1 ENS Live Breaking News

అర్హత ఉంటే నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు

అర్హత ఉంటే చాలు నేరుగా అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు  శాసనసభ్యులు  అలజంగి  జోగారావు  తెలిపారు.   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  భాగంగా మంగళవారం ఉదయం పార్వతిపురం పురపాలక సంఘం, కొత్తవలస 4వ సచివాలయం పరిధిలో  9వ వార్డు విజయరామరాజు కాలనీ మరియు నిర్మల కాలనీలలో  పర్యటించారు. ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు అలజంగి జోగారావు   ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి నేరుగా ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి వారికి సీఎం  వై. యఎస్‌. జగన్  మోహన్  రెడ్డి  అమలు  చేస్తున్న  సంక్షేమ  పధకాలు ,  ప్రభుత్వం ఈమూడెళ్ళ పరిపాలనా కాలంలో చేసిన సహాయాన్ని  తెలియ చేస్తూ  కరపత్రాలు  అందజేశారు.   అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకున్న వారి వివరాలు తెలుసుకుని వాటిని నమోదు చేయించి వారికి రానున్న కాలంలో అర్హత మేరకు ఆయా పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్టానిక  సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసినదిగా  అధికారులకు  ఆదేశించారు.  ప్రతి  పేదవానికి  సంక్షేమ  పధకాలను  చేరవేస్తూ అవినీతి రహిత ప్రజారంజక పాలనను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం  మన  ప్రభుత్వం మని   తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ప్రజలు శాసనసభ్యులకు ఘనస్వాగతం  పలికారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్ కే రుక్మిణీ, వైస్ చైర్మన్ ఇండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవి కుమార్, ఏఏంసి వైస్ చైర్మన్ వి. శంకర్రావు, స్థానిక కౌన్సిలర్ సభ్యులు పొట్నురు జయంతి, మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ వార్డుల  కౌన్సిలర్ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, ఏఎంసి డైరెక్టర్లు, స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-23 11:09:38

ఘనంగా టంగుటూరి 151 వ జయంతి

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి సందర్భంగా విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్స్ కే.మాధవి, డా. రాణీ సుస్మిత, డీ.కీర్తి,   పరిపాలన అధికారి ఈశ్వరరావు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి. మణిరామ్ , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు టంగుటూరి దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

Visakhapatnam

2022-08-23 11:04:31

సచివాలయాల నిర్మాణాలు పూర్తికావాలి..

ఎన్ఆర్ఈజీఎస్ , గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్  వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్) తదితర నిర్మాణాలకు జిల్లా కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,  నాడు - నేడు పనులు , ఏఎంసియూ, బిఎంసియూల నిర్మాణం, వైయస్సార్ డిజిటల్ లెబ్రరీ బిల్డింగ్స్, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, ఏపి టిడ్కో ఇళ్లు  , జగనన్న భూహక్కు మరియు భూరక్ష(సర్వే), జాతీయ రహదారులు, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వము తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జివియంసి కమిషనర్ లక్ష్మీషా, డియమ్ &హెచ్ఓ, డిఇఓ,  పిడి హౌసింగ్, ఎడి సర్వే వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-23 10:59:50

స్వచ్ఛ గ్రామాలే అందరి సంకల్పం కావాలి

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే అందరి సంకల్పం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ (పిఆర్, అర్ డి) ప్రత్యేక కమీషనర్ డా. శాంతి ప్రియ పాండే పేర్కొన్నారు. మంగళ వారం జిల్లా గిరి మిత్ర భవన్ లో డివిజనల్ పంచాయితి అధికారులు, ఎంపీడీఓ లు, ఈ ఓ పిఆర్ డి, పంచాయితీ కార్యదర్శిలు, ఎమ్ అర్ సి లతో సిరా( సర్వెలియన్స్, ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్, ఎనాలిసిస్), ప్లాస్టిక్ వ్యర్దం, చెత్తా చెదారం వేసే స్పాట్, లెగసీ డంపింగ్, సామూహిక మరుగుదొడ్లు నిర్వహణ అంశాల పై జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా చెత్త డంపింగ్ చేసే అలవాటు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుందని, ప్రజల్లో అవగాహన కల్పించి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని  అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమం పక్కగా జరగాలని, పంచాయితీ కార్యదర్శి లు, ఈ ఓ పి అర్ డిలు, డివిజనల్ పంచాయితీ అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీఓ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. 

