1 ENS Live Breaking News

Visakhapatnam

2022-06-28 16:49:53

2వ దశ నాడు-నేడు త్వరగా పూర్తిచేయాలి

మనబడి నాడు-నేడు 2వ దశ పాఠశాల పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ), పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులతో రెండోదశ మనబడి నాడు-నేడు పనుల పురోగతి, సిమెంట్ ఇతర మెటీరియల్ సరఫరా, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి అంశాలపై జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఫీల్డ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో రెండవ దశ మనబడి  నాడు-నేడు కార్యక్రమం కింద 663 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు పనులు పూర్తయిన వెంటనే బిల్లు అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

అదేవిధంగా మండలాల వారిగా ఫీల్డ్ ఇంజనీర్, ఎంఈఓ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి  ఎన్ని చోట్ల అదనపు తరగతులు అవసరమో గుర్తించి, వివరాలు తెలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎక్సపండెచర్ ను నిర్దేశిత సమయంలో ఖర్చుచేసి పనుల్లో పురోగతి చూపాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలలు త్వరలో పునఃప్రారంభం కానున్నందున మండలాల వారీగా పాఠశాల ఇండెంట్ ప్రకారం సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రెండో దశ పాఠశాల పనులకు సంబంధించి అవసరమైన సిమెంటు ఇతర మెటీరియల్ అందుబాటులో ఉండే విధంగా మండల విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ వి. లక్ష్మణ రెడ్డి, జిల్లా సమగ్ర శిక్ష ఈఈ డి. నటరాజన్, నగరపాలక సంస్థ సూపరింటిండెంట్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ సూపరిండెండెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-06-28 15:00:12

విద్యార్ధుల కోసం ఆధార్ శిబిరాలు

కాకినాడ జిల్లాలో ఈ నెల 29న పాఠశాల విద్యార్ధుల కోసం ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అధార్ సేవలు అందుబాటులో ఉన్న 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆధార్ నిబంధనల కనుగుణంగా జిల్లాలో 5 నండి 15 సంవత్సరాల వయస్సు పిల్లలు చేతి వేలి ముద్రల బయోమెట్రిక్స్  అప్ డేషన్ తో పాటు, ఇప్పటి వరకూ ఆధార్ నమోదు చేసుకోని వారికి నమోదు, ఇతర ఆధార్ సంబంధిత సేవలు పొందేందుకు  ఈ ప్రత్యేక శిభిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఆయా సచివాలయాల పరిధిలోని పాఠశాల విద్యార్థులు 29వ తేదీన ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Kakinada

2022-06-28 14:47:04

నూతన పంధాలోకి వెళ్లి..ఆర్ధికంగా ఎదగాలి

నూతన విధానాలను అవలంబించి ఆర్ధికంగా ఎదుగుదామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయం సహాయక బృందాలకు పిలుపునిచ్చారు. మంగళవారం పాడేరు ఐటిడిఎ సమావేశమందిరంలో సూక్ష్మ ఆహార శుద్ధ పరిశ్రమలు, క్రమబద్ధీకరణ అనే అంశంపై జిల్లా అధికారులకు, స్వయం సహాయక సంఘాలకు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నప్పటికీ అవగాహనా లోపంతో లబ్ధిదారులు అందుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.  పి.ఎం.ఎఫ్.ఎం.ఇ  పథకం క్రింద ఒక లక్ష రూపాయలు నుండి ఒక కోటి రూపాయల వరకు, వ్యక్తిగత, బృందాలుగా రుణాలు మంజూరు చేస్తారని,  దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐతే ఈ పథకంలో ఆహార ఉత్పత్తులు గ్రేడింగ్, ప్యాకింగ్, శుభ్రపరచటం లాంటి అవసరాలకు ఋణం అందించటమే కాకా మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తారని వివరించారు. యూనిట్ స్థాపిస్తే 55 శాతం బ్యాంకు ఋణం లభిస్తుందని, 35 శాతం సబ్సిడీ ఉంటుందని, కేవలం 10 శాతం లబ్ధిదారు వాటా గ చెల్లిస్తే సరిపోతుందని,  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరించారు. ఈ పథకం క్రింద ప్రతి మండలం నుండి కనీసం రెండు యూనిట్ల స్థాపనకు వెలుగు సిబ్బంది స్వయం సహాయక బృందాలకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. 
     ఐటిడిఎ పిఓ రోణంకి గోపాల కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, ఉత్పత్తులకు కొదవ లేదని, వాటికి విలువ పెంచి అమ్మకం చేయటం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు విస్తారంగా లభిస్తున్నాయని, వాటి నుండి కొత్త కొత్త ఉత్పత్తులు తయారు చేసి అమ్మటం ద్వారా లాభాలు పొందవచ్చని, అందుకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సౌకర్యాలకు సహకారం అందిస్తామన్నారు. 
       ఈ కార్యక్రమంలో విజయవాడ నుండి విచ్చేసిన ఎపి ఫుడ్ పోసెస్సింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ మారుతి పలు అంశాలపై అవగాహన కల్పించారు. 
          ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి మురళి, విశాఖపట్నం ఎపిఎంఐపి సహాయ సంచాలకులు రహీం, జిల్లా వ్యవసాయ అధికారి బిఎస్ నంద్ , బ్యాంకర్లు, స్వయంగా సహాయక బృందాల సభ్యులు వెలుగు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2022-06-28 14:37:45

