1 ENS Live Breaking News

తెలుగు సాహిత్యంలో సినారే ఉద్దండులు

తెలుగు సాహిత్య, సంగీత రంగంలో సినారే సేవలు ప్రశంసనీయమని ఆంధ్రాయూనివర్సిటీ నృత్యవిభాగ ఉపాధ్యాయురాలు కె.వి.విజయవేణి కొనియాడారు. శుక్రవారం సాయంత్రం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తెలుగువీర సంస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వర్ధంతి, ప్రముఖ భాషావేత్త, కవి సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది చిన్నారులు కూచిపూడి, జానపద, శాస్ర్తీయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవేణి మాట్లాడుతూ, వెంపటి చినసత్యం యుగంను నాట్య యుగంగా పేర్కొనవచ్చన్నారు. ఆయన హయాంలో శాస్ర్తీయ నృత్యాలకు పెద్ద పీటవేశారన్నారు. ఇక తెలుగు సినిమా రంగంలో సి.నారాయణరెడ్డి అందించిన కథలు, రచనలుతో పాటు ఆయన రచించిన విశ్వంభర గ్రంథానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించిందన్నారు. వీరిద్దరూ భాషాభిమానులేనని వారి వల్లే ప్రస్తుత, భవిష్యత్ తరాలకు కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలాయన్నారు. గౌరవ అతిధిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగువీరసంస్థానం ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. శాస్ర్తీయ నృత్యాల వల్ల పిల్లలకు ఆధ్యాత్మిక భక్తిభావం పెరుగుతుందని, అంకితభావం, క్రమశిక్షణ కూడా అలవడుతాయన్నారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు సంస్థానం ట్రస్టు అధ్యక్షులు దొడ్డి శివకుమార్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా తెలుగుభాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

DABA GARDENS

2022-07-29 15:37:52

గ్రూప్-4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన జరగనున్న రెవెన్యూ డిపార్టుమెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్ (గ్రూప్-4) పోస్టుల నియామకం కోసం నిర్వహించే పరీక్షను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు అధికారుల‌ను ఆదేశించారు. గ్రూప్ -4 ప‌రీక్ష నేప‌థ్యంలో శుక్ర‌వారం ఆయ‌న స్థానిక‌ క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో లైజన్ అధికారులు, స‌హాయ‌క లైజన్ అధికార‌లు, చీఫ్ సూపరిండెంట్స్, పోలీస్, ఆర్టీసీ, మెడికల్, విద్యుత్ శాఖ, స‌మాచార పౌర సంబంధాల శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. జ‌రిగిన ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలో 52 కేంద్రాల్లో ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని, 19,153 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కానున్నార‌ని పేర్కొన్నారు. ఉద‌యం 11.00 నుంచి 1.30 గంట‌ల వ‌ర‌కు పరీక్ష జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. అభ్య‌ర్థుల‌ను గ్రేస్ పిరియ‌డ్ 5 నిమిషాల‌తో క‌లిపి ఉద‌యం 10.30 నుంచి 11.00 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. 11.00 త‌ర్వాత ఒక నిమిషం ఆల‌స్య‌మైనా ఎవ‌రినీ కేంద్రం లోప‌లికి అనుమతించ‌రాద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సంబంధిత విభాగాల అధికారులంద‌రూ స‌మ‌న్వ‌య లోపం లేకుండా అన్ని ఏర్పాట్ల‌ను ప‌క్కాగా చేసుకోవాల‌ని సూచించారు. ఎలాంటి అవ‌క‌త‌వ‌కలు జ‌ర‌గ‌కుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పరీక్ష‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. ప్ర‌ధానంగా లైజ‌న్ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అంద‌రితీ కో-ఆర్డినేట్ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. చీఫ్ సూప‌రింటెండెంట్లు ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన మెటీరియ‌ల్‌ను జాగ్ర‌త్త‌గా తీసుకొని వెళ్లాల‌ని, కేంద్రాల్లో అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించాల‌ని సూచించారు.