పారిశుధ్యం నిర్వహణ పనులను ఉన్నత స్థాయి నుంచి పర్యవేక్షించేందుకు పంచాయితి కార్యదర్శి లకు బాడీ కెమెరా లు ఏర్పాటు చేసి వీడియో కాల్ , ఫొటోస్ ద్వారా ఇంటి పరిసరాలు,పారిశుధ్య పనులు ఎంత మేర నిర్వహించింది పరిశీలించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ క్లాప్ మిత్ర(గ్రీన్ అంబాసిడర్) చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిది ప్రజల మొబైల్ సందేశం ద్వారా తెలుసుకుంటామన్నారు. గ్రామ పంచాయితీ ల్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలో ఉండాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. పాగింగ్ , ఇన్సినిరైటర్స్ యంత్రాలు వినియోగంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య మెరుగుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్ర రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ఓ.ప్రభాకర రావు, జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు, విజయనగరం డి.ఎఫ్.ఓ ఎస్. వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-23 10:52:50

భవన నిర్మాణాలపై ద్రుష్టిపెట్టండి..

గ్రామ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం సంభందిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, గృహ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయి భవనాల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష (రీ సర్వే) పనులు వేగవంతం చేయాలని, స్పందన వినతులు పరిష్కారం పక్కాగా జరగాలని ఆయన పేర్కొన్నారు.

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె.రాజ కుమార్,  ఇంఛార్జి జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, హౌసింగ్ డిఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-23 10:50:13

అభివ్రుద్ధి పనులు ఆపడానికి వీల్లేదు..

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జిల్లాలోని అభివృద్ధి ప‌నులు ఆగ‌డానికి వీల్లేద‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పంచాయ‌తీ రాజ్ ఇంజనీరింగ్‌ అధికారుల‌ను, గుత్తేదార్ల‌ను ఉద్దేశించి అన్నారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా ప‌నుల‌ను గుర్తించి ముందుగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రారంభంకాని ప‌నుల‌కు వ‌చ్చే నెల 7వ తేదీలోగా శంకుస్థాప‌న‌లు చేయాల‌ని నిర్దేశించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేల స‌హ‌కారంతో ప‌నుల‌ను ప్రారంభించాల‌ని, నిర్ణీత కాలంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు, గుత్తేదార్ల‌కు సూచించారు. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్రారంభంకాని, అసంపూర్తిగా నిలిచిపోయిన‌ ప‌నుల‌పై స‌మీక్షించే నిమిత్తం జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పంచాయ‌తీ రాజ్ ఇంజ‌నీరింగ్‌ అధికారులు, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం జిల్లాల‌కు చెందిన‌ గుత్తేదార్ల‌తో మంగ‌ళ‌వారం స్థానిక జ‌డ్పీ స‌మావేశ మందిరంలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

జిల్లాలో ప్ర‌భుత్వ అనుమ‌తులు వ‌చ్చి వివిధ కార‌ణాలతో నిలిచిపోయిన ప‌నుల తాజా ప‌రిస్థితిపై ఆయన అధికారుల‌ను ఆరా తీశారు. ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అటు అధికారుల‌ను, ఇటు గుత్తేదార్ల‌ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక ప్ర‌క్రియ‌ల‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా ప‌నులను పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ప‌నుల‌ను నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేసి ప్ర‌జా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు గుత్తేదార్లు స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా జ‌డ్పీ ఛైర్మ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. గుత్తేదార్లు నిర్ణీత కాలంలో ప‌నులు పూర్తి చేస్తే.. సంబంధిత‌ బిల్లుల చెల్లింపు ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రిగేలా తాను బాధ్య‌త వ‌హిస్తాన‌ని ఛైర్మ‌న్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్యాకేజీల‌లో చేప‌ట్టిన ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు.

