1 ENS Live Breaking News

అంతా నాఇష్టం.. నేనే యాక్టింగ్ జెడ్పీచైర్మన్

అంతా నా ఇష్టం..నేనే యాక్టింగ్ జెడ్పీ చైర్మన్.. మీకు తెలియదా..చైర్మన్ కు ఏం తెలియదు.. తెలియడానికైనా జిల్లా పరిషత్ లోనూ, పంచాయతీరాజ్ శాఖలోనూ రూల్ పొజిషన్.. ఏ వింగ్ లో నుంచి ఎవరు ఎక్కడెక్కడికి వస్తారు..ఎలా వస్తారు.. అవన్నీ మనకు తెలుసుకనుక..అవే చైర్మన్ కి చెప్పి మాట్లాడిస్తున్నాం.. ఆమెకి తెలియని విషయాలు  మనం ఎంత చెబితే ఆమెకి అంత..ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడపెడతారు.. ఆఖరికి జెడ్పీ సీఈఓ కూడా డమ్మీ.. చైర్మన్ ఫైనల్ చేసి పంపిన ఫైలుపై నామ్ కే వాస్తే సీఈఓ కూడా సంకతాలు చేయాలి.. జిల్లా పరిషత్ బదిలీల్లో కూడా ఆదాయం వచ్చే మార్గాలు మనమే చెప్పాం.. ఇంజనీరింగ్ సెక్షన్ కావాలంటే లక్ష 50వేలు.. జనరల్ సెక్షన్ కావాలంటే లక్ష, జిల్లా పరిషత్ కావాలంటే 75వేలు, కావాల్సిన రోడ్డు పాయింట్ మండలాలు కాలన్నా లక్ష ఇస్తే పనిజరిగిపోతుంది.. నేనే స్వయంగా చేయించేస్తాను.. అందుకే నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేల్యు, ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖలను కూడా పక్కన పెట్టేశారు జెడ్పీ చైర్మన్.. ఆఖరికి జీవిఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ లు స్వయంగా వచ్చి చెప్పినా ఖాతరు చేయడంలేదు అంతా మన కనుసన్నన్నల్లోనే జరుగుతుంది.. ఏంటీ ఇదేదో సినిమా స్క్రిప్టు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియలో జరుగుతున్న తంతు.. ఎప్పడూ లేనివిధంగా జిల్లాపరిషత్ లో ఒక యూనియన్ నేత, చైర్మన్ పక్కనే పనిచేస్తున్న ఒక ఉద్యోగి చేస్తున్న కను సన్ననలలోనే కావాల్సిన వారికి..కాసులిచ్చిన వారికి పని జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే వీటిని జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి శుభద్ర, జెడ్పీ సీఈఓ మీడియా ముందు ఇదంతా మాపై ట్రోల్ అవుతున్న గాసిప్ ప్రచారమే అని కొట్టి పడేస్తున్నారు.

గాసిప్స్ మాత్రమే అనుకుంటే..కొత్తగా పదవిలోకి వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ కి పక్కనే వున్న సిబ్బంది, మోత మోస్తూ..అన్ని విషయాలూ చెప్పే ఆ యూనియన్ నేతలు..ఎందుకు ఏఏ విభాగాలకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ కి వస్తున్నారు..ఎందుకు వస్తున్నారు.. ఆయా విభాగాలకు రేటు ఎంత పలుకుతుంది.. దానికోసం ఏఏ శాఖల మంత్రుల లేఖలు తెస్తున్నారు..ఎవరెవరితో నేరుగా ఫోన్లు చేయిస్తున్నారు అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే సమాధానమే వస్తున్నది. జిల్లా పరిషత్ బదిలీల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తూ వారికి కావాల్సిన వారు, డబ్బులిచ్చిన వారికే లైన్ క్లియర్ చేస్తూ.. తమది కాని సెక్షన్ నుంచి బదిలీల ఉత్తర్వులు కూడా దగ్గరుండి మరీ తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగానే జిల్లా పరిషత్ బదిలీలంటే అంతా కాసులపైనే నడుస్తుంది. అలా నడిచినా కావాల్సిన ప్రదేశాలు కావాలంటే మరికొంచెం చేయి తడపాల్సిందే. మేము సత్య హరిశ్చచంద్రుల వంశానికి చెందిన వారమని చెప్పినా.. పైసా పెట్టకుండా ఏ పనీ జరగదు అది జగమెరిగిన సత్యం. అందులోనూ..చాలా కాలం తరువాత జెడ్పీ చైర్మన్ కూడా జిల్లా పరిషత్ సీటులో కూర్చోవచడంతో.. ఆమెను మచ్చిన చేసుకొని.. ఆమె దగ్గరకు మంచి అధికారులు, సిబ్బంది రాకుండా  అడ్డుంకుంటున్నారని ఆ యూనియన్ నేతలు, చైర్మన్ దగ్గర పనిచేసే ఉద్యోగి ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తాజా పరిణాలమాలు రుజువు చేస్తున్నాయి.

