1 ENS Live Breaking News

స‌చివాల‌యాల్లో 2రోజులు ఈ-శ్ర‌మ్ రిజిస్ట్రేష‌న్

అసంఘ‌టిత రంగ కార్మికుల ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-శ్ర‌మ్ ప‌థ‌కంలో చేరేందుకు ఇంకా రిజిస్ట్రేష‌న్ చేయించుకోనివారి కోసం ఆగ‌స్టు 30, 31వ తేదీల్లో ప్ర‌త్యేకంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌త్యేకాధికారి బాలాజీ తెలిపారు. ఈ ప‌థకంలో చేర‌టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టే అన్ని పథకాలను పొంద‌వ‌చ్చ‌ని, ప్ర‌మాదాలు లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల చ‌నిపోయిన వారికి రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక సాయంతో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. కావున జిల్లాలోని అసంఘటిత రంగంలో ప‌ని చేస్తున్న‌ వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, వాలంటీర్లు, కొరియర్ బాయ్స్, చిల్లర వర్తకులు, తోపుడు బండి వర్తకులు, పాల వ్యాపారులు, చేతి వృత్తి పనివారు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలకు చెందిన స‌భ్యులు త‌దిత‌రులు స‌మీపంలోని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాల‌ని ఆయ‌న సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా  కోరారు. మొబైల్ నెంబ‌ర్‌తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా మొద‌టి పేజీ జెరాక్సు కాపీల‌ను స‌చివాల‌యంలో అంద‌జేయాల‌ని సూచించారు.

Vizianagaram

2022-08-29 13:01:53

నులిపురుగుల దినోత్సవంపై అవగాహన

విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 8,9 తేదీలు లో జరిగే నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమన్నీ పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో విజయవంతం అయ్యేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు పనిచేయాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె ఛాంబర్ లో డి-వార్మింగ్ కార్యక్రమం పై జిల్లా ప్రాధమిక ఆరోగ్య కేంద్రల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్లు ఆయా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో ఉండే పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో ఉండే టీచర్లు, లైన్ డిపార్ట్మెంట్లు తో ఏ.ఎన్. ఎం. , ఆశా వర్కర్స్ సహాయం తీసుకొని ప్రేత్యేక అవగాహన సమావేశం నిర్వహించాలని తెలిపారు. 

అలాగే ఒకటవ ఏడాది పిల్లలు నుండి 19 ఏళ్ళు వయసు కలిగిన పిల్లలు వరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి టీచర్ పర్యవేక్షణ లో
అల్బెన్డ్ జోల్ మాత్ర మింగకుండా, చప్పరించే విధంగా చూడాలి అని తెలిపారు. ఈ మాత్రలు ఆరోగ్యం బాగోలేని వారికి, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారికి వెయ్యదు అని తెలిపారు. సెప్టెంబర్ 8,9 తేదీల్లో  అనివార్య కారణాలు వల్ల రాలేని వారికి , తిరిగి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగే మాప్ అప్ డే లో మాత్రలు వెయ్యాలి అని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు చేతికి మాత్రలు ఇవ్వవద్దు అని, అంగన్ వాడి , పాఠశాల, కళాశాలలో మాత్రమే వెయ్యాలి అని తెలిపారు.   ప్రతి పి.హెచ్.సి లో అల్బెన్డ్ జోల్ మాత్రలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ పి.రవి కుమార్, డి.ఈ.ఐ.సి. మేనేజర్ లోకనాధ్, తదితరులు పోల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 12:59:20

విశాఖలో ఘనంగా తెలుగుభాష జయంతి..

