1 ENS Live Breaking News

10 ఫలితాల్లో విజయనగరంజిల్లా కొత్తరికార్డు

ప‌దోత‌ర‌గతి ప‌రీక్ష‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా విద్యార్థులు చ‌రిత్ర‌ సృష్టించారు. దాదాపు 62 శాతం మంది ప్ర‌ధ‌మ‌శ్రేణిలో ఉత్తీర్ణులై రికార్డు తిర‌గ‌రాశారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు త‌మ స‌త్తా చాటారు.  ముఖ్యంగా ప్ర‌భుత్వ సంక్షేమ పాఠ‌శాల‌ల విద్యార్థులు అద్వితీయ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది విజ‌య‌న‌గ‌రం జిల్లాను రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిల‌బెట్ట‌డ‌మే కాకుండా, వ్య‌క్తిగ‌తంగా కూడా ఉత్తీర్ణ‌త‌లో గ‌తం కంటే మెరుగైన ఫ‌లితాల‌ను సొంతం చేసుకున్నారు. విజ‌య‌న‌గ‌రం అయ్య‌ప్ప‌న‌గ‌ర్‌లోని ఆద‌ర్శ‌పాఠ‌శాల విద్యార్థి 590 మార్కుల‌ను సాధించి చ‌రిత్ర‌ సృష్టించారు. గ‌ణ‌నీయ‌మైన ఫ‌లితాల‌ను సాధించిన విద్యార్థుల‌కు, ఉపాధ్యాయుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్ట‌ర్ జ‌య‌శ్రీ అభినంద‌న‌లు తెలిపారు.

  ఎపిటిడ‌బ్ల్యూఆర్ఇఐ సొసైటీ పాఠ‌శాల‌ల‌నుంచి మొత్తం 423 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 95.74శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. వీరిలో బాలిక‌లు శ‌త‌శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, బాలురు 93.75శాతం ఉత్తీర్ణుల‌య్యారు. ఎపిఆర్ఇఐ సొసైటీ పాఠ‌శాల‌ల నుంచి 663 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 93.06 శాతం, ఎపి మోడ‌ల్ స్కూల్స్ నుంచి 1448 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాగా, 92.75శాతం, గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల నుంచి 6152 మంది ప‌రీక్ష‌లు రాయ‌గా, 86.25 శాతం, కెజిబివిల‌నుంచి1295 మంది బాలిక‌లు ప‌రీక్ష‌లు రాయ‌గా, 83.01శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఎంపిపి, జెడ్‌పిహెచ్ఎస్ పాఠ‌శాల‌ల నుంచి14,570 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 71.45 శాతం, ఎపిఎస్‌డ‌బ్ల్యూఆర్ఇఐ సొసైటీ పాఠ‌శాల‌ల‌నుంచి 755 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 70.20 శాతం, మున్సిప‌ల్ పాఠ‌శాల‌ల నుంచి 1257 మందికి గాను, 59.82 శాతం, రాష్ట్ర‌ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నుంచి 806 మందికి గానూ, 53.10 శాతం, ప్ర‌యివేటు ఎయిడెడ్ పాఠ‌శాలల నుంచి 287 మందికి గానూ, 49.83 శాతం, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల నుంచి 6152 మందికి విద్యార్థుల‌కు గానూ, 90.72శాతం ఉత్తీర్ణ‌తను సాధించారు. జిల్లా మొత్తం మీద 524 పాఠ‌శాల‌ల నుంచి మొత్తం 29,365 మంది ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయ‌గా, 77.50 శాతం ఉత్తీర్ణ‌త‌తో 22,758 మంది ఉత్తీర్ణుల‌య్యారు. ఉత్తీర్ణులైన వారిలో 18,158 మంది ప్ర‌ధ‌మ‌శ్రేణిలో(61.84 శాతం), 3,429 మంది ద్వితీయ శ్రేణిలో(11.68), 1171 మంది తృతీయ శ్రేణిలో (3.98శాతం) ఉత్తీర్ణులు కావడం విశేషం.

  వివిధ‌ ప్ర‌భుత్వ సంక్షేమ పాఠ‌శాల‌లు, రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, ఎయిడెడ్ పాఠ‌శాల‌ల ప‌రంగా చూస్తే,  576 కంటే ఎక్కువ మార్కుల‌ను 84 మంది, 551-575 మ‌ధ్య మార్కుల‌ను సాధించిన‌ది 447 మంది, 526-550 మ‌ధ్య మార్కుల‌ను సాధించిన‌వారిలో 894 మంది, 500-525 మ‌ధ్య 1352 మంది విద్యార్థులు ఉండ‌టం, ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిగా చెప్ప‌వ‌చ్చు. 500కు పైబ‌డి మార్కుల‌ను సాధించిన‌వారిలో బాలురు కంటే బాలిక‌లు రెట్టింపు ఉండ‌టం విశేషం.