పరిశ్రమల ఏర్పాటుకి ముందుకి రావాలి

ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.  అంతర్జాతీయ ఎంఎస్ఎంఇ దినోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంబంధించిన అధికారులు, ఔత్సాహికులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా  గత రెండేళ్లుగా కోవిడ్ వలన ప్రపంచ ఎంఎస్ఎంఇ దినోత్సవాన్ని జరుపుకోలేకపోయామన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం నిర్వచనం అనుసరించి వర్గీకరణ జరిగిందని చెప్పారు.  జిల్లాలో సుమారు 600 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇఓడిబి ద్వారా అన్ని  సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా 1 నుంచి 21 పని దినాలలో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.  ఏదైనా పరిశ్రమకు అనుమతి జారీ చేయడం ఆలస్యం కాకుండా ప్రతీ నెల జిల్లా ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పపోర్ట్ ప్రమోషన్ కమిటీ ద్వారా ఎస్డీపి పని తీరు, పరిశ్రమలకు రాయితీలు, సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.  

జిల్లాలో రైస్ మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, గ్రానైట్ పాలిషింగ్, ఫార్మా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు.  ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల స్థాపనకు ప్రాజెక్టు కోటి రూపాయలు వరకు పెట్టుకోవచ్చును వివరించారు. సర్విసుల సైడ్ స్థాపనకు 75 లక్షల వరకు పెట్టుకోవచ్చునని చెప్పారు. ఆగస్టు నెలలో  అర్హత గల ఎంటర్ప్రైన్యూర్స్ కు రాయితీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారన్నారు. ఎపిఐఐసి భూములకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు.  జిల్లాలో కొత్త పరిశ్రమ వాడలు నిమిత్తం ఎపిఐఐసి ద్వారా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ సహకారంతో పలాస, పైడిభీమవరం, తదితర ప్రాంతాల్లో కొత్త ఎస్టేట్ లు స్థాపించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

        ఎపిఐడిసి డైరెక్టర్ అనూరాధ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈ లకు ఎంతో తోడ్పాటు అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రాయితీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 75 శాతం స్థానిక ఎంప్లాయ్ మెంట్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామారావు మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చిన్న, మత్య తరగతి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు.   ఐతం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుమూర్తి మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. స్టార్ట్ అప్ లు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రానైట్ ఇండస్ట్రీస్ లో బయటి నుండి ఆపరేటింగ్ కు వస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలు ఆపరేటింగ్ నేర్చుకుంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఎంఎస్ఎంఈ లు పెరగాలని చెప్పారు.