దేశంలో ఎన్ని భాషలు వాడుకలో  ఉన్న తెలుగు భాష తియ్యదనం కలిగిన భాష అని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున  అన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఉడా చిల్డ్రన్ ధియేటర్ లో  తెలుగు భాషా దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా కలెక్టర్  డా. ఏ మల్లిఖార్జున పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాన్ని సరళీకరించి,  తెలుగు భాష తీయ్యదనాన్ని సామాన్యునికి చేరేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులుగారన్నారు. తెలుగు భాష సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా  నిలిచిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. పాఠశాలల్లో, విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు 5 నిమిషాల పాటు ఇంగ్లీషు పదాలు  ఉపయోగించకుండా  మాట్లాడటం, వ్రాయడం వంటి  కాంపిటీషన్స్ నిర్వహించాలన్నారు. ప్రజలు సందర్శించే ప్రదేశాల్లో తెలుగు లో  హోర్డింగులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలుగు అధికార భాష సంఘం అద్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ గ్రాంధిక భాష నుండి సంకెళ్ళు విడిపించి తెలుగు భాష  సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో  వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం అన్నారు. భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి  శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశంలో హిందీ తర్వాత తెలుగు భాష చరిత్ర కలిగిన భాష అని అన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇతర భాషలు  ఎన్ని నేర్చుకున్నా, తెలుగు భాష కమనీయ తియ్యదనం మర్చిపోకూడదన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రాంధిక భాష లో విద్యనభ్యసించినచో సామాన్య ప్రజలకు అర్థం కాదని, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో వాడుకలోకి తెలుగు భాష తీసుకు రావడానికి గిడుగు - పిడుగై సపళీకృతం కాగలిగారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఉన్నంత కాలం తెలుగు భాష ఉంటుందని తెలిపారు.

అంతకు ముందు  జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా  రాష్ట్ర స్థాయి లో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన 44 మంది మహనీయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో  ఎ యూ  వైస్ ఛాన్సలర్ ప్రసాదరావు, ఉడా  చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జెడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర , ఎమ్ ఎల్ సి వరుదు కళ్యాణి,  వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు  కెకె రాజు, చొక్కాకుల లక్ష్మి, మధుసూదనరావు, వంగపండు ఉష, కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జున రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-29 10:35:03

తెలుగు మాధుర్యాన్ని అందించిన గిడుగు

పండితులకు మాత్రమే పరిమితమైన భాషను ప్రజలందరి వాడుక భాషగా రూపుదిద్దేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు, సంస్కర్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు అన్నారు. తెలుగుభాషతో పాటు సవర లిపి కనుగొని భాషోధ్యమానికి చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహుదూర్ అని బిరుదాకింతులు పొందిన కీర్తి గిడుగు సొంతమన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు నూతన విగ్రహాన్ని కమిషనర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాధుర్యాన్ని సామాన్య ప్రజల చెంతకు చేర్చిన ఘనత గిడుగుదే అన్నారు. సరుబుజ్జిలి మండలం పర్వతాల పేటకు చెందిన గిడుగు ఖ్యాతి తెలుగు భాష మాదిరిగా ఖండాంతరాలు వ్యాపించిందన్నారు. 

ప్రభుత్వం మాతృభాషలోని పరిపాలన ప్రజలకు అందించే దిశగా ఎన్నో చర్యలు చేపట్టిందని కమిషనర్ వివరించారు. ప్రజల భాష ఎప్పుడూ సజీవంగా ఉండేందుకు పౌర సమాజం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పరిపాలనలో తెలుగు భాష వాడకం పెరిగిందని కమిషనర్ తెలిపారు. జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, మేనేజర్ రమణ బృందం గిడుగు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విగ్రహదాత, హిందీ ఉపాధ్యాయులు మందపల్లి రామకృష్ణను కమిషన  పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. అలాగే తెలుగు తల్లి వేషధారణలో గాయత్రీ, నృత్య శిక్షకురాలు సుశీల బృందాన్ని మెమెంటో ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర సమన్వయ బృందం సురంగి మోహన్‌రావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్, మహిబుల్లాఖాన్, పొన్నాడ రవికుమార్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, గుత్తు చిన్నారావు, నిక్కు హరిసత్యనారాయణ, తర్జాడ అప్పలనాయుడు తదితరులున్నారు.