కెజిబివిల్లో రాష్ట్రంలోనే ప్ర‌థ‌మం

            క‌స్తూరిభా గాంధీ బాలికా విద్యాల‌యాలు గ‌త రికార్డును తిర‌గ‌రాశాయి. మొత్తం 1296 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, వీరిలో 83.18శాతంతో 1078 మంది ఉత్తీర్ణుల‌య్యారు. దీంతో మ‌న జిల్లా రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచింది. అలాగే అత్య‌ధిక మార్కుల‌ను సాధించిన విద్యార్థి కూడా మ‌న జిల్లాకు చెందిన వారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణం. ఎల్‌కోట కెజిబివి విద్యార్థిని 580 మార్కుల‌ను సాధించింది. అదేవిధంగా 500-550 మ‌ధ్య మార్కుల‌ను 149 మంది సాధించారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం, గుమ్మ‌ల‌క్ష్మీపురం కెజిబివిలు శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించాయి. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశాల‌కు అనుగుణంగా, సూప‌ర్ 60 పేరుతో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, అత్యుత్త‌మ ఫ‌లితాల‌ను సాధించారు. గ‌ణ‌నీయ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న కెజిబివి విద్యార్ధిణుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, స‌మ‌గ్ర శిక్ష అద‌న‌పు ప‌థ‌క సంచాల‌కులు డాక్ట‌ర్ వి అప్ప‌ల‌స్వామినాయుడు అభినందించారు.

Vizianagaram

2022-06-06 16:10:59

ఎంపీ సురేష్ ప్రభు సహాయం మరువలేనిది

అల్లూరి సీతారామరాజు నడయాడి, వీర మరణం పొందిన ప్రాంతాల అభివ్రుద్ధికి రూ.కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మాజీ కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు ప్రకటించడం హర్షణీయమని అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విశాఖలో జిల్లా మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రదేశాలను సెంట్రల్ టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్దాలని తాము ప్రధానమంత్రి కార్యాలయాలనికి, కేంద్రం పర్యాటకశాఖ కార్యాలయానికి లేఖలు రాశామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ(రాజ్యసభ్) సురేష్ ప్రభు ముందుకి వచ్చి అల్లూరి సంచరించిన మంప ప్రాంతానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం అభినందనీయమన్నారు.. ఇదే రీతిలో అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి చరిత్రను కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాలుగా చేర్చి ఆయన బ్రిటీషు సేనలపై చేసిన వీరోచిన తిరుగుబాటుపైనా, సాయుధ సమరమపైనా, ప్రపంచమే తొంగిచూసిన పోరాటాలపై పరిశోధనలు చేసే స్థాయికి తీసుకు రావాలని కోరారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వమే అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన నాటి మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లను, బయటకు తీసి ప్రజలకు తెలియజేయాలని కోరారు.  అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియాకి వివరించారు.

Visakhapatnam

2022-06-02 03:28:09

జిల్లాలో లోగిస గ్రామ సచివాలయం ఫస్ట్

విజయనగరం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వారి పని తీరును ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్ లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. సచివలయాలలో  అందించిన సేవలు, స్పందన నమోదు, స్పందన డిస్పోజల్స్, గడువు లోగా పరిష్కరించినవి,  హౌసింగ్ తదితర అంశాల  ప్రామాణికంగా  ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా  గజపతినగరం మండలం లోగిస గ్రామ సచివాలయం 110.92 పోయింట్ల తో రాంక్ 1 కైవసం చేసుకుంది. మెంటాడ మండలం జక్కువ సచివాలయం 103.67 పోయింట్లతో 2 వ రాంక్, పూసపాటి రేగ మండలం రెళ్లివలస సచివాలయం  92.86 పోయింట్లతో 3వ రాంక్ సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.

