1 ENS Live Breaking News

విజయం సాధించేదాకా విశ్రమించవద్దు

విద్యార్థులు తమకిష్టమైన ఏ రంగంలో అయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి  రజని విద్యార్థినిలకు పిలుపునిచ్చారు  టీటీడీ విద్యాసంస్థ‌ల క్రీడా స‌ల‌హాదారుగా నియ‌మితులైన కుమారి ర‌జ‌ని శ‌నివారం సాయంత్రం టీటీడీ ప‌రిపాల‌న భ‌వనంలో జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా జెఈవో  స‌దా భార్గ‌వి టీటీడీ విద్యాసంస్థ‌ల్లో క్రీడ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, విద్యార్థుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించే దిశ‌గా వారిని ప్రోత్స‌హించాల‌ని ర‌జ‌నికి సూచించారు.జె ఈవో  శ్రీమతి సదా భార్గవి సలహా మేరకు కుమారి రజని శ్రీ పద్మావతి మహిళా డిగ్రి  ,పిజి కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. అనంత‌రం  ర‌జ‌ని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రి, పిజి క‌ళాశాల‌లో విద్యార్థినుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఆమె మాట్లాడుతూ, తాను తిరుపతిలోనే చదివి నిరంతర శ్రమతో అనేక పరాజ‌యాల నడుమ అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజ‌యం సాధించాన‌ని చెప్పారు. 

తన జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. శ్రీ వేంక‌టేశ్వర స్వామి వారి దయతో తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాన‌న్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగం ఏదైనా అందులో వెంటనే ఫలితాలు రాకపోవచ్చుననే విషయం గుర్తించాలన్నారు. జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా వెనుకంజవేయ‌కుండా లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు మానసికంగా అత్యంత ధైర్యంగా ఉండి సమస్యలను ఎదిరించాలని చెప్పారు.

       తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని పాఠశాల దశలో పిఈటి తనకు హాకిని పరిచయం చేశారని ఆమె తన పాఠశాల స్మృతులను విద్యార్థులకు వివరించారు. 2008లో తాను ఇండియన్ హ‌కీ క్యాంప్ కి ఎంపికైనప్పటికీ ఆడే అవ‌కాశం దక్కలేదని ఆమె చెప్పారు. భాషా పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటి గురించి ఆలోచించకుండా తాను లక్ష్యసాధన దిశగా నిరంతర శ్రమ చేశాన‌న్నారు. 2009లో భారత హాకీ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి న్యూజిలాండ్ లో తాను ఆడానని తెలిపారు. ఆంధ్ర నుండి చరిత్ర సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాల‌న్న తన పట్టుదలే తనను ఈరోజు ఈ స్థాయికి చేర్చగలిగిందని ఆమె వివరించారు.

      2019లో జరగాల్సిన హాకీ ఒలంపిక్స్ కు తాను ఎంపికైనా, కరోనా కారణంగా ఒలంపిక్స్ వాయిదా పడ్డాయన్నారు. ఆ సమయంలో తాను ఆందోళన చెందకుండా మరో ఏడాది పాటు నిరంతరం సాధన చేశానని ఆమె చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తమ లక్ష్యసాధన కోసం చివరి నిమిషం దాకా కష్టపడాలని సూచించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో హాకీలో మెడల్ సాధించాలనుకున్న తన కోరిక నెరవేరి 16 సంవత్సరాల తర్వాత భారతదేశానికి పత‌కంతో తిరిగి వచ్చామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహ‌దేవమ్మ ఆధ్వర్యంలో అధ్యాపకులు రజనిని ఘనంగా సన్మానించారు.  ఈ కార్య‌క్ర‌మంలో అధ్యాప‌కులు  విద్యుల్ల‌త‌, భువ‌నేశ్వ‌రి, ఉష‌, ఉమారాణి పాల్గొన్నారు.

Tirupati

2022-08-27 13:12:02

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం

గడచిన మూడేళ్ళలో కాకినాడ ప్రజలకు ప్రభుత్వం రూ.800 కోట్లు విలువైన సంక్షేమ పథకాలు అందించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని 4, 5,9 డివిజన్లలో రూ.3.70 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అలాగే రూ.1.09 కోట్ల వ్యయంతో నాడు–నేడు పథకంలో 9 క్లాస్‌ రూమ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, ఏ డి సి సి హెచ్ నాగ నరసింహారావు, అధికారులు,కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ  తన హయాంలో అమ్మ ఒడి, డ్వాక్రా రుణ మాఫీ, గృహనిర్మాణం, చేయూత వంటి వివిధ పథకాలు ద్వారా కాకినాడ ప్రజలకు ప్రభుత్వం ద్వారా రూ.800 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు.