Srikakulam

2022-08-29 07:25:40

తెలుగుభాష గొప్పతనం చాటిచెప్పిన గిడుగు

తెలుగు భాష ప్రాశ‌స్త్యాన్ని ప్ర‌పంచ దేశాల‌కు చాటి చెప్ప‌టంలో.. తెలుగు భాష‌ ఔన్న‌త్యాన్ని కాపాడ‌టంలో విశేష‌మైన పాత్ర పోషించిన మ‌హ‌నీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. నిత్యం జీవితంలో వినియోగించే భాష‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేస్తూ సుల‌భ‌త‌ర రీతిలో ర‌చ‌న‌లు సాగించిన ఘ‌నుడు అని కీర్తించారు. తెలుగు భాషకు ఒక అంద‌మైన భావాన్ని తీసుకొచ్చి ప్రాముఖ్య‌త‌ను పెంచ‌టంలో ఎన‌లేని కృషి చేశార‌ని కొనియాడారు. తెలుగు వ్య‌వ‌హారికా భాషోద్య‌మ పితామ‌హుడు గిడుగు రామ్మూర్తి పంతులు జ‌యింతిని పుర‌స్క‌రించుకొని క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం తెలుగు భాషా దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గిడుగు రామ్మూర్తి పంతులు చిత్ర‌ప‌టానికి క‌లెక్ట‌ర్, డీఆర్వో, ప్ర‌త్యేక ఉప‌క‌లెక్ట‌ర్లు, జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాష ఔన్న‌త్యాన్ని కాపాడ‌టంలో పోషించిన పాత్ర గురించి.. చేసిన కృషి గురించి వివ‌రించారు. ఆయ‌న‌కు స్పందించే గుణం ఎక్కువ అని అందుకే ప్ర‌జ‌లు వినియోగించే వాడుక ప‌దాల ఆధారంగా ఎన్నో ర‌చ‌న‌లు చేశార‌ని గుర్తు చేశారు. స‌వ‌ర భాష‌పై ప్ర‌త్యేక‌మైన ప‌రిశోధ‌న చేసి దానికి ప్ర‌త్యేక గుర్తింపును క‌ల్పించార‌ని చెప్పారు. రామ్మూర్తి పంతులు చేప‌ట్టిన‌ ఉద్యమం వల్ల కొంద‌రికే పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింద‌ని వివ‌రించారు. ఆయ‌న జీవిత‌మంతా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే సాగింద‌ని గుర్తు చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులును ఆద‌ర్శంగా తీసుకొని ఈ రోజు నుంచి మ‌నంద‌రం సాధ్య‌మైనంత మేర‌కు తెలుగు భాష‌లోనే ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌రుపుదామ‌ని ఈ సంద‌ర్భంగా కలెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఆక‌ట్టుకున్న చిన్నారుల ప్ర‌ద‌ర్శ‌న‌
గిడుగు రామ్మూర్తి పంతులును అభిన‌యిస్తూ సంగీత క‌ళాశాల‌ విద్యార్థులు చేసిన ప్ర‌ద‌ర్శ‌న చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. తెలుగు భాషకు గిడుగు చేసిన కృషిని తెలుపుతూ ప్ర‌ద‌ర్శ‌న సాగింది. చిన్నారుల‌ను క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ప్ర‌త్యేకంగా అభినందించారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో గ‌ణ‌పతిరావు, ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు సూర్య‌నారాయ‌ణ రాజు, సుద‌ర్శ‌న దొర‌, జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి ర‌మేశ్‌, జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 06:59:47

జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో మెలగాలి

వర్కింగ్ జర్నలిస్టులు చేస్తున్న వ్రుత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు అవసరమైన మెళకువలను నేర్చుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి, వాస్తవాలను త్వరిగతిన ప్రజలకు చేరవేయడానికి ఆస్కారం వుంటుందని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పూర్వ ఉప కులపతి ఆచార్య బాల మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. ఆదివారం అల్లూరి సీతారామజరాజు స్మారక విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నిర్వహించిన ఒక రోజు పునఃశ్చరణ  తరగతులులో ఆచార్య వి. బాలమోహన్ దాస్ మాట్లాడుతూ, పలు అంశాలను ప్రస్తుతించారు. జర్నలిస్టులు అంకిత భావం, సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాలన్నారు. చేస్తున్న పనిలో మరింత విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను కలిగి ఉండాలన్నారు. దానిని ఆచరణలో అమలు చేసుకుని స్వీయ వృద్ధిని సాధించుకోవాలన్నారు. రాసే వార్తా కథనాలు, న్యూస్ అన్ని పత్రికల్లోనూ ఒకే రీతిగా ఉండకూడదనీ చెప్పారు. అలా ఉంటే కాపీ న్యూస్ పాఠకులు భావించే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు తమని తాము సాంకేతికత పరంగా వృద్ధి చేసుకోవాలన్నారు. స్మార్ట్ సిటి రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, చాలా కాలంగా అనుకుంటున్న వర్కింగ్ జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు ఎన్ఎన్ఆర్ సహకారంతో నిర్వహించినట్లుగా చెప్పారు. ఈ వర్కు షాప్ నిర్వహణ సాటి జర్నలిస్టుగా, నిర్వాహక సంస్థ వ్యవస్థాపకునిగా తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు విధి నిర్వహణలో నైపుణ్యాలనూ, మెళకువలనూ తెలిపే వర్కుషాపుల నిర్వహిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వర రావు  మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించడం ప్రభుత్వం చేసినట్లుగా బంగారు  అశోక్ కుమార్  రూపొందించారన్నారు. నెల రోజుల కృషి ఫలితం ఇందులో ఉందన్నారు. నిధుల సమీకరణ మొదలు అనేక ప్రయాశలకు ఓర్చి అధ్యక్షులు అశోక్ కుమార్ వహించిన పాత్ర.. విజయం వర్ణించలేనిదన్నారు. 

