1 ENS Live Breaking News

ఏపీఎంఐపీ పీడీగా శ్రీనివాసరావు

పార్వతీపురం మన్యం జిల్లా సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు (ఏపిఎంఐపి) ప్రాజెక్టు డైరెక్టర్ గా ఎల్.శ్రీనివాస రావు బాధ్యతలను స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా సూక్ష్మ నీటి పారుదల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చేలా రైతులకు మేలు చేకూర్చలని కలెక్టర్ సూచించారు. ఈయన నెల్లూరు ఉద్యాన వన అధికారిగా పనిచేసి పార్వతీపురం మన్యం జిల్లాకు సూక్ష్మ నీటి పారుదల శాఖ అధికారిగా వచ్చారు.

Parvathipuram

2022-08-25 09:46:11

ప్రతీశాఖ అధికారి డిడిఓగా నమోదు కావాలి

ప్రతి శాఖ  డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఖజానాలో నమోదు కావాలని, టాన్ (టి.ఏ.ఎన్) నంబర్లు విధిగా పొందాలని జిల్లా ఖజానా, గణాంక శాఖ అధికారి కవిటి మోహన రావు అన్నారు. సి.ఎఫ్.ఎం.ఎస్, పే రోల్, ఖజానా ప్రక్రియ ద్వారా జరుగుతున్న చెల్లింపులపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారుల(డిడిఓలు)తో జిల్లా ఖాజానా కార్యాలయంలో గురు వారం సమావేశం నిర్వహించారు. 2018 సంవత్సరంలో సి.ఎఫ్.ఎం.ఎస్ విధానం అమలు ప్రారంభం అయిందన్నారు. ఈ విధానం మరింత సమర్ధవంతంగా అమలు చేయుటకు, వేగంగా చెల్లింపులు చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇందుకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సిపిఎస్  ఉద్యోగులు తమ వివరాలను ప్రతి మార్చి 31 నాటికి  పరిశీలించుకోవాలని ఆయన చెప్పారు. వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే స్పందించి పరిష్కారం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఖజానా శాఖకు తెలియజేయాలని కోరారు. నాలుగవ తరగతి ఉద్యోగుల జి.పి.ఎఫ్ వివరాలు నమోదును పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి తన వ్యక్తిగత మొబైల్ ను అనుసంధానం చేసుకోవాలని ఆయన కోరారు. 

పింఛనర్ల వివరాలు అందించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో పింఛనర్లు మృతి చెందినా వివరాలు అందించటం లేదని ఆయన చెప్పారు. జీతాల బిల్లులతో కలిపి ఇతర బిల్లులు సమర్పించరాదని ఆయన అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న ఉద్యోగులు ప్రతి నెల జీతం నుండి కొంత మొత్తాన్ని చెల్లింపు చేయడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.  పలువురు డి.డి.ఓలు మాట్లాడుతూ సి.ఎఫ్.ఎం.ఎస్, పే రోల్ కాకుండా అన్ని రకాల బిల్లులు ఒకే విధానంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు ఏ.మన్మథ రావు, కె.శ్రీనివాస రావు, సబ్ ట్రెజరీ అధికారి పి.ప్రసాద్, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డిడిఓలు), పింఛనర్లు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-25 09:43:51

జిల్లాలో .64.32 లక్షలు "నేతన్న నేస్తం"

అనకాపల్లి జిల్లాలో 268 మంది చేనేత పని వారికి నాలుగవ విడత "నేతన్న నేస్తం" పథకంలో రూ.24 లక్షల 32 వేలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు వైయస్సార్ జగనన్న నేస్తం చెక్కును అందజేశారు. నాలుగు సంవత్సరాలుగా ఈ పథకంలో 1174 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల 81 లక్షల 76 వేలు ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 50 సంవత్సరాలు నిండిన 2747 మంది చేనేత కార్మికులకు చేనేత మరియు జౌళి శాఖ  ద్వారా నెలకు రూ. 2,500/- చొప్పున మొత్తం రూ.68 లక్షల 67 వేల 500 అందిస్తున్నారన్నారు. 'ముద్ర' పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 29 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల 50 వేలు 20 శాతం మార్జిన్ మనీ గా అందజేసినట్లు చెప్పారు.

అంతకుముందు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం తోటమూల గ్రామంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న నేతన్న నేస్తం బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని చేనేత కార్మికులు నాయకులతో కలిసి కలెక్టర్ వీక్షించారు.  ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. పి. వెంకటరమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీసెట్టి వరాహ సత్యవతి, అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కన్వీనర్ రామ లక్ష్మణ రావు ఏపీ వీవర్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. రాజారావు, సంఘాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-08-25 09:06:27

నేతన్న నేస్తం క్రింద రూ.2.44 కోట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2022 - 23 వ సంవత్సరం లో నాలుగో విడతలో అర్హులైన 1017 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 44 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి.తెలిపారు. చేనేత కుటుంబాలకు స్వంత మగ్గం ఆధునికీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు ఈ పథకం ఉద్దేశించబడినదని కలెక్టర్ తెలిపారు.ప్రతీ సంవత్సరం 24,000 రూపాయల చొప్పున అర్హులైన  ప్రతీ చేనేత కుటుంబాలకు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2019 - 20వ సంవత్సరంలో మొదటి విడతలో అర్హులైన 854 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద 2020 - 21వ సంవత్సరంలో రెండవ విడతలో అర్హులైన 1067 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 56  లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేశారని పేర్కొన్నారు.
 ఈ పథకం కింద 2021 - 22వ సంవత్సరంలో మూడవ విడతలో అర్హులైన 779 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున కోటి  87 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి తెలిపారు.