అధికాపార్టీ మీడియా మీడియా గొంతు నొక్కినా..మిగిలిన మీడియా మొత్తం జిల్లా పరిషత్ లో జరిగే బదిలీల్లో జరిగే తంతును ఒక్కోరోజు ఒక్కో విధంగా బయటకు తీసుకొస్తున్నది. ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగే సమయంలో సర్వసాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి కావాల్సిన అధికారులు, సిబ్బందికి సహాయం చేస్తుంటారు. ఇలా సహాయం చేయడానికి  బదిలీల సమయంలోనే సిఫార్సు లేఖలు కూడా ఇస్తుంటారు. కానీ జిల్లా పరిషత్ లో మాత్రం  తమకు కావాల్సిన సిబ్బంది విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని స్వయంగా ఫోన్లు చేసినా..లేఖలు ఇచ్చినా..జెడ్పీ చైర్మన్ చుట్టూ వుండే పైరవీదారులు ఆమెను తప్పుదోవ పట్టించి ఎలాంటి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆ విషయం కూడా స్వయంగా కొందరు ప్రజాప్రతినిధులే మీడియాకి లీకులిచ్చి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎవరో చాలా గట్టిగా ప్రభావితం చేస్తున్నారు.. అందుకే ఆమె ఎవరు చెప్పినా..ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు..ఆమె దగ్గరఉన్నవారి మాటలు మాత్రం వింటున్నారని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం చెప్పుకొస్తున్నారు వారంతా.

ఇంత జరుగుతున్నా జిల్లా పరిషత్  లో జరుగుతున్న బదిలీల విషయంలో మాత్రం ఆ యూనియన్ నేతలు, చైర్మన్ పక్కనే పనిచేసే ఉద్యోగి మాటలు, చేసిన ప్రచారం మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. నేరుగా ప్రజాప్రతినిధులు కలిసి చెప్పినా సదురు ఉద్యోగుల విషయంలో మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఎక్కడా తగ్గడం లేదనే ఆరోపణలున్నాయి. కాదు.. కాదు.. ఆవిధంగా చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. మీరు సీటులోకి రాగానే జరుగుతున్న బదిలీలు ఇపుడే మీరేంటో..మీ పవర్ ఏంటో చూపించాలన్నట్టుగానే చైర్మన్ ను పూర్తిగా మార్చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నది. వాస్తవానికన్నా..అబద్దానికి ఎక్కువ విలువ అన్నట్టుగా చెప్పుడు మాటలకు, కాసులతో జరిగే వ్యవహారాలకు మాత్రమే జిల్లా పరిషత్ లో పచ్చజెండా ఊపుతున్నారనే విషయం బయట గుప్పుమంటోంది. అయితే అవేమీ పట్టించుకోకుండా కావాలనుకున్న చోటుకి బదిలీ కావాలనుకున్నవారు మాత్రం మూడో కంటి తెలియకుండా బదిలీ చేయించుకుంటున్నారు. అందులోనూ జిల్లాల విభజన జరిగిన తరువాత కొన్ని ప్రాంతాలు, విభాగాల్లో పోస్టులకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉంటూ పనిచేసుకుంటూ పోదామనుకున్నవారు బదిలీల సమయంలో ఎంత అడిగితే అంతా ఇచ్చి కావాల్సిన ప్రదేశాలను కోరుకొని పనులు చేయించుకుంటున్నారు.