ప్ర‌జా అవ‌స‌రాల‌కు త‌గిన‌ ప్రాధాన్య‌త ఇవ్వండి

ప్ర‌జా అవ‌స‌రాల‌ను తీర్చే క్ర‌మంలో ప్ర‌భుత్వం గుర్తించిన ప‌నుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా జ‌డ్పీ ఛైర్మ‌న్ స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాల‌కు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాల‌కు తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. రోడ్లు, వంతెన‌ల‌కు సంబంధించిన ప‌నులను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించి నిర్ణీత కాలంలో అందుబాటులోకి తీసుకురావాల‌ని పేర్కొన్నారు. స్థ‌లానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌లువురు గుత్తేదార్లు జ‌డ్పీ ఛైర్మ‌న్ దృష్టికి తీసుకురాగా సంబంధిత సాంకేతిక ప్ర‌క్రియ‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని పంచాయ‌తీ రాజ్ ఇంజనీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు అన్నివిధాలా గుత్తేదార్ల‌కు స‌హాయ‌, స‌హ‌కారాలు అందించాల‌ని సూచించారు. ఒకే గుత్తేదారుకు అన్ని ప‌నులు కాకుండా విభజించి ప‌లువురికి అప్ప‌గించాల‌ని, నిర్ణీత కాలంలోగా ప‌నులు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటి

స‌మీక్ష‌లో భాగంగా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా ప‌నులు తాజా ప‌రిస్థితిని జ‌డ్పీ ఛైర్మన్ తెలుసుకున్నారు. పలుచోట్ల ఇంకా ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డానికి గల కార‌ణాల‌ను అధికారుల‌ను, గుత్తేదార్లను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల పంచాయతీ రాజ్ ఇంజ‌నీర్ల‌ను, ఎంపీడీవోల‌ను, గుత్తేదార్ల‌ను పిలిపించి నియోజ‌వ‌ర్గం వారీగా స‌మీక్షించారు.

స‌మావేశంలో పంచాయ‌తీ రాజ్ ఎస్‌.ఈ. ఆర్‌.ఎస్. గుప్తా, ఈఈ కేజీజీ నాయుడు, జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్‌, పంచాయ‌తీ రాజ్ విభాగానికి చెందిన డీఈలు, ఏఈలు, జేఈలు, ఉమ్మ‌డి జిల్లాకు చెందిన గుత్తేదార్లు పాల్లొన్నారు.

Vizianagaram

2022-08-23 10:46:21

ఆ వీఏఏల సమాధానాలు నమ్మసక్యంగా లేవు

కాకినాడ జిల్లాలో ఈ-క్రాప్ నమోదులో భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడిన గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ఇచ్చిన సమాధానాలు నమ్మసక్యంగా లేవని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా ఫోనులో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులకు అవకతవకలకు పాల్పడ్డారనే ప్రాధమిక సమాచారంపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆయనే పేర్కొన్నారు. అందులో శంఖవరం మండలం వీఏఏలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తరువాత ఇచ్చిన సమాధానంతో రెవిన్యూ సిబ్బంది ఇచ్చిన సమాధానాలకు పొంతన కుదరడం లేదని ప్రస్తుతం జిల్లా వ్యప్తంగా విచారణ జరుగుతోందని ఆయన వివరించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనలో కూడా నోటీసులు ఇచ్చిన ప్రాంతాలను తాము కూడా పరిశీలిన చేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు విషయంలో జరిగిన భారీ అవకతవకలపై చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లినట్టు జేడీఏ ఎన్.విజయ్ కుమార్ ఈఎన్ఎస్ కి వివరించారు.

