభాకర రావు,  గిరిజన సంక్షేమ శాఖ ఈఈ జె. శాంతిశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-25 12:22:55

ఏపీఎంఐపీ పీడీగా శ్రీనివాసరావు

పార్వతీపురం మన్యం జిల్లా సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు (ఏపిఎంఐపి) ప్రాజెక్టు డైరెక్టర్ గా ఎల్.శ్రీనివాస రావు బాధ్యతలను స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా సూక్ష్మ నీటి పారుదల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చేలా రైతులకు మేలు చేకూర్చలని కలెక్టర్ సూచించారు. ఈయన నెల్లూరు ఉద్యాన వన అధికారిగా పనిచేసి పార్వతీపురం మన్యం జిల్లాకు సూక్ష్మ నీటి పారుదల శాఖ అధికారిగా వచ్చారు.

Parvathipuram

2022-08-25 09:46:11

ప్రతీశాఖ అధికారి డిడిఓగా నమోదు కావాలి

ప్రతి శాఖ  డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఖజానాలో నమోదు కావాలని, టాన్ (టి.ఏ.ఎన్) నంబర్లు విధిగా పొందాలని జిల్లా ఖజానా, గణాంక శాఖ అధికారి కవిటి మోహన రావు అన్నారు. సి.ఎఫ్.ఎం.ఎస్, పే రోల్, ఖజానా ప్రక్రియ ద్వారా జరుగుతున్న చెల్లింపులపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారుల(డిడిఓలు)తో జిల్లా ఖాజానా కార్యాలయంలో గురు వారం సమావేశం నిర్వహించారు. 2018 సంవత్సరంలో సి.ఎఫ్.ఎం.ఎస్ విధానం అమలు ప్రారంభం అయిందన్నారు. ఈ విధానం మరింత సమర్ధవంతంగా అమలు చేయుటకు, వేగంగా చెల్లింపులు చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇందుకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సిపిఎస్  ఉద్యోగులు తమ వివరాలను ప్రతి మార్చి 31 నాటికి  పరిశీలించుకోవాలని ఆయన చెప్పారు. వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే స్పందించి పరిష్కారం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఖజానా శాఖకు తెలియజేయాలని కోరారు. నాలుగవ తరగతి ఉద్యోగుల జి.పి.ఎఫ్ వివరాలు నమోదును పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి తన వ్యక్తిగత మొబైల్ ను అనుసంధానం చేసుకోవాలని ఆయన కోరారు. 

పింఛనర్ల వివరాలు అందించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో పింఛనర్లు మృతి చెందినా వివరాలు అందించటం లేదని ఆయన చెప్పారు. జీతాల బిల్లులతో కలిపి ఇతర బిల్లులు సమర్పించరాదని ఆయన అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న ఉద్యోగులు ప్రతి నెల జీతం నుండి కొంత మొత్తాన్ని చెల్లింపు చేయడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.  పలువురు డి.డి.ఓలు మాట్లాడుతూ సి.ఎఫ్.ఎం.ఎస్, పే రోల్ కాకుండా అన్ని రకాల బిల్లులు ఒకే విధానంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు ఏ.మన్మథ రావు, కె.శ్రీనివాస రావు, సబ్ ట్రెజరీ అధికారి పి.ప్రసాద్, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డిడిఓలు), పింఛనర్లు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-25 09:43:51

జిల్లాలో .64.32 లక్షలు "నేతన్న నేస్తం"

అనకాపల్లి జిల్లాలో 268 మంది చేనేత పని వారికి నాలుగవ విడత "నేతన్న నేస్తం" పథకంలో రూ.24 లక్షల 32 వేలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు వైయస్సార్ జగనన్న నేస్తం చెక్కును అందజేశారు. నాలుగు సంవత్సరాలుగా ఈ పథకంలో 1174 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల 81 లక్షల 76 వేలు ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 50 సంవత్సరాలు నిండిన 2747 మంది చేనేత కార్మికులకు చేనేత మరియు జౌళి శాఖ  ద్వారా నెలకు రూ. 2,500/- చొప్పున మొత్తం రూ.68 లక్షల 67 వేల 500 అందిస్తున్నారన్నారు. 'ముద్ర' పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 29 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల 50 వేలు 20 శాతం మార్జిన్ మనీ గా అందజేసినట్లు చెప్పారు.