      పరిశ్రమల శాఖ ఎడి రమణారావు   మాట్లాడుతూ జిల్లాలో సుమారు 600 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు. మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతా యన్నారు. ఫ్యాక్టరీ డిపార్ట్ మెంట్ జిల్లా అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రింటింగ్ ప్రెస్, తదితరులు పలువురు ఎంటర్ ప్రెన్యూర్స్ వారి అనుభవాలను వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎడి ఆర్.వి. రమణారావు సుస్థిర అభివృద్ధి పై మాట్లాడారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ పది మంది ఒక  గ్రూపుగా వచ్చి పరిశ్రమల స్థాపనకు వస్తే పై అధికారులు నుండి అనుమతి తీసుకొని రుణం మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఎడి వి. రఘునాథ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం డి. లక్ష్మణరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. వీరభద్రరావు, ఎపిఐఐసి లైజన్ ఆఫీసర్ ఎ. సత్యనారాయణ, పలువురు ఎంటర్ప్రైన్యూర్స్, పరిశ్రమల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-27 14:19:26

సీఎం వైఎస్.జగన్ కి వంశీ ఘన స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సోమవారం శ్రీకాకుళం హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయుటకు సోమవారం ఆయన జిల్లాకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా పలు అంశాలను సీఎం ద్రుష్టికి తీసుకెళ్లారు.  ఇంకా సీఎంకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, డిఐజి హరికృష్ణ, జిల్లా ఎస్పీ రాధిక, విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి,  నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు వి. కళావతి, గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ అధ్యక్షులు పి. తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, సీతంపేట ఐటిడిఎ పిఓ బి. నవ్య, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-27 12:23:19

హెలీపాడ్ వద్ద సీఎంకి ఘన స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి శ్రీకాకుళం హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయుటకు సోమవారం ఆయన జిల్లాకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, డిఐజి హరికృష్ణ, జిల్లా ఎస్పీ రాధిక, విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి,  నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు వి. కళావతి, గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ అధ్యక్షులు పి. తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, సీతంపేట ఐటిడిఎ పిఓ బి. నవ్య, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-27 07:45:10

జర్నలిస్టు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నెలకొల్పాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమ మంత్రిత్వ శాఖను నెలకొల్పాలని ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలోని మాధవధార శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాలులో నిర్వహించిన యూనియన్ ఉత్తరాంధ్ర ప్రతినిధుల సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. కనీస వేతనాలకు నోచుకోని పాత్రికేయుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తాను మరో మారు ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా హాజరైన వైసీపీ నేత సనపల బంగార్రాజు, ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వర రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బెండి వెంకట్రావులు జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర, వివిధ జిల్లాల ప్రతినిధులు,సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-26 14:25:53

నిశ్వార్ధ సేవకు నిలువెత్తు సత్కారం..

కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఆమె చేసిన అలుపెరగని సేవ మాటల్లో చెప్పలేం.. అర్ధరాత్రీ, అపరాత్రీ అనే తేడా లేకుండా  ప్రాణాలమీదకు వచ్చినవారిని ఎలాగైనా కోవిడ్ నుంచి కాపాడాలనే ఆమె తపన, చేసిన విధి నిర్వహణ అంతా ఇంతా కాదు. విపత్కర సమయంలో ప్రభుత్వ అధికారిగా మనవంతు సహకారం అందిస్తే కొంత మేరకైనా కోవిడ్ నుంచి ప్రజలను కాపాడవచ్చుననేది ఆమె బావన. దానికి తగ్గట్టుగానే 24 గంటల పాటు కోవిడ్ ప్రత్యేక కేంద్రం అధికారిగా విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణ అందించిన సేవలను వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తించి..ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా విసిసిఐ ఎక్స్ లెన్స్ అవార్డ్-2022తో సన్మానించింది. ప్రభుత్వ అధికారులు మనసు పెట్టి పనిచేస్తే ఎందరో నిరుపేదలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందడంతోపాటు, నాణ్యమైన వైద్యం కూడా అందుతందని నిర్వాహకులు కొనియాడారు. కోవిడ్ లాంటి పాండమిక్ లో జ్నానవేణిలాంటి అధికారుల సేవలు మరెందరికో ఆదర్శమంటూ కొనియాడారు. విశాఖలో జరిగిన అదే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎదురుగా భారీ విపత్తు..ఎందరో ప్రాణాలు పోగొట్లుకుంటున్నారు..ఆ సమయంలో ప్రభుత్వం ద్వారా అందించే వైద్య సహాయానికి నన్ను అధికారిగా జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన దగ్గర నుంచి ప్రతీరోజూ ఎంతమందిని కాపాడతాననే లక్ష్యంతోనే పనిచేశాను. ఆ సమయంలో తాను అస్వస్థతకు లోనైనా కోవిడ్ బారిన పడిన వారి ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క సంకల్పంతో పనిచేయడం ఎంతో సంత్రుప్తినిచ్చిందని అన్నారు.. కోవిడ్ మహమ్మరాభారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరోగ్య సూత్రాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చైతన్యం కల్పించినట్టు పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి అలవాటు చేసిన మంచి సుగుణమే తన సేవలకు తొలి కారణమని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను స్వీకరిస్తున్న ఈ సత్కారం, అవార్డు తన బాధ్యతను భవిష్యత్తులో మరింతగా పెంచిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారిగా తన సర్వీసు ఆఖరి వరకూ ఆ తర్వాత కూడా ప్రజాసేవలో రాజీలేకుండా ముందుకి సాగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వీరమోహన్, మల్లిక్, రవిగోడే, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-26 03:51:30

పర్యావరణ పాటయాత్రలో దేవిశ్రీ గొంతు

ప్రకృతి వనరులని  రక్షించుకోలేకపోతే  మానవాళికి మరణసశానమే అని పర్యావరణ కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజా గాయకుడు మజ్జిదేవిశ్రీ అన్నారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో ఉన్న అల్లూరి సీతారాం రాజు విగ్రహం నుంచి పాటయాత్ర పాదయాత్రగా ప్రారంభమై శ్రీశ్రీ విగ్రహం వరకూ సాగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ, ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయని తనదైన శైలిలో గొంతు పెకిలించి పాడిన చైతన్య గీతాలు ఆలోచింపచేసాయి. ఏమిచ్చావని ప్రకృతి వానయ్యింది.. ఏమిచ్చావని ప్రకృతి నీకు గొడుగుయింది.. ఏమిచ్చావని ప్రకృతి నీడయ్యింది.. అంటూ ఆలపించారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు అంటూ ప్రతీ ఒక్కరినీ అభ్యర్ధించారు. పర్యావరణ సమతుల్యాణికి ముప్పుతెచ్చిపెట్టే మానవతప్పిదాలు వల్లే అడవిలో జీవించవలిసిన పులి,సింహం,కొండచిలువ,వంటి వన్యప్రాణులు జనవాసాల్లోకి చొరబడి వస్తున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ పచ్చదనాన్ని పెంచేందుకుందు ముందుకు రావాలని కోరారు.  పర్యావరణ పరిరక్షణ నినాదాలు,ఆలోచన రేకెత్తించే అర్ధవంతమైన గీతాలుతో కార్యక్రమం ఆద్యంతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్ సాధిక్ మహమ్మద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు బాల మోహన్ దాస్ ,మంజుల, బాబీ వర్ధన్,కళా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణ మూర్తి పర్యావరణ కళా మండలి సభ్యులు పెద్దింటి శ్రీనివాస్ శ్రీకాంత్, సీత రోజా లక్ష్మి బొబ్బది అప్పారావు, న్యాయవాదులు  శ్రీరామ్ మూర్తి, వేణు ఆంద్రా విశ్వవిద్యాలయం పరిశోధకులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-25 10:13:21