 నాడు–నేడు పథకంలో రూ.10 కోట్లతో 106 కొత్త తరగతి గదులను కూడా తన హయాలోనే తీసుకొచ్చానన్నారు.  కాకినాడ నగరాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నామని,ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి తక్షణమే పరిష్కరించగలగుగుతున్నామన్నారు. టీడీపీ నేతలు కూడా గడపగడపకు మన ప్రభుత్వంలో తన వెంట వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ సత్యకుమారి, డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, లంకే హేమలత, కంపర బాబి, పలకా సూర్యకుమారి, పేర్ల జోగారావు, ఎంజీకే కిషోర్, గోడితోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Kakinada

2022-08-27 13:09:10

ఈఓడిబి పర్యవేక్షణకు నోడల్ అధికారులు

పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వారికి సహకరించడానికి  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ క్రింద  సింగల్ డెస్క్ పోర్టల్ ను పర్యేక్షించడానికి ప్రతి లైన్ డిపార్ట్మెంట్ నుండి ఒక అధికారిని నోడల్ ఆఫీసర్ గా నామినెట్ చేయాలని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే మన జిల్లా ఈఒడిబి లో మొదటి రాంక్ లో ఉందని, ఈ రాంక్ ను కొనసాగించే  చర్యల్లో భాగంగా నోడల్ అధికారులను వెంటనే నియమించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో  జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో   జె.సి  మాట్లాడుతూ పరిశ్రమ ల ఏర్పాటు కోసం గుర్తించిన భూములను క్షున్నంగా తనిఖీ చేసి వచ్చే సమావేశం లోగా నివేదిక ఇవ్వాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజు కు సూచించారు.  భోగాపురం లో అపెక్స్ హెచరీస్  వారు యూనిట్ స్థాపనకు దరఖాస్తు చేసుకున్నారని, ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూములను తఃసిల్దార్ తో కలసి తనిఖీ చేసి నో. అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని మత్స్య శాఖ డిడి నిర్మలా కుమారి కి సూచించారు. 

 ఉద్యాన శాఖ ద్వారా ఉద్యాన పంటలకు, యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని, అదే విధంగా మార్కెటింగ్ సౌకర్యాల కల్పన పై దృష్టి  పెట్టాలని ఉద్యాన , మార్కెటింగ్ శాఖల అధికారులకు ఆదేశించారు.  గత సమావేశం నుండి ఈ సమావేశం వరకు నెల రోజుల వ్యవధిలో జిల్లాలో పరిశ్రమల స్థాపన కు 32 దరఖాస్తులు అందాయని, 15 దరఖాస్తు లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని పరిశ్రమల జనరల్ మనేజర్ పాపారావు తెలిపారు. కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 16, గ్రౌండ్ వాటర్ వద్ద 1 దరఖాస్తు పెండింగ్ ఉన్నట్లు వివరించారు.  టైం లైన్ లోపల అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని జె.సి సూచించారు. ఈ సమావేశంలో లైన్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-27 12:45:09

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల చట్టం నివారణ సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీ సమావేశం పాలకొండ ఏరియా ఆసుపత్రి సమావేశ మందిరంలో శని వారం జరిగింది. ఏదైనా ఆసుపత్రిలో లింగ నిర్థారణ పరీక్షలు నిప్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటిసారి తప్పు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష, 10 వేలు జరిమానా,  రెండవ తప్పుకు ఐదు సంవత్సరాల జైలు, రూ.50 వేలు జరిమానా, మూడవసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాల జైలు, వైద్యుని పట్టా నిషేధం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె కోరారు. గ్రామ, మండల స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన సమావేశాలు జరగాలని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో డెప్యూటీ డి.ఎం.హెచ్. ఓ బి.శ్రీనివాస రావు, వైద్యులు రవీంద్ర కుమార్, భారతి, పద్మావతి, పోలీసు ఇన్స్పెక్టర్ శంకర రావు, న్యాయ నిపుణులు వై. లక్ష్మణ రావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎల్.సంపత్ కుమారి, దుర్గారావు, రమేష్ బాబు, యోగేశ్వర రెడ్డి, సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