  ఈరోజు  కృష్ణా జిల్లా పెడన నుంచి వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం నేరుగా జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పాల్గొనగా.. భీమవరం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి., చేనేత జౌళి శాఖ ఎడి కె.అప్పారావు,  ఏ డి ఓ కె. చేతన్ , చేనేత లబ్ధిదారులకు 2.4 కోట్ల రూపాయలు చెక్కును అందచేశారు.

Bhimavaram

2022-08-25 07:50:02

ప్రజాధనంతో పార్లే సంస్థకు ప్రచారం దారుణం

మహా విశాఖ నగర ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల డబ్బుతో  పార్లే సంస్థకు ప్రచారం చేయడం సిగ్గుచేటని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. బీచ్  క్లీన్ బాధ్యతలు పార్లే సంస్థకు అప్పగించడానికి ఒప్పందం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెచ్చించి బీచ్ క్లీన్ చేసి ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. బీచ్ లోని ఆక్రమణలు తొలిగించాలని కోరుతూ గురువారం జీవీఎంసీ మేయర్, కమిషనర్ కు  ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ బీచ్ క్లీన్ మెగా డ్రైవ్ పేరుతో  విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్ లో చెత్తను వ్యర్ధాలను తొలగించెందుకు 25 వేల మందితో  భారీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమే కానీ,  దాని కంటే ముందు అసలు బీచ్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  విశాఖ తీరంలో పెద్ద ఎత్తున కోస్తా నియంత్రణ మండలి ( సీ ఆర్ జడ్ ) ఉల్లంఘనలు జరిగాయన్నారు. గతంలో   సీఆర్జెడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై  చర్యలు తీసుకున్నారన్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అప్పట్లో కూల్చివేసిన వన్నీ తిరిగి వెలిశాయని చెప్పారు. వాటికి అనుబంధం గా  కొత్త కొత్తవి వచ్చి చేరాయి. గతంలో ఏ ప్రభుత్వం లోనూ ఎన్నడూ లేని విధంగా సముద్రంలోకి ఇసుకతిన్నెలపై కి వెళ్లి కాంక్రీట్ తో పెన్షింగ్ లు వేస్తున్నారన్నారు. రెవెన్యూ, వుడా,మున్సిపల్ అధికారులు పరోక్షంగా ఈ కబ్జాదారులకు  సహకరిస్తున్నారన్నారని ఆరోపించారు. అసలు బీచ్ లో వ్యరథాలు అనేవి ఉంటే వాటిని శుభ్రం చేయవచ్చు.  అదే కబ్జాకు గురైతే చేయటానికి ఏమీ ఉండదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టే  ముందు బీచ్ ఆక్రమణలపై దృష్టిసారించాలన్నారు. వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు.

 విశాఖ నగరం లో భాగమైన జోడుగుళ్ల పాలెం, సాగర్ నగర్,  రాడిసన్ హోటల్ ప్రాంతం, రిషి కొండ ప్రాంతం, కాపులుప్పాడ భీమిలి తీరాల్లో పెద్ద ఎత్తున కబ్జాలకు ఆక్రమణలకు గురైందని తెలిపారు. కోస్తా నియంత్రణ మండలి ఉల్లంఘనల భారీగా జరిగాయయని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా కేవలం ప్రచారం కోసం అవార్డు ల కోసం ఉత్తుత్తి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చివరికి అపహాస్యంగా మిగిలిపోతుందన్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని  సముద్ర తీర ప్రాంతాల కబ్జాలపై  చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.  బీచ్ ను కాంక్రీట్ జంగిల్ గా మార్చడం హోటళ్లు షాపులు వంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల అవి సాంఘిక కార్యక్రమాలకు, నైట్ పార్టీ లకు,  గంజాయి సరఫరా కు వేదికలుగా మారుతున్నాయన్నారు. వీటిని  తొలగించి గతంలో మాదిరిగా తీర రక్షణ కోసం షెల్టర్ బెల్ట్  ప్లాంటేషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీచ్ లో  అక్రమ నిర్మాణాల వల్ల జీవీఎంసీ ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోందన్నారు. 