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమరనాధ్ పార్టీ నాయకులు, కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి నియోజకవర పార్టీ ప్లీనరి సన్నాహక సమావేశం స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2024లో జరగనున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ ఇప్పటి నుంచే సిధ్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇందుకు తగినట్టుగా అధికారిక యంత్రాంగాని ఆయా ప్రాంతాల్లో నియమించుకోవాలని, అందుకు తన సహాయ, సహకారాలు అందిస్తానాని అమర్ నాధ్ వెల్లడించాలి. వచ్చే ఎన్నికల్లో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత పార్టీ క్యాడర్పైనే ఉందని అన్నారు. జగన్ అధికార లోకి వచ్చిన మూడేళ్లలో 95శాతం హామీలను నెరవేర్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సంక్షేమ కార్య క్రమాల అమలులో క్షణం ఆలస్యం జరగకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. సామాన్య నాయకునిగా ఉన్న నన్ను మంత్రిగా చేసి, ముఖ్యమంత్రి సరసన నన్ను నిలబెట్టినది. మీ అభిమానమేనని మంత్రి సమావేశానికి వచ్చినాయకులు, అభిమానులనుద్దేశించి అన్నారు. అందరి మీద నేను  ప్రేమాభిమానాలను నేరుగా వ్యక్త పరక పోవచ్చు. కాని మీ అందరిని పేరుపేరునా గుర్తుంచుకున్నాను. మీరు నా గుండెల్లోనే ఉంటారు' అని అమర్ చెప్పారు. రానున్న ఎన్నికలలో  విజయానికి మనమంతా కలిసికట్టుగా  పనిచేయాల్సి ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ నెల 28న జరగనున్న ప్లీనరి సమావేశాన్ని విజయవంతం చేయలని అమర్ కోరారు. పార్టీ పరిశీలకులు రాజారాం మాట్లాడతూ గుడివాడ అమర్  కుటుంబానికి మూడు తరాల రాజకీయ అనుభవం ఉందని అన్నారు. అమర్ నిమళ్ళీ గెలిపించుకోడానికి అందరూ కంకణ బద్ధులు కావాలని ఆయన కోరారు. కోవిడు కాలంలో కూడా మూఖ్యమంత్రి జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిం చారని అన్నారు. ప్లీనరికి ముందు ఏర్పాటు చేసుకునే కమిటీలో  మహిళలకు 50 శాతం స్థానం కల్పించాలని ఆయన సూచించారు. మరో పరిశీలకులు, డీసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతు మంత్రి అమరనాధ్ కు మంచి పేరు తీసుకువచ్చేలా పార్టీ కార్య కర్తలు, నాయకులు పని చేయులని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీపు కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ విజయంకోసం సమష్టిగా పనిచేయాలని కోరారు. 2019 లో ప్రజలకు  మనం ఏమిచేయకుండానే, ప్రజలు పార్టీకి 151 సీట్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో 1,40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మనకు వచ్చే  ఎన్నికలలో 175 కి 175 సీట్లు మన పార్టీకి అందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటు అడిగే హక్కు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వుందని  ఆయన అన్నారు.  ఈ సమావేశంలో పెద్దయెత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం  అనకాపల్లి లో ప్లీనరి జరిగే  పెంటకోట కల్యాణ మండపాన్ని మంత్రి  అమరనాధ్ పరిశీలించారు.

Anakapalle

2022-06-25 10:03:29

అంతా నాఇష్టం.. నేనే యాక్టింగ్ జెడ్పీచైర్మన్

అంతా నా ఇష్టం..నేనే యాక్టింగ్ జెడ్పీ చైర్మన్.. మీకు తెలియదా..చైర్మన్ కు ఏం తెలియదు.. తెలియడానికైనా జిల్లా పరిషత్ లోనూ, పంచాయతీరాజ్ శాఖలోనూ రూల్ పొజిషన్.. ఏ వింగ్ లో నుంచి ఎవరు ఎక్కడెక్కడికి వస్తారు..ఎలా వస్తారు.. అవన్నీ మనకు తెలుసుకనుక..అవే చైర్మన్ కి చెప్పి మాట్లాడిస్తున్నాం.. ఆమెకి తెలియని విషయాలు  మనం ఎంత చెబితే ఆమెకి అంత..ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడపెడతారు.. ఆఖరికి జెడ్పీ సీఈఓ కూడా డమ్మీ.. చైర్మన్ ఫైనల్ చేసి పంపిన ఫైలుపై నామ్ కే వాస్తే సీఈఓ కూడా సంకతాలు చేయాలి.. జిల్లా పరిషత్ బదిలీల్లో కూడా ఆదాయం వచ్చే మార్గాలు మనమే చెప్పాం.. ఇంజనీరింగ్ సెక్షన్ కావాలంటే లక్ష 50వేలు.. జనరల్ సెక్షన్ కావాలంటే లక్ష, జిల్లా పరిషత్ కావాలంటే 75వేలు, కావాల్సిన రోడ్డు పాయింట్ మండలాలు కాలన్నా లక్ష ఇస్తే పనిజరిగిపోతుంది.. నేనే స్వయంగా చేయించేస్తాను.. అందుకే నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేల్యు, ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖలను కూడా పక్కన పెట్టేశారు జెడ్పీ చైర్మన్.. ఆఖరికి జీవిఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ లు స్వయంగా వచ్చి చెప్పినా ఖాతరు చేయడంలేదు అంతా మన కనుసన్నన్నల్లోనే జరుగుతుంది.. ఏంటీ ఇదేదో సినిమా స్క్రిప్టు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియలో జరుగుతున్న తంతు.. ఎప్పడూ లేనివిధంగా జిల్లాపరిషత్ లో ఒక యూనియన్ నేత, చైర్మన్ పక్కనే పనిచేస్తున్న ఒక ఉద్యోగి చేస్తున్న కను సన్ననలలోనే కావాల్సిన వారికి..కాసులిచ్చిన వారికి పని జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే వీటిని జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి శుభద్ర, జెడ్పీ సీఈఓ మీడియా ముందు ఇదంతా మాపై ట్రోల్ అవుతున్న గాసిప్ ప్రచారమే అని కొట్టి పడేస్తున్నారు.

గాసిప్స్ మాత్రమే అనుకుంటే..కొత్తగా పదవిలోకి వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ కి పక్కనే వున్న సిబ్బంది, మోత మోస్తూ..అన్ని విషయాలూ చెప్పే ఆ యూనియన్ నేతలు..ఎందుకు ఏఏ విభాగాలకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ కి వస్తున్నారు..ఎందుకు వస్తున్నారు.. ఆయా విభాగాలకు రేటు ఎంత పలుకుతుంది.. దానికోసం ఏఏ శాఖల మంత్రుల లేఖలు తెస్తున్నారు..ఎవరెవరితో నేరుగా ఫోన్లు చేయిస్తున్నారు అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే సమాధానమే వస్తున్నది. జిల్లా పరిషత్ బదిలీల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తూ వారికి కావాల్సిన వారు, డబ్బులిచ్చిన వారికే లైన్ క్లియర్ చేస్తూ.. తమది కాని సెక్షన్ నుంచి బదిలీల ఉత్తర్వులు కూడా దగ్గరుండి మరీ తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగానే జిల్లా పరిషత్ బదిలీలంటే అంతా కాసులపైనే నడుస్తుంది. అలా నడిచినా కావాల్సిన ప్రదేశాలు కావాలంటే మరికొంచెం చేయి తడపాల్సిందే. మేము సత్య హరిశ్చచంద్రుల వంశానికి చెందిన వారమని చెప్పినా.. పైసా పెట్టకుండా ఏ పనీ జరగదు అది జగమెరిగిన సత్యం. అందులోనూ..చాలా కాలం తరువాత జెడ్పీ చైర్మన్ కూడా జిల్లా పరిషత్ సీటులో కూర్చోవచడంతో.. ఆమెను మచ్చిన చేసుకొని.. ఆమె దగ్గరకు మంచి అధికారులు, సిబ్బంది రాకుండా  అడ్డుంకుంటున్నారని ఆ యూనియన్ నేతలు, చైర్మన్ దగ్గర పనిచేసే ఉద్యోగి ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తాజా పరిణాలమాలు రుజువు చేస్తున్నాయి.

అధికాపార్టీ మీడియా మీడియా గొంతు నొక్కినా..మిగిలిన మీడియా మొత్తం జిల్లా పరిషత్ లో జరిగే బదిలీల్లో జరిగే తంతును ఒక్కోరోజు ఒక్కో విధంగా బయటకు తీసుకొస్తున్నది. ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగే సమయంలో సర్వసాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి కావాల్సిన అధికారులు, సిబ్బందికి సహాయం చేస్తుంటారు. ఇలా సహాయం చేయడానికి  బదిలీల సమయంలోనే సిఫార్సు లేఖలు కూడా ఇస్తుంటారు. కానీ జిల్లా పరిషత్ లో మాత్రం  తమకు కావాల్సిన సిబ్బంది విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని స్వయంగా ఫోన్లు చేసినా..లేఖలు ఇచ్చినా..జెడ్పీ చైర్మన్ చుట్టూ వుండే పైరవీదారులు ఆమెను తప్పుదోవ పట్టించి ఎలాంటి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆ విషయం కూడా స్వయంగా కొందరు ప్రజాప్రతినిధులే మీడియాకి లీకులిచ్చి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎవరో చాలా గట్టిగా ప్రభావితం చేస్తున్నారు.. అందుకే ఆమె ఎవరు చెప్పినా..ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు..ఆమె దగ్గరఉన్నవారి మాటలు మాత్రం వింటున్నారని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం చెప్పుకొస్తున్నారు వారంతా.