నూరు శాతం ప్రయోజనాత్మక  వర్కుషాప్..
ఒక రోజు కార్యశాలలో పలువురు జర్నలిజం ఉద్దండులు తమ ప్రజ్ఞాపాటవాలతో  చైతన్య దీప్తిలుగా నిలిచారు. అయిదు అంశాల్లో అయిదుగురు ఉద్దండులైనా లబ్ధప్రతిష్టులతో నిర్వాహకులు ఏర్పాటు చేసిన గెస్టు లెక్చర్స్ ప్రతి జర్నలిస్టుకూ తమ రంగంలో కొత్త ఉత్సాహాన్ని మార్గదర్శకత్వంను నింపింది. తొలుత ప్రారంభ ఉపన్యాసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విశ్విద్యాలయం శ్రీకాకుళం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ రెడ్డి తిరుపతిరావు వర్త రచన, చట్ట నింబంధనలు, క్రైం న్యూస్ సోషల్ మీడియాలో ఎదురవుతున్న సవాళ్లుపై ప్రసంగించారు. జర్నలిజం బోధకులు, సామాజిక పరిశోధకులూ, నవ  రచయిత డాక్టర్ జికెడి ప్రసాద్ తెలుగు జర్నలిజం నూతన ఆవిష్కరణలు అంశంపైనా,   విజయవాడ నుంచి వచ్చిన సీనియర్ పాత్రికేయులు బి.నగేష్ ఎలక్ట్రానిక్ మీడియాకు వార్తలు రాయడం ఎలా, సవాళ్లు పరిష్కారాలు అంశంపై విశ్లేషనాత్మక ప్రసంగం చేశారు. వార్త రచనలో నూతన పోకడలూ పత్రికలు, టెలివిజన్ మీడియాలపై ప్రభావం అంశం పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ జి. లీలా వర ప్రసాదరావు ప్రసంగించారు. చివరిగా వార్తలు సేకరణ, రచన, భాష, పత్యేక విభాగాలు (బీట్) అంశంపై విశాఖపట్నం రచయిత, సీనియర్ పాత్రికేయులు ఎన్ నాగేశ్వర రావు (ఎన్ఎన్ఆర్ఆ) వివరించారు. అనంతరం బాదంగీర్ సాయి వంటి జర్నలిస్టులు తమ ప్రస్తానం గురించి వివరించారు. కార్యక్రమం నిర్వహణలో కార్యవర్గ సభ్యులూ భాగం అయ్యారు. ఏకబిగిన సాగిన ఈ వర్కుషాప్ లో పాల్గొన్న పాత్రికేయులకు సర్టిఫికేట్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వి. విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన వార్తల ప్రజెంటేషన్ తీరు తెన్నులు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.

Visakhapatnam

2022-08-28 16:26:08

పులి దాడిలో ఆవుల‌కు ప‌రిహారం పంపిణీ

పులి దాడిలో మృతి చెందిన రెండు ఆవుల‌కు రూ.35,000 ప‌రిహారంగా అంద‌జేసిన‌ట్లు జిల్లా అట‌వీ అధికారి ఎస్‌.వెంక‌టేష్ తెలిపారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌నర‌స‌య్య  ఆవుల‌ను కోల్పోయిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు చెక్కు రూపంలో ఆదివారం ఈ స‌హాయం అంద‌జేశామ‌ని పేర్కొన్ంనారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి పులి బోను ర‌ప్పించామ‌న్నారు. వైల్డ్ లైఫ్ రెస్క్యూ వ్యాన్ కూడా జిల్లాలో అందుబాటులో వుంచామ‌న్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పులికి సంబంధించి ఒక ప‌రిష్కారం ల‌భించ‌గ‌ల‌ద‌ని క‌న్స‌ర్వేట‌ర్ ఆశాభావం వ్య‌క్తంచేశారు. ఎవరూ దిగాలు చెందాల్సిన పనిలేదని..పులిని పట్టుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నట్టు అటవీశాఖ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంతో విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-28 16:15:23

