1 ENS Live Breaking News

సకాలంలో కోవిడ్ వేక్సినేషన్ పూర్తిచేయాలి

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జె నివాస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, అర్హులైన అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా విస్తృతంగా స్ప్రేయింగ్ చేయాలని సూచించారు. గతంలో ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో స్ప్రేయింగ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. నవంబరు, డిసెంబరు సమయంలో నిమోనియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని వాటిపై అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సూత్రాలు, అంటువ్యాధులపై సంతలలో అవగాహన కల్పించుటకు చర్యలు చేపట్టామని తెలిపారు. పౌష్టికాహార కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వాటికి నిధులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-26 09:37:17

రీసర్వే, మ్యూటేషన్ సకాలంలో పూర్తి చేయండి

జగనన్న భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో భూముల రీ సర్వేను వేగవం తంగా చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లను సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ ఆదేశించారు. గురువారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుండి జగనన్న భూ హక్కు - భూరక్ష పథకం అమలు అంశంలో భాగంగా డ్రోన్ సర్వే, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మ్యూటేషన్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డీ.కె బాలాజీ, సర్వే అధికారులు పాల్గొన్నారు. సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ...భూమి రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని స్వచ్ఛమైన.. శాశ్వత భూమి రికార్డులను రూపొందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లకు సూచించారు. జగనన్నభూ సర్వేపై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలను కారణాలు లేకుండా తిరస్కరించరాదని ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం చేయాలన్నారు. డ్రోన్ సర్వే, భూమి కొలతలు, భూమి హద్దులు  ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మ్యూటేషన్, రీ సర్వే పనుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి తరచూ సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి వివరిస్తూ జగనన్న భూ హక్కు - భూరక్ష పథకంలో భాగంగా  డ్రోన్ సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో 34 మండలాలలో 1050  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని అందులో నాలుగు డివిజన్లలో 52 గ్రామాలలో ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేశామని, మిగిలినవి నిర్దేశించిన సమయం మేరకు పూర్తి చేస్తామని తెలిపారు. 

Tirupati

2022-05-26 09:19:34

ఆసుపత్రి పనులు ప్రారంభం కావాలి

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంజూరైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపీఎంఎస్ ఐడిసి ఇంజనీర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, సంబంధిత అధికారులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి ఎదురుగా ఉన్న వెటర్నరీ క్లినిక్ ను సిఆర్పిఎఫ్ బరాక్ వద్దకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. బరాక్ కు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆయన సూచించారు. పోలీస్ క్వార్టర్స్ కొంత మేర తొలగించాల్సి ఉంటుందని, వాటిని తొలగించి స్థలాన్ని చదును చేసి తక్షణం పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్వతిపురంలో 49 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసిన సంగతి విదితమే.  మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఐదు విభాగాలతో పాటు వంద పడకలు రానున్నాయి. దీంతో మన్యం జిల్లా కేంద్రంలో ఇప్పటికే మంచి సేవలు అందిస్తున్న జిల్లా ఆస్పత్రికి అదనంగా మరో మంచి మౌలిక వసతి కలగడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ చికిత్సలు లభ్యం కానున్నాయి. 

దీన్ని త్వరగా నిర్మించి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం వైద్య సేవలకు మకుటాయమానంగా నిలవాలని నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లో జిల్లా ఆసుపత్రి తనిఖీలో భాగంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షించడమే కాకుండా వెటర్నరీ క్లినిక్ ను తరలిస్తున్న సిఆర్పిఎఫ్ బారక్ ను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు బరాక్ కు చేపట్టాల్సిన మరమ్మతులపై ఏపీఎంఎస్ ఐడిసి ఇంజినీర్లు పరిశీలించారు.  ఈ సమీక్ష సమావేశంలో ఏపీఎస్ఎంఐడిసి పర్యవేక్షక ఇంజినీర్ కె.శివ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ ఏం.సూర్య ప్రభాకర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసన్న కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-26 09:11:07

సమాజసేవకు మరింగా ముందుకి రావాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని అన్ని స‌దుపాయాల‌తో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సేప్టీ సపోర్ట్ అంబులెన్స్‌ను ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా జిల్లాకు స‌మ‌కూర్చింది. రూ.30 ల‌క్ష‌ల సీఎస్ఎర్ నిధుల‌తో జిల్లాకు కేటాయించిన ప్ర‌త్యేక‌ అంబులెన్స్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ సౌత్ రీజియ‌న్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ కుమార్‌తో క‌లిసి గురువారం ప్రారంభించారు. ముందుగా అంబులెన్స్ లోప‌ల క‌ల్పించిన స‌దుపాయాల‌ను, ప్ర‌త్యేక‌ వెంటిలేట‌ర్‌, స్ట్రెచ‌ర్‌, ఆక్సిజ‌న్ మానిట‌ర్ త‌దిత‌ర ప‌రిక‌రాల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించ‌గా దీనిలో క‌ల్పించిన స‌దుపాయాల గురించి వైద్యులు ఆమెకు వివ‌రించారు. మిగ‌తా వాటికంటే అడ్వాన్స్‌డ్ స‌దుపాయాల‌తో కూడిన అంబులెన్స్ అని దీని స‌హ‌కారంతో త్వ‌రిత‌గతిన సేవ‌లందించ‌వ‌చ్చ‌ని, ఆక్సిజ‌న్ బెడ్‌పై ఉన్న రోగుల‌ను కూడా ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించ‌వ‌చ్చని చెప్పారు. 