ఇంత జరుగుతున్నా జిల్లా పరిషత్  లో జరుగుతున్న బదిలీల విషయంలో మాత్రం ఆ యూనియన్ నేతలు, చైర్మన్ పక్కనే పనిచేసే ఉద్యోగి మాటలు, చేసిన ప్రచారం మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. నేరుగా ప్రజాప్రతినిధులు కలిసి చెప్పినా సదురు ఉద్యోగుల విషయంలో మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఎక్కడా తగ్గడం లేదనే ఆరోపణలున్నాయి. కాదు.. కాదు.. ఆవిధంగా చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. మీరు సీటులోకి రాగానే జరుగుతున్న బదిలీలు ఇపుడే మీరేంటో..మీ పవర్ ఏంటో చూపించాలన్నట్టుగానే చైర్మన్ ను పూర్తిగా మార్చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నది. వాస్తవానికన్నా..అబద్దానికి ఎక్కువ విలువ అన్నట్టుగా చెప్పుడు మాటలకు, కాసులతో జరిగే వ్యవహారాలకు మాత్రమే జిల్లా పరిషత్ లో పచ్చజెండా ఊపుతున్నారనే విషయం బయట గుప్పుమంటోంది. అయితే అవేమీ పట్టించుకోకుండా కావాలనుకున్న చోటుకి బదిలీ కావాలనుకున్నవారు మాత్రం మూడో కంటి తెలియకుండా బదిలీ చేయించుకుంటున్నారు. అందులోనూ జిల్లాల విభజన జరిగిన తరువాత కొన్ని ప్రాంతాలు, విభాగాల్లో పోస్టులకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉంటూ పనిచేసుకుంటూ పోదామనుకున్నవారు బదిలీల సమయంలో ఎంత అడిగితే అంతా ఇచ్చి కావాల్సిన ప్రదేశాలను కోరుకొని పనులు చేయించుకుంటున్నారు.

జిల్లా పరిషత్ లో జరుగుతున్న తంతుపైనా..చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్ లపైనా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ స్వయంగా చైర్మన్ ద్రుష్టికి తీసుకెళ్లింది. దానికి జిల్లా పరిషత్ చైర్మన్ స్పందిస్తూ..బదిలీల విషయంలో జరుగుతున్నదంతా కేవలం గాసిప్స్ మాత్రమేనని..జిల్లా పరిషత్ ఉద్యోగులు, వారి సమస్యలకే తాను పెద్ద పీట వేస్తున్నామని ఈ విషయంలో ఎవరూ తనను తప్పుదోవ పట్టించడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుంగా అటు జెడ్పీ సిఈఓ దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే..అసలు బదిలీల ప్రక్రియలో డబ్బులు చేతులు మారుతున్నాయని, యూనియన్ నేతలే స్వయంగా ఈ ప్రక్రియన దగ్గరుండి నడిపిస్తున్నారనే విషయం తనవరకూ రాలేదని చెప్పొకొచ్చారు. ఏమైనా ఆధారాలుంటే, బదిలీలకు డబ్బులిచ్చిన వారుంటే తమ ద్రుష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు(మరీ వెటకారంగా కావాల్సిన చోటుకి బదిలీ కావాల్సిన వ్యక్తి ఇచ్చిన డబ్బుల విషయం అధికారికంగా బయటకు చెబుతాడా). విశాఖపట్నం జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియ మొత్తం పైసలు, పైరవీలతోనే జరిగిపోతున్నా.. అటు జిల్లా పరిషత్ చైర్మన్, ఇటు సిఈఓలు ఏమీ జరగడం లేదని చెప్పడం..మరోపక్క యాక్టింగ్ చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్లు.. ప్రజాప్రతినిధులే స్వయంగా తాము చెప్పినా..ఆమె వినడం లేదనే ప్రచారం ఇపుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి..ముందు ముందు జిల్లా పరిషత్ లో ఇంకెన్ని సిత్రాలు చోటుచేసుకుంటాయనది..!