ఆ ప్రాంతంలో ఒంటరిగా తిరగడం ప్రమాదం

విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి పులి త‌న ఆవాసాల‌కు చేరే వ‌ర‌కు ప్ర‌జ‌లు సంయ‌మ‌నంతో వుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని విశాఖలోని అట‌వీ సంర‌క్ష‌ణాధికారి(క‌న్స‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్‌) పి.రామ్మోహ‌న రావు కోరారు. ముఖ్యంగా పులి రాత్రి వేళ‌ల్లో తెల్ల‌వారు ఝామున సంచ‌రించే అవ‌కాశం వుంద‌ని, నాలుగు కాళ్ల జంతువుల‌ను ఆహారంగా తీసుకుంటుంద‌ని అందువ‌ల్ల పులి సంచ‌రించే ప్రాంతాల్లో ప్ర‌జ‌లు రాత్రివేళ‌ల్లో ఆరుబ‌య‌ట సంచ‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరారు. జిల్లా అట‌వీ అధికారి ఎస్‌.వెంక‌టేష్‌, పార్వ‌తీపురం స‌బ్ డివిజ‌న‌ల్ అట‌వీ అధికారి బి.రాజారావుల‌తో క‌ల‌సి ఇటీవ‌ల పులి సంచ‌రించిన పులిగుమ్మి, షికారుగంజి గ్రామాల‌ అట‌వీ ప్రాంతం, ప‌రిస‌ర గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప‌ర్య‌టించి పాద‌ముద్ర‌లు ప‌రిశీలించారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారికి జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పులి స్వ‌త‌హాగా బిడియ స్వ‌భావం క‌లిగిన జంతువ‌ని, మ‌నుషుల నుంచి సాధ్య‌మైనంత దూరంగా వుండ‌టానికి ప్ర‌య‌త్నిస్తూ క‌న‌ప‌డ‌కుండా వుండేందుకు ఇష్ట‌ప‌డుతుంద‌న్నారు. ఆక‌స్మాత్తుగా మ‌నుషుల ఉనికిని గ్ర‌హించిన‌ట్ల‌యితే పులి దాడిచేసే అవ‌కాశం వుంటుంద‌న్నారు. అందువ‌ల్ల బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌డం, ప్ర‌జ‌లు ఆరుబ‌య‌ట నిద్రించడం, సంచారం లేని ప్ర‌దేశాల్లో ఒంట‌రిగా తిర‌గ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2022-08-28 16:12:47

సమస్యల పరిష్కారానికే మేమున్నది

కాకినాడ 12వ డివిజన్‌ పర్లోపేటలో శుక్రవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి  డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ళ ప్రభుత్వపాలనలో  ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌లను ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, అధికారులు, కార్పొరేటర్లు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డివిజన్‌ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో రూ కోటి వ్యయంతో మోడ్రన్‌ ఫిష్‌మార్కెట్‌ యార్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ సచివాలయానికి రూ.20లక్షల చొప్పున నిధులు విడుదల చేసేందుకు  ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీని వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ ఇంటికి వెళ్ళి  సమస్యలు తెలుసుకుంటామని ఎలాంటి అంశానైనా పరిష్కరిస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ బెండా విష్ణుమూర్తి,  డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేషన్ కార్యదర్శి ఏసుబాబు, టి పి ఆర్ ఓ కృష్ణమోహన్, డి ఈ మాధవి, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత,  మీసాల శ్రీదేవి, కామాడి సీత,  పినపోతు సత్తిబాబు, గోడి సత్యవతి, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, పలువురు అధికారులు ఉన్నారు.

Kakinada

2022-08-27 13:52:01

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వివిధ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని  వైద్యులను   జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున ఆదేశించారు. శనివారం ఉదయం  స్థానిక ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ నందు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన హాస్పిటల్   డెవలప్ మెంట్ సొసైటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కొరకు మెరుగైన వైద్య సేవలు అందించే కార్యక్రమం లో భాగంగా  షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ ఫండ్ నుంచి 10  కంప్యూటర్లు  కొనుగోలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అవసరమైన  అనస్థీషియా మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది   పోస్టుల మంజూరు కొరకై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రతిపాదనలు సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను  ఆదేశించారు. 