Palakonda

2022-08-27 12:41:07

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నింధితులకు శిక్షపడాలి

తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ , ఎస్టీ ల పై అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా, కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ డా.కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రి కలక్టరేట్  వీసీ హాల్లో  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని  జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, కమిటీ కన్వీనర్ శోభారాణి లతో కలిసి కలెక్టర్ మాధవీలత నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత  మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కేసుల్లో శిక్షలు త్వరిత  పడేలా  చర్యలు తీసుకోవాలన్నారు.  2022 జనవరి నుంచి ఇప్పటి వరకు  53 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్ కేసులను పబ్లిక్ ప్రోసిక్యూటర్ వారీగా సమీక్షించి ఈ కేసుల్లో న్యాయ స్థానాల తీర్పులను పరిశీలించి బాధితులకు న్యాయం జరగని పక్షంలో కేసు పూర్వపరాలను పరిశీలించి అవసరమైతే డివిజన్ బెంచు కేసు వేయాలని కలెక్టర్ సూచించారు. కొవ్వూరు,రాజమహేంద్రవరం డివిజన్ పెండింగ్లో ఉన్న ఎస్సీ , ఎస్టి కేసులకు సంబంధించి వేగవంతం చేయ్యాలని ఆర్డీవోలను ఆదేశించారు.  జిల్లాలో పెండింగ్ కేసుల పై సమీక్ష చేస్తూ ఎఫ్ ఐ ఆర్ లు 10, ఛార్జి షీట్ లు 11, దోషిగా నిర్ధారించింది 8 కేసులు ఉన్నట్లు తెలిపారు.

 జిల్లాలో మహిళలపై వేధింపుల నివారణకు ప్రతి శాఖలోను ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని కలక్టర్ సూచించారు. వచ్చే సమావేశం నాటికి పూర్తిస్థాయిలో కమిటీ సభ్యులను నియమించే విధంగా చర్యలు చేపట్టాలని కన్వీనర్ ఎమ్మెస్ శోభారాణిని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ(ఎ) సిహెచ్.పాపారావు మాట్లాడుతూ ఎస్సి , ఎస్టి కేసుల విషయంలో ఏ విధమైన వివక్షత లేకుండా కేసులను నమోదు చేసి నింతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలో ఎస్సీ , ఎస్టి కేసుల పై హైకోర్టు స్టేలు ఉన్నాయని , అదే విధంగా కొన్ని కేసుల్లో కుల ధృవీకరణ , మెడికల్ సర్టిఫికేట్లు రావల్సి ఉందన్నారు . ఈ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. 

 సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎమ్.ఎస్. శోభారాణి, ఇంఛార్జి డి ఆర్ వో కొవ్వూరు ఆర్డీవో  ఎస్. మల్లిబాబు,  రాజమండ్రి ఆర్డీవో ఏ.చైత్ర వర్షిని, అడిషనల్ ఎస్పీ (ఏ)సి హెచ్. పాపారావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్ పి భక్తవత్సలం, డి.ఎస్.పి.ఎ. శ్రీనివాసరావు అడిషనల్ పిపి  జి. వెంకట రత్నంబాబు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కేఎన్ జ్యోతి, సిడిపిఓ కే.విజయ కుమారి, డిఆర్డిఎ  పిడి ఎస్.డేగలయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి పిఎస్ రమేష్, డీఈవో ఎస్. అబ్రహం,  డి ఎమ్ హెచ్.ఓ. డా. ఎన్.వసుంధర  తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-27 12:38:47

డీ వార్మింగ్ మాత్రలపై అవగాహన కల్పించాలి

శ్రీకాకుళంజిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా వచ్చే నెల 8న చేపట్టనున్న డీ వార్మింగ్ డే పై గ్రామస్థాయిలో చాటింపు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. డీ వార్మింగ్ మాత్రల వలన ఎటువంటి దుష్పరిణామాలు ఉండబోవని విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. వీటిపై సంబంధిత సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని, డీ వార్మింగ్ రోజున  ప్రతి కేంద్రం వద్ద 108 వాహనాలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీ వార్మింగ్ నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా సెప్టెంబర్ 8న నిర్వహించే డి-వార్మింగ్ డే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అమలు జరిగేలా ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు  తగు ఆదేశాలు ఇవ్వాలని,అలాగే  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలయ్యేలా  ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలని

ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు,జిల్లా విద్యా శాఖాధికారిలను కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి, ప్రాంతీయ తనిఖీ అధికారులు కళాశాలల కరస్పాండెంట్ లేదా ప్రిన్సిపాల్స్ లకు ఆదేశించాలన్నారు.  జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు డి వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్ - 400 మీ.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుందని, అంగన్వాడి కేంద్రములలో 1 నుండి 2 సం.ల వరకు అర మాత్ర., 2 నుండి 5 సం.ల వరకు ఒక మాత్ర మరియు 6-19 సం.ల వయస్సు గల స్కూల్స్ కు వెళ్ళని పిల్లలు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా ఈ మాత్రలు వేయించబడతాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత శ్రద్ద వహించాలని కోరారు. ఈ మాత్రలు వినియోగం పట్ల సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని, శిక్షణ నిర్వహించే తేదీలను ముందుగానే తెలియజేయాలన్నారు.