జిల్లా పరిషత్ లో జరుగుతున్న తంతుపైనా..చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్ లపైనా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ స్వయంగా చైర్మన్ ద్రుష్టికి తీసుకెళ్లింది. దానికి జిల్లా పరిషత్ చైర్మన్ స్పందిస్తూ..బదిలీల విషయంలో జరుగుతున్నదంతా కేవలం గాసిప్స్ మాత్రమేనని..జిల్లా పరిషత్ ఉద్యోగులు, వారి సమస్యలకే తాను పెద్ద పీట వేస్తున్నామని ఈ విషయంలో ఎవరూ తనను తప్పుదోవ పట్టించడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుంగా అటు జెడ్పీ సిఈఓ దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే..అసలు బదిలీల ప్రక్రియలో డబ్బులు చేతులు మారుతున్నాయని, యూనియన్ నేతలే స్వయంగా ఈ ప్రక్రియన దగ్గరుండి నడిపిస్తున్నారనే విషయం తనవరకూ రాలేదని చెప్పొకొచ్చారు. ఏమైనా ఆధారాలుంటే, బదిలీలకు డబ్బులిచ్చిన వారుంటే తమ ద్రుష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు(మరీ వెటకారంగా కావాల్సిన చోటుకి బదిలీ కావాల్సిన వ్యక్తి ఇచ్చిన డబ్బుల విషయం అధికారికంగా బయటకు చెబుతాడా). విశాఖపట్నం జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియ మొత్తం పైసలు, పైరవీలతోనే జరిగిపోతున్నా.. అటు జిల్లా పరిషత్ చైర్మన్, ఇటు సిఈఓలు ఏమీ జరగడం లేదని చెప్పడం..మరోపక్క యాక్టింగ్ చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్లు.. ప్రజాప్రతినిధులే స్వయంగా తాము చెప్పినా..ఆమె వినడం లేదనే ప్రచారం ఇపుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి..ముందు ముందు జిల్లా పరిషత్ లో ఇంకెన్ని సిత్రాలు చోటుచేసుకుంటాయనది..!

Visakhapatnam

2022-06-25 09:06:34

తపాలా శాఖ ఆద్వర్యంలో ధాయ్ అఖర్

భారత తపాలా శాఖ ఆద్వర్యంలో జూలై 1 నుండి అక్టోబర్ 31 వరకు "ధాయ్ అఖర్" పేరిట "విజన్ ఫర్ ఇండియా 2047" అనే అంశంపై జాతీయ స్థాయి లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ను నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.కాంతారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనువారు తమ ఉత్తరములను ఇంగ్లీష్/తెలుగు/హిందీ భాషలలో రాయవచ్చని అన్నారు. వాటిని "సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం - 532 001 నకు అక్టోబర్ 31లోగా పంపాలని కోరారు. అభ్యర్థులు పంపే ఉత్తరములపై " ఎంట్రీ ఫర్ దాయ్ అఖర్ 22-23"అని వ్రాయవలెనని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్వలప్స్  పంపేవారు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని అన్నారు.ఈ కాంపిటిషన్ రాష్ట్రీయ మరియు జాతీయ స్థాయిలో నిర్వహించ బడుతుందని,రాష్ట్రస్థాయిలో గెలుపొందిన ప్రథమ విజేతకు రూ25వేలు, ద్వితీయ విజేతకు రూ.10వేలు, తృతీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి విజేతకు రూ.50వేలు, ద్వితీయ విజేతకు రూ25వేలు, తృతీయ విజేతకు రూ.10వేలు నగదును అందజేయబడుతుందని స్పష్టం చేశారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు తమ ఉత్తరములను అక్టోబర్ 31లోగా పంపించాలని, ఆ తదుపరి వచ్చిన ఉత్తరములు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.ఆసక్తి గలవారు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించ వచ్చని, అదనపు సమాచారం కొరకు www.appost.in వెబ్ సైట్ ను పరిశీలించుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
 

Srikakulam

2022-06-24 13:18:56

రేపు విశాఖలో పర్యావరణ పాటయాత్ర

విశాఖలో  పర్యావరణ పాటయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్టు పర్యావరణ కళామండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రజాగాయకుడు దేవిశ్రీ తెలియజేశారు. ఈ మేరకు శక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతీ శనివారం పుడమి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పాటయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. విశాఖను కాలుష్యం కోరల నుంచి రక్షించుకోవడానికి పాటలతో ప్రజలను చైతన్యం చేయడానికి విశాఖలోని బీచ్ రోడ్డులోని పామ్ బీచ్ లోని అల్లూరి విగ్రహం నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకూ ఈ పాటయాత్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ ప్రేమికులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీడియా ద్వారా దేవిశ్రీ కోరారు.

విశాఖపట్నం

2022-06-24 07:40:56

AERUఉత్తరాంధ్ర ప్రతినిధుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధుల సమావేశం ఈనెల 26న విశాఖపట్నం మాధవధార లోని శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరగనుందని జిల్లా కమిటీ ప్రతినిధులు నేమాల.హేమసుందరరావు, హనుమంతు లక్ష్మణ్, సీపాన ప్రసాద్, గొండు అచ్యుతరావులు తెలియజేశారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడుతో పాటు రాష్ట్ర కమిటీ ఇతర ప్రతినిధులు, వివిధ జిల్లాల యూనియన్ ప్రతినిధులు హాజరు కానున్నారని.. వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను యూనియన్ జిల్లా ప్రతినిధులతో కలిసి యూనియన్ రాష్ట్ర కమిటీ సలహాదారు కాకుమాను వెంకట వేణులు పరిశీలించారు. ఉత్తరాంధ్రాజిల్లాల ప్రతినిధుల సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలను చర్చించడంతోపాటు కార్యాచరణను కూడా ప్రకటిస్తామని ఈ సందర్బంగా వారంతా మీడియాకి వివరించారు.