 ఆంధ్ర మెడికల్ కాలేజ్ డెవలప్ మెంట్ ఫండ్ నుండి పి.జి రూమ్ మరియు ఈ-లైబ్రరీలను ఆధునీకరించాలని సూచించారు. రోగుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు నాన్-ఎసి రూములకు రూ.400/- ఏసీ రూములు రూ.500/- గా ఉండాలన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి మహా ప్రస్థానం వాహనం ఏర్పాటు చేసుకోవాలని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలిపారు. నాడు - నేడు కింద ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రభుత్వ  చెస్ట్ ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపులా ఉన్న  చెత్త తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ మెంబర్ డాక్టర్ రవి కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ డి. పుల్లారావు, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి. బుచ్చిరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె. విజయలక్ష్మి, డాక్టర్ టి రమేష్ కిషోర్, డాక్టర్ సునీల్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-27 13:18:21

విజయం సాధించేదాకా విశ్రమించవద్దు

విద్యార్థులు తమకిష్టమైన ఏ రంగంలో అయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి  రజని విద్యార్థినిలకు పిలుపునిచ్చారు  టీటీడీ విద్యాసంస్థ‌ల క్రీడా స‌ల‌హాదారుగా నియ‌మితులైన కుమారి ర‌జ‌ని శ‌నివారం సాయంత్రం టీటీడీ ప‌రిపాల‌న భ‌వనంలో జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా జెఈవో  స‌దా భార్గ‌వి టీటీడీ విద్యాసంస్థ‌ల్లో క్రీడ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, విద్యార్థుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించే దిశ‌గా వారిని ప్రోత్స‌హించాల‌ని ర‌జ‌నికి సూచించారు.జె ఈవో  శ్రీమతి సదా భార్గవి సలహా మేరకు కుమారి రజని శ్రీ పద్మావతి మహిళా డిగ్రి  ,పిజి కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. అనంత‌రం  ర‌జ‌ని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రి, పిజి క‌ళాశాల‌లో విద్యార్థినుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఆమె మాట్లాడుతూ, తాను తిరుపతిలోనే చదివి నిరంతర శ్రమతో అనేక పరాజ‌యాల నడుమ అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజ‌యం సాధించాన‌ని చెప్పారు. 

తన జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. శ్రీ వేంక‌టేశ్వర స్వామి వారి దయతో తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాన‌న్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగం ఏదైనా అందులో వెంటనే ఫలితాలు రాకపోవచ్చుననే విషయం గుర్తించాలన్నారు. జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా వెనుకంజవేయ‌కుండా లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు మానసికంగా అత్యంత ధైర్యంగా ఉండి సమస్యలను ఎదిరించాలని చెప్పారు.

       తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని పాఠశాల దశలో పిఈటి తనకు హాకిని పరిచయం చేశారని ఆమె తన పాఠశాల స్మృతులను విద్యార్థులకు వివరించారు. 2008లో తాను ఇండియన్ హ‌కీ క్యాంప్ కి ఎంపికైనప్పటికీ ఆడే అవ‌కాశం దక్కలేదని ఆమె చెప్పారు. భాషా పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటి గురించి ఆలోచించకుండా తాను లక్ష్యసాధన దిశగా నిరంతర శ్రమ చేశాన‌న్నారు. 2009లో భారత హాకీ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి న్యూజిలాండ్ లో తాను ఆడానని తెలిపారు. ఆంధ్ర నుండి చరిత్ర సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాల‌న్న తన పట్టుదలే తనను ఈరోజు ఈ స్థాయికి చేర్చగలిగిందని ఆమె వివరించారు.

      2019లో జరగాల్సిన హాకీ ఒలంపిక్స్ కు తాను ఎంపికైనా, కరోనా కారణంగా ఒలంపిక్స్ వాయిదా పడ్డాయన్నారు. ఆ సమయంలో తాను ఆందోళన చెందకుండా మరో ఏడాది పాటు నిరంతరం సాధన చేశానని ఆమె చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తమ లక్ష్యసాధన కోసం చివరి నిమిషం దాకా కష్టపడాలని సూచించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో హాకీలో మెడల్ సాధించాలనుకున్న తన కోరిక నెరవేరి 16 సంవత్సరాల తర్వాత భారతదేశానికి పత‌కంతో తిరిగి వచ్చామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహ‌దేవమ్మ ఆధ్వర్యంలో అధ్యాపకులు రజనిని ఘనంగా సన్మానించారు.  ఈ కార్య‌క్ర‌మంలో అధ్యాప‌కులు  విద్యుల్ల‌త‌, భువ‌నేశ్వ‌రి, ఉష‌, ఉమారాణి పాల్గొన్నారు.