జిల్లాలోని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలు చదువుకునే విద్యార్థులు  4 లక్షల 71 వేల 37 మంది ఉన్నందున అందుకు తగిన విధంగా మాత్రలు, ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.  జిల్లాలో బడికి వెళ్ళని పిల్లల సంఖ్య తక్కువగా ఉందని, వీటిపై మరోమారు పరిశీలించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వైద్యాధికారి పర్యవేక్షణలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 2 నాటికి ఈ మాత్రలు పంపిణీ చేయాలని, ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షకుడుగా నియమించాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సేవా సంఘాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.మీనాక్షి, రాష్ట్రీయ బాల స్వాస్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, , సమగ్ర శిక్ష ప్రోజెక్ట్ అధికారి డా. జయప్రకాష్,ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు కె.ఆనంతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట్రామన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పి.వి.విద్యాసాగర్, డి.ఐ.ఓ ఆర్.వి.ఎస్.కుమార్, ప్రజారోగ్య అధికారి జి.వెంకటరావు, డిసిహెచ్ఎస్ డా.ఎం.ఎస్.నాయక్, డెమో పైడి వెంకటరమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-08-27 12:32:13

ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధులు

ప్ర‌భుత్వ ఉద్యోగులు.. ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌థుల్లాంటి వార‌ని, వారి సేవ‌లు ఎన‌లేన‌వ‌ని జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కొనియాడారు. అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తూ నిత్యం ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మై ఉంటార‌ని కితాబిచ్చారు. ముఖ్యంగా జిల్లాలో ప‌ని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే స్పందిస్తూ మెరుగైన సేవ‌లందిస్తున్నార‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇటీవ‌ల ప‌దోన్న‌తులు పొందిన ఎంపీడీవోల‌కు జ‌డ్పీ స‌మావేశ మంద‌రింలో జ‌డ్పీ ఛైర్మ‌న్ చేతుల మీదుగా శ‌నివారం స‌త్కార కార్య‌క్ర‌మం జ‌రిగింది. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు సేవ‌లందించి ప్ర‌స్తుతం ఇత‌ర జిల్లాల‌కు ప‌దోన్న‌తుల‌పై వెళ్లిన రామ‌చంద్ర‌రావు, స‌త్యానారాయ‌ణ‌, చంద్ర‌మ్మ‌, కిరణ్ కుమార్ల‌ను ఇక్క‌డే పదోన్న‌తులు పొంది సేవ‌లందిస్తున్న‌ రాజ్ కుమార్‌, లక్ష్మ‌ణ‌రావు, సుధాక‌ర్‌, నిర్మ‌లాదేవి, ఇందిరా ర‌మ‌ణ‌, శార‌దా దేవిల‌ను జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీ ఇందుకూరి ర‌ఘురాజుతో క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి, శాలువాలు క‌ప్పి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ గ‌త కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు భాగ‌స్వామ్యం అవుతూ ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించ‌టంలో ఉద్యోగులు కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని పేర్కొన్నారు. 

ప్ర‌ధానంగా ఎంపీడీవో స్థాయిలో ఉండేవారు అన్ని వేళల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ప్ర‌శంస‌నీయ‌మైన సేవ‌లందిస్తార‌ని కితాబిచ్చారు. ప‌దోన్న‌తులు పొందిన వారిని ఇలా స‌త్క‌రించుకోవ‌టం మంచి సంప్ర‌దాయానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. జిల్లాలో ప‌ని చేస్తున్న అధికారులు స‌మ‌ష్టి కృషితో ప‌ని చేస్తున్నార‌ని.. దానికి గాను పలు అంశాల్లో జిల్లా మెరుగైన ఫ‌లితాలు సాధిస్తోంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క్షేత్ర స్థాయిలో జ‌రిగే ప్ర‌తి ప‌రిపాల‌నాప‌ర‌మైన అంశంలోనూ ఎంపీడీవోలు పాత్ర ఉంటుంద‌ని, ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కాల‌ను, సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ద‌రిచేర్చే అస‌లైన స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ఎంపీడీవోలేన‌ని ఎమ్మెల్సీ ఇందుకూరి ర‌ఘురాజు కితాబిచ్చారు. త‌ను జ‌డ్పీటీసీగా ఉన్నప్ప‌టి నుంచి ఎంపీడీవోల‌తో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని.. వారి నుంచి నేను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని ర‌ఘురాజు త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ప్ర‌స్తుతం స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు అనుసంధానం చేయ‌టంలో.. సేవ‌లందించ‌టంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నార‌ని ప్ర‌శంసించారు.

ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం... జ‌డ్పీ ఛైర్మ‌న్‌కు స‌న్మానం
ప‌దోన్న‌తులు పొందిన ఎంపీడీవోలు, ప్రస్తుత ఎంపీడీవోలు జ‌డ్పీ స‌మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఇదే క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావును గ‌జ‌మాల‌తో వేసి, దుశ్శాలువాతో స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్, బీసీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నెక్క‌ల నాయుడు బాబు, జిల్లాలో ప‌ని చేస్తున్న వివిధ మండలాల ఎంపీడీవోలు, జ‌డ్పీటీసీ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-27 12:29:08

మంత్రిని కలిసిన తూర్పు కాపు ప్రతినిధులు

విశాఖ, అనకాపల్లి,పాడేరు జిల్లాల తూర్పు కాపు కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సంఘం అధ్యక్షులు  ఏ.వి. రమణయ్య ఆధ్వర్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మింది లోని అతని క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు.  ఈ సందర్భంగా అధ్యక్షుడు రమణయ్య  మాట్లాడుతూ  కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో తహసీల్దార్లు చేస్తున్నా జాప్యంపై విశాఖ, అనకాపల్లి, జిల్లా కలెక్టర్లకు   లేఖలు రాశామని, దానిపై స్పందన లేదని మంత్రి అమర్ నాథ్ కు తెలియజేశారు.విశాఖ,అనకాపల్లి, పాడేరు జిల్లా కలెక్టర్లతో రెవిన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తూర్పు కాపులకు బీసీలకు  ఏవిధంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారో  అదేవిధంగా తూర్పు కాపులకు కుల దృవీకరణ పత్రాలు జారీ చేయవలసిందిగా  ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అమర్నాథ్ ను కోరారు. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జాప్యo లేకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయ చేయవలసినదిగా అమర్నాథ్ ని కోరారు.   నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలలో గల తూర్పు కాపులు  52 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీ సర్టిఫికెట్లు పొందలేకపోయారని సంఘం ప్రతినిధులు తెలిపారు. తూర్పు కాపులు సకాలంలో బీసీ సర్టిఫికెట్లు పొందకపోవుటవలన తమకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశములు కోల్పోతున్నారని అన్నారు. అందువలన ఇతర బీసీల వారి మాదిరి దరఖాస్తు చేసుకున్న వెంటనే తూర్పు కాపులకు కూడా బీసీ సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించే వలసిందిగా అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీని కూడా కోరినట్లు రమణయ్య తెలియజేశారు.

 తూర్పు కాపులకు ఓసి సర్టిఫికెట్లు ఇచ్చి కొంతమంది అధికారులు తూర్పు కాపులను ఓసీలుగా చేయుటకు ప్రయత్నించుచున్నారని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ మూడు జిల్లాల కలెక్టర్లతో, సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను శాశ్వతముగా  పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రమణయ్య తెలియజేశారు. మంత్రి అమర్ నాథ్ ను కలిసిన వారిలో సంఘం గౌరవ అధ్యక్షులు బొండా అప్పారావు, ప్రధాన కార్యదర్శి మురిపిండి సన్యాసిరావు,  జిల్లా ఉపాధ్యక్షులు కంపర సత్తిబాబు,  గోపాలపట్నం తూర్పు కాపు కమిటీ అధ్యక్షులు కంపర కోటేశ్వరావు,  జిల్లా శాఖ కార్యదర్శి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాకవరపాలెం కమిటీ అధ్యక్షులు గొంతిని హరిబాబు, నాగరాజు, హరనాథ్,  చీకట్ల నాగేశ్వరావు, కొల్లన రాజేశ్వరరావు, విప్పల ప్రసాద్, సేనాపతి శంకర్ రావు, సేనాపతి దేవుడు, దేముడు తదితరులు ఉన్నారు.