 ప్రైవేట్ సంస్థ కోసం జిల్లా లోని ఐఏఎస్ లు,  మంత్రులు వారం రోజులుగా పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రైవేటు సంస్థ ప్రచారం కోసం పని చేయడం మాని ప్రభుత్వ విధులు నిర్వర్తించాల్సిన గా విజ్ఞప్తి చేశారు.  పార్లే సంస్థకు ఇప్పటివరకు విశాఖలో ఎక్కడ రీసైక్లింగ్ యూనిట్లు లేవు. రేపు బీచ్ లోని  40 పాయింట్ల్లో  సేకరించే చెత్త ను  తిరిగి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్నారు. దీని వల్ల ఇంత పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం ఫలితాలు కనిపించవన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ధనం కోట్ల రూపాయల ను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్నారన్నారు. వీటిపై దృష్టి సారించి జరిగిన లోపాలను సరిదిద్దాల్సినదిగా విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2022-08-25 07:38:33

పేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చండి

పేద‌లంద‌రికీ ఇళ్లు ఇవ్వాల‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ సంక‌ల్పానికీ.. సొంతింటి క‌ల నెర‌వేర్చుకో వాల‌ని తాప‌త్ర‌యం ప‌డుతున్న‌పేద ప్ర‌జ‌ల సంతోషానికి మ‌ధ్య వార‌థులుగా నిల‌వాల‌ని జిల్లా గృహ నిర్మాణ శాఖ‌ అధికారుల‌ను ఉద్దేశించి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాహుల్ పాండే పేర్కొన్నారు. స‌మ‌న్వ‌యంతో ముందుకెళ్లి పేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని సూచించారు. నిర్మాణాలు జోరుగా సాగేందుకు ఉన్న ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోరాద‌ని.. నిర్దేశించిన ల‌క్ష్యాలు చేరుకునే వ‌ర‌కు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాల‌ని హితవు ప‌లికారు. న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా జిల్లాలో చేప‌ట్టిన‌ ఇళ్ల నిర్మాణాల ప్ర‌గ‌తిపై, ఓటీఎస్ ప్ర‌క్రియ పురోగ‌తిపై స్థానిక డీఆర్డీఏ స‌మావేశ మంద‌రింలో గృహ నిర్మాణ శాఖ అధికారుల‌తో గురువారం ఆయ‌న స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు.

నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకుంటూ ఇళ్ల నిర్మాణాల్లో మ‌రింత‌ ప్ర‌గ‌తి సాధించాల‌ని రాహుల్ పాండే పేర్కొన్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్లు క‌ట్టుకునేలా ప్రోత్సాహం అందించాల‌ని సూచించారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నలో ఉత్సాహం ప్ర‌ద‌ర్శించాల‌ని ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాలని నిర్దేశించారు. ఇంటి నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన వ‌న‌రులు ఇసుక‌, సిమెంటు, ఇనుము నిర్ణీత కాలంలో అంద‌జేయాల‌ని, బిల్లుల ప్రక్రియ‌ను ఎప్ప‌టికప్పుడు పూర్తి చేసుకోవాల‌ని సూచించారు. జిల్లాలోని అన్ని లేఅవుట్లలో తాజా ప‌రిస్థితిపై రూపొందించిన నివేదిక‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌రిశీలించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే మాదిరి పురోగ‌తి సాధించేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఓటీఎస్ ప్ర‌క్రియ ద్వారా స‌మ‌కూరిన నిధులు, వాటి వినియోగం గురించి పీడీని అడిగి తెలుసుకున్నారు. ఈ స‌మావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ ర‌మ‌ణ మూర్తి, ఈఈ శ్రీ‌నివాస‌రావు, డీఈలు, ఏఈలు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-25 07:33:46

నేత్ర దానానికి దాతలు ముందుకురావాలి

అన్ని దానాల్లో క‌న్నా నేత్ర దానం గొప్ప‌ద‌ని.. ప్ర‌తి ఒక్కరూ పెద్ద మ‌న‌సుతో నేత్ర దానానికి ముందుకు రావాల‌ని.. ఇత‌రుల జీవితాల్లో వెలుగులు నింపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. నేత్ర దానం తాలూక ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ జిల్లా అంధ‌త్వ నివార‌ణ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన నేత్ర‌దాన ప‌క్షోత్స‌వాల‌ను ఆమె గురువారం జెండా ఊపి ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి త‌న నేత్రాల‌ను దానం చేస్తూ సంబంధిత‌ అంగీకార వీలునామా ప‌త్రాన్ని వైద్యాధికారులకు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ నేత్ర దాన ఆవశ్య‌క‌త‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని.. క‌ళ్లు లేనివారి జీవితాల్లో వెలుగులు నింపాల‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌క్రియ‌పై అపోహ‌లు వీడి మాన‌వ‌తా దృక్ప‌థంతో అంద‌రూ ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. చ‌నిపోయిన త‌ర్వాత క‌ళ్లు ఇవ్వ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికి కొత్త జీవితాల‌ను ప్ర‌సాదించ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

నేత్ర దాన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అవ‌గాహ‌న ర్యాలీలు, స‌ద‌స్సులు పెట్ట‌నున్నామ‌ని పేర్కొన్నారు. ప‌క్షోత్స‌వాలు వ‌చ్చే నెల 8వ తారీఖు వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం వైద్యారోగ్య శాఖ సిబ్బంది, కంటి వెలుగు విభాగ వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సార‌థి వెల్పేర్ అసోసియేష‌న్ స‌భ్యులు, విద్యార్థులు క‌లెక్ట‌రేట్ నుంచి పెద్దాసుప‌త్రి వర‌కు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌తో పాటు జిల్లా అంధ‌త్వ నివార‌ణ అధికారి డా. బి. శివ‌ప్ర‌సాద్‌, కంటి వెలుగు విభాగ అధికారి డా. తార‌కేశ్వ‌ర‌రావు, ఇత‌ర వైద్యాధికారులు, పుష్ప‌గిరి ఆసుప‌త్రి వైద్య సిబ్బంది, సార‌థి వెల్పేర్ అసోసియేష‌న్ స‌భ్యులు, ఏఎన్ఎంలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-25 07:16:24