Tirupati

2022-08-27 13:12:02

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం

గడచిన మూడేళ్ళలో కాకినాడ ప్రజలకు ప్రభుత్వం రూ.800 కోట్లు విలువైన సంక్షేమ పథకాలు అందించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని 4, 5,9 డివిజన్లలో రూ.3.70 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అలాగే రూ.1.09 కోట్ల వ్యయంతో నాడు–నేడు పథకంలో 9 క్లాస్‌ రూమ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, ఏ డి సి సి హెచ్ నాగ నరసింహారావు, అధికారులు,కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ  తన హయాంలో అమ్మ ఒడి, డ్వాక్రా రుణ మాఫీ, గృహనిర్మాణం, చేయూత వంటి వివిధ పథకాలు ద్వారా కాకినాడ ప్రజలకు ప్రభుత్వం ద్వారా రూ.800 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు.

 నాడు–నేడు పథకంలో రూ.10 కోట్లతో 106 కొత్త తరగతి గదులను కూడా తన హయాలోనే తీసుకొచ్చానన్నారు.  కాకినాడ నగరాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నామని,ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి తక్షణమే పరిష్కరించగలగుగుతున్నామన్నారు. టీడీపీ నేతలు కూడా గడపగడపకు మన ప్రభుత్వంలో తన వెంట వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ సత్యకుమారి, డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, లంకే హేమలత, కంపర బాబి, పలకా సూర్యకుమారి, పేర్ల జోగారావు, ఎంజీకే కిషోర్, గోడితోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Kakinada

2022-08-27 13:09:10

ఈఓడిబి పర్యవేక్షణకు నోడల్ అధికారులు

పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వారికి సహకరించడానికి  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ క్రింద  సింగల్ డెస్క్ పోర్టల్ ను పర్యేక్షించడానికి ప్రతి లైన్ డిపార్ట్మెంట్ నుండి ఒక అధికారిని నోడల్ ఆఫీసర్ గా నామినెట్ చేయాలని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే మన జిల్లా ఈఒడిబి లో మొదటి రాంక్ లో ఉందని, ఈ రాంక్ ను కొనసాగించే  చర్యల్లో భాగంగా నోడల్ అధికారులను వెంటనే నియమించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో  జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో   జె.సి  మాట్లాడుతూ పరిశ్రమ ల ఏర్పాటు కోసం గుర్తించిన భూములను క్షున్నంగా తనిఖీ చేసి వచ్చే సమావేశం లోగా నివేదిక ఇవ్వాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజు కు సూచించారు.  భోగాపురం లో అపెక్స్ హెచరీస్  వారు యూనిట్ స్థాపనకు దరఖాస్తు చేసుకున్నారని, ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూములను తఃసిల్దార్ తో కలసి తనిఖీ చేసి నో. అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని మత్స్య శాఖ డిడి నిర్మలా కుమారి కి సూచించారు. 

 ఉద్యాన శాఖ ద్వారా ఉద్యాన పంటలకు, యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని, అదే విధంగా మార్కెటింగ్ సౌకర్యాల కల్పన పై దృష్టి  పెట్టాలని ఉద్యాన , మార్కెటింగ్ శాఖల అధికారులకు ఆదేశించారు.  గత సమావేశం నుండి ఈ సమావేశం వరకు నెల రోజుల వ్యవధిలో జిల్లాలో పరిశ్రమల స్థాపన కు 32 దరఖాస్తులు అందాయని, 15 దరఖాస్తు లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని పరిశ్రమల జనరల్ మనేజర్ పాపారావు తెలిపారు. కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 16, గ్రౌండ్ వాటర్ వద్ద 1 దరఖాస్తు పెండింగ్ ఉన్నట్లు వివరించారు.  టైం లైన్ లోపల అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని జె.సి సూచించారు. ఈ సమావేశంలో లైన్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-27 12:45:09