Anakapalle

2022-08-27 12:22:37

కేసుల‌పై స‌కాలంలో కౌంట‌ర్లు దాఖ‌లు చేయాలి

ప్ర‌భుత్వంపై వివిధ సంస్థ‌లు, వ్య‌క్తులు న్యాయస్థానాల్లో దాఖ‌లు చేసిన కేసుల్లో ఆయా శాఖ‌ల త‌ర‌పున స‌కాలంలో కౌంట‌ర్లు దాఖ‌లు చేయ‌డంపై దృష్టి సారించాల‌ని జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు కోరారు. ఏ.పి.ఆన్ లైన్ లీగ‌ల్ కేసుల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ద్వారా ఆయా కేసుల ప‌రిష్కారంపై డి.ఆర్‌.ఓ. శ‌నివారం త‌న ఛాంబ‌రులో స‌మీక్షించారు. అన్ని శాఖ‌ల అధికారులు త‌మకు సంబంధించిన కోర్టు కేసుల‌పై ఆన్ లైన్ వ్య‌వ‌స్థ ద్వారా తాజా ప‌రిస్థితులు తెలుసుకుంటూ త‌గిన విధంగా కౌంట‌ర్లు దాఖ‌లు చేసి ప్ర‌భుత్వ వాద‌న‌ను స‌మ‌ర్ధంగా కోర్టుల్లో వినిపించాల‌న్నారు. ఈ స‌మావేశంలో సి- సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ శ్రీ‌కాంత్‌, ప‌లువురు త‌హ‌శీల్దార్‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-27 12:17:03

స్పందన అర్జీలపై నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికే

స్పందన విజ్ఞప్తులను పరిష్కరించకుండా మొక్కుబడిగా పరిశీలించి మూసివేస్తున్న సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అరుణమ్మ వీధి సచివాలయం, బాలాజీ నగర్ సచివాలయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన కార్యక్రమం విధిగా నిర్వహించాలన్నారు. ఆయా విజ్ఞప్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. కేవలం మొక్కుబడిగా సమస్యను పరిష్కరించినట్లుగా చూపి, ఆయా దరఖాస్తులను మూసివేయడం తగదన్నారు. ఒకే సమస్య  మరల మరల స్పందనలో వస్తుందంటే సదరు సమస్యను సక్రమంగా పరిష్కరించలేదని అర్థమన్నారు. స్పందనలో వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి సమస్య మూలాల్లోకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా గృహ నిర్మాణాల పురోగతి గురించి ఇంజనీరింగ్ సహాయకులతో విచారించారు. గృహ నిర్మాణంకు సంబంధించి దశల వారీగా అన్ని దశలలో ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కృషి చేయాలని కోరారు. లబ్ధిదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు కృషి చేయాలన్నారు.

జగనన్న తోడు, చేయూత పథకాల గురించి సంక్షేమ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా పథకాలు ప్రారంభమైన వారం లోపు లబ్ధిదారులు అందరికీ వారి వారి అకౌంట్లో తప్పనిసరిగా నగదు జమ కావాలన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ పరిధిలోని ఆయా పధకాల లబ్ధిదారులందరికీ నగదు జమ అయిందీ, లేనిదీ తెలుసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ఎక్కడా ఎటువంటి జాప్యంను సహించేది లేదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తీరుతెన్నుల గురించి విచారిస్తూ, 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ల వయసు లోపు అందరికీ కోవాక్సిన్ / కోవిషీల్డ్ బూస్టర్ డోస్ అందించాలన్నారు.  అందరికీ అవగాహన కల్పిస్తూ 100% పూర్తయ్యేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఓటర్ కార్డు తో ఆధార్ అనుసంధాన ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ విచారించారు.  బి ఎల్ వో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వారికి కేటాయించిన ఓటర్లను నిర్దేశిత గడువులోగా ఆధార్ తో అనుసంధానం చేయడానికి ప్రణాళిక వేసుకొని పూర్తి చేయాలన్నారు. ప్రజల నుండి సేకరించిన ఆధార్ సమాచారంను సంబంధిత సూపర్వైజర్లకు జాగ్రత్తగా  అందించి భద్రపరచాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమంపై సమీక్షిస్తూ, ప్రతిరోజు సిబ్బంది వారి పరిధిలోని వీధులను విధిగా పరిశీలించాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలకు కూడా వెనుకాడేది లేదన్నారు. పారిశుధ్య నిర్వహణ పై ప్రజలకు నిరంతర అవగాహన కల్పిస్తూ , తడి చెత్త, పోడి చెత్త ను వేర్వేరుగా సేకరించి తరలించాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తదితరులు ఉన్నారు.