పర్యావరణ హితంగా గణపతి నవరాత్రులు

గణపతి నవరాత్రి ఉత్సవాలను పర్యావరణం, పౌర జీవనాలకు విఘాతం కలుగకుండా,  సజావుగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు సంయుక్తంగా వివిధ శాఖల జిల్లా అధికారులు, నగర గణేశ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి గణపతి నవరాత్రి ఉత్సవాలు, విగ్రహ నిమజ్జనాల నిర్వహణ అంశాలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఏటా ప్రజలు భక్తిశ్రద్దలతో ఆనందగా జరుపుకునే వినాయక చవితి వేడుకలు  కోవిడ్ మహమ్మారి కారణంగా 2019 తరువాత గడచిన రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయని, కోవిడ్ పరిస్థితులు దాదాపు తొలగిన నేపద్యంలో ఈ సంవత్సరం వేడుకలను తిరిగి జరుపుకోవడం జరుగుతోందన్నారు.  ఈ వేడుకలను కృత్రిమ రసాయనిక రంగులు వాడని, మట్టితో చేసిన విగ్రహాలను పూజించి  పర్యావరణ హితమైన రీతిలో జరుపుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  అలాగే ఉత్సవ నిర్వహణకు ఏర్పాటు చేసే పాండళ్లను జన, వాహన సంచారాలకు ఆటంకం కలిగించని రీతిలో ఏర్పాటు చేసుకోవాలని, పందిళ్లలో ఎటువంటి ప్రమాదాలకు తావులేని రీతిలో తగిన భద్రతా ఏర్పాట్లు తప్పని సరిగా పాటించాలని కోరారు.  

పాండళ్ల ఏర్పాటు చేసేటపుడు రెవెన్యూ, విద్యుత్, పోలీస్, మున్సిపల్, పంచాయితీ శాఖల అనుమతి విధిగా తీసుకోవాలని తెలిపారు.  పందిళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే మైకులను అనుమతించిన సమయాల్లోనే వినియోగించాలని, శబ్ద కాలుష్యం వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగకుండా వేడుకల నిర్వాహకులు సహకరించాని కోరారు.  అలాగే బాణాసంచా వినియోగించేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.    నవరాత్రి వేడుకల అనంతరం విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు అనువైన, భద్రమైన ప్రదేశాలను ఆర్డిఓలు, మున్సిపల్ కమీషనర్లు గుర్తించి, అవసరమైన క్రేన్లు, లైటింగ్ ఇతర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.  అలాగే ఊరేగింపులు సాగే మార్గాల్లోను, నిమజ్జన ప్రదేశాలలోను సిసి కెమెరాలను ఏర్పాటు చేసి అవాంఛిత సంఘటనలు జరుగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.  నిమజ్జనం రోజున జిల్లాలో మద్యం షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.   అలాగే పోలీస్ శాఖ సమన్వయంతో ఊరేగింపు రూట్లు నిర్థేశించి, ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా నివారించాలని ఆదేశించారు.  నిమజ్జన ప్రదేశాల వద్ద ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను, బోట్లను ఏర్పాటు చేయాలని మత్య్స శాఖను ఆదేశించారు.  

అలాగే ఈ ప్రదేశాల వద్ద లైటింగ్ ఏర్పాటుకు మున్సిపల్, పంచాయితీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఫస్ట్ ఎయిడ్ క్రేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.  నిమజ్జనాలు నిర్వహించే జల వనరులలో నిమజ్జనాలకు ముందు, తరువాత కాలుష్య స్థాయిలను నమోదు చేయాలని, 48 గంటలలోపు విగ్రహాల కొరకు వాడిన ఇనుము, ప్లాస్టిక్ సామాగ్రిని పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.  అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలలో అన్ని జాగ్రత్తలతో వేడుకలు జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో వేడుకలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని కోరారు. 
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ కోవిడ్ ముప్పు ముగిసిన అనంతరం ఈ యేడాది  గణపతి నవరాత్రి వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారని, ఈ వేడుకలను ఎవరికీ ఇబ్బంది లేకుండా, సురక్షితంగా జరుపుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  పాండళ్ల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనాలు సందర్భంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ నియంత్రణ చేపడుతుందన్నారు.  ప్రతి పాండళ్ వద్ద నిర్వాహకులు ఫైర్ ఫైటింగ్ జాగ్రత్తలు, పరికరాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  లైటింగ్, కరెంట్ వైర్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగకుండా ట్రాన్స్ కో అధికారుల పరిశీలన అవసరమన్నారు. నిమజ్జన స్థలాల వద్దకు చిన్న పిల్లలను అనుతించ వద్దని ఉత్సవ కమిటీలను కోరారు. 
సమావేశంలో నగర గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధుల బృందం సభ్యులు దూసర్లపూడి రమణరాజు, దువ్వూరి సుబ్రమణ్యం, రంభాల వెంకటేశ్వర్లు, యెనిమిరెడ్డి మాలకొండయ్య గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల సహకరిస్తామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె.శ్రీధరరెడ్డి, ఆర్డిఓలు బి.వి.రమణ, జె.సీతారామారావు, డిపిఓ ఎస్.వి.నాగేశ్వరనాయక్, డిఎస్పిలు భీమారావు, మురళీమోహన్, అంబికాప్రసాద్, జిల్లా మత్స్య అధికారి పి.వి.సత్యన్నారాయణ, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయితీరాజ్, ట్రాన్స్ కో, పొల్యూషన్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2022-08-24 14:02:24