నిరంతర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా జాగ్ర‌త్త వ‌హించాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌ను, స‌మ‌యానికి కేంద్రాల‌కు చేరుకునేలా ఆర్టీసీ బ‌స్సులు న‌డ‌పాల‌ని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్ర‌తి కేంద్రం వ‌ద్దా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్ష‌న్ అధికారి శ‌ణ్ముఖ‌రావు, స‌హాయ సెక్ష‌న్ అధికారి గోపాల్‌, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ‌నివాస‌రావు, ఈపీడీసీఎల్ ఈఈ ధ‌ర్మ‌రాజు, ఏపీఆర్వో నారాయ‌ణ‌రావు, లైజ‌న్ అధికారులు, స‌హాయ‌క లైజ‌న్ అధికారులు, వివిధ ప‌రీక్షా కేంద్రాల చీఫ్ సూప‌రింటెండెంట్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-29 13:14:34

తూ.గో. కాపునేస్తం రూ.44.73 కోట్లు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లాలో  వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద 29,824 మంది కాపు మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.44.73 కోట్లు  జమచెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం 3 వ విడత కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి తో కలిసి రూ.44.73 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అంద చేశారు .  ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవిలత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆర్థిక సాధికారిక దిశగా అడుగులు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పేద కాపు మహిళలకి వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 45 - 60 సంవత్సరాలు మధ్య ఉన్న కాపు మహిళలకు రూ.15000 చొప్పున నగదును బ్యాంకు ఖాతాలకు జమచేసారని తెలిపారు. మహిళలు వారి కాళ్ళ పై వాళ్ళు నిలదొక్కు కోవడానికి ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు చేయడం జరిగిందన్నారు. ఈ మొత్తంతో వారు ఆర్థిక వనరులను పెంపొందించే విధంగా వీటిని వినియోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  నేరుగా నగదు బదలీ విధానంలో బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారని తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లాలో కాపునేస్తం పథకం కింద ప్రయోజనం పొందిన మహిళలకు తొలుత ఆమె శుభాకాంక్షలు తెలియచేశారు. ఇంకా అర్హులు ఎవరికైనా ఈ పథకం అమలుకాక పోయిఉంటే  సాంకేతికమైన కారణాల వలన ఆధార్ లింక్, బ్యాంకు ఖాతా తదితర కారణాలు దృష్ట్యా తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించడం జరిగిందన్నారు.  వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో నియోజక వర్గాల వారీగా :

రాజమహేంద్రవరం రూరల్ 4685 మంది లబ్ధిదారలకు రూ.7,02,75,000 లు, రాజమహేంద్రవరం అర్బన్ 2038 మందికి రూ.3,05,70, 000 ; అనపర్తి 4283 మందికి రూ.6,52,45,000 ;  రాజానగరం 6834 రూ.10,25,10,000 ; కొవ్వూరు 3976 మందికి రూ.5,96,40,000 ; నిడదవోలు 5299 మంది కి రూ. 7,94,85,000 ; గోపాలపురం 3387 మందికి రూ.5,08,05,000 లు

తొలుత గొల్లప్రోలు లో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని ఆన్లైన్ లో జిల్లా అధికారులు లబ్దిదారులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్, డిపివో జెవి సత్యనారాయణ, డి డి వో రత్న కుమారి, కొండగుంటురు సర్పంచ్ వి. నాగరాజు, లబ్దిదారులు పాల్గొన్నారు.


Rajamahendravaram

2022-07-29 10:09:53

స్పూర్తి నింపిన హెరిటేజ్ వాక్

అజాదీకా అమృత్ మ‌హోత్స‌వాలు నేటి యువ‌త‌లో స్ఫూర్తి నింపుతాయ‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు పేర్కొన్నారు. అమృతోత్స‌వాల్లో భాగంగా ప‌ట్ట‌ణంలోని మూడులాంత‌ర్లు నుంచి గంట‌స్తంభం వ‌ర‌కు, 150 అడుగుల‌ భారీ త్రివ‌ర్ణ ప‌తాకంతో, హెరిటేజ్ వాక్ పేరుతో, ఉజ్వ‌ల భార‌త్, ఉజ్వ‌ల్ భ‌విష్య‌త్‌ ర్యాలీని నిర్వ‌హించారు. నెహ్రూ యువ కేంద్రం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వ‌ర్యంలో  ఘ‌నంగా ఈ ర్యాలీ జ‌రిగింది. విద్యుత్ రంగంలో సాధించిన ఘ‌న విజ‌యాల‌ను ఈ ర్యాలీలో వివ‌రించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డిఆర్ఓ గ‌ణ‌ప‌తిరావు మాట్లాడుతూ, ఇలాంటి కార్య‌క్ర‌మాలు యువ‌త‌లో స్వాతంత్య్రోద్య‌మ స్ఫూర్తిని ర‌గిలించేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. అన్ని రంగాల్లో దేశం సాధించిన విజ‌యాల‌ను వివ‌రించేందుకు ఉజ్వ‌ల భార‌త్‌, ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నినాదంతో దేశ‌వ్యాప్తంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అన్ని గ్రామాల‌ను విద్య‌దీక‌ర‌ణ‌ చేయ‌డం, విద్యుత్ రంగంలో సాధించిన విజ‌యంగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కృషితో, ప్ర‌తీ ఇంటికీ విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా జ‌రుగుతున్న ఈ అమృతోత్స‌వాలు, వందేళ్ల ఉత్స‌వాల‌కు పునాది లాంటివ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా యువ‌జ‌న అధికారి విక్ర‌మాదిత్య‌, ఉత్స‌వాల జిల్లా నోడ‌ల్ అధికారి, ఎన్‌టిపిసి డిజిఎం పి.ఆనంద్‌బాబు,  తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప‌ర్య‌వేక్ష‌క ఇంజ‌నీర్ పి.నాగేశ్వ‌ర్రావు, ఇఇ కృష్ణ‌మూర్తి, జిల్లా ప‌ర్యాట‌కాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, విద్యుత్ శాఖ ఉద్యోగులు, విద్యాశాఖాధికారులు, ఎన్‌సిసి కేడెట్లు, విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-29 09:27:46

ఇలాగేనా స్పందన రికార్డులు నిర్వహించేది

విశాఖలోని వార్డు సచివాలయంలో స్పందన రికార్డుల నిర్వహణ సరిగా లేవని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కార్యదర్శుల పై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె 6వ జోన్ 88 వ వార్డు పరిధిలోని నరవ, కోటనరవ లోని 399, 404 సచివాలయాల వార్డ్ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు తో, జోనల్ కమిషనర్ సింహాచలం తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శుల హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీలను పరిశీలించారు. ముఖ్యంగా స్పందన రికార్డులను పరిశీలించగా వాటి నిర్వహణ సరిగా లేనందున సచివాలయల కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ ను ప్రవేశపెట్టి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అటువంటి సచివాలయ  వ్యవస్థను నిర్యయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పనులపై మీ వద్దకు వస్తారని వారిని చిరునవ్వుతో స్వాగతించాలని సూచించారు. డయల్ యువర్ మేయర్, స్పందన లలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వార్డు సచివాలయాల స్థాయిలోని సమస్యలు ప్రధాన కార్యాలయం వరకు రాకూడదని, ప్రధాన సమస్యలైన త్రాగు నీరు విద్యుత్ దీపాలు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులు సచివాలయ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి, వాటిని 24 గంటల్లో పరిష్కరించాలని, మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు పైఅధికారులకు సకాలంలో పంపించి అవి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో ఫిర్యాదులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని కార్యదర్శులను హెచ్చరించారు కార్యదర్శులు ఫీల్డ్ విజిట్ చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు.

Visakhapatnam

2022-07-29 09:19:40

బాలికల హక్కులపై అవగాహన అవసరం

బాలికల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, దిశ చట్టం పై అవగాహన, బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలనే అంశాల పై విధ్యార్థునీలకు అవగాహన కల్పించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి యం.ఎస.శోభారాణి అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయసమావేశమందిరంలో37 వసతి గృహాలు 11 ఫ్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాలు మరియు ఐదు కాలేజీ వసతి గృహాలు చదువుతున్న బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలి, కౌమారదశలోని బాలికలు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలకు సంబందించి విద్యార్థినీలకు అవగాహన కల్పించామన్నారు.ఈ అవగాహనా కార్యక్రమానికి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో 8 వ తరగతి చదువుతున్న విధ్యార్థీనీలు 90 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రతి విద్యార్థినీ వ్యక్తలు వివరించిన బాలికలు ప్రభుత్వం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈసందర్బంగా హాజరైన బాలికలకు నగదు పురస్కారం, బ్యాగ్ లు, అందజేశారు. 
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి (గైనకాలజిస్ట్) దిశాపోలీస్ స్టేషన్ ఎస్ ఐ రేవతి, డీసీపీవో వెంకట్,   డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, చైల్డ్ లైన్ కోర్డినేటర్ బి శ్రీనివాసరావు, వరల్డ్ విజన్ ప్రోగ్రామర్ మేనేజర్ అరుణ్ ప్రకాష్,సాంఘికసంక్షేమ శాఖ,సిబ్బంది, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 16:39:28