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల చట్టం నివారణ సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీ సమావేశం పాలకొండ ఏరియా ఆసుపత్రి సమావేశ మందిరంలో శని వారం జరిగింది. ఏదైనా ఆసుపత్రిలో లింగ నిర్థారణ పరీక్షలు నిప్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటిసారి తప్పు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష, 10 వేలు జరిమానా,  రెండవ తప్పుకు ఐదు సంవత్సరాల జైలు, రూ.50 వేలు జరిమానా, మూడవసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాల జైలు, వైద్యుని పట్టా నిషేధం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె కోరారు. గ్రామ, మండల స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన సమావేశాలు జరగాలని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో డెప్యూటీ డి.ఎం.హెచ్. ఓ బి.శ్రీనివాస రావు, వైద్యులు రవీంద్ర కుమార్, భారతి, పద్మావతి, పోలీసు ఇన్స్పెక్టర్ శంకర రావు, న్యాయ నిపుణులు వై. లక్ష్మణ రావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎల్.సంపత్ కుమారి, దుర్గారావు, రమేష్ బాబు, యోగేశ్వర రెడ్డి, సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

Palakonda

2022-08-27 12:41:07

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నింధితులకు శిక్షపడాలి

తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ , ఎస్టీ ల పై అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా, కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ డా.కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రి కలక్టరేట్  వీసీ హాల్లో  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని  జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, కమిటీ కన్వీనర్ శోభారాణి లతో కలిసి కలెక్టర్ మాధవీలత నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత  మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కేసుల్లో శిక్షలు త్వరిత  పడేలా  చర్యలు తీసుకోవాలన్నారు.  2022 జనవరి నుంచి ఇప్పటి వరకు  53 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్ కేసులను పబ్లిక్ ప్రోసిక్యూటర్ వారీగా సమీక్షించి ఈ కేసుల్లో న్యాయ స్థానాల తీర్పులను పరిశీలించి బాధితులకు న్యాయం జరగని పక్షంలో కేసు పూర్వపరాలను పరిశీలించి అవసరమైతే డివిజన్ బెంచు కేసు వేయాలని కలెక్టర్ సూచించారు. కొవ్వూరు,రాజమహేంద్రవరం డివిజన్ పెండింగ్లో ఉన్న ఎస్సీ , ఎస్టి కేసులకు సంబంధించి వేగవంతం చేయ్యాలని ఆర్డీవోలను ఆదేశించారు.  జిల్లాలో పెండింగ్ కేసుల పై సమీక్ష చేస్తూ ఎఫ్ ఐ ఆర్ లు 10, ఛార్జి షీట్ లు 11, దోషిగా నిర్ధారించింది 8 కేసులు ఉన్నట్లు తెలిపారు.

 జిల్లాలో మహిళలపై వేధింపుల నివారణకు ప్రతి శాఖలోను ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని కలక్టర్ సూచించారు. వచ్చే సమావేశం నాటికి పూర్తిస్థాయిలో కమిటీ సభ్యులను నియమించే విధంగా చర్యలు చేపట్టాలని కన్వీనర్ ఎమ్మెస్ శోభారాణిని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ(ఎ) సిహెచ్.పాపారావు మాట్లాడుతూ ఎస్సి , ఎస్టి కేసుల విషయంలో ఏ విధమైన వివక్షత లేకుండా కేసులను నమోదు చేసి నింతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలో ఎస్సీ , ఎస్టి కేసుల పై హైకోర్టు స్టేలు ఉన్నాయని , అదే విధంగా కొన్ని కేసుల్లో కుల ధృవీకరణ , మెడికల్ సర్టిఫికేట్లు రావల్సి ఉందన్నారు . ఈ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. 

 సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎమ్.ఎస్. శోభారాణి, ఇంఛార్జి డి ఆర్ వో కొవ్వూరు ఆర్డీవో  ఎస్. మల్లిబాబు,  రాజమండ్రి ఆర్డీవో ఏ.చైత్ర వర్షిని, అడిషనల్ ఎస్పీ (ఏ)సి హెచ్. పాపారావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్ పి భక్తవత్సలం, డి.ఎస్.పి.ఎ. శ్రీనివాసరావు అడిషనల్ పిపి  జి. వెంకట రత్నంబాబు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కేఎన్ జ్యోతి, సిడిపిఓ కే.విజయ కుమారి, డిఆర్డిఎ  పిడి ఎస్.డేగలయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి పిఎస్ రమేష్, డీఈవో ఎస్. అబ్రహం,  డి ఎమ్ హెచ్.ఓ. డా. ఎన్.వసుంధర  తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-27 12:38:47