స్మార్ట్‌సిటీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

స్మార్ట్ సిటీ మిష‌న్ కింద కాకినాడ‌లో చేప‌ట్టిన 71 ప్రాజెక్టుల్లో 50 ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని.. మిగిలిన 21 ప్రాజెక్టుల ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి ప్ర‌జ‌లకు అందుబాటులోకి తెచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్‌, స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఛైర్‌ప‌ర్స‌న్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో మూడో సిటీ లెవెల్ అడ్వ‌యిజ‌రీ ఫోర‌మ్ (సీఎల్ఏఎఫ్‌), 34వ డైరెక్ట‌ర్ల బోర్డు స‌మావేశాలు జ‌రిగాయి. ఈ స‌మావేశాల‌కు కాకినాడ నగ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న, క‌మిష‌న‌ర్ కె.ర‌మేష్‌, అడ్వ‌యిజ‌రీ ఫోర‌మ్ స‌భ్యులు, డైరెక్ట‌ర్లు హాజ‌ర‌య్యారు. స‌మ్మిళిత‌, సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యంగా స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద చేప‌ట్టిన ప్రాజెక్టులు, పూర్త‌యిన ప‌నులు, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నుల్లో పురోగ‌తి త‌దిత‌ర వివ‌రాల‌ను క‌మిష‌న‌ర్.. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఈ  సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ మిష‌న్ ప‌నుల ద్వారా కాకినాడ స‌మ‌గ్ర అభివృద్ధికి ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ రంగాల ప్ర‌ముఖుల నుంచి స‌ల‌హాలు తీసుకునేందుకు, మార్గ‌నిర్దేశ‌నం పొందేందుకు అడ్వ‌యిజ‌రీ ఫోర‌మ్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు.

 విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని ఫోరం స‌భ్యులు చేసిన సూచ‌న‌లు ప్రాజెక్టు ప‌నుల స‌త్వ‌ర పూర్తికి, న‌గ‌ర అభివృద్ధికి దోహ‌దం చేస్తాయ‌న్నారు. రూ. 564 కోట్ల‌తో చేప‌ట్టిన 50 ప్రాజెక్టులు పూర్త‌య్యాయని, రూ. 348 కోట్ల అంచ‌నాల‌తో చేప‌ట్టి, ప్ర‌స్తుతం ప‌నులు జ‌రుగుతున్న 21 ప్రాజెక్టులను ప‌టిష్ట ప్ర‌ణాళిక‌ల‌తో, వివిధ శాఖ‌ల అధికారుల స‌మ‌న్వ‌యంతో 2023, జూన్‌లోగా పూర్తిచేసి, వినియోగంలోకి తెచ్చేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. పూర్త‌యిన ప్రాజెక్టుల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌పైనా అధికారులు దృష్టిసారించాల‌న్నారు. మిష‌న్ పూర్తికి ఇంకా ప‌ది నెల‌ల స‌మ‌యం అందుబాటులో ఉన్నందున‌.. ఈ కాలాన్ని స‌ద్వినియోగం చేసుకొని చేప‌ట్టిన అన్ని ప్రాజెక్టులను విజ‌య‌వంతంగా పూర్తిచేయాల‌ని పేర్కొన్నారు. ఉప క‌మిటీల స‌మావేశాలను ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్.. అధికారుల‌కు సూచించారు. స‌మావేశాల్లో ఫోరం స‌భ్యులు వైడీ రామారావు, డా. వై. క‌ళ్యాణ్‌చ‌క్ర‌వ‌ర్తి, టీవీఎస్ కృష్ణ‌కుమార్‌, జేవీఆర్ మూర్తి, సీహెచ్ సుసి తదిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-08-24 13:59:15

పీహెచ్సీ పరిధిలోనే వైద్యులు నివాసముండాలి

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారులు, సిబ్బంది ప్రధాన కేంద్రంలోనే ఉండి సమయపాలన పాటించి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం  జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మరియు సిబ్బందితో సమీక్షా నిర్వహించిన సమీక్షలో  కలెక్టర్ మాట్లాడుతూ   ఆరోగ్య ఉప కేంద్రాలలో వైధ్యాదికారులు నిరంతరం సందర్శనలు చేపట్టి అవసరమైతే  వైద్య శిభిరాలను నిర్వహించాలని,  రోగులకు అందించిన వైద్య సేవలు అందుబాటులో ఉన్న మందులు వివరాల రిపోర్టులను సంబందిత అధికారుల ద్వారా పంపించాలని కోరారు.   గ్రామ సందర్శనల ద్వారా గుర్తించిన గర్భిణి స్త్రీలను నమోదుచేసి చెకప్ చేయాలని,  ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం జరుగునట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పధకం ద్వార  గర్భిణిలకు పౌష్టికాహారం నిమిత్తం విడతల వారిగా అందించే పారితోషికం విషయమై వారి పూర్తీ వివరాలను పోర్టల్ లో నమోదుచేసి సకాలంలో నగదు అందునట్లు  చర్యలు  తీసుకోవాలని  తెలిపారు. రిపెరులో ఉన్న  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అంబులెన్స్ లను వారం రోజులలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 