Nellore

2022-08-27 07:47:40

ధాన్యం కొనుగోలుకు ఈ-క్రాప్ లో తప్పనిసరి

ఈ- క్రాప్ లో నమోదు ఉంటేనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్  తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న ఖరీఫ్ 2022-23 సీజనకు సంబంధించి జిల్లాలో ధాన్యము పంట ప్రక్రియ ప్రారంభమైందని, నిబంధనల ప్రకారం ఈ- పంట నమోదు చేసుకున్న రైతుల వద్ద నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  వ్యవసాయ శాఖ ఇప్పటికే ఇ పంట నమోదు ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు.   జిల్లాలో 306 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఇ పంటలో తమ పేర్ల నమోదు పరిస్థితిని రైతులు పరిశీలించి అవసరమైతే  దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వెంటనే నమోదును చేసుకోవాలని కోరారు. ఈ-పంట లో పేర్లు నమోదు కాకపోతే మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.  రైతులు అందరూ ఇ-పంట నమోదును వెంటనే పూర్తిచేసుకుని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందుటకు ఇప్పటి నుండే శ్రద్ద వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Parvathipuram

2022-08-27 07:37:46

నారీశక్తి పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

విద్య, వైద్యం, క్రీడా, క‌ళా రంగాల్లో కృషి చేస్తున్న‌ మ‌హిళ‌ల‌కు 2023, మార్చి 8న‌ అంద‌జేసే నారీశ‌క్తి పుర‌స్కారానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి తెలిపారు. అర్హులైన మ‌హిళలంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకొని ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా సూచించారు. పుర‌స్కార గ్ర‌హీత‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో రూ.2 ల‌క్ష‌ల న‌గ‌దు, ప్ర‌శంశా ప‌త్రం అంద‌జేస్తుంద‌ని వివ‌రించారు. కావున 25 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండి ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు రంగాల్లో ప‌ని చేసే మ‌హిళ‌లు, అసంఘటిత రంగంలో సేవ‌లందించే మ‌హిళ‌లు  www.awards.gov.in వెబ్ సైట్ ద్వారా అక్టోబ‌ర్ 31వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసి సంబంధిత హార్డ్ కాపీల‌ను జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. ఇత‌ర వివ‌రాల‌కు 94904 98932 నెంబ‌రును సంప్ర‌దించాల‌ని సూచించారు.

Vizianagaram

2022-08-27 07:23:54

విద్య‌.. వైద్యం ప్ర‌భుత్వానికి రెండు క‌ళ్లు

విద్య‌, వైద్యం రాష్ట్ర ప్ర‌భుత్వానికి రెండు క‌ళ్లులాంటివ‌ని అందుకే వాటికి ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఇస్తూ వేల కోట్లు వెచ్చిస్తోంద‌ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ పేర్కొన్నారు. ప్ర‌జా ఆరోగ్యానికి.. సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తూ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందిస్తున్నామ‌ని గుర్తు చేశారు. విద్య‌, వైద్య రంగంలో మ‌రింత ప్ర‌గ‌తి సాధించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక‌ నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణ ప‌రిధిలోని కొత్త‌పేట కుమ్మ‌ర‌వీధి 14వ వార్డులో రూ.20 లక్ష‌ల వ్య‌యంతో నిర్మించిన ప్రాథ‌మిక పాఠ‌శాల అద‌న‌పు గ‌దుల‌ను, రూ.98 ల‌క్ష‌ల‌తో నిర్మించిన వైఎస్సార్‌ ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాన్ని శ‌నివారం ఆయ‌న స్థానిక ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్, ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర‌స్వామి, ఎమ్మెల్సీ ర‌ఘురాజు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, వార్డు కార్పొరేట‌ర్ రాజేష్‌ల‌తో క‌లిసి లాంఛ‌నంగా ప్రారంభించారు. ముందుగా నాడు-నేడు నిధులు, కార్పొరేష‌న్ నిధుల‌తో అభివృద్ధి చేసిన‌ కుమ్మ‌ర‌వీధిలోని స్వామి వివేకానంద ప్రాథ‌మిక పాఠ‌శాల గదుల‌ను ప‌రిశీలించారు. ఆధునిక వ‌సతుల‌తో కూడిన ఇంగ్లీషు, కంప్యూట‌ర్ ల్యాబ్‌ల‌ను చూసిన మంత్రి మంత్ర ముగ్ధుల‌య్యారు. పాఠ‌శాల‌లో అన్ని గ‌దుల‌కు ఏసీ పెట్టించ‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ పాఠ‌శాల రాష్ట్రంలోనే త‌ల‌మానిక‌మైన‌ద‌ని కితాబిచ్చారు. ఈ క్ర‌మంలో పాఠ‌శాల విద్యార్థుల‌తో మంత్రి కాసేపు ముచ్చటించారు. పుస్త‌కంలోని అక్ష‌రాల‌ను, బొమ్మ‌ల‌ను చూపించి ఇవేంటి అని చిన్నారిని అడిగారు.

వైద్య సేవలు నిత్యం అందేలా చ‌ర్య‌లు
అనంత‌రం రూ.98 ల‌క్ష‌ల‌తో నిర్మించిన ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన‌ ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన‌ మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన సంక‌ల్పంతో ముందుకెళ్తోంద‌ని దానిలో భాగంగానే ఈ రోజు నాడు - నేడు ద్వారా వేల కోట్లు ఖ‌ర్చు చేస్తూ విద్య‌, వైద్య రంగంలో ఎన్నో స‌దుపాయాలను క‌ల్పించింద‌ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ నిజ‌మైన‌ పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మే ఈ ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్ర‌మ‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణంలో మొత్తం ఏడు కేంద్రాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని వాటిలో ప్ర‌థ‌మంగా కుమ్మ‌ర‌వీధిలోని ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వ‌చ్చింద‌ని, మ‌రో నాలుగు 75 శాతం ప‌నుల‌ను పూర్తి చేసుకున్నాయ‌ని వివ‌రించారు. మిగిలిన కేంద్రాలు కూడా ప‌ట్ట‌ణవాసుల‌కు త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయని మంత్రి పేర్కొన్నారు. నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా వైద్యుల‌ను, సిబ్బందిని నియ‌మించామ‌ని, ఇక్క‌డి నుంచే 104 వాహ‌నం ఆప‌రేట్ చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. స్థానిక ప్ర‌జ‌లు సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి సూచించారు. కార్య‌క్ర‌మాల్లో విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ ఇందుకూరి ర‌ఘురాజు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, న‌గ‌ర క‌మిష‌న‌ర్ శ్రీ‌రాములు నాయుడు, ఏపీసీ స్వామినాయుడు, జిల్లా వైద్యారోగ్య అధికారి ర‌మణ కుమారి, 14వ వార్డు కార్పొరేట‌ర్ రాజేష్‌, ఇత‌ర కార్పొరేట‌ర్లు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-27 06:22:49

కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాదనలు సమర్పించాలి

సాలూరు మార్కెట్ కమీటీ పరధి సాలూరులో శీతలీకరణ గిడ్డంగుల ప్రతిపాదనలు తక్షణం సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పనులపై జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ శాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. సాలూరు, పాచిపెంటలలో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల  ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పార్వతీపురం రైతు బజార్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమగ్ర పరిశీలన చేసి సంర్పించవలసినదిగా ఆదేశించారు. పాలకొండ రైతు బజార్ కు డి.సి.ఎం.ఎస్ నుండి అద్దె ప్రాతిపదికన స్థలం సేకరించుటకు ప్రతిపాదనలు  వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమీషనర్ కు సంర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ శాఖ అధికారి యల్ .ఆశోక్ , ప్రత్యేక శ్రేణి కార్యదర్శి బి. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-26 16:46:27

ఈ - క్రాప్ లో ఉంటేనే ధాన్యం కొనుగోలు

ఈ-క్రాప్ లో నమోదు ఉంటేనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ఖరీఫ్ 2022-23 సీజనకు సంబంధించి జిల్లాలో ధాన్యము పంట ప్రక్రియ ప్రారంభమైందని, నిబంధనల ప్రకారం ఇ పంట నమోదు చేసుకున్న రైతుల వద్ద నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  వ్యవసాయ శాఖ ఇప్పటికే ఇ పంట నమోదు ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు.  రైతుల సౌకర్యార్ధం దిగుబడికి అనుగుణంగా జిల్లాలో మొత్తం 306 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.  రైతులు తమ పేర్లు ఈ పంటలో నమోదు అయింది లేనిదీ  సరిచూసుకొని దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వెంటనే నమోదును చేసుకోవాలని కోరారు. ఈ-పంట లో పేర్లు నమోదు కాకపోతే మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.  రైతులందరూ ఇ-పంట నమోదును వెంటనే పూర్తిచేసుకుని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందుటకు ఇప్పటి నుండే శ్రద్ద వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Parvathipuram

2022-08-26 16:38:23