నేటికీ షోకాజ్ నోటీసుల విషయం చెప్పని విఏఏలు
కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ అవకతవకలకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు నేటి వరకూ ఆ విషయాన్ని తాము పనిచేసే సచివాలయ డీడీఓలకు గానీ, మరికొందరు గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు గానీ తెలియజేయక పోవడం విశేషం. నోటీసులు అందుకున్న దగ్గర నుంచి చాలా మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులు సచివాలయాలకు కూడా హాజరు కాకుండా, అటు డీడీఓ  పంచాయతీ కార్యదర్శిలకు కూడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొన్నిచోట్ల గ్రేడ్-5 కార్యదర్శిలకు విషయం తెలిసినా..వారంతా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తుండటం విశేషం. అందునా తప్పుచేసింది వీఏఏలే అన్నట్టుగా..తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే మాట్లాడుతుండటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ శాఖలోని వ్యవసాయశాఖ వీఏఏలు దైర్యంగా ఈ-క్రాప్ బుకింగ్ విషయంలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడటం, అదే సమయంలో సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఈ భారీ స్కామ్ బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  ఇటు జిల్లా అధికారులు ఎంత మొత్తంలో అవినీతి జరిగిందనే విషయాన్ని, ఎంతెంత మొత్తాలకు వీఏఏలకు నోటీసులిచ్చారనే సమాచారాన్ని మీడియాకి తెలియజేస్తే తప్పా జిల్లా వ్యాప్తంగా ఎంతపెద్ద మొత్తంలో ఈ-క్రాప్ అవినీతి జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చూడాలి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ భారీస్కాములో కాకినాడ జిల్లాలో ఎంతమొత్తం వ్యవసాయశాఖ అధికారులు నిగ్గు తేల్చి.. ఎంతమందిని ఇంటికి పంపిస్తారనేది..!

Kakinada

2022-08-23 09:58:15

సింహాద్రి అప్పన్న అత్యంత మహిమాన్వితుడు

సింహాచలంలో శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) అత్యంత మహిమాన్వితుడని రాష్ట్ర గవర్నర్ భిష్వభూషణ్ హరిచందన్ అన్నారు. వరాహా, నారసింహ అవతారాలుతో కూడిన ఆ సింహాద్రినాధుడిని దర్శించుకోవడం భక్తులంతా తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారన్నారు. ఇటీవలే తాను కూడా సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామిని దర్శించుకోవడం జరిగిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.  ఈ మేరకు మంగళవారం  విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు సింహాద్రినాధుడి చందనోత్సవం విశిష్టతను తెలియజేస్తూ అప్పన్న చందనం ప్రసాదాన్ని అందజేశారు. శేష వస్త్రం సమర్పించారు.. అంతేకాకుండా ఆలయ చరిత్రను విపులంగా తెలియజేసే అంశాలుతో పాటు శ్రీ సింహాద్రినారసింహ స్ర్తోత్రమంజరి పుస్తకాలను శ్రీనుబాబు దంపతులు గవర్నర్ కు బహుకరించారు. సింహాద్రినాధుడి జ్ఞాపికను అందజేశారు. వరహా నరసింహ, చందనోత్సవం, నిజరూపం..నిత్య రూపం విశిష్ఠతను విపులము గా అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు. అయితే రాష్ర్ట ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పన్న క్షేత్ర మహత్యంకు సంబంధించి మరింత ప్రచారం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. భక్తుల్లో మరింతగా ఆధ్యాత్మిక భక్తిభావాలు పెంపొందించే విధంగా  తమ ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇటీవల ఆలయానికి భక్తులు తాకిడి ఘననీయంగా పెరిగిందన్నారు. గవర్నర్ ను కలిసి సింహాద్రినాధుడి చందనం ప్రసాదం , శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయడం సంతోషం కలిగించిందన్నారు.

Visakhapatnam

2022-08-23 09:31:07

ఈవీఎం గోదాముల భద్రతకు పటిష్ట చర్యలు

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  డా.కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ, ఎన్నికలు, పోలీసు, అగ్నిమాపక శాఖ‌ల అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. వ‌ర్షాలు తరుచుగా కురుస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని తీసుకోవాల‌ని కలెక్టర్ ఈ సంద‌ర్భంగా సూచించారు.  కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి రమణ, పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు జేవీఆర్.రమేష్, ఎం.జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-23 08:59:23