Vizianagaram

2022-06-01 15:47:18

నైపుణ్యతతోకూడిన ద్వారా మంచి ఫలితాలు

నైపుణ్య‌త‌తో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయ‌ని, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు త్వ‌రిత‌గ‌తిన ల‌భిస్తాయ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్ర‌భు పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఆలోచించాల‌ని, ప్ర‌స్తుత స‌మాజ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా విద్యార్థుల‌ను తీర్చి దిద్దాల‌ని సూచించారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్సరాలు అవుతున్నా ఇప్ప‌టికీ పాత ప‌ద్ధుతుల‌నే అనుస‌రిస్తున్నామ‌ని, దీని వ‌ల్ల ప్ర‌గ‌తి కుంటుప‌డుతుంద‌ని అన్నారు. వ్య‌వ‌సాయ రంగంలో హరిత విప్ల‌వం తర్వాత చెప్పుకోద‌గ్గ శుభ‌ప‌రిణామాలు ఏమీ చోటుచేసుకోలేద‌ని మ‌నమంద‌రం సంప్ర‌దాయ‌క ప‌ద్ధ‌తుల్లోనే ఆలోచిస్తున్నామ‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. నేటి త‌రం యువ‌త విభిన్నంగా ఆలోచించాల‌ని... ఉత్త‌మ ఫ‌లితాలు అందుకోవాల‌ని సూచించారు. రూ.70 ల‌క్ష‌లు త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కేటాయించిన ఆయ‌న‌ స్థానిక ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప‌రిధిలో బుధ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొని స్కిల్ డెవ‌లెప్మెంట్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం రూ.20 ల‌క్ష‌ల‌తో జిల్లాకు కేటాయించిన ప్ర‌త్యేక అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. డిగ్రీలు, స‌ర్టిఫికేట్లు ప్ర‌ధానం కాద‌ని.. నైపుణ్యం అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌స్తుత స‌మాజంలో ఉపాధి రంగంలో స్థిర ప‌డ‌డానికి ఉప‌యోగ‌ప‌డే చ‌దువులను అభ్య‌సించాల‌ని సూచించారు. ఉద్యోగానికి లేదా స్వ‌యం శ‌క్తితో ఎద‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 1966లో హ‌రిత విప్ల‌వం తర్వాత వ్య‌వ‌సాయ రంగంలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి పరిణామం ఏమీ లేద‌ని, కావున నేటి త‌రం యువ‌త కొత్త‌గా ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని చెప్పారు. ఇప్పుడు 98 శాతం విద్యార్థులు డిగ్రీలు పాస్ అయిపోతున్నార‌ని, కానీ నాణ్య‌త ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేం చ‌దువుకొనే రోజుల్లో కేవ‌లం 1 శాతం మాత్ర‌మే పాస్ అయ్యేవార‌ని, ఇప్ప‌టి ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉంద‌ని గుర్తు చేశారు. విద్యార్థులు సానుకూల దృక్ప‌థంతో ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌ల‌కాల‌ని సూచించారు. అలాగే ప్ర‌జారోగ్యానికి ప్రాధాన్యత‌ ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని, అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 13 ప్ర‌త్యేక అంబులెన్స్‌ల‌ను అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు సౌమ్యుల‌ని, మంచి మ‌న‌సున్న వార‌ని అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని గుర్తు చేశారు. అన్ని ర‌కాల ఆచార‌, సంప్ర‌దాయాలు, ప‌ద్ధ‌తులు క‌ల‌గ‌లిసిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని సురేష్ ప్ర‌భు కితాబిచ్చారు.

అనంత‌రం స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖ‌ర్ మాట్లాడుతూ సురేష్ ప్ర‌భుకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల ప్ర‌త్యేక అభిమానం ఉంద‌ని, అందుకే నిధుల కేటాయింపులో, రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వామ్య‌మ‌య్యార‌ని పేర్కొన్నారు. ఆర్థికంగా, నైతికంగా అన్ని వేళ‌లా సురేష్ ప్ర‌భు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నార‌ని ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ మాధ‌వ్ అన్నారు. మీలాంటి వాళ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలోని యువ‌త‌కు ఉత్త‌మ శిక్ష‌ణ అందించి మెరుగైన ఉపాధి అవ‌కాశాలు సృష్టిస్తామ‌ని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఎండీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఎం & హెచ్ వో ర‌ణ‌మ కుమారి, సీపీవో బాలాజీ, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ విజ‌య‌లక్ష్మి, జిల్లా స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అధికారి సాయి శ్రీ‌నివాస్‌, ఇత‌ర అధికారులు, భాజపా నాయ‌కురాలు రెడ్డి పావ‌ని, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ అధ్యాప‌కులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-06-01 11:21:40

అత్యంత శక్తివంతమైన క్షేత్రం సింహాచలం

దేశంలోనే అతి శక్తివంతమైన నారసింహ క్షేత్రం సింహాచలమని, భక్తులు కోరిన కోరికలు తీర్చే సింహాద్రి నాథుడు ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన స్వామిగా విరాజిల్లుతున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కొనియాడారు. సింహాచలంలో బుధవారం  కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన ధ్వజస్తంభానికి శారదా పీఠాధిపతి సమక్షంలో అర్చక స్వాములు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి స్వయంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠను అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం శారదా పీఠాధిపతి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోనే అనేక నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ వరాహ ,నారసింహ అవతారాల కలయిక ఒక్క  సింహాచలంకి మాత్రమే పరిమితం అన్నారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ తో పాటు ఎన్నో రాష్ట్రాల భక్తులు సింహాద్రి నాధుడును దర్శించుకోవడానికి నిత్యం తరలివస్తారని చెప్పారు. వారందరికీ ఆలయ వర్గాలు  మెరుగైన సదుపాయాలు కల్పించడం శుభపరిణామ మని చెప్పారు. కొన్ని నరసింహ క్షేత్రాల్లో శైవ ఆలయాలు కూడా ఉన్నాయని దీని వల్ల  ఒకవైపు నారసింహుడు మరోవైపు పరమశివుడు ఆశీస్సులు భక్తులకు 
లభిస్తుందన్నారు. హుద్ హూద్ లో ఈ శివాలయం ధ్వజ స్తంభం నేలకొరిగిందని మంచి శుభమూహూర్తము లో పూజలు జరిపి తిరిగి ప్రతిష్టించడం సంతోష దాయకమన్నారు. ఆపై మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈఈ శ్రీనివాసరాజు డిఈఓ రాంబాబు ఇంజనీరింగ్ అధికారులు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు.  ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు దొడ్డి రమణ, దినేష్ రాజు, సువ్వడ శ్రీదేవి ,శ్రీదేవి వర్మ రాజేశ్వరి, నిర్మల, సంపెంగ శ్రీనివాసరావు రాధా ,చందు యాదవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Simhachalam