అంతకుముందు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం తోటమూల గ్రామంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న నేతన్న నేస్తం బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని చేనేత కార్మికులు నాయకులతో కలిసి కలెక్టర్ వీక్షించారు.  ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. పి. వెంకటరమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీసెట్టి వరాహ సత్యవతి, అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కన్వీనర్ రామ లక్ష్మణ రావు ఏపీ వీవర్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. రాజారావు, సంఘాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-08-25 09:06:27

నేతన్న నేస్తం క్రింద రూ.2.44 కోట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2022 - 23 వ సంవత్సరం లో నాలుగో విడతలో అర్హులైన 1017 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 44 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి.తెలిపారు. చేనేత కుటుంబాలకు స్వంత మగ్గం ఆధునికీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు ఈ పథకం ఉద్దేశించబడినదని కలెక్టర్ తెలిపారు.ప్రతీ సంవత్సరం 24,000 రూపాయల చొప్పున అర్హులైన  ప్రతీ చేనేత కుటుంబాలకు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2019 - 20వ సంవత్సరంలో మొదటి విడతలో అర్హులైన 854 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద 2020 - 21వ సంవత్సరంలో రెండవ విడతలో అర్హులైన 1067 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 56  లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేశారని పేర్కొన్నారు.
 ఈ పథకం కింద 2021 - 22వ సంవత్సరంలో మూడవ విడతలో అర్హులైన 779 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున కోటి  87 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి తెలిపారు.

  ఈరోజు  కృష్ణా జిల్లా పెడన నుంచి వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం నేరుగా జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పాల్గొనగా.. భీమవరం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి., చేనేత జౌళి శాఖ ఎడి కె.అప్పారావు,  ఏ డి ఓ కె. చేతన్ , చేనేత లబ్ధిదారులకు 2.4 కోట్ల రూపాయలు చెక్కును అందచేశారు.

Bhimavaram

2022-08-25 07:50:02

ప్రజాధనంతో పార్లే సంస్థకు ప్రచారం దారుణం

మహా విశాఖ నగర ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల డబ్బుతో  పార్లే సంస్థకు ప్రచారం చేయడం సిగ్గుచేటని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. బీచ్  క్లీన్ బాధ్యతలు పార్లే సంస్థకు అప్పగించడానికి ఒప్పందం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెచ్చించి బీచ్ క్లీన్ చేసి ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. బీచ్ లోని ఆక్రమణలు తొలిగించాలని కోరుతూ గురువారం జీవీఎంసీ మేయర్, కమిషనర్ కు  ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ బీచ్ క్లీన్ మెగా డ్రైవ్ పేరుతో  విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్ లో చెత్తను వ్యర్ధాలను తొలగించెందుకు 25 వేల మందితో  భారీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమే కానీ,  దాని కంటే ముందు అసలు బీచ్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  విశాఖ తీరంలో పెద్ద ఎత్తున కోస్తా నియంత్రణ మండలి ( సీ ఆర్ జడ్ ) ఉల్లంఘనలు జరిగాయన్నారు. గతంలో   సీఆర్జెడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై  చర్యలు తీసుకున్నారన్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అప్పట్లో కూల్చివేసిన వన్నీ తిరిగి వెలిశాయని చెప్పారు. వాటికి అనుబంధం గా  కొత్త కొత్తవి వచ్చి చేరాయి. గతంలో ఏ ప్రభుత్వం లోనూ ఎన్నడూ లేని విధంగా సముద్రంలోకి ఇసుకతిన్నెలపై కి వెళ్లి కాంక్రీట్ తో పెన్షింగ్ లు వేస్తున్నారన్నారు. రెవెన్యూ, వుడా,మున్సిపల్ అధికారులు పరోక్షంగా ఈ కబ్జాదారులకు  సహకరిస్తున్నారన్నారని ఆరోపించారు. అసలు బీచ్ లో వ్యరథాలు అనేవి ఉంటే వాటిని శుభ్రం చేయవచ్చు.  అదే కబ్జాకు గురైతే చేయటానికి ఏమీ ఉండదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టే  ముందు బీచ్ ఆక్రమణలపై దృష్టిసారించాలన్నారు. వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు.