 మాత్రు మరియు శిశు సేవల వివరాలను సకాలంలో యం.సి.హెచ్ పోర్టల్ లో నమోదు చేయాలని  తెలిపారు. మాత్రు శిశు మరణాలు జరిగిన వెంటనే సదరు వైధ్యాదికారి విచారణ జరిపి వెంటనే సంబందిత కారణములను జిల్లా శాఖకు పంపాలని సూచించారు.  వైద్య ఆరోగ్య శాఖ యొక్క సేవల  పోర్టల్ లో నమోదుచేసిన రిపోర్ట్ లపై సమీక్షను నిర్వహించిన కలెక్టర్  అసంతృప్తిని వ్యక్తం చేసారు. మరో రెండు వారాలలో తిరిగి సమిక్ష నిర్వహిస్తానని, ఆరోగ్య శాఖ యొక్క సేవల  పోర్టల్ లో నమోదుచేయాల్సిన రిపోర్ట్ లను త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు.   వైద్యాధికారులు మరియు సిబ్బంది ప్రతి రోజు బయోమెట్రిక్ అటెండెన్స్  నమోదుచేయాలని ఆదేశించారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ కార్యాక్రమంలో  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. సుజాత, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కే లీలా ప్రసాద్రు, డి.టి.సి.ఓ డా. టి. విశ్వేశ్వర రావు నాయుడు, డి.ఐ.ఓ డా. ప్రభావతి గారు, పి.ఓ. డి.టి.టి.  డా. ప్రభావతి గారు,  35 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు  సిబ్బంది పాల్గున్నారు.

Paderu

2022-08-24 13:55:28

మాతా, శిశుమరణాలు లేకుండా చూడాలి

అల్లూరిసీతారామరాజు జిల్లాలో మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.  బుధవారం ఐసిడిఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ఐసిడిఎస్ ద్వారా అందించే అన్ని సేవలు సంబంధిత యాప్ లలో అప్లోడ్ చేయాలనీ, జిల్లా డాష్ బోర్ద్ లో ప్రకటించాలని సూచించారు.  సిగ్నల్ సమస్య ఉంటె, ఆఫ్ లైన్ లో నమోదు చేసి సిగ్నల్ ఉన్న దగ్గర ఆన్ లైన్ చేయాలనీ సూచించారు. జిల్లాలో 20 నుండి 25 శాతం పిల్లలకు ఇమ్మ్యునైజేషణ్ జరగటం లేదని, వారందరినీ గుర్తించి వారికి వ్యాధి నిరోధక మందులు అందజేయాలని ఆదేశించారు.  వైద్య అధికారులు, సిబ్బంది సహకారంతో మందులు తీసుకోవాలన్నారు.  రక్త హీనత ఉన్న తల్లుఅలను, బిడ్డలను గుర్తించి వారిపై ప్రత్యెక శ్రద్ధ కనపరచాలన్నారు. బరువు, ఎత్తులను ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకనుగునంగా వారికి పౌష్టికాహారం అందచేయాలన్నారు. ఇక నుండి ప్రతి 15 రోజులకు సమీక్షిస్తానని, సమీక్షలకు తగిన వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. జిల్లలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి నివేదిక అందచేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. రక్త హీనత, ఎదుగుదల లేకపోవటం, నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి స్పాట్ ఫీడింగ్ ఇవ్వాలన్నారు. సిడిపిఒలు, సుపెర్వైజర్లు ప్రతి అన్గావాడి కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడి కార్యకర్తలు, వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, మహిళా పోలీస్ లతో సమావేశమై తగు సూచనలు జారీ చేసి అవగాహనా కల్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అయిన సరుకులు, పంపిణీ చేసిన, మిగిలిన స్టాక్ తో సరిపోల్చాలన్నారు.  సందర్శనలలో గ్రోత్ మోనటరింగ్ పై శిక్షణ ఇవ్వాలన్నారు. 

ప్రతి సిడిపిఒ గర్భిణీల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేసి వారితో ఎప్పటికప్పుడు మాటాడి వారికి ధైర్యం కల్పించాలని, అవసరమైన సూచనలు అందచేయాలని ఆదేశించారు. గర్భినీలకు సేవలు అందించటం కోసమే మీరున్నారని గుర్తించాలని,  వారికి సేవలు అందించ లేకపోతె మీకు జీతాలు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలకు రక్త హీనత, పౌష్టికాహారం, ఎదుగుదల, లో వెయిట్,  ఆరోగ్యం తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.  లేక్టింగ్ స్త్రీలను ట్రాక్ చేసి వారికి సరైన రీతిలో మందులు అందచేయాలన్నారు. అనీమియా నిర్వహణలో సచివాలయ మహిళా పోలీసులు స్పందించటం లేదని కలెక్టర్  దృష్టికి తీసుకు రాగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ఎస్పి సతీష్ కుమార్ తో మాటాడి వారికి తగు సూచనలు జారీ చేయాలనీ కోరారు.  అదేవిధంగా సచివాల్యాలకు ఒక సర్క్యులర్ పంపించాలని సూచించారు.  