Madhavadhara

2022-06-23 11:23:01

విశాఖలో చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేయాలి

విశాఖలో చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలి సంఘం ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ను కోరారు. శనివారం మిందిలోని స్ధానిక మంత్రి నివాసంలో పద్మశాలి సంఘం నాయకులు,ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర బడ్జెట్‌లో చేనేతలకు రూ.200కోట్లు మాత్రమే కేటాయిస్తోందని, దీంతో చేనేతలకు ప్రయోజనం చేకూరడంలేదని చెప్పారు. నేతన్న నేస్తం కింద చేనేతలకు 24వేల రూపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ఇది కొద్ది మందికే అందుతుందని మంత్రి అమర్‌కు తెలియజేశారు. చేనేత కులాల వారికి ఓల్డేజ్‌ హోం,ఫంక్షన్‌ హోల్‌,విద్య,వైద్య సదుపాయాలు కల్పించాలని ఆ వినతిపత్రంలో కోరారు.ఈ వినతి పత్రం అందించిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా అధ్యక్షుడు పప్పు రాజరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల రామ్ కుమార్‌, పెద్దల కమిటీ చైర్మన్‌ తెడ్లుపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-18 14:05:28

అయ్యన్నకు డా.షారోన్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్

 కన్నతల్లి లాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, దాని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపకులపతి పివిజిఆర్ ప్రసాద్ రెడ్డిల మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని ఏయు జెఏసి నేతలు ద్వజమెత్తారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి నాయకులు, అధ్యాపకులు, అనుబంధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన జ్వాల రగిలించారు. రోడ్లను నిర్బంధించి రెండు నిమిషాల పాటు మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మతిభ్రమించి మాట్లాడుతున్న అయ్యన్న వ్యాఖ్యలు ట్విట్టర్ లో పోస్టులు చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఖ్యాతిని అవమానపరిస్తే సహించేది లేదన్నారు. ప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత ఏయు మరింత అభివృద్ధికి నోచుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ టాప్ టెన్ లో ఉంచాలన్న ఆకాంక్షను  ఉపకులపతి పివిజిఆర్  ప్రసాద్ రెడ్డి ముందుకు తీసుకెళ్తూ నాడు నేడు పేరుతో విద్యార్థుల మౌలిక వసతి కల్పన, నూతన భవన నిర్మాణాలు, చే పడుతున్నారన్నారు. దానిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఏయూ ప్రతిష్టను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని, తక్షణమే అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సిపి స్టూడెంట్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బి కాంతారావు, ప్రొఫెసర్స్ టి శారున్ రాజు, ఎన్ ఎ డి పాల్, ఏయూ ఉద్యోగ సంఘాల నాయకులు జీ రవి కుమార్, రమణారెడ్డి, స్టూడెంట్స్ లీడర్స్ ఎం కళ్యాణ్, పూడి చరణ్, హేమచంద్ర , తుల్లి చంద్రశేఖర్, పితాని ప్రసాద్ , పవణ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2022-06-18 13:47:03

27న ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ

ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ "ఛలో వైజాగ్" ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు పాడేరు మాజీ ఎమ్మెల్యే, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకే రాజారావు తెలిపారు. రామటాకీస్ అంబేద్కర్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాన్ని సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  27న సోమవారం ఆర్కే బీచ్ లో మధ్యాహ్నం 3 గంటలకు బహుజన చైతన్య సభ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. .ఉత్తరాంధ్ర నేడు ఆంధ్రప్రదేశ్ బహుజన రాజ్యస్థాపన లో ముందు భాగంలో నిలవాలని ఆకాంక్షించారు. అదే మనం సాహు మహారాజ్ కి ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఉత్తరాంధ్ర బహుజనులకు తమ ప్రాంతంపై నిర్ణయాత్మకమైన అధికారం ఉండాలన్నారు. వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి సరైన పరిష్కారాలు కావాలంటే అధికారం ఉత్తరాంధ్ర బహుజన చేతుల్లోకి రావాలని కోరారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు దళితులంతా ఏకం కావాలన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున జరగనున్న బహుజన చైతన్య సభను జయప్రదం చేయాలని లకే రాజారావు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కరణం తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు బోను కృష్ణ, సోము రాంబాబు, పీరుబండి ప్రకాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-18 13:41:56