అనంత‌రం ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఈడీ, రెడ్ క్రాస్ సొసైటీ ప్ర‌తినిధులతో క‌లిసి స్థానిక క‌లెక్ట‌రేట్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నుంచి క‌లెక్ట‌ర్ జెండా ఊపి అంబులెన్స్‌ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు. క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ జిల్లా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని మాన‌వ‌తా దృక్ప‌థంతో అంబులెన్స్ ను కేటాయించటం అభినంద‌నీయ‌మ‌ని, ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ వారికి ధ‌న్యావాదాలు తెలుపుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. జిల్లాలో రిఫ‌రెల్ కేసులో ఎక్కువ‌గా ఉండే ఎస్‌. కోట‌, ఎల్‌. కోట‌, కొత్త‌వ‌ల‌స ప‌రిధిలోని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఈ అంబులెన్స్‌ అందుబాటులో ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెడ్ క్రాస్ సొసైటీ ప్ర‌తినిధుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ ప‌ద్మావ‌తి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్‌ కె.ఆర్‌.డి. ప్రసాద‌రావు, రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, సీతం కళాశాల యూత్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-26 08:14:07

సచివాలయాలపై ప్రజలకు నమ్మకం పెంచాలి

సచివాలయానికి  సమస్యల  తో వచ్చేవారికీ సరైన పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరుకు అద్దం పట్టేలా సచివాలయ  వ్యవస్థ పని చేస్తోందని, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు.   కలెక్టరేట్ ఆడిటోరియం  లో బుధవారం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నున్న  వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి,  విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల  వీరభద్ర స్వామి హాజరయ్యారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతి పాదనలు పంపుతున్నామని,  ఉద్యోగులు ఇంకా ఉత్తేజంగా, చిత్తశుద్ధి తో  పని చెయ్యాలని అన్నారు.  కార్పొరేషన్ పరిధి లో రెవిన్యూ కలెక్షన్ లో, సిటిజెన్ అవుట్ రీచ్ లో ముందున్నామని, అయితే ఇంకా అనేక సేవలలో మెరుగు పడాల్సి ఉందని పేర్కొన్నారు.  చేసే పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అప్పడే పూర్తిగా మనసు పెట్టి చేయగలమని అన్నారు.  ఎందరికో రానటువంటి  అవకాశం మీకు వచ్చిందని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి క్రమ శిక్షణ తో పని చేయాలనీ హితవు పలికారు.,  పదవి తో సంబంధం లేకుండా  శాసన సభ్యులు కోలగట్ల నిత్యం  ప్రజలతో మమేకం అవుతూ ప్రజా  సమస్యలు వారే స్వయంగా పరిష్కరిస్తున్నారని, అందుకోసం వారిని ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు.  మంచి పని చేసే వారిని  ఏ ఒక్కరూ అడ్డుకోరని , ఎంతైనా చేయవచ్చని, అది పది మందికి ఉపరించేలా ఉండాలని అన్నారు.  జాబు చార్ట్ లోని పనులే కాకుండా వినూత్నంగా అలోచించి ప్రజలకు మేలు చేసే పని దేనినైనా స్వాగతిస్తామని తెలిపారు. 

శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించి, పారదర్శకంగా , ప్రతిభను ప్రాతిపదికగా తీసుకొని సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టారని, మీ ప్రతిభను ప్రజా సమస్యల పరిష్కారం లో చూపించాలని అన్నారు.  ఎంతో నమ్మకం తో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రారంభించారని, ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించాలని అన్నారు.  సచివాలయ వ్యవస్థకు తోడుగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసారని , ప్రజలతో మమేకం అయి, అందరిని కలుపుకొని  పని చేయాలనీ అన్నారు.  పాలన అనేది నిరంతర ప్రక్రియ అని, బాధ్యతాయుతంగా నడిపిస్తే  వ్యవస్థ చక్కగా నడుస్తుందని అన్నారు. జిల్లా కలెక్టరు గా చేరిన నుండి సూర్య కుమారి గారు  కఠినంగా వ్యవహరిస్తూ  అలసత్వాన్ని సహించేది లేదంటూ జిల్లా పాలనను గాడిలో పెట్టారని తెలిపారు.  కలెక్టరు, కమీషనర్ మాత్రమే  బాధ్యత తీసుకుంటే కుదరదని, ప్రతి ఉద్యోగి వారి బాట లో నడిచి విధి నిర్వహణ లో చిత్తశుద్ధి కనపరచాలని అన్నారు.  అంతే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా కలుపుకొని వెళ్ళాలని  అప్పుడే ప్రజలకు అవసరమగు సేవలు అవసరమైనపుడు అందుతాయని పేర్కొన్నారు.  క్రింది స్థాయి వారితో మాట్లాడడం తక్కువని  భావించరాదని,  సేవ చేసే అవకాశం రావడమే అదృష్టమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్  ఆర్.శ్రీ రాములు నాయుడు మాట్లాడుతూ వార్డు సచివాలయ సిబ్బందికి అవసరమగు శిక్షణలు అందిస్తూ ,  వారి సేవల పర్యవేక్షణకు నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసామన్నారు.  ప్రజామోద యోగ్యమైన సేవలందించేలