1 ENS Live Breaking News

శ్రీకాకుళంలో భూసర్వే వేగవంతం చేయాలి

శ్రీకాకుళం జిల్లాలో భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ తెలిపారు.  జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే పై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భూ సర్వే పనులు జరుగున్నాయన్నారు. జిల్లాలో 348 మ్యాప్ లు ఉన్నాయన్నాయని, తీర ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి చెట్లు ఉన్నాయని అక్కడ సిగ్నల్స్ ఉండడం లేదని వివరించారు. సిగ్నల్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత విజయవాడ నుండి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-28 11:07:00

స్వాతంత్య్ర గొప్పదనాన్ని తెలియజేయాలి

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.  గురువారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్   కాంపౌండ్ లో ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా  రాష్ట్ర ఆర్కైవ్స్ ప్రాంతీయ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన పురావస్తు ఎగ్జిబిషన్ కార్యక్రమమును తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజు కిషోర్, ఆర్కివిస్ట్  డైరెక్టర్ రంగరాజలతో కలసి రిజిస్ట్రార్   ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ...  స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంను జరుపుకోవడం  సంతోషమని ఈ సందర్భంగా  మన దేశ స్వాతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు పోరాడిన విధానం , పోరాటానికి ముందు మన భారత  జీవన శైలి ఎలా ఉంది వంటి విషయాలపై  ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పురావస్తు పుస్తకాలను  ప్రదర్శించడం జరిగిందని తెలిపారు.  నేటితరం దేశానికి ఆదర్శంగా నిలవాలని అందుకు  అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా దేశ అభివృద్ధి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధి లోకి రావాలని తెలిపారు. విద్యార్థులు కలలను కనడం కాదు వాటిని సాకారం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.  

Tirupati

2022-07-28 11:03:32

డిజిటలైజేషన్ సమర్ధవంతంగా చేపట్టాలి

రాజమహేంద్రవరం జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ విధానాన్ని అత్యంత సమర్థవంతంగా చెప్పడం ఎందుకు చేపట్టేందుకు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు జాబితా ను డిజిటలైజేషన్ చేసే విధానం అమలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం చెయ్యాల్సిన అవసరం దృష్ట్యా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 80 శాతం మంది సచివాలయం సిబ్బంది ని బూత్ లెవెల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికి సంబందించిన వారి ఆధార్ వివరాలు సచివాలయం వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో తగినంత మానవ వనరులు ఉన్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఇచ్చే లక్ష్యాలను ఆచరణాత్మక విధానంలో చేపట్టి పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని తెలిపారు. 2022 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించి మార్చి 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసెందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణ కోసం కొంత సమయం, తదుపరి సేకరించిన డేటా ను కంప్యూటరైజేషన్ కోసం మరికొంత సమయం పడుతుందని మాధవీలత తెలిపారు. సేకరించిన డేటా వివరాలు తప్పులు లేకుండా నమోదు చెయ్యడం కోసం మరింత సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకత్వంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 నుంచి 1500 వందల వరకు ఓటర్లు ఉంటారు. వీరి డేటా సేకరణకు తగినంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్ కె మీనా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు మేరకు ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో వాలంటీర్ లని భాగస్వామ్యం చెయ్యడం జరగదని పేర్కొన్నారు.  

జిల్లా స్థాయి సమీక్ష: జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1570 పోలింగ్ కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు జాబితా ను అత్యంత పారదర్శకంగా డీజీటలైజేషన్ చెప్పట్టాల్సి ఉందన్నారు. మొత్తం జిల్లాలో 15,44,735 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,57,735 మంది పురుషులు, 7,86,887 మంది స్త్రీలు, 119 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచి ఓటరు జాబితా డీజీటలైజేషన్ పై క్షేత్ర స్థాయి లో రూఉత్ మ్యాప్ రూపొందించి, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పనులు ప్రారంభించా లని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో మల్లిబాబు, ఏ ఒ జీ. బీమారావు, తహశీల్దార్  ఏ. శ్రీనివాసరావు, , కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 10:34:57

ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ చేయాలి..

ఓటరు కార్డుకు  ఆధార్ సీడింగ్ కొరకు, మార్పులు చేర్పులు, తప్పులు సరిదిద్దుట,   తొలగిం పులకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా సవరించిన ఫారమ్లు, ఆధార్ నంబర్ సేకరణ, తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మరణాలు, డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని  ముందుగా నిర్థారణ చేసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. షెడ్యూలు ప్రకారం సవరణ చర్యలు చేపట్టాలని తెలిపారు.  ఇంటింటి సర్వే పై బిఎల్ఓలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం, ఆధార్ సీడింగ్ కార్యక్రమం షెడ్యూలు ప్రకాకం  ప్రారంభించి పూర్తిచేయటకు చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఒ. ఆనంద్,  జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-28 10:17:13

ఆధార్ సీడింగ్ లకు చర్యలు తీసుకోవాలి

ఆధార్ లో మార్పులు చేర్పులు, తొలగింపులకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా సవరించిన ఫారమ్‌లు, ఆధార్ నంబర్ సేకరణ, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మరణాలు, డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని  ముందుగా నిర్థారణ చేసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. ప్రణాళికా బద్దంగా తేదీలు నిర్ణయించుకొని చేయాలన్నారు. ఇంటింటి సర్వే పై బిఎల్ఓలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కార్యక్రమం ఆగస్టు 4వ తేదీ నుండి ప్రారంభిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత విజయవాడ నుండి పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, రెవిన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి, ఉప కలెక్టర్ జి. జయదేవి, అర్బన్ తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-28 10:14:12

ప్రభుత్వ ఉద్యోగులు ఫారం 16 సమర్పించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను కు సంబంధించిన ఫారం -16 ను ఖజానా కార్యాలయాలకు సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి కవిటి మోహన రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నెల జీతాలు ఫిబ్రవరి నెలలో నేరుగా జమ చేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగుల 12 నెలల ఆదాయపు పన్ను వివరాలతో కూడిన ఫారం -16 ను డ్రాయింగ్ అండ్ డిస్బర్శింగ్ (డిడిఓ)లు తక్షణం తమ ఖజానాలలో సమర్పించాలని ఆయన కోరారు. ఉద్యోగులంతా తక్షణమే ఈ పనిని చేపట్టాలన్నారు. 

Parvathipuram

2022-07-28 10:11:00

విజయనగరంలో హెరిటేజ్ వాక్

విజయనగరంలో శుక్రవారం ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా మూడు లాంత‌ర్ల జంక్ష‌న్ నుంచి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం వ‌ర‌కు హెరిటేజ్ వాక్ పేరుతో ఉద‌యం 7.00 గంట‌ల‌కు ర్యాలీని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా యుజ‌వ‌న అధికారి విక్ర‌మాధిత్య తెలిపారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం వ‌ర‌కు ర్యాలీ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లా పరిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ర్యాలీలో పాల్గొని స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను, స్ఫూర్తిని భావిత‌రాల‌కు తెలియ‌జేస్తార‌ని వివ‌రించారు. అధిక సంఖ్య‌లో యువ‌త‌, వాలంటీర్లు, ప్ర‌జ‌లు పాల్గొని ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌ని ఆయ‌న గురువారం ఓ ప్ర‌కట‌న ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.

Vizianagaram

2022-07-28 08:43:20

ఆహా మత్స్య ఉత్పత్తుల వంటకాల రుచులు

చేపల పులుసు..చేపల వేపుడు.. చేపల నూడిల్స్.. చేపల లాలీపాప్స్.. బోన్ లెస్ చేపల ఫ్రై.. చేపల బర్గర్.. చేపల ఊరగాయ.. రొయ్యల వేపుడు.. చేపల కట్లెట్.. రొయ్యల ఊరగాయ..ఇలా అన్నీ చేపలు రొయ్యలతో తయారు చేసిన వంటకాలే.. ఏంటి ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్ లో కాస్ట్లీ మెనూ అనుకుంటున్నారా.. అలా అనుకుంటే చేప ముల్లు గుచ్చుకుంటుంది జాగ్రత్త..నోరూరించే ఈ వంటకాలన్నీ  విజయంనగంలోని శిల్పారామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో మత్స్యకారులే స్వయంగా వండిన వంటకాలు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల అవగాహనకై వీటిని ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలాకుమారి ఆధ్వర్యంలో మత్స్యకారులు ఈ వంటకాలన్నీ సందర్శకులకు రుచి చూపించారు. స్టాల్ వద్దకు వచ్చిన వారందరికీ గ్రామీణ మత్స్య సహాయకులు చేపలు వాటి రకాలు, ఉత్పత్తుల కోసం వివరిస్తే.. ఫిష్  ఆంధ్ర పథకం ద్వారా మత్స్యకార మహిళలు నిర్వహిస్తున్న వాల్యూ యాడెడ్  ప్రోడక్ట్స్ ను పర్యాటకులకు, అక్కడికి వచ్చిన వారికి లైవ్ గా తయారు చేసి మరీ రుచి చూపించారు. వీటిని తిలకించిన వారంతా చేపల ఉత్పత్తులు ఇన్ని రకాలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యలతో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను అక్కడికక్కడే చేశారేమో ఆ ప్రాంగణమంతా ఒక్కటే గుమ గుమలు. ఈ స్టాల్ దగ్గరకి వచ్చినవారంతా చేపల వంటకాలు రుచి చూసిన తరువాతే వెనుతిరిగారంటే ఎంతగా ఈ ప్రదర్శన ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.    ఏఏ రకాల మత్స ఉత్పత్తులతో ఏ ఏ రకాల తినుబండారాలు తయారు చేస్తారు వాటి విలవలను ఈ సందర్భంగా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల కుమారి కూడా పలువు ప్రముఖులకు ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మత్స్య ప్రదర్శనల ద్వారా ప్రజలకు మత్స్య ఉత్పత్తులపై అవగాహన కల్పించడంతోపాటు మత్స్యకారులకు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వాల్యూ ఎడిట్ ప్రొడక్ట్స్ కు ప్రజలు, సందర్శకులు, పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. చేపల వేపుడు రొయ్యల వేపుడు చేపల కూర చేపల పచ్చడి తదితర అంశాలతో ఈ ప్రదర్శనను  ప్రదర్శనలో ఉంచినట్టు ఆమె పేర్కొన్నారు. అధికంగా ప్రజలు మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతోపాటు.. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు గ్రామీణ మత్స్యకార సహాయకులు మత్స్యశాఖకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-24 16:14:30

విజేఎఫ్ ప్రతిభకు ప్రోత్సాహం అవార్డులు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సభ్యులు పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేయనున్నట్లు ఫోరం అధ్యక్షులు, స్కాలర్ షిప్స్ కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు విశాఖలోని డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ఎల్ కేజీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టేట్,సీబీఎస్ఈ సిలబస్ లకు సంబంధించి స్కాలర్ షిప్స్ అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ లో ప్రతిభ కనబర్చిన ఒకరిద్దరు విద్యార్థులను కూడా గుర్తించి వారికి కూడా ప్రత్యేక అవార్డులు అందజేస్తామన్నారు.. కావున జర్నలిస్టుల పిల్లలు సంబంధిత మార్కుల జాబితా, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,  పూర్తిచేసిన దరఖాస్తుతో కలిపి వచ్చే నెల 5వ తేదీలోగా ప్రెస్ క్లబ్ కార్యాలయం పనివేళల్లో అందజేయాలన్నారు.. అదేవిధంగా త్వరలో ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు అవార్డు ల  కమిటీ చైర్మన్ ఆర్ నాగరాజు పట్నాయక్ తెలిపారు.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామన్నారు.. ఆగస్టులో ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.. మెరిట్ స్కాలర్ షిప్ లకు , అవార్డుల కమిటీకి సంబంధించి ఉపాధ్యక్షులు నానాజీ, జాయింట్ సెక్రటరీ (ఇంఛార్జి కార్యదర్శి) దాడి రవికుమార్,
కోశాధికారి పి ఎన్ మూర్తి,పలువురు  కార్యవర్గ సభ్యులు కో చైర్మన్ లుగా వ్యవహరిస్తారన్నారు.. నార్ల వెంకటేశ్వరరావు భవన్ (విజేఫ్, వినోద వేదిక) మరమ్మ త్తులు త్వరలోనే పూర్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని శ్రీను బాబు తెలిపారు..సమావేశములో
కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర రావు, ఎమ్మెస్సార్ ప్రసాదు, పైలా దివాకర్, డేవిడ్, పి. వరలక్ష్మి. దొండ గిరిబాబు, సనపల మాధవ్, శేఖర మంత్రి ,గయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-24 15:14:41

సంద‌ర్శ‌కుల‌ మనసు దోచిన మ‌త్స్య ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌య‌న‌గ‌రం శిల్పారామంలో  ఆదివారం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఏర్పాటు చేసిన మ‌త్స్య ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జిల్లాకు చెందిన స‌మ‌ర‌యోధుల జీవిత విశేషాల ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్శ‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయ‌గా న‌గ‌రంలోని ప‌లువురు త‌మ కుటుంబాల‌తో క‌ల‌సి మ‌త్స్య శాఖ స్టాళ్ల‌ను, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించి అరుదైన ఫోటోల‌ను తిల‌కించి ఆనందించారు. మ‌త్స్యశాఖ‌కు సంబంధించి ఫిష్ ఆంధ్ర మార్టు, లైవ్ ఫిష్ విక్ర‌యాలు, మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను వివిధ ర‌కాల ఆహార ప‌దార్ధాలుగా రూపొందించి రొయ్య‌లు, చేప‌ల‌తో చేసిన వంట‌కాలు, అక్వేరియం త‌దిత‌ర అలంక‌ర‌ణ మ‌త్స్య ఉత్ప‌త్తులు, అక్వాలాబ్ సేవ‌లు, మ‌త్స్య‌కారుల‌కు ఉద్దేశించిన ప‌థ‌కాల‌కు సంబంధించిన బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు ఎన్‌.నిర్మ‌ల కుమారి ఆధ్వ‌ర్యంలో మ‌త్స అభివృద్ధి అధికారులు చాందిని, మ‌త్స్య స‌హాయ‌కులు పాల్గొన్నారు.

75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్స‌వాల‌కు సంబంధించి నిర్వ‌హిస్తున్న ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా జిల్లాకు చెందిన 30 మంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల అరుదైన‌ ఫోటోలు, వారి జీవిత విశేషాలు, వారు స్వాతంత్య్రోద్య‌మంలో పాల్గొన్న ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి విశేషాల‌తో స‌మాచార శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. ఫోటోల‌ను తిల‌కించ‌డంతోపాటు సంద‌ర్శ‌కులు వారి జీవిత విశేషాల‌ను కూడా ఆస‌క్తిగా తెలుసుకున్నారు. జిల్లా స‌మాచార పౌర‌సంబంధాల అధికారి డి.ర‌మేష్‌, స‌హాయ కార్య‌నిర్వాహ‌క ఇంజ‌నీరు మ‌ల్లేశ్వ‌ర‌రావు, ఏ.వి.ఎస్‌. డి.స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.


గంట్యాడ మండ‌లం ల‌ఖిడాంకు చెందిన పాశల కృష్ణ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌కు సంబంధించి తాను ప్ర‌చురించిన పుస్త‌కాల ప్ర‌తుల‌ను స‌మాచార శాఖ జిల్లా అధికారుల‌కు అంద‌జేశారు. 

Vizianagaram

2022-07-24 14:53:42

ప్రభుత్వ విప్ గా కరణం ధర్మశ్రీ నియామకం

చోడవరం ఎమ్మెల్యే,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమించారు. పార్టీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ తన శక్తి వంచన లేకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతూ వైఎస్సార్సీపీ అభివృద్దే  ధ్యేయంగా  పనిచేస్తున్న ధర్మశ్రీ ని గుర్తించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ విప్ గా  నియమించారు. అమరావతి నుండి గురువారం ఉదయం చోడవరం నియోజకవర్గానికి ఆయన  రానున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమించడం పట్ల జిల్లా కేడర్ లో నూతన ఆనందం వ్యక్తం అవుతుంది. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేతోపాటు జిల్లా అధ్యక్షులుగా వున్న ధర్మశ్రీకి ప్రభుత్వ విప్ పదవితో జిల్లాలో పార్టీ మరింతగా అభివ్రుద్ధి చెందే అవకాశాలున్నాయి.

Chodavaram

2022-07-19 16:37:34

క‌చ్చిత‌త్వంతో ఈ-క్రాప్ బుకింగ్ ప్ర‌క్రియ‌

రైతు సంక్షేమం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వైఎస్సార్ రైతు భ‌రోసా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి వాటితో పాటు పంట ఉత్ప‌త్తుల కొనుగోలుకు కూడా ఈ-క్రాప్ డేటా ఆధార‌మ‌వుతున్నందున ఈ ప్ర‌క్రియను స‌జావుగా పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం రాత్రి వ్య‌వ‌సాయ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య విశాఖ‌ప‌ట్నం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ‌, ఉద్యాన శాఖ‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌, ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. వీసీ అనంత‌రం క‌లెక్ట‌ర్‌.. జిల్లా అధికారుల‌తో మాట్లాడుతూ అత్యంత పారద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంలో ఈ-క్రాప్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. కొత్త యాప్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని.. అత్యంత క‌చ్చిత‌త్వంతో పంట వివ‌రాల న‌మోదుకు ఈ యాప్ వీలుక‌ల్పిస్తుంద‌ని వివ‌రించారు. గ‌తంలో ఒక్క గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు (వీఏఏ) మాత్ర‌మే డేటా సేక‌రించేవారని.. ఈసారి వీఏఏ, వీఆర్‌వో, విలేజ్ స‌ర్వేయ‌ర్ల‌ ఉమ్మ‌డి బృందం ఈ ప్ర‌క్రియ‌లో భాగ‌స్వామ్యమ‌వుతుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఆర్‌బీకే యూనిట్‌గా ఈ-క్రాప్ జ‌రుగుతున్నందున వాటితో రెవెన్యూ గ్రామాల అనుసంధాన ప్ర‌క్రియ జ‌ర‌గాల‌న్నారు. స‌మావేశంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎన్‌.విజ‌య‌కుమార్‌, ఉద్యాన‌శాఖ అధికారి బీవీ ర‌మ‌ణ‌, ఏడీ(ఏ) జీవీ ప‌ద్మ‌శ్రీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-07-19 15:25:51

గృహ నిర్మాణాలకు ప్రత్యేక ప్రణాళిక

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో చేపట్టిన జగన్న కాలనపీల్లో ఇళ్ళ గ్రౌండింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ళ నిర్మాణం ప్రగతిపై అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గృహనిర్మాణానికి అవసరమైన వ్యయంలో రూ.1.80లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా అందిస్తున్నాయన్నారు. మిగిలిన సొమ్మును పైవేటు ఆర్థిక సంస్థలు, ఇతర మార్గాలు ద్వారా సమకూర్చేందుకు లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. మరో వైపు గతంలో టిడ్కో గృహాల కోసం రూ.25వేలు నుంచి రూ.లక్ష వరకు సొమ్ములు చెల్లించిన దాదాపు 1052 మంది లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు కాలేదని, వీరందరంతా జగనన్నకాలనీల్లో ఇళ్ళు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. అలాగే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు రూ.35వేలు అందించేలా  బ్యాంకులతోఎప్పటికప్పుడు మాట్లాడి సమన్వయం చేయాలని సూచించారు. ఇళ్ళు గ్రౌండింగ్‌ కాకపోతే రద్దయ్యే అవకాశం ఉన్నందున వెంటనే ఇళ్ళు ప్రారంభించేలా ప్రత్యేకాధికారులు చూడాలన్నారు. నగరపాలక సంస్థ ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు నిర్థిష్ట ప్రణాళికతో సచివాలయ కార్యదర్శుల సహకారంతో ప్రణాళిక బద్ధంగా గ్రౌండింగ్‌ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు, గృహనిర్మాణశాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-19 15:08:11

ఈ క్రాప్ నమోదు ద్వారా లబ్ధి చేకూరాలి

రాష్ట్రంలో ప్రతి రైతుకు ఈ క్రాప్ నమోదు ద్వారా వ్యవసాయ ఫలాలు అందాలని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా  జిల్లా కలెక్టర్లు , జాయింట్ కలెక్టర్లు,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన, పట్టుపరిశ్రమ మరియు  రెవిన్యూ అధికారులతో ఈ క్రాప్ నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యవసాయదారుడు కి పండించే ప్రతి పంట ఇ-క్రాపు ద్వారా నమోదు చేయాలని సంబంధిత అధికారులను  ఆదేశించారు. దీనికి సంబంధించి చేయవలసిన కార్యాచరణ పై పలు సూచనలను తెలియజేశారు. పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులందరికీ కూడా ఇ-క్రాప్ ఫలాలు అందాలని వెల్లడించారు. కౌలు రైతులకు ఇ-క్రాప్ నమోదు సమయంలో భూ యజమానులు ఎటువంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని తెలియజేశారు. భూమి యాజమాన్య హక్కులు సంబంధిత భూయజమానికి మాత్రమే చెందుతాయని, కేవలం పంట నష్టం పరిహారం మాత్రమే కౌలు రైతులకు  అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 
ఇ పంట నమోదు చేసినట్లయితే వై.ఎస్.ఆర్.సున్నావడ్డీ పంట రుణాలు, వై.ఎస్.ఆర్ ఉచిత పంటల భీమా పథకం, పంట నష్ట పరిహారంతో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేసుకోవచ్చని తెలియజేసారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను రెవెన్యూ గ్రామాలకు  అనుసంధానం చేయాలన్నారు . గ్రామాల నుండి వి.ఎ.ఎ/వి.ఆర్.ఓ పంటలు నమోదు చేయాలని, మండలాల నుండి   తహసిల్దార్లు/మండల వ్యవసాయ అధికారులు వి.ఎ.ఎ/వి.ఆర్.ఓలకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి డా. ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, డిఆర్ఓ శ్రీనివాస్ మూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-19 14:50:49

గర్భిణీలకు ఆరోగ్య తనిఖీలు ఆవశ్యం

గర్భిణీల ఆరోగ్య తనిఖీ ఆవశ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి. జగన్నాథ రావు అన్నారు. మాతృ మరణాలు నివారణపై  పార్వతీపురం ఎన్ జి ఒ హోంలో జిల్లా  వైద్య ఆరోగ్య శాఖాధికారి జగన్నాథరావు అద్యక్షతన ఎమ్.డి.ఎస్.ఆర్ శిక్షణ కార్యక్రమం మంగళ వారం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్  గైనకాలజిస్టులు డా. శోభారాణి,  డా. సాగరిక లు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వైద్యాధికారులు వారి పరిధిలో ఉన్న వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ గర్భిణీలకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు.  గర్భిణీల ఆరోగ్య తనిఖీలు ఆసుపత్రిలో పి.ఎమ్.ఎస్.ఎం.ఎ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా జరగాలని ఆయన ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తద్వారా మాతృ మరణాల నివారణకు కృషి చేయాలని జగన్నాథరావు సూచించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలు జరగకుండా ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డా  సి. దుర్గా కళ్యాణి, ప్రోగ్రాం అధికారులు డా. జగన్మోహన్ , డా. అనిల్ , డా. సందీప్ పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-19 13:15:56