2022-06-01 07:26:39

ప్రమాదాల నివారణే ప్రథమ లక్ష్యం

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రమాదాలను నివారించడమే ప్రథమ లక్ష్యంగా భావించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్.హెచ్.ఏ.ఐ, ఆర్ అండ్ బి మరియు పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా ప్రమాదాల నివారణకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేసారు. ఆర్ధికపరమైన సమస్యలుంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని అంతిమంగా ప్రమాదాల నివారణే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రహదారి భద్రతా జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు గల జాతీయ రహదారిలో 48  బ్లాక్ స్పాట్ పాయింట్ల ( ప్రమాదాలు జరిగే ప్రాంతం ) వద్ద తగిన చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో తెలియజేయడం జరిగిందన్నారు. వీటిపై ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారని, అయినప్పటికీ రావివలస, తాడివలస, అదపాక జంక్షన్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వీటితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇల్యూమనేషన్ తో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరగా, అవి తమ పరిధిలో లేవని ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు తేల్చిచెప్పడంతో వీటిపై పై అధికారులకు తెలియజేసి వారం రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు తీసుకున్న చర్యలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేసారు. ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో గల బ్లాక్ స్పాట్ పాయింట్లలో ఇప్పటికే పూర్తిచేసిన పనులతో పాటు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరిగే  అవకాశమున్నందున వాటిని కూడా గుర్తించి ఎన్.హెచ్.ఏ.ఐ,  ఆర్ అండ్ బి మరియు పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను వేసుకొని ప్రమాదాల నివారణకు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ముందుకు సాగాలన్నారు. వీటిపై సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, ఎన్ని సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్న అంతిమంగా అందరి లక్ష్యం ప్రమాదాల నివారణే కావాలని కలెక్టర్ స్పష్టం చేసారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీతో పాటు మండల స్థాయిలో కూడా రహదారి భద్రతా కమిటీ ఉంటే మరిన్ని ప్రమాదాలు నివారించేందుకు అవకాశముంటుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్ ను ఆదేశించారు.

          జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక మాట్లాడుతూ జిల్లాలో పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిలో గల బ్లాక్ స్పాట్ పాయింట్లతో పాటు అదనపు ప్రదేశాల్లో కూడా హైమాట్స్ లైటింగ్, ఇల్యూమనేషన్, హై స్పీడ్ బోర్డులు, సి.సి కెమెరాలు అవసరమై ఉన్నాయన్నారు. అలాగే జాతీయ రహదారిలో గల సి.సి కెమెరాలను జిల్లా పోలీసు కేంద్రానికి అనుసంధానం చేయగలిగితే అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించవచ్చని, తద్వారా వాటిపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు. అదనపు బ్లాక్ స్పాట్స్ వద్ద అవసరమైన చర్యలు ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు చేపట్టేలోగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున వీలైనంత త్వరగా ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే స్వచ్ఛంధ సంస్థల తోడ్పాటు, సిఎస్ఆర్ నిధుల ద్వారా వాటిని చేపట్టవచ్చని సూచించారు. శ్రీకాకుళం నగరపరిధిలోని పసగాడ మిల్లు జంక్షన్, ఏడు రోడ్ల జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సిగ్నల్ లైట్లు అలాగే కృష్ణాపార్కు, బలగ, భైరివానిపేట వద్ద స్పీడ్ బ్రేకర్స్, ఎల్లో బ్లింకర్స్ అవసరమై ఉన్నాయని యస్.పి తెలియజేసారు. ఇవన్నీ నగరపాలక సంస్థ పరిధిలోనివి అయినందున నగరపాలక సంస్థ నిధులతో వీలైనంత త్వరగా ఏర్పాటుచేయాలని కలెక్టర్ నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషును ఆదేశించారు.