రిటైర్డ్ ఎడీ న‌ర్సింహులు క‌న్నుమూత‌

ఆంధ్రప్రదేశ్ స‌మాచార శాఖలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఎవి న‌ర్సింహులు (78) క‌న్నుమూశారు. చిన‌ముషిడివాడ‌లోని త‌న స్వ‌గృహంలో ఆయ‌న నిద్రలోనే కాలం చేశారు. ఆదివారం సాయంత్రం త‌మ బంధువుల ఇంటికి వెళ్లి వ‌చ్చిన ఆయ‌న రాత్రి నిద్ర‌పోయి మ‌రి సోమ‌వారం ఉదయం లేవలేదు. నిద్ర‌లోనే గుండెపోటు రావ‌డంతో మృతి చెందిన‌ట్లు పెద్ద‌కుమారుడు అర‌వింద్ తెలిపారు. కొన్నేళ్ళ క్రితం భార్య‌ను కొల్పోయిన న‌ర్సింహులు త‌న కుమారులు అర‌వింద్‌, బాలాజీల‌తో క‌లిసి ఉంటున్నారు. వివాహిత అయిన కుమార్తె ఒడిస్సాలో ఉంటున్నారు. స‌మాచార శాఖ‌లో ఏపీఆర్‌వో నుంచి ఏడీ వ‌ర‌కు ఎదిగిన ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలో చాలా కాలం ప‌నిచేశారు. అప్ప‌ట్లో డెక్క‌న్ క్రానిక‌ల్‌కు ప్ర‌త్యేక వార్తలు రాసి పేరు గాంచారు. అత్యంత సౌమ్యునిగా, వివాద ర‌హితునిగా పేరుగాంచిన న‌ర్సింహులు మృతి ప‌ట్ల ప‌లువురు అధికారులు, పాత్రికేయులు సంతాపం తెలిపారు.  వార్త‌ల ప‌ట్ల అవ‌గాహ‌న‌, స‌మాచార శాఖ‌లో ప్ర‌తిభ చూపిన న‌ర్సింహులు మృతి త‌మకు వ్య‌క్తిగ‌తంగా చాలా తీర‌ని బాధ‌ను మిగిల్చింద‌ని విశ్రాంత సమాచార అధికారులు పి. గోవిందరావు ఆర్.త్యాగరాజు, పి.వెంకటప్పారావు, ఏ.బాబ్జి, డిడి మణిరామ్,  డిపిఆర్ఓలు గోవిందరాజులు సాయిబాబా  తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా న‌ర్సింహులు భౌతిక కాయానికి సోమ‌వారం సాయంత్రం చిన‌ముషిడివాడ శ్మ‌శాన‌వాటికిలో కుమారుడు అర‌వింద్ చేతుల మీదుగా అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. పెద్ద సంఖ్య‌లో అభిమానులు , బంధువులు హాజ‌రై తుది వీడ్కోలు ప‌లికారు.

Visakhapatnam

2022-06-13 11:30:07

ఉత్స‌వ‌మూర్తుల‌కు కవచాల‌ తొలగింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులకు కవచం తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో గంట తరువాత రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. సాధార‌ణంగా జ్యేష్ఠాభిషేకానికి ముందు మంగ‌ళ‌వారం క‌వ‌చాల‌ను తొల‌గించి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-06-07 12:48:06

10 ఫలితాల్లో విజయనగరంజిల్లా కొత్తరికార్డు

ప‌దోత‌ర‌గతి ప‌రీక్ష‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా విద్యార్థులు చ‌రిత్ర‌ సృష్టించారు. దాదాపు 62 శాతం మంది ప్ర‌ధ‌మ‌శ్రేణిలో ఉత్తీర్ణులై రికార్డు తిర‌గ‌రాశారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు త‌మ స‌త్తా చాటారు.  ముఖ్యంగా ప్ర‌భుత్వ సంక్షేమ పాఠ‌శాల‌ల విద్యార్థులు అద్వితీయ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది విజ‌య‌న‌గ‌రం జిల్లాను రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిల‌బెట్ట‌డ‌మే కాకుండా, వ్య‌క్తిగ‌తంగా కూడా ఉత్తీర్ణ‌త‌లో గ‌తం కంటే మెరుగైన ఫ‌లితాల‌ను సొంతం చేసుకున్నారు. విజ‌య‌న‌గ‌రం అయ్య‌ప్ప‌న‌గ‌ర్‌లోని ఆద‌ర్శ‌పాఠ‌శాల విద్యార్థి 590 మార్కుల‌ను సాధించి చ‌రిత్ర‌ సృష్టించారు. గ‌ణ‌నీయ‌మైన ఫ‌లితాల‌ను సాధించిన విద్యార్థుల‌కు, ఉపాధ్యాయుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్ట‌ర్ జ‌య‌శ్రీ అభినంద‌న‌లు తెలిపారు.