జిల్లాలో 131 అంగన్వాడి కేంద్రాలకు నాడు- నేడు కింద అభివృద్ధి చేయటానికి కేంద్రానికి రూ.13.50 లక్షలు మంజూరైనందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.  అందుకు అవసరమైన కమిటీసభ్యుల వివరాలు తీసుకుని ఆధార అప్డేట్ చేయించి సంబంధిత  బ్యాంకు లలో ఖాతాలు తెరిపించాలని, తద్వారా అంగన్వాడి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. హుకుంపేట ప్రాజెక్ట్ పరిధిలో నాణ్యమైన సరుకులు పంపిణీ కావటం లేదని,   సిడిపిఒలు  కలెక్టర్ దృష్టికి తీసుక  రాగా ఆయా కాంట్రాక్టర్లను గురువారం తన వద్ద హాజరు పరచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇసిడిఎస్ ప్రాజెక్ట్  డైరెక్టర్ సూర్యలక్ష్మి, పాడేరు డివిజన్ లోని అంగన్వాడి ప్రాజెక్ట్ ల సిడిపిఒలు, సూపెర్వైజర్లు,  తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2022-08-24 13:50:36

మత్తు పదార్ధాల నష్టాలను విద్యార్ధులకు వివరించాలి..

మ‌త్తు ప‌దార్ధాలు, మాద‌క ద్ర‌వ్యాల‌వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను విద్యార్థుల‌కు వివ‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి సూచించారు. న‌ష ముక్త భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మం అమ‌లులో భాగంగా త‌న ఛాంబ‌ర్‌లో వివిధ విద్యాశాఖ‌ల అధికారుల‌తో, క‌లెక్ట‌ర్ త‌న ఛాంబ‌ర్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువ‌త‌ను మ‌త్తుప‌దార్ధాల‌నుంచి విముక్తి క‌ల్గించాల‌ని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి, వీటి వాడ‌కం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను, దుష్ప‌రిణామాల‌ను వివ‌రించాల‌ని సూచించారు. దీనిలో భాగంగా ప్ర‌తీ విద్యాసంస్థ‌లో ఫెక్సీల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. మ‌త్తుప‌దార్ధాల‌ను వాడ‌బోమంటూ, విద్యార్థుల‌చేత ప్ర‌తిజ్ఞ‌లు చేయించాల‌ని సూచించారు. మ‌త్తుప‌దార్ధాల వినియోగం వ‌ల్ల జీవితాలు ఎలా నాశ‌నం అయిపోతాయో తెలియ‌జేయాల‌ని అన్నారు. అలాగే మ‌త్తు ప‌దార్ధాలు, మాద‌క ద్ర‌వ్యాల‌ కొనుగోలు, విక్ర‌యాలు చేప‌ట్టినా, వాటిని వినియోగించినా చ‌ట్ట‌ప్ర‌కారం నేర‌మ‌ని, వాటికి ప‌డే శిక్ష‌ల గురించి తెలియ‌జేయాల‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు. ఈ స‌మావేశంలో జెఎన్‌టియు గుర‌జాడ విశ్వ‌విద్యాల‌యం డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ కె.బాబులు, డిఇఓ కె.వెంక‌టేశ్వ‌ర్రావు, స‌మ‌గ్ర శిక్ష పిఓ డాక్ట‌ర్ వి.స్వామినాయుడు, విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్దుల సంక్షేమ‌శాఖ ఎడి జ‌గ‌దీష్, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-08-24 13:11:48

తుమ్మచెట్లను తొలగించి భూసారాన్ని పెంచాలి

తిరుమల శేషాచల అడవుల్లో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అకేషియా(తుమ్మ) చెట్ల‌ను తొలగించి భూసారాన్ని పెంచాల‌ని,  టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో బుధ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, సంప్రదాయ మొక్కల పెంప‌కం పనుల‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మోడ‌ల్ ప్రాజెక్టుగా ఒక హెక్టార్‌లో అకేషియా చెట్ల‌ను తొల‌గించి సంప్ర‌దాయ మొక్క‌ల పెంప‌కం చేప‌ట్టార‌ని, క్ర‌మంగా విస్త‌రించాల‌ని సూచించారు. ఈ ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరారు. భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా తిరుమ‌ల‌లో రోడ్ల సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. తిరుమ‌ల‌లో నిర్మాణంలో ఉన్న త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. టిటిడిలోని ప‌లు విభాగాల్లో ఉన్న పాత రికార్డుల‌ను ప‌రిశీలించి ముఖ్య‌మైన వాటిని డిజిటైజ్ చేయాల‌ని, మిగిలిన వాటిని తొల‌గించాల‌ని సూచించారు. తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ స్వామివారి ఆల‌య గోపురం బంగారు తాప‌డం ప‌నుల‌ను అక్టోబ‌రులోపు పూర్తి చేయాల‌న్నారు. తిరుప‌తిలోని గోశాలను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల సూచ‌న‌ల మేర‌కు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాల‌ని కోరారు. అనంత‌రం స్థానికాల‌యాల్లో జ‌రుగుతున్న గోపూజ‌పై ఈవో స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎఫ్ఏసిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-08-24 09:56:25