ఆయన తమ్ముడివా..ఈయన దత్త పుత్రుడివా

ఒక సిద్ధాంతం.. ఆలోచన లేని.. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా  ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా  వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడా? చంద్రబాబు దత్తపుత్రుడా? అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పాలని  అమర్నాథ్ డిమాండ్ చేశారు.సోమవారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు బట్టి  చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు మధ్య డీల్ కుదిరినట్టు అర్థమవుతోందని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడే ఆ పార్టీ చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత పెట్టిన పార్టీ అని అప్పుడే చెప్పామని అమర్ నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి చెయ్యమని పవన్ కళ్యాణ్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019లో జనసేన టీడీపీ నుంచి  రాష్ట్ర ప్రజలు తమను తాము కాపాడుతున్నారని అమర్ ఎద్దేవా చేశారు.  ఆ రోజు ఫలితాలు చూసి తమకు రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్  భావించి ఉంటారని అన్నారు.  చంద్రబాబుతో తాను కలిసి లేనని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్పుకోలేక పోతున్నారని అమర్ నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ మాటలు బట్టి ఆయన చంద్రబాబు ప్రొడక్షన్లో పనిచేస్తున్నారని స్పష్టం అవుతోందని అమర్ నాథ్ అన్నారు.

 ఈ రెండు పార్టీలు వస్తే సంక్షేమ పథకాల నుంచి ప్రజలను దూరం చేస్తారన్నది నిజమని అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా క్షేమం కోసం ఖర్చు చేయలేదని అన్నారు.అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ ఎలా కలిసుండాలని భావిస్తున్నారని అమర్ నాథ్ ప్రశ్నించారు.  జగన్ మోహన్ రెడ్డి లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పార.  ఇవి పవన్ కళ్యాణ్ కి  కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కళ్ళుండీ చూడలేక పోతున్నారని మంత్రి అన్నారు. పరిశ్రమలు రావాలంటే కప్పం కట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను అమర్ నాథ్ తీవ్రంగా ఖండించారు. ఏ పారిశ్రామికవేత్త అయినా ఫలానా నాయకుడికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ డబ్బులు ఇచ్చినట్లు చెప్పగలరా?  అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరినీ బెదిరించ వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడి పవన్ కళ్యాణ్ ఆయన చెంత చేరని అమర్ నాథ్ అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉండగా చిరంజీవి అంటే తమకు ఎంతో అభిమానమని ఆయన పుట్టిన రోజు నాడు ఆయన కించపరిచే విధంగా పవన్ మాట్లాడడం తనకు బాధాకరంగా ఉందని అమర్ నాథ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు  కలత చెంది పవన్ ను కొణెదల పవన్ కళ్యాణ్ అని  పిలవాలా?  లేక నారా నాదెండ్ల పవన్ కళ్యాణ్ అని పిలవాలా? అర్థం కావట్లేదని అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన వచ్చే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి నే  తిరిగి ముఖ్యమంత్రి గా చేయాలని రాష్ట్ర ప్రజలు  నిర్ణయిoచు కున్నారు అని అమర్ నాథ్ స్పష్టం  చేశారు.

Visakhapatnam

2022-08-22 16:08:45

జానపద కళలను కాపాడుకుందాం

గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదని ఏపి రాష్ర్ట భాషా సాంస్కృతిక మండలి ఛైర్మన్ వంగపండు ఉష అన్నారు. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖలోని పౌర గ్రంధాలయంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన వంగపండు ఉష మాట్లాడుతూ, రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు కోసేటప్పుడు, బిడ్డకు తల్లి అన్నం తినిపించేటప్పుడు ఆలపించే గీతాలే జానపదాలన్నారు. తన తండ్రి వంగపండు ప్రసాదరావు ఎక్కడ ప్రజలకు మేలు చేకూరుతుందంటే అక్కడే జానపదంతో వారికి అండంగా నిలేచేవారన్నారు. ఆ రోజుల్లో కనీసం వాయిద్య పరికరాలు కూడా లేవని కేవలం అగ్గిపెట్టితోనే సంగీతం సమకూర్చుకుని ఆలపించేవారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం కళాకారులకు అన్ని విదాల అండగా నిలుస్తుందన్నారు. గత ఏడాది అవార్డులు అందించి ఎంతో మందిలో స్పూర్తి నింపిందన్నారు. ఇక రాష్ర్ట శిష్టకరణం వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కంటి మహంతి అనూషాపట్నాయక్ మాట్లాడుతూ జానపద దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా స్నేహాంజలి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, పూర్వపు ఏడీసీపీ మహ్మద్ ఖాన్, పలు కళాసంస్థల గౌరవ అధ్యక్షులు కొనతాల రాజు, పణిస్వామి తదితరులంతా పాల్గొని కళాకారుల సేవలను కొనియాడారు.

 ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తమ సేవలను గుర్తించి సత్కరించడం తమలో మరింత బాధ్యత పెంచేలా చేసిందని సన్మానగ్రహీతలు నాగభూషణం, నరసింహమూర్తిలు అన్నారు. భవిష్యత్తులో కూడా తాము కళాకారులకు అండగా ఉంటామన్నారు. స్నేహాంజలి ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.ఎన్.మూర్తి సారధ్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇందులో భాగంగానే వంగపండు ఉష తన పాటలతో అలరించగా ప్రముఖ జానపద కళాకారుడు అసిరయ్య తన ఆట, పాటతో కేరింతలు కొట్టించాడు. అంతకు ముందు వ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.  ప్రతీ ఒక్కరూ జానపద కళలను కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సేవా పరులుగా పేరుగాంచిన మాతారికార్డింగ్ సెంటర్ అధినేతలు పల్లి నాగభూషణం, బిన్నాల నరసింహమూర్తులను ఘనంగా సత్కరించారు.  కార్యక్రమానికి భీశెట్టి వెంకటేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

Visakhapatnam

2022-08-22 15:34:30

స్పందన అర్జీలఅలసత్వంపై సహించేది లేదు

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని సహించబోమని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత హెచ్చరించారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగిన స్పందన వేదికలో ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం ద్వారా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచనలు జారీచేశారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన వేదిక అనంతరం అధికారులతో కమిషనర్ వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని కమిషనర్ స్పష్టం చేసారు. స్పెషల్ అధికారులంతా ప్రతీ వారం క్రమం తప్పకుండా తమకు కేటాయించిన సచివాలయాలను సందర్శించి, కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. స్పందన వేదిక సమయంలో కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందన వేదికలో ‘డయల్ యువర్ కమిషనర్’ ద్వారా 30, కార్యాలయం వేదికగా 29 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. స్పందన వేదికలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nellore

2022-08-22 13:30:56

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి..

వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పి.సత్యనారాయణ డిమాండ్ చేశారు .నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంధాలయంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిబంధనలు లోబడి   పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయకపోవడం తగదని, పెండింగ్ లో ఉన్న 
అక్రిడిటేషన్లను వెంటనే జారీ చేయాలన్నారు. అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ  కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 
5 లక్షల చొప్పున పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. 
స్థానిక దిన పత్రికలకు, పీరియాడికల్స్ కు సమాచార పౌర సంబంధాల శాఖ యాడ్స్ విడుదల చేసి ఆయా పత్రికలకు చేయూత నివ్వాలన్నారు . సీనియర్ జర్నలిస్టు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులకు అమలు చేయడం లేదని, జీఎస్టీ నిబంధన వల్ల స్థానిక పత్రికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే తొలగించాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు  బి.నారాయణ రావు మాట్లాడుతూ జీవో 142ను సవరించి జర్నలిస్టు సంఘాలకు అక్రిడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.సీనియర్ 
జర్నలిస్ట్ నేమాల హేమ సుందర రావు మాట్లాడుతూ జర్నలిస్టుల కాలనీలు నిర్మించి అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు,
సభ్యులు అర్.అబ్బాస్, చక్రవర్తి ,  రవికాంత్ ,వెంకట వేణు, తిర్లంగి హరి ,శివప్రసాద్,జి.ఆనంద్ , హరనాథ్,దొండా రమేష్, బాదంగీర్ సాయి, కొణతాల మోహనరావు,
బి.ఏ.నాయుడు,,మొల్లి కమల్ కుమార్ ,వి.గణేష్,నాయుడు యాదవ్,భగవాన్ , ఎం.శ్రీహరి వివిధ పత్రికల  సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-21 01:51:05