  ఎపిటిడ‌బ్ల్యూఆర్ఇఐ సొసైటీ పాఠ‌శాల‌ల‌నుంచి మొత్తం 423 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 95.74శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. వీరిలో బాలిక‌లు శ‌త‌శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, బాలురు 93.75శాతం ఉత్తీర్ణుల‌య్యారు. ఎపిఆర్ఇఐ సొసైటీ పాఠ‌శాల‌ల నుంచి 663 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 93.06 శాతం, ఎపి మోడ‌ల్ స్కూల్స్ నుంచి 1448 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాగా, 92.75శాతం, గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల నుంచి 6152 మంది ప‌రీక్ష‌లు రాయ‌గా, 86.25 శాతం, కెజిబివిల‌నుంచి1295 మంది బాలిక‌లు ప‌రీక్ష‌లు రాయ‌గా, 83.01శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఎంపిపి, జెడ్‌పిహెచ్ఎస్ పాఠ‌శాల‌ల నుంచి14,570 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 71.45 శాతం, ఎపిఎస్‌డ‌బ్ల్యూఆర్ఇఐ సొసైటీ పాఠ‌శాల‌ల‌నుంచి 755 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 70.20 శాతం, మున్సిప‌ల్ పాఠ‌శాల‌ల నుంచి 1257 మందికి గాను, 59.82 శాతం, రాష్ట్ర‌ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నుంచి 806 మందికి గానూ, 53.10 శాతం, ప్ర‌యివేటు ఎయిడెడ్ పాఠ‌శాలల నుంచి 287 మందికి గానూ, 49.83 శాతం, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల నుంచి 6152 మందికి విద్యార్థుల‌కు గానూ, 90.72శాతం ఉత్తీర్ణ‌తను సాధించారు. జిల్లా మొత్తం మీద 524 పాఠ‌శాల‌ల నుంచి మొత్తం 29,365 మంది ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయ‌గా, 77.50 శాతం ఉత్తీర్ణ‌త‌తో 22,758 మంది ఉత్తీర్ణుల‌య్యారు. ఉత్తీర్ణులైన వారిలో 18,158 మంది ప్ర‌ధ‌మ‌శ్రేణిలో(61.84 శాతం), 3,429 మంది ద్వితీయ శ్రేణిలో(11.68), 1171 మంది తృతీయ శ్రేణిలో (3.98శాతం) ఉత్తీర్ణులు కావడం విశేషం.

  వివిధ‌ ప్ర‌భుత్వ సంక్షేమ పాఠ‌శాల‌లు, రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, ఎయిడెడ్ పాఠ‌శాల‌ల ప‌రంగా చూస్తే,  576 కంటే ఎక్కువ మార్కుల‌ను 84 మంది, 551-575 మ‌ధ్య మార్కుల‌ను సాధించిన‌ది 447 మంది, 526-550 మ‌ధ్య మార్కుల‌ను సాధించిన‌వారిలో 894 మంది, 500-525 మ‌ధ్య 1352 మంది విద్యార్థులు ఉండ‌టం, ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిగా చెప్ప‌వ‌చ్చు. 500కు పైబ‌డి మార్కుల‌ను సాధించిన‌వారిలో బాలురు కంటే బాలిక‌లు రెట్టింపు ఉండ‌టం విశేషం.

కెజిబివిల్లో రాష్ట్రంలోనే ప్ర‌థ‌మం

            క‌స్తూరిభా గాంధీ బాలికా విద్యాల‌యాలు గ‌త రికార్డును తిర‌గ‌రాశాయి. మొత్తం 1296 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, వీరిలో 83.18శాతంతో 1078 మంది ఉత్తీర్ణుల‌య్యారు. దీంతో మ‌న జిల్లా రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచింది. అలాగే అత్య‌ధిక మార్కుల‌ను సాధించిన విద్యార్థి కూడా మ‌న జిల్లాకు చెందిన వారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణం. ఎల్‌కోట కెజిబివి విద్యార్థిని 580 మార్కుల‌ను సాధించింది. అదేవిధంగా 500-550 మ‌ధ్య మార్కుల‌ను 149 మంది సాధించారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం, గుమ్మ‌ల‌క్ష్మీపురం కెజిబివిలు శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించాయి. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశాల‌కు అనుగుణంగా, సూప‌ర్ 60 పేరుతో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, అత్యుత్త‌మ ఫ‌లితాల‌ను సాధించారు. గ‌ణ‌నీయ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న కెజిబివి విద్యార్ధిణుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, స‌మ‌గ్ర శిక్ష అద‌న‌పు ప‌థ‌క సంచాల‌కులు డాక్ట‌ర్ వి అప్ప‌ల‌స్వామినాయుడు అభినందించారు.