Visakhapatnam

2022-06-25 09:06:34

తపాలా శాఖ ఆద్వర్యంలో ధాయ్ అఖర్

భారత తపాలా శాఖ ఆద్వర్యంలో జూలై 1 నుండి అక్టోబర్ 31 వరకు "ధాయ్ అఖర్" పేరిట "విజన్ ఫర్ ఇండియా 2047" అనే అంశంపై జాతీయ స్థాయి లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ను నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.కాంతారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనువారు తమ ఉత్తరములను ఇంగ్లీష్/తెలుగు/హిందీ భాషలలో రాయవచ్చని అన్నారు. వాటిని "సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం - 532 001 నకు అక్టోబర్ 31లోగా పంపాలని కోరారు. అభ్యర్థులు పంపే ఉత్తరములపై " ఎంట్రీ ఫర్ దాయ్ అఖర్ 22-23"అని వ్రాయవలెనని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్వలప్స్  పంపేవారు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని అన్నారు.ఈ కాంపిటిషన్ రాష్ట్రీయ మరియు జాతీయ స్థాయిలో నిర్వహించ బడుతుందని,రాష్ట్రస్థాయిలో గెలుపొందిన ప్రథమ విజేతకు రూ25వేలు, ద్వితీయ విజేతకు రూ.10వేలు, తృతీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి విజేతకు రూ.50వేలు, ద్వితీయ విజేతకు రూ25వేలు, తృతీయ విజేతకు రూ.10వేలు నగదును అందజేయబడుతుందని స్పష్టం చేశారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు తమ ఉత్తరములను అక్టోబర్ 31లోగా పంపించాలని, ఆ తదుపరి వచ్చిన ఉత్తరములు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.ఆసక్తి గలవారు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించ వచ్చని, అదనపు సమాచారం కొరకు www.appost.in వెబ్ సైట్ ను పరిశీలించుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
 

Srikakulam

2022-06-24 13:18:56

రేపు విశాఖలో పర్యావరణ పాటయాత్ర

విశాఖలో  పర్యావరణ పాటయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్టు పర్యావరణ కళామండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రజాగాయకుడు దేవిశ్రీ తెలియజేశారు. ఈ మేరకు శక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతీ శనివారం పుడమి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పాటయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. విశాఖను కాలుష్యం కోరల నుంచి రక్షించుకోవడానికి పాటలతో ప్రజలను చైతన్యం చేయడానికి విశాఖలోని బీచ్ రోడ్డులోని పామ్ బీచ్ లోని అల్లూరి విగ్రహం నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకూ ఈ పాటయాత్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ ప్రేమికులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీడియా ద్వారా దేవిశ్రీ కోరారు.

విశాఖపట్నం

2022-06-24 07:40:56

AERUఉత్తరాంధ్ర ప్రతినిధుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధుల సమావేశం ఈనెల 26న విశాఖపట్నం మాధవధార లోని శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరగనుందని జిల్లా కమిటీ ప్రతినిధులు నేమాల.హేమసుందరరావు, హనుమంతు లక్ష్మణ్, సీపాన ప్రసాద్, గొండు అచ్యుతరావులు తెలియజేశారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడుతో పాటు రాష్ట్ర కమిటీ ఇతర ప్రతినిధులు, వివిధ జిల్లాల యూనియన్ ప్రతినిధులు హాజరు కానున్నారని.. వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను యూనియన్ జిల్లా ప్రతినిధులతో కలిసి యూనియన్ రాష్ట్ర కమిటీ సలహాదారు కాకుమాను వెంకట వేణులు పరిశీలించారు. ఉత్తరాంధ్రాజిల్లాల ప్రతినిధుల సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలను చర్చించడంతోపాటు కార్యాచరణను కూడా ప్రకటిస్తామని ఈ సందర్బంగా వారంతా మీడియాకి వివరించారు.

Madhavadhara

2022-06-23 11:23:01