చెరువు గట్లను అందంగా తీర్చిదిద్దండి..

చెరువు గట్లు ఆహ్లాదకరంగా తయారు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. అమృత్ సరోవర్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఉపాధి హామీ పథకం కింద బాగుచేయడం జరిగిందని, ఆ చెరువు గట్లను ఆహ్లాదకరంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.  చెరువు గట్లు పై మొక్కలు నాటి కూర్చోడానికి బెంచ్ లు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అభినందించారు. లక్ష్యాలకు చేరువ కావాలన్నారు.  జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీపతి, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ రోజారాణి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-28 16:36:12

128 మంది విఏహెచ్ కార్యదర్శిలు క్రమబద్దీకరణ

గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వి ఏ హెచ్ కార్యదర్శులు గా సేవలందిస్తున్న 128 మంది సర్వీసు క్రమబద్దీకరణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వి ఏ హెచ్ కార్యదర్శులు గా క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులు  డి ఏ హెచ్ ఓ సత్య గోవింద్ తో పాటు కలెక్టర్ ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ,  సచివాలయం పరిధిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  గ్రామ పశుసంవర్ధక సహాయకులుగా  (కార్యదర్శులు) జిల్లాలో సేవలు అందిస్తున్న 128 మంది ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేసినట్లు తెలిపారు. మరో 50 మందికి అక్టోబర్ నాటికి సర్వీసు క్రమబద్దీకరణ పూర్తి కానున్న ట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ భద్రత కల్పించినందున ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పడానికి తనవద్దకు రావడం జరిగిందన్నారు.  ప్రజలకు అందుబాటులో ఉంటూ పశువుల సంరక్షణ కోసం మెరుగైన సూచనలు సలహాలు అందించే క్రమంలో నిబద్దతతో  పని చేయాలని సూచించారు. పశుసంవర్ధక సహాయకుడు పోస్టుకు ప్రాథమిక అర్హత వెటర్నరీ పాలిటెక్నిక్ లేదా డైరీ సైన్స్‌తో ఇంటర్మీడియట్ వృత్తివిద్య లేదా పశుసంవర్ధక వృత్తి ఇంటర్మీడియట్‌తో 2 సంవత్సరాలు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఏ హెచ్ ఓ  ఎస్జీటి సత్య గోవింద్,   పలువురు వి ఏ హెచ్ సహాయకులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 16:33:46

భవన నిర్మాణాల చెల్లింపుల్లో పురోగతి పెంచాలి

తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో స్టేజ్ కన్వర్షన్ లో, చెల్లింపుల విషయంలో మెరుగైన  పురోగతి సాధించాడంలో అధికారులు సమన్వయం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి పిఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కొన శశిధర్ లచే ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జీ పనుల్లో భాగంగా చేపడుతున్న అర్భికెలు, సచివాలయ, హెల్త్ క్లినిక్స్, బి ఎమ్ సి యూ భవన నిర్మాణ పనుల పై, అమృత్ సరోవర్ పథకం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ  మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులను చేపట్టడం, వాటికి అనుగుణంగా నిధుల కేటాయింపు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అదే సమయంలో ఆయా పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులను అప్లోడ్ చేయాలి అని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నిర్ణీత సమయం లో పూర్తి చేసేందుకు మెటీరియల్, కాంపోనెంట్ పథకం కి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అధికారులతో సమీక్ష చేస్తూ,  జిల్లాలో జల జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన టాప్ కనెక్షన్స్ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవారం 3,296 లక్ష్యం కోసం నిర్దేశించగా, కేవలం సుమారు 1400 మాత్రమే పూర్తి అవ్వడం పై వివరణ కోరారు.  ప్రతీ వారం లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  సచివాలయ భవనాలు 390 కి గాను 258 పూర్తి చేసి, మిగిలినవి పురోగతి లో ఉన్నాయన్నారు. అర్భికే లు 373 కి గాను 183 పూర్తి చేశారని, మిగిలినవి పూర్తి చేయాల్సి  ఉనాయన్నరు. సచివాలయ అర్భికే భవనాలు, హెల్త్ క్లినిక్స్, బిఎమ్ సియూ/ ఏఎమ్ సియూ లు స్టేజ్ కన్వర్షన్ ప్రగతి చూపాలని,  కోర్టు కేసులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని ప్రారంభం కావాలన్నారు. నియోజక వర్గం/ మండల వారీగా వారీగా ప్రాధాన్యత భవనాలు పై సమీక్ష చేస్తూ, వాటిని అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా స్థలం గుర్తింపు లేదా స్థల సమస్యలు పరిష్కారం చెయ్యాల్సి  అవసరం ఉంటే సంబందించిన మండల అధికారులకు తక్షణం ప్రతిపాదనలు చెయ్యాలని పేర్కొన్నారు.

ఆగస్ట్ 15 నుంచి ప్రతి ఇంటికీ డాక్టర్ టై అప్ చేసే కార్యక్రమం చేపట్టనున్న దృష్ట్యా హెల్త్ సెంటర్ నిర్మాణం పనులు మరింత త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. డ్వామా కి సంబందించిన ఉపాధి హామీ చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు  పి ఆర్ ఎస్ ఈ.,  ఎస్ బి వి ప్రసాద్, ఆర్ డబ్ ఎస్ ఎస్ ఈ డి బాల శంకర్, డ్వామా పీడీ పి. జగదాంబ,  డి ఎ హెచ్.ఓ  డా ఎస్టిజీ సత్య గోవింద్,  తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 13:17:08

వ్రుద్ధ కళా కారులకు పించన్లు..

విజ‌య‌న‌ర‌గ‌రం జిల్లాలోని రంగస్థల వృద్ధ కళాకారులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా పింఛన్లను మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. ర‌మేష్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు అర్హులైన ల‌బ్ధిదారుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున‌ట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుద‌ల‌ చేశారు. ఏదైనా క‌ళారంగానికి చెంది 58 ఏళ్ల వ‌య‌సు నిండిన వారు, తెల్ల రేష‌న్ కార్డు క‌లిగి ఉన్న‌వారు వృద్ధ కళాకారుల పింఛను కొరకు దరఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. సంబంధిత ద‌ర‌ఖాస్తును జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి కార్యాల‌యంలో లేదా vizianagaram.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ల‌బ్ధిదారులు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 6వ తేదీలోగా స్వయంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాల‌యం, క‌లెక్ట‌రేట్ కాంప్లెక్సు, మొద‌టి అంత‌స్తు, రూం. నెం.16 చిరునామాలో అంద‌జేయాల‌ని పేర్కొన్నారు. ద‌రఖాస్తుతో పాటు రెండు పాస్ ఫోర్టు సైజు ఫోటోలు, కళాకారునిగా గుర్తింపు పత్రం, కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, ఆధార్ కార్డు, రేషన్ లేదా బియ్యం కార్డు జెరాక్స్ కాపీల‌ను తప్పనిసరిగా జతచేయాలని సూచించారు.

Vizianagaram

2022-07-28 13:08:56

ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిది

ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిదిపైనా ఉందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అటవీశాఖ, ఆన్ సెట్ సంయుక్త ఆధ్వర్యంలో కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి నగర మేయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  వసీం మాట్లాడుతూ, లాక్‍డౌన్‍ సమయంలో కాలుష్యం లేని వాతావరణాన్ని మనమంతా చూశామని, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుందో లాక్‍డౌన్‍ మనకు చూపించిందన్నారు. ఇదే సందర్భంలో ఆక్సిజన్ విలువ కూడా కోవిడ్ విపత్తు మనకు తెలియచేసిందని,ఉచితంగా లభించే ఆక్సిజన్ డబ్బులు పెట్టినా మనకు దొరకని పరిస్థితి మనం చూశామని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా వాటిని రక్షించాలి సూచించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ నిర్ములన కూడా పర్యావరణ పరిరక్షణలో ఎంతో ముఖ్యమైనదని,పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణలో తమ పాలకవర్గం అండగా నిలుస్తుందని మా వంతు సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో,ఆన్ సెట్ కేశవ నాయుడు,జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య,కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంగయ్య,డాక్టర్ సింధూర రెడ్డి వైసీపీ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-07-28 13:04:26

ఓటరు సవరణలకు నూతన మార్గనిర్దేశకాలు

ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీనుండి నూతన మార్గని ర్దేశకాలు అమలు కానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటరు మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని మీనా తెలిపారు. జాబితాలో పేరు తొలగింపుకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఇప్పటి వరకు దీనిని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై దానిని విభిన్న అంశాలకు వినియోగించనున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించనున్నామన్నారు.

నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే ఉన్న నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ నాటికి తమ ఆధార్ నంబర్ను తెలియచేయవలసి ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంధమని, ఆధార్ నంబర్ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం ఉండదని మీనా స్పష్టం చేసారు.  ఇప్పటికే ఓటర్లుగా నమెదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్ వి ఎస్ పి, వి హెచ్ ఎ తదితర వెబ్ సైట్ లలో ఈ నెలాఖరు నాటికి నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంటుందన్నారు. 6బి ధరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘంకు సమర్పించవచ్చన్నారు. ఎన్ విఎస్ పి, ఓటర్ల హెల్ప్లైన్ యాప్ని అనుసరించి స్వీయ-ప్రామాణీకరణతో యుఐడిఐఎతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ ఓటిపిని ఉపయోగించి ఆధార్ను ప్రామాణీకరించవచ్చన్నారు.

స్వీయ-ప్రామాణీకరణ పట్ల ఆసక్తిలేని వారు, స్వీయ-ప్రామాణీకరణ విఫలమైన సందర్భంలో అవసరమైన పత్రాలతో ఫారమ్ 6బిని ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. మరోవైపు బూత్ లెవల్ అధికారి ఓటరు జాబితాతో ఓటర్ల నుండి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని మీనా పేర్కొన్నారు. ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని,  ఓటర్లు ఆధార్ నంబర్ను అందించలేకపోతే  ఫారం 6బి లో పేర్కొన్న పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలన్నారు. ఆధార్ సంఖ్యను సేకరణ, నిర్వహణ కోసం అన్నిజాగ్రత్తలు తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జనబాహుళ్యంలోకి వెళ్లకూడదని, ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు ఇఆర్ఓల ద్వారా డబుల్ లాక్తో సురక్షితమైన కస్టడీలో ఉంచబడతాయని, యుఐడిఎఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమీషన్  నియమించిన లైసెన్స్ పొందిన ఆధార్ వాల్ట్లో ఓటర్ల ఆధార్ నంబర్ జాగ్రత్త చేయబడుతుందని మీనా స్పష్టంచేసారు.

Vizianagaram

2022-07-28 12:46:28

మన్యం జిల్లాలో 1,429 మందికి కాపునేస్తం

పార్వతీపురం మన్యం జిల్లాలో వై.యస్.ఆర్ కాపు నేస్తం పథకం క్రింద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం శుక్ర వారం జరుగుతుందని బి.సి.కార్పొరేషన్ ఇన్ ఛార్జ్ కార్యనిర్వా హక సంచాలకులు ఆర్. గడ్డెమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల జీవనోపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం సంవత్సరానికి రూ.15,000/-ల చొప్పున ఐదు సంవత్సరాలకి రూ.75,000/-లు ఆర్ధిక సహాయం చేయుటకు ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంత లబ్దిదారుల కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు లోబడి ఉన్నవారు పథకానికి అర్హులని ఆమె పేర్కొన్నారు.  సమగ్ర కుల దృవీకరణ పత్రం, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డు లేదా ఆధార్ కలిగి ఉండాలని, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి ఉద్యోగ విరమణ పింఛను పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లించు వారు అనర్హులని ఆమె స్పష్టం చేశారు. కుటుంబంలో ఎవరికైనా మాగాణి భూమి మూడు ఎకరములు పైబడి లేదా మెట్ట భూమి 10 ఎకరములకు పైబడి లేదా మాగాణి, మెట్ట భూమి వెరసి 10 ఎకరములకు పైబడి ఉన్నా, కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన నాలుగు చక్రముల సొంత వాహనము కలిగి ఉన్నా పథకానికి అనర్హులని చెప్పారు. పట్టణ ప్రాంతములో కుటుంబ సభ్యులలో ఎవరికైనా వెయ్యి చదరపు అడుగులకు పైబడి సొంత నివాస గృహము ఉన్నవారు కూడా అనర్హులని ఆమె సూచించారు. 

2020-21 సంవత్సరంలో 1,398 మంది లబ్ధిదారులకు రూ.2.097 కోట్లు,  2021-22 ఆర్థిక సంవత్సరాలలో 1,384 మందికి రూ.2.076 కోట్లు కాపు నేస్తం క్రింద అందించటం జరిగిందని ఆమె తెలిపారు. 2022-23 సంవత్సరానికి వై.యస్.ఆర్. కాపు నేస్తం క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో 1,429 మందికి రూ.2.145 కోట్లు పంపిణీ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కురుపాం నియోజక వర్గంలో 165 మంది లబ్ధిదారులకు రూ.24.80 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. పాలకొండ నియోజక వర్గంలో 295 మంది లబ్ధిదారులకు రూ.44.30 లక్షలు, పార్వతీపురం నియోజక వర్గంలో 463 మంది లబ్ధిదారులకు రూ.69.50 లక్షలు, సాలూరు నియోజక వర్గంలో 506 మంది లబ్ధిదారులకు రూ.75.90 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.

Parvathipuram

2022-07-28 12:30:01

పటిష్టంగా ఓటరు జాబితా నిర్వహణ

తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1570 పోలింగ్ కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు జాబితా ను అత్యంత పారదర్శకంగా డీజీటలైజేషన్ చెపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ మాధవీలత తెలియజేశారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె జిల్లాలోని రెవిన్యూ అధికారులతో  స్థానిక కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సంరద్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  మొత్తం జిల్లాలో 15,44,735 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,57,735 మంది పురుషులు, 7,86,887 మంది స్త్రీలు, 119 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచి ఓటరు జాబితా డీజీటలైజేషన్ పై క్షేత్ర స్థాయి లో రూఉత్ మ్యాప్ రూపొందించి, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పనులు ప్రారంభించా లని కలెక్టర్ మాధవీలత అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో మల్లిబాబు, ఏ ఒ జీ. బీమారావు, తహశీల్దార్  ఏ. శ్రీనివాసరావు,  కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. 

Rajamahendravaram

2022-07-28 11:58:22

సత్వరమే భూసేకరణ పనులు పూర్తిచేయాలి

అర్హులైన పేదలందరికి ఇళ్లస్థలాల పట్టాలు మంజూరి చేసేందుకు అవసరమైన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్  జె వి మురళి సంబంధింత అధికా రులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  అర్హులైన పేదలకు  90 రోజులలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినందుకు అవసరమైన భూమిని సేకరించాలని ఆయన సూచించారు.  జిల్లాలో అర్హులైన కౌలు రైతులకు అందరికీ సి సి ఆర్ సి  కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క  కౌలు రైతు కూడా సిసిఆర్ సి కార్డులు రాలేదని అనకూడదని అన్నారు.  మన జిల్లాలో కౌలు రైతులు చాలామంది ఉన్నారని వారందరికీ కచ్చితంగా సి సి ఆర్ సి కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. ఎం ఐ జి లేఔట్లకు స్థలాల సేకరణ   పట్టణ  ప్రాంతాలలో చేయాలని ఆయన సూచించారు. స్వామిత్వా రీ సర్వే  పై సమీక్ష చేశారు,  N H 165 అండ్  NH 216 నరసాపురం బైపాస్  కు అవసరమైన  భూసేకరణ పూర్తి చేయలన్నారు. ఏఎంసీయు,  బి ఎం సి యు లకు భూసేకరణ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డిఓ దాసిరాజు  , తాసిల్దార్లు ,కలెక్టరేట్ ల్యాండ్ సూపర్డెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-07-28 11:18:21