Vizianagaram

2022-06-06 16:10:59

ఎంపీ సురేష్ ప్రభు సహాయం మరువలేనిది

అల్లూరి సీతారామరాజు నడయాడి, వీర మరణం పొందిన ప్రాంతాల అభివ్రుద్ధికి రూ.కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మాజీ కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు ప్రకటించడం హర్షణీయమని అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విశాఖలో జిల్లా మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రదేశాలను సెంట్రల్ టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్దాలని తాము ప్రధానమంత్రి కార్యాలయాలనికి, కేంద్రం పర్యాటకశాఖ కార్యాలయానికి లేఖలు రాశామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ(రాజ్యసభ్) సురేష్ ప్రభు ముందుకి వచ్చి అల్లూరి సంచరించిన మంప ప్రాంతానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం అభినందనీయమన్నారు.. ఇదే రీతిలో అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి చరిత్రను కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాలుగా చేర్చి ఆయన బ్రిటీషు సేనలపై చేసిన వీరోచిన తిరుగుబాటుపైనా, సాయుధ సమరమపైనా, ప్రపంచమే తొంగిచూసిన పోరాటాలపై పరిశోధనలు చేసే స్థాయికి తీసుకు రావాలని కోరారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వమే అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన నాటి మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లను, బయటకు తీసి ప్రజలకు తెలియజేయాలని కోరారు.  అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియాకి వివరించారు.

Visakhapatnam

2022-06-02 03:28:09

జిల్లాలో లోగిస గ్రామ సచివాలయం ఫస్ట్

విజయనగరం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వారి పని తీరును ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్ లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. సచివలయాలలో  అందించిన సేవలు, స్పందన నమోదు, స్పందన డిస్పోజల్స్, గడువు లోగా పరిష్కరించినవి,  హౌసింగ్ తదితర అంశాల  ప్రామాణికంగా  ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా  గజపతినగరం మండలం లోగిస గ్రామ సచివాలయం 110.92 పోయింట్ల తో రాంక్ 1 కైవసం చేసుకుంది. మెంటాడ మండలం జక్కువ సచివాలయం 103.67 పోయింట్లతో 2 వ రాంక్, పూసపాటి రేగ మండలం రెళ్లివలస సచివాలయం  92.86 పోయింట్లతో 3వ రాంక్ సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.

Vizianagaram

2022-06-01 15:47:18

నైపుణ్యతతోకూడిన ద్వారా మంచి ఫలితాలు

నైపుణ్య‌త‌తో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయ‌ని, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు త్వ‌రిత‌గ‌తిన ల‌భిస్తాయ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్ర‌భు పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఆలోచించాల‌ని, ప్ర‌స్తుత స‌మాజ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా విద్యార్థుల‌ను తీర్చి దిద్దాల‌ని సూచించారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్సరాలు అవుతున్నా ఇప్ప‌టికీ పాత ప‌ద్ధుతుల‌నే అనుస‌రిస్తున్నామ‌ని, దీని వ‌ల్ల ప్ర‌గ‌తి కుంటుప‌డుతుంద‌ని అన్నారు. వ్య‌వ‌సాయ రంగంలో హరిత విప్ల‌వం తర్వాత చెప్పుకోద‌గ్గ శుభ‌ప‌రిణామాలు ఏమీ చోటుచేసుకోలేద‌ని మ‌నమంద‌రం సంప్ర‌దాయ‌క ప‌ద్ధ‌తుల్లోనే ఆలోచిస్తున్నామ‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. నేటి త‌రం యువ‌త విభిన్నంగా ఆలోచించాల‌ని... ఉత్త‌మ ఫ‌లితాలు అందుకోవాల‌ని సూచించారు. రూ.70 ల‌క్ష‌లు త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కేటాయించిన ఆయ‌న‌ స్థానిక ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప‌రిధిలో బుధ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొని స్కిల్ డెవ‌లెప్మెంట్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం రూ.20 ల‌క్ష‌ల‌తో జిల్లాకు కేటాయించిన ప్ర‌త్యేక అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. డిగ్రీలు, స‌ర్టిఫికేట్లు ప్ర‌ధానం కాద‌ని.. నైపుణ్యం అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌స్తుత స‌మాజంలో ఉపాధి రంగంలో స్థిర ప‌డ‌డానికి ఉప‌యోగ‌ప‌డే చ‌దువులను అభ్య‌సించాల‌ని సూచించారు. ఉద్యోగానికి లేదా స్వ‌యం శ‌క్తితో ఎద‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 1966లో హ‌రిత విప్ల‌వం తర్వాత వ్య‌వ‌సాయ రంగంలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి పరిణామం ఏమీ లేద‌ని, కావున నేటి త‌రం యువ‌త కొత్త‌గా ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని చెప్పారు. ఇప్పుడు 98 శాతం విద్యార్థులు డిగ్రీలు పాస్ అయిపోతున్నార‌ని, కానీ నాణ్య‌త ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేం చ‌దువుకొనే రోజుల్లో కేవ‌లం 1 శాతం మాత్ర‌మే పాస్ అయ్యేవార‌ని, ఇప్ప‌టి ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉంద‌ని గుర్తు చేశారు. విద్యార్థులు సానుకూల దృక్ప‌థంతో ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌ల‌కాల‌ని సూచించారు. అలాగే ప్ర‌జారోగ్యానికి ప్రాధాన్యత‌ ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని, అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 13 ప్ర‌త్యేక అంబులెన్స్‌ల‌ను అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు సౌమ్యుల‌ని, మంచి మ‌న‌సున్న వార‌ని అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని గుర్తు చేశారు. అన్ని ర‌కాల ఆచార‌, సంప్ర‌దాయాలు, ప‌ద్ధ‌తులు క‌ల‌గ‌లిసిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని సురేష్ ప్ర‌భు కితాబిచ్చారు.