 విశాఖ నగరం లో భాగమైన జోడుగుళ్ల పాలెం, సాగర్ నగర్,  రాడిసన్ హోటల్ ప్రాంతం, రిషి కొండ ప్రాంతం, కాపులుప్పాడ భీమిలి తీరాల్లో పెద్ద ఎత్తున కబ్జాలకు ఆక్రమణలకు గురైందని తెలిపారు. కోస్తా నియంత్రణ మండలి ఉల్లంఘనల భారీగా జరిగాయయని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా కేవలం ప్రచారం కోసం అవార్డు ల కోసం ఉత్తుత్తి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చివరికి అపహాస్యంగా మిగిలిపోతుందన్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని  సముద్ర తీర ప్రాంతాల కబ్జాలపై  చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.  బీచ్ ను కాంక్రీట్ జంగిల్ గా మార్చడం హోటళ్లు షాపులు వంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల అవి సాంఘిక కార్యక్రమాలకు, నైట్ పార్టీ లకు,  గంజాయి సరఫరా కు వేదికలుగా మారుతున్నాయన్నారు. వీటిని  తొలగించి గతంలో మాదిరిగా తీర రక్షణ కోసం షెల్టర్ బెల్ట్  ప్లాంటేషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీచ్ లో  అక్రమ నిర్మాణాల వల్ల జీవీఎంసీ ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోందన్నారు. 

 ప్రైవేట్ సంస్థ కోసం జిల్లా లోని ఐఏఎస్ లు,  మంత్రులు వారం రోజులుగా పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రైవేటు సంస్థ ప్రచారం కోసం పని చేయడం మాని ప్రభుత్వ విధులు నిర్వర్తించాల్సిన గా విజ్ఞప్తి చేశారు.  పార్లే సంస్థకు ఇప్పటివరకు విశాఖలో ఎక్కడ రీసైక్లింగ్ యూనిట్లు లేవు. రేపు బీచ్ లోని  40 పాయింట్ల్లో  సేకరించే చెత్త ను  తిరిగి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్నారు. దీని వల్ల ఇంత పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం ఫలితాలు కనిపించవన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ధనం కోట్ల రూపాయల ను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్నారన్నారు. వీటిపై దృష్టి సారించి జరిగిన లోపాలను సరిదిద్దాల్సినదిగా విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2022-08-25 07:38:33

పేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చండి

పేద‌లంద‌రికీ ఇళ్లు ఇవ్వాల‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ సంక‌ల్పానికీ.. సొంతింటి క‌ల నెర‌వేర్చుకో వాల‌ని తాప‌త్ర‌యం ప‌డుతున్న‌పేద ప్ర‌జ‌ల సంతోషానికి మ‌ధ్య వార‌థులుగా నిల‌వాల‌ని జిల్లా గృహ నిర్మాణ శాఖ‌ అధికారుల‌ను ఉద్దేశించి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాహుల్ పాండే పేర్కొన్నారు. స‌మ‌న్వ‌యంతో ముందుకెళ్లి పేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని సూచించారు. నిర్మాణాలు జోరుగా సాగేందుకు ఉన్న ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోరాద‌ని.. నిర్దేశించిన ల‌క్ష్యాలు చేరుకునే వ‌ర‌కు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాల‌ని హితవు ప‌లికారు. న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా జిల్లాలో చేప‌ట్టిన‌ ఇళ్ల నిర్మాణాల ప్ర‌గ‌తిపై, ఓటీఎస్ ప్ర‌క్రియ పురోగ‌తిపై స్థానిక డీఆర్డీఏ స‌మావేశ మంద‌రింలో గృహ నిర్మాణ శాఖ అధికారుల‌తో గురువారం ఆయ‌న స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు.

నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకుంటూ ఇళ్ల నిర్మాణాల్లో మ‌రింత‌ ప్ర‌గ‌తి సాధించాల‌ని రాహుల్ పాండే పేర్కొన్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్లు క‌ట్టుకునేలా ప్రోత్సాహం అందించాల‌ని సూచించారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నలో ఉత్సాహం ప్ర‌ద‌ర్శించాల‌ని ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాలని నిర్దేశించారు. ఇంటి నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన వ‌న‌రులు ఇసుక‌, సిమెంటు, ఇనుము నిర్ణీత కాలంలో అంద‌జేయాల‌ని, బిల్లుల ప్రక్రియ‌ను ఎప్ప‌టికప్పుడు పూర్తి చేసుకోవాల‌ని సూచించారు. జిల్లాలోని అన్ని లేఅవుట్లలో తాజా ప‌రిస్థితిపై రూపొందించిన నివేదిక‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌రిశీలించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే మాదిరి పురోగ‌తి సాధించేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఓటీఎస్ ప్ర‌క్రియ ద్వారా స‌మ‌కూరిన నిధులు, వాటి వినియోగం గురించి పీడీని అడిగి తెలుసుకున్నారు. ఈ స‌మావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ ర‌మ‌ణ మూర్తి, ఈఈ శ్రీ‌నివాస‌రావు, డీఈలు, ఏఈలు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-25 07:33:46