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

రీ సర్వే చేపట్టడం ద్వారా భూ సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారించేందుకు వంద సంవత్సరాలు తర్వాత జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం ద్వారా సర్వే చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం "జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం "పై సర్వేయార్ల శిక్షణ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్,  ఎమ్మేల్యే జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 1920 సంవత్సరంలో అప్పటి అధికారులు భూ సర్వే చేపట్టి భూ రికార్డులను నిబద్దతతో ఆధునికరించారన్నారు. స్పందనగా కార్యక్రమంలో గానీ , ప్రజలు అందజేసే వినద్దుల్లో గాని ఎక్కువ శాతం భూ సంబంధ సమస్యలు అంశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. గత వంద సంవత్సరాలుగా భూ రికార్డులు ఆధునీకరించిపోవడం కొనుగోలు అమ్మకాలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన రికార్డుల లో మార్పులు చేయకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న భూ హక్కు మరియు భూ రక్షా పథకం ద్వారా భూ సర్వే నిర్వహించి, భూ రికార్డుల స్వచ్చికరణ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న భూ యజమాని పేరుతో భూ రికార్డుల సర్వే ద్వారా కొత్త సర్వే నంబర్ కేటాయించడం కోసం ఈ ప్రక్రియ ను చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సర్వే లో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలు నిబద్దతతో,  సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని ఖచ్చితమైన విధానం లో నమోదు చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలక్ష్యం ప్రదర్శించరాదని తెలియచేశారు. 

దేశంలోనే ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి దానికి లాజికల్ కంక్లుజన్ (తార్కిక ముగింపు) తీసుకుని రాగలిగిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమన్నారు. ప్రతి న్యూ డివిజన్లో ఒక గ్రామాన్ని  పైలెట్ గా ఎంపిక చేసి సర్వే పూర్తి చేసి, పత్రాలు అందజేశామని, గ్రామ సచివాలయం వద్ద నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో పరిమితి సంఖ్యలో మానవ వనరులు ఉండేవని, ప్రస్తుతం మన దగ్గర 96 సచివాలయం వద్ద సర్వేయర్లు, మరో నలుగురు సిబ్బంది కూడా ఉండడం వల్ల సర్వే మరింత సులభతరం కానున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్దతతో సర్వే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎంపీ మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, ప్రతి పేదవానికి, సామాన్యునికి మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వే ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ ప్రక్రియ చేపట్టినా సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యం చెయ్యక పోవడం చుసామన్నరు. ఐతే ముఖ్యమంత్రి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూ రికార్డుల సర్వే చేపట్టే దిశగా అడుగులు వేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ను అంతే నిబద్దతతో చేపట్టవలసి ఉందని ఎంపి తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ పురపాలక సంఘాలు పరిధిలో చేపడుతున్న ఈ భూ సర్వే పనులు అత్యంత జాగ్రత్తగా పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల లో చేపట్టిన సర్వే సమర్థవంతంగా చేపట్టిన దృష్ట్యా వాటి నుంచి పొందిన అనుభవాన్ని మనకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకుని, తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలని కోరారు.శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో నిర్వహించిన సర్వే తరువాత ఇంత లేటెస్టు ఎక్యుప్ మెంట్ వినియోగిస్తూ ఖచ్చితంగా హద్దులను నిర్ణయిస్తూ చేస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. రీసర్వే చేయడం పట్ల రైతులు నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఇప్పటి వరకు రీసర్వే వూర్తియిన గ్రామాల్లో ప్రజలు మంచి స్పందన  వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు  మాట్లాడుతూ, సర్వే చేపట్టే ప్రక్రియ పూర్తి వివరాలు కలెక్టర్ ద్వారా సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. సర్వే ప్రక్రియ పూర్తి అయ్యేలా పనితీరు చూపాల్సి ఉందని తెలిపారు. ఈ శిక్షణా సమావేశానికి  శాసన సభ్యులు జక్కంపూడి రాజా, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, ఆర్ ఎమ్ సి అధికారులు, మునిసిపల్ సచివాలయ వార్డు సర్వే, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-24 09:36:57

100 పడకలతో డెంగీ ప్రత్యేక వార్డు

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వంద పడకలతో డెంగీ చికిత్సకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మెడికల్, సర్జికల్ బ్లాకులను కలెక్టరు కృతికా శుక్లా.. జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్  మెడికల్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో 100 పడకలతో డెంగీ వ్యాధికి చికిత్స పొందేవారి కోసం ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందు కొరకు  ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. సీజనల్ వ్యాదులైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాదులు పట్ల వైద్యులు అప్రమత్తుతో వ్యవహరించాలన్నారు.  ముఖ్యంగా ఆసుపత్రిలో వార్డులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులు సూచించారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులపై అవగాహన పెంపొందించుకుని తమ నివాస, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా మెడికల్ బ్లాక్, వోల్డ్ ఎస్ఎస్ఆర్ వార్డులో డెంగీ వ్యాధితో చికిత్స పొందుతున్న వారితో కలెక్టర్ మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టరు వెంట జీజీహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్, మెడికల్ వార్డు విభాగాధిపతి డా. విజయ్ కుమార్, ఆర్.ఎం.ఓ డా.యమున ఇతర వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.

కాకినాడ

2022-08-24 09:08:14