అనంత‌రం స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖ‌ర్ మాట్లాడుతూ సురేష్ ప్ర‌భుకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల ప్ర‌త్యేక అభిమానం ఉంద‌ని, అందుకే నిధుల కేటాయింపులో, రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వామ్య‌మ‌య్యార‌ని పేర్కొన్నారు. ఆర్థికంగా, నైతికంగా అన్ని వేళ‌లా సురేష్ ప్ర‌భు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నార‌ని ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ మాధ‌వ్ అన్నారు. మీలాంటి వాళ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలోని యువ‌త‌కు ఉత్త‌మ శిక్ష‌ణ అందించి మెరుగైన ఉపాధి అవ‌కాశాలు సృష్టిస్తామ‌ని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఎండీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఎం & హెచ్ వో ర‌ణ‌మ కుమారి, సీపీవో బాలాజీ, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ విజ‌య‌లక్ష్మి, జిల్లా స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అధికారి సాయి శ్రీ‌నివాస్‌, ఇత‌ర అధికారులు, భాజపా నాయ‌కురాలు రెడ్డి పావ‌ని, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ అధ్యాప‌కులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-06-01 11:21:40

అత్యంత శక్తివంతమైన క్షేత్రం సింహాచలం

దేశంలోనే అతి శక్తివంతమైన నారసింహ క్షేత్రం సింహాచలమని, భక్తులు కోరిన కోరికలు తీర్చే సింహాద్రి నాథుడు ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన స్వామిగా విరాజిల్లుతున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కొనియాడారు. సింహాచలంలో బుధవారం  కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన ధ్వజస్తంభానికి శారదా పీఠాధిపతి సమక్షంలో అర్చక స్వాములు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి స్వయంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠను అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం శారదా పీఠాధిపతి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోనే అనేక నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ వరాహ ,నారసింహ అవతారాల కలయిక ఒక్క  సింహాచలంకి మాత్రమే పరిమితం అన్నారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ తో పాటు ఎన్నో రాష్ట్రాల భక్తులు సింహాద్రి నాధుడును దర్శించుకోవడానికి నిత్యం తరలివస్తారని చెప్పారు. వారందరికీ ఆలయ వర్గాలు  మెరుగైన సదుపాయాలు కల్పించడం శుభపరిణామ మని చెప్పారు. కొన్ని నరసింహ క్షేత్రాల్లో శైవ ఆలయాలు కూడా ఉన్నాయని దీని వల్ల  ఒకవైపు నారసింహుడు మరోవైపు పరమశివుడు ఆశీస్సులు భక్తులకు 
లభిస్తుందన్నారు. హుద్ హూద్ లో ఈ శివాలయం ధ్వజ స్తంభం నేలకొరిగిందని మంచి శుభమూహూర్తము లో పూజలు జరిపి తిరిగి ప్రతిష్టించడం సంతోష దాయకమన్నారు. ఆపై మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈఈ శ్రీనివాసరాజు డిఈఓ రాంబాబు ఇంజనీరింగ్ అధికారులు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు.  ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు దొడ్డి రమణ, దినేష్ రాజు, సువ్వడ శ్రీదేవి ,శ్రీదేవి వర్మ రాజేశ్వరి, నిర్మల, సంపెంగ శ్రీనివాసరావు రాధా ,చందు యాదవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Simhachalam

2022-06-01 07:26:39