సామాజిక  కార్యకర్త  డా. పి.దేవభూషణరావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో పోలీసు వ్యవస్థ ఉందని వారిని ఉపయోగించుకొని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించగా, జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో 693 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారని, అయితే ఇందుకు వారిని ఉపయోగించుకునే అవకాశం లేదని ఎస్.పి స్పష్టం చేసారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టి.పి.విఠలేశ్వర్, ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, ఎన్.హెచ్.ఏ.ఐ డెప్యూటీ మేనేజర్ సిహెచ్.సతీష్, రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కె.కాంతిమతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి, పలాస మునిసిపల్ కమీషనర్ టి.రాజగోపాలరావు, ఎస్.డి.పి.ఓ ఎం.శివరామిరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సమన్వయకర్త్ కె.సత్యనారాయణ, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్, స్వీప్ రమణమూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-31 15:11:05

2.56లక్షల రైతుల ఖాతాల్లో రూ.51.15 కోట్లు

దేశంలో అర్హలైన రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నగదు జమ చేసినట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వెల్లడించారు.  డా.బి.ఆర్.అంబేద్కర్ కళా వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా (13 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు) గరీభ్  కళ్యాణ్ సమ్మేళన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కొన్ని జిల్లాల లబ్దిదారులతో దృశ్య మాద్యమం (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు గూర్చి లబ్ధిదారులతో ముఖా ముఖిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జల జీవన్ మిషన్, అమృత్, ప్రధాన మంత్రి స్వనిధి, ఒకే దేశం ఒక రేషన్ కార్డు, ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్ పి.యం.జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు,  ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకాలపై ఆయన మాట్లాడారు. దేశంలో అర్హులైన  కోట్ల మంది రైతుల ఖాతాలో ప్రధాన మంత్రి కిషాన్ సమ్మాన్ నగదు జమ చేసినట్లు పేర్కొంటూ, ఇటువంటి అవకాశం నాకు రావడం చాలా అదృష్టమన్నారు. కరోనా కష్టకాలంలో తల్లి దండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు సోమవారం (30వ తేదీన)  సహాయం అందజేయడం జరిగిందని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  భారతదేశంలో ఉన్న ప్రజలకు సేవచేసుకునే అదృష్టాన్ని నాకు అందించినట్లు వివరించారు. ఈ పథకాలు మోడీ అందించారు అనుకోకండి దేశ ప్రజలు ఎన్నుకోవడంతో నాకు ఇటువంటి అవకాశం కలిగిందన్నారు. ప్రతి ఒక్కరూ నిర్దేశించిన సంకల్పం ప్రతిసారీ గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.  

అటువంటి సంకల్పం తో ముందుకు పోవడం, ఆ లక్ష్యాలతో ముందుకు సాగుదామన్నారు.  2014 సంవత్సరానికి ముందు పత్రికల్లో వచ్చే వార్తలకు నేడు వస్తున్న వార్తలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. నేడు పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న పథకాల, అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వార్తలు కనిపిస్తున్నాయని అన్నారు. సేవా భావం, పేదరికం నిర్మూలనకు ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పథకాలు అవే ఉంటాయని తెలిపారు.  శాశ్వత  సమస్యలు అనుకున్నవి పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.  అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల భీమా అందజేయడం జరిగిందన్నారు. 200 కోట్ల వ్యాక్షినేషన్ వేయించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ పథకం అందజేయడం జరిగిందన్నారు. అలాగే ముద్ర పథక్ ద్వారా పలువురు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్క పేదవానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. భారత్ చేయూత ఇవ్వడాకి ఎప్పుడూ ముందు వుంటుందని స్పష్టం చేశారు. భారత్ లో ప్రస్తుతం. పేదరిక శాతం తగ్గుతుందని, దేశంలో అన్ని రకాల ఉత్పత్తులు జరగి మార్కెట్లోకి వస్తే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్ ఆర్థికంగా అభివృధి చెందే దేశాలల్లో ముందున్నది వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య, సాంకేతిక చదువులు, మాతృ భాషలు జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని, గృహనిర్మాణ పథకం, పిఎం కిసాన్ పథకం, వై.యస్.ఆర్.రైతు భరోసా, జగనన్న తోడు, జగనన్న శాశ్వత భూ హక్కు, స్వచ్ఛదార, జగనన్న స్వచ్చ సంకల్పం, తదితర పథకాలను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా వివిధ పథకాలలు లబ్ధిదారునికి అందించడం జరుగుతుందని వివరించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ కింద  జిల్లా లో 2.56 లక్షల మంది రైతులకు సుమారు 51.15 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ప్రధాన మంత్రి జమ చేసినట్లు వివరించారు. గార మండలం శాలిహుండం గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కృష్ణ వేణి మాట్లాడుతూ  3 సంవత్సరాలు నుండి పిఎం కిసాన్ పథకం వస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వలన రైతులందరమూ లబ్ధి పొందుతున్నట్లు ఆమె తెలిపారు. దమ్ములు పట్టే సమయంలో నగదు వస్తుందని, వాటిని వ్యవసాయంలో పెట్టుబడిక్రింద ఉపయోగ పడుతుందని ఆమె వివరిస్తూ ప్రధాన మంత్రికి రైతులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాకుళం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న వడ్డాది సోమేశ్వరరావు మాట్లాడుతూ ఏటువంటి  సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండా తనకు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం క్రింద తనకు శేషాద్రి ఆర్ట్స్ అండ్ సినీ రంగం స్లైడ్స్ మేనేజింగ్ పార్టనర్ గా యాడ్ ఏజెన్సీ పెట్టుకోడానికి కంప్యూటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం  లోన్ మంజూరు చేశారని, తద్వారా కేంద్ర ప్రభుత్వ ఈ రోజు సమాజంలో తనకు ఒక స్థానం కల్పించిందని తాను ఉపాధి పొందుతూ మరో ఇద్దరికీ ఉపాధి కల్పించగలిగానని సంతోషం వ్యక్తం చేశారు.  శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఎలేశ్వరి మాట్లాడుతూ  నేను గర్భవతిగా ఉన్న సమయంలో పోషక విలువలు కలిగే ఆహారాన్ని తీసుకోవడానికి కరోనా సమయంలో నాకు ఆర్థికంగా సహాయ అందించారని సంతోషం వ్యక్తం చేశారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మీనాక్షి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పి.యం.జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు గూర్చి వివరిస్తూ  పథకంలోని లబ్దిదారులు, పురోగతి గూర్చి  చెప్పారు. 

          ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎల్.ఇ.డి. స్క్రీన్ లో ప్రధాన మంత్రి లబ్దిదారులతో ముఖా ముఖిగా మాట్లాడటం, ప్రధాన మంత్రి సందేశాలను అధికారులు, లబ్దిదారులు, తదితరులు వీక్షించారు. లబ్దిదారులు తాము లబ్ది పొంది అభివృద్థి చెందిన విధానంను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీపతి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మీనాక్షి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకట రమణ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఇ ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరి ప్రసాద్, డిఆర్డిఎ పిడి శాంతి శ్రీ, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఆర్హులైన లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు.

Srikakulam

2022-05-31 13:02:46

దావోస్ పెట్టుబడులు రూ.1.25 లక్షల కోట్లు

దావోస్ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ కి లక్షా ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిధి గృహాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ, మే 22 నుంచి 26 వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల బృందం వెళ్ళామని,  ఆంధ్రప్రదేశ్ లో అవకాశం వున్న అంశాలనే దావోస్ లో ప్రోజెక్ట్ చేశామన్నారు. వైద్య రంగంలో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు ఫ్యామిలీ డాక్టర్ విధానం అందర్నీ ఆకట్టుకుందని తెలిపారు. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అవకాశాలు వివరించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, తీర ప్రాంత ప్రయోజనాలు ప్రపంచ స్థాయి వేదిక పై  వివరించామన్నారు. 50 ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిదులు,  కొత్త పారిశ్రామిక వేత్తలు  ముఖ్య మంత్రి తో బేటీ అయ్యారని తెలిపారు. విశాఖ ఐటి unicorn చేయాలన్న ప్రయత్నం దావోస్ సదస్సు లో జరిగిందని, గ్రీన్ ఎనర్జీ ప్రోజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ ద్వారం కాబోతుందని తెలిపారు. విశాఖలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో  ఆదిత్య మిట్టల్ కంపెనీ విస్తరించనుందన్నారు. పంపు స్టోరేజ్.. విండ్.. సోలార్ ద్వారా 30 వేల కోట్ల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి జరగనుందని, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ విశాఖలో కార్యాలయం పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశాఖలో ఉపాధి అవకాశాలు రానున్నాయని, దావోస్ సదస్సు ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించడం జరిగిందన్నారు.

Visakhapatnam

2022-05-31 12:58:46

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

వ్య‌వ‌సాయం, ఉపాధి, విద్య‌, వైద్యం త‌దిత‌ర రంగాల‌కు సంబంధించి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకొని.. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ల‌బ్ధిదారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని సిమ్లా నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌పై వివిధ రాష్ట్రాల‌కు చెందిన ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. అనంత‌రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్‌) ప‌థ‌కం కింద 11వ విడ‌త‌గా రూ. 2000 చొప్పున పెట్టుబ‌డి సాయాన్ని రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి కలెక్ట‌ర్ కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌ప‌ర్స‌న్ విప్ప‌ర్తి వేణుగోపాల‌రావు, వైస్ ఛైర్‌ప‌ర్స‌న్ బుర్రా అనుబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి, రైతులు, వివిధ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు హాజ‌ర‌య్యారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 1,57,914 మంది రైతు కుటుంబాల‌కు రూ. 31.58 కోట్ల పీఎం కిసాన్ సాయం మెగా చెక్‌ను రైతుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్య‌వ‌స్థ‌, వ్య‌వ‌సాయం, కుటుంబ సంక్షేమం త‌దిత‌ర విభాగాల్లో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల గురించి గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించార‌ని తెలిపారు. జిల్లాలో రైతుల సంక్షేమం ల‌క్ష్యంగా జూన్ 1 నుంచి ఖ‌రీఫ్ సాగుకు నీరు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ అంశంపై రైతు భ‌రోసా కేంద్రాల (ఆర్‌బీకే) స్థాయిలో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. సీజ‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తాజాగా పీఎం కిసాన్ కింద అందిన సాయం ఖ‌రీఫ్‌కు విత్త‌నాలు, ఎరువులు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి ల‌క్ష్యంగా ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌తి ప‌థ‌కాన్ని ప‌టిష్టంగా అమ‌లుచేయ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, వ్య‌వ‌సాయ అధికారి స్వాతి, మెప్మా పీడీ బి.ప్రియంవ‌ద‌, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్‌, డీఎంహెచ్‌వో డా. ఎ.హ‌నుమంత‌రావు, వివిధ శాఖ‌ల అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ల‌బ్ధిదారులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-05-31 11:05:36

జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూన్ 1వ తేదీన జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జూన్ 2వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. జూన్ 2వ తేదీ ఉదయం 10-30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు మార్పును గమనించి, మార్పు చేసిన తేదీరోజు అన్ని రకాల రికార్డులతో తప్పనిసరిగా  హాజరు కావాలని కోరారు. 

Vizianagaram

2022-05-31 11:01:15

భారత్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తోంది

దేశమంతా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రధాని నరేంద్రమోడి సారధ్యంలో భారత దేశం అన్నిరంగాలలో శక్తివంతంగా రూపొందుతోందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, ఆయుష్ మంత్రి శర్వానంద సోనోవాల్ పేర్కొన్నారు.  మంగళవారం నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన పేదల సంక్షేమ సమ్మేళనం  (వీడియో కాన్ఫరెనన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సంక్షేమ పథకాల పై లబ్దిదారులతో సంభాషణ) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులందరూ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి  చేందేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు.  అందరికీ సామాజిక న్యాయం జరిగేలా బడుగు బలహీన వర్గాల వారికి చేయూత నందిస్తున్నట్లు చెప్పారు.  తద్వారా మన దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారబోతోందన్నారు.  అదే విధంగా విశాఖపట్నం ప్రపంచానికే గమ్యనగరంగా నిలుస్తుందన్నారు.  ప్రధానికి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక అభిమానమని, రాష్ట్ర విభజన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు.  ఆత్మనిర్బర్ భారత్ ధ్యేయంగా ప్రధాని సారధ్యంలో అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.  కేంద్ర రాష్ల్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులు, మహిళలు, యువతకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు. 
రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి.శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి 8 సంవత్సరాల పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు.  కేంద్రం అందిస్తున్న రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.7 వేలు కలిపి మొత్తం రూ. 13 వేలు రైతుభరోసా అందిస్తున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులకు ఆర్ధికంగా లబ్ది చేకూరుతుందన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం  వారు వ్యవసాయానికి అప్పు చేయనవసరం లేకుండా ప్రభుత్వమే రైతుకు పెట్టుబడికి అందజేస్తున్నట్లు తెలిపారు. 
తరువాత ప్రధాన మంత్రి సంక్షేమ పథకాల మూలంగా లబ్ది పొందిన మహిళలు తమ అనుభవాన్నితెలియజేస్తూ మాట్లాడారు.  తమకు అందిన పథకం ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందినదీ తెలియజేశారు.  రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు, శాసన మండలి సభ్యులు పి.వి.మాధవ్, 
అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాని పాల్గొన్న కార్యక్రమం ప్రసారాన్ని అందరూ విక్షించారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి అవాజ్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ మరియు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్ భారత్ పి.ఎం.జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పధకాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల లబ్దిదారులతో వర్చువల్ విధానంలో  ప్రధానమంత్రి మాట్లాడారు. జగనన్న రైతుభరోసా (పి.ఎం.కిసాన్ యోజన) అనకాపల్లి జిల్లాకు సంబంధించి రూ. 43 కోట్ల, 45 లక్షల చెక్కును, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి  రూ.4కోట్ల 62 లక్షల చెక్కును  ఆయా జిల్లాల మహిళా రైతులకు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపి డాక్టర్ బి.వి.సత్యవతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, సునీల్ దేవ్ ధర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పోర్టు ఛైర్మన్  రామ్మోహన్ రావు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఏ.మల్లికార్టున, రవి పట్టన్ శెట్టి, జాయింట్ కలెక్టర్లు కె.ఎస్.విశ్వనాధన్, కల్పనాకుమారి జివియంసి కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. 