స్పందనలో ‘డయల్ యువర్ కమిషనర్

ప్రతీ సోమవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ ను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పై సమాచారం ఇవ్వాలనే ప్రజలు, పరిష్కారం నిమిత్తం కార్యాలయానికి రాలేని వారు సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 0861 – 2355678 నంబరుకు ఫోన్ చేసి సూచించిన గడువులోపు సంప్రదించాలని కోరారు. కార్యాలయంలో నిర్వహించే స్పందన వేదికలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. కావున అవసరమైన వారు ‘ డయల్ యువర్ కమిషనర్’ ద్వారా సేవలు పొందాలని కమిషనర్ ఆకాంక్షించారు.

Nellore

2022-08-20 07:35:09

దోమల నియంత్రణకు సహకరించాలి

దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి కోరారు. ప్ర‌పంచ దోమ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా, తమ కార్యాల‌యంలో శ‌నివారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ, దోమ‌ల‌వ‌ల్ల క‌లుగుతున్న అన‌ర్థాల‌ను వివ‌రించారు. దోమ అతిచిన్న కీట‌కమే అయిన‌ప్ప‌టికీ, మాన‌వాళికి దీనివ‌ల్ల ఎన్నో ర‌కాల ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయ‌ని చెప్పారు.  దోమ‌ల కార‌ణంగానే మ‌లేరియా వ్యాధి వ్యాప్తి చెందుతోంద‌ని, 1897లో స‌ర్ రోనాల్డ్ రాస్ ప్ర‌క‌టించార‌ని, అప్ప‌టినుంచి దోమ‌ల నివార‌ణా కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. మ‌లేరియా వ్యాధికి స‌కాలంలో స‌రైన‌ వైద్యం చేయించక‌పోతే, మ‌ళ్లీమ‌ళ్లీ వ‌చ్చి, చివ‌ర‌కు ప్రాణాంత‌క‌మ‌వుతుంద‌ని తెలిపారు. అందువ‌ల్ల దోమ‌ల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యం చూప‌కూడ‌ద‌ని, దోమ‌కాటువ‌ల్ల వ‌చ్చే వ్యాధుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

               జిల్లా మ‌లేరియా అధికారి తుల‌సి మాట్లాడుతూ, దోమ‌వ‌ల్ల క‌లుగుతున్న అన‌ర్ధాల‌ను వివ‌రించారు. దోమ‌వ‌ల్ల కేవ‌లం మ‌లేరియా మాత్ర‌మే కాకుండా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, ఫేలేరియా, మెద‌డు వాపు త‌దిత‌ర వ్యాధులు వ‌స్తాయ‌ని తెలిపారు. వీటిప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిరంత‌రం తెలియ‌జేస్తూ, ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తోంద‌ని చెప్పారు. దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో క‌లిసి కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ముఖ్యంగా దోమ‌ల‌ను నివారించడానికి ప్ర‌జ‌ల స‌హ‌కారం చాలా అవ‌స‌ర‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ శుక్ర‌వారం త‌ప్ప‌నిస‌రిగా డ్రైడే నిర్వ‌హించాల‌ని, ఇంటిలోప‌ల‌, ఇళ్ల చుట్టుప్ర‌క్క‌లా నీరు నిల్వ ఉండ‌కుండా చూడాల‌ని సూచించారు. నీళ్ల కుండీల‌ను, నీరు నిల్వ ఉంచే పాత్ర‌ల‌ను నిరంత‌రం శుభ్రం చేయాల‌ని చెప్పారు. జిల్లాలో మ‌లేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు అదుపులోనే ఉన్నాయ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.
             జిల్లా స‌హాయ మ‌లేరియా అధికారి డి.వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ, వ్యాధులు విజృంభించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నిరంత‌రం అప్ర‌మ‌త్తం చేస్తున్న‌ట్లు చెప్పారు. దోమ‌ల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల ప‌ట్ల  అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. జాతీయ‌ కీట‌క జ‌నిత వ్యాధుల నివార‌ణా కార్య‌క్ర‌మానికి సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు.

Vizianagaram

2022-08-20 07:19:25