Anakapalle

2022-05-31 10:58:35

ఆరోగ్య సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి

శ్రీకాకుళం జిల్లాలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది, ఎం.పి.హెచ్.ఇ.ఓలు, ఆడ, మగ సూపర్ వైజర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి సిబ్బందికి తెలియజేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి హెచ్చరించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో సిహెచ్ఓలు,ఎం.పి.హెచ్.ఇ.ఓలు, సూపర్ వైజర్లతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తగ్గుముఖం పట్టాయని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలలో కూడా వెనుకబడి ఉందని ఆమె స్పష్టం చేసారు. మరో 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని, నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక ఆసుపత్రులలో వైద్యాధికారులతో పాటు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసారు. ప్రతి సూపర్ వైజర్ ఏఎన్ఎంతో కలిసి తమ పరిధిలో గర్భిణీ స్త్రీల వివరాలను సేకరించి ప్రతి వారం ఐరన్ మాత్రలు అందించాలని, అలాగే వైద్యులు నెలలో ఒకసారి తనిఖీ చేసి వారికి అవరసమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జె.ఎస్.వై ( జననీ సురక్ష యోజన ) మరియు పి.ఎం.ఎం.వి.వై ( ప్రధానమంత్రి మాతృ వందన యోజన ) పథకాల పట్ల గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జననీ సురక్ష యోజన క్రింద గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలకు రూ.1000/-లు, పి.ఎం.ఎం.వి.వై క్రింద రూ.5వేలు ప్రభుత్వం అందిస్తున్న సంగతిని ప్రతి గర్భిణీకి తెలియజేయాలన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వసతుల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేనందునే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని, ఇకమీదట ప్రతి గర్భిణీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునేలా చైతన్యపరచాలని, ఆ దిశగా వైద్యాధికారులు, వైద్యసిబ్బంది కృషిచేయాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు టి.టి ఇంజిక్షన్లు ఇచ్చేలా చూడాలని, బిడ్డ పుట్టిన వెంటనే పోలియో చుక్కలు, హెపటైటిస్ – బి తప్పనిసరిగా వేయాలని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాలంటరీ వ్యవస్థ నేడు ఉందని, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు సమన్వయంతో ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీల వివరాలతో పాటు ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. హెల్త్ సూపర్ వైజర్లు తమ పి.హెచ్.సి పరిధిలో గల గృహాలను సందర్శించి ఎన్.సి.డి ( నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ) పై వివరాలు సేకరించాలని అన్నారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చేపట్టిన వివరాలు రోజువారీ అందించాలని, లేనిఎడల హాజరుకానట్లుగా పరిగణిస్తామని ఆమె అన్నారు. వచ్చే 10 రోజుల్లో అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్నింటా మంచి స్థానంలో నిలిపేందుకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఎస్.ఓ నాగేశ్వరరావు, డెప్యూటీ ఎస్.ఓ శ్రీనివాస పట్నాయక్, జిల్లా ప్రోగ్రామ్ అధికారి వి.వి.అప్పల నాయుడు, రవికుమార్, కె.నారాయణరావు,  వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-31 07:38:39

పొగాకు వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలి

పొగాకు వినియోగం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మంది మరణిస్తు న్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని, కావున ప్రతీ ఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండా లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి జిల్లా ప్రజలకు సూచించారు. మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీ కార్యక్ర మాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కళావేదిక వద్ద మంగళవారం నిర్వహించింది.  ఈ కార్యక్ర మానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీకి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభిం చారు. పొగకుతో పర్యావరణానికి ముప్పు అనే నినాదంతో అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీలో పాల్గొని మొక్కలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకుతో వచ్చే ప్రమాదాలు గురించి తెలిసినప్పటికీ యువత ధూమపానానికి అలవాటు పడుతున్నారని, ఇది ప్రాణాంతకమని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కోరారు. పొగాకు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశముందని ఆమె గుర్తుచేసారు. పొగాకు వినియోగం వలన వచ్చే సమస్యలను ప్రజలకు వివరించడమే కాకుండా, వాటికి దూరం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పొగాకు రహిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. కావున యువత పొగాకు వినియోగానికి దూరంగా ఉంటూ తమతో పాటు తమ తోటి వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటును అందించాలని ఆమె అభిలషించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, రవిప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-31 07:37:46

కనకమహాలక్ష్మి అమ్మకు ఆర్జిత సేవలు..

విశాఖలోని బురుజుపేట వెలసివున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు జరుగు తున్న ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుం దని, ఇందుకు భక్తుల తాకిడి నిదర్శనంగా పేర్కొనవ చ్చు అని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవా రిని దర్శించుకున్న శ్రీనుబాబు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లిగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కనకమహా లక్ష్మి అమ్మవారు ఎంతో ప్రసిద్ధి గాంచారన్నారు. అమ్మవారిని దర్శించుకునీ
సేవించు కొన్నవారికి 
అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గా శ్రీను బాబుఅభివర్ణించారు. ఈ కార్యక్రమంలో

Visakhapatnam

2022-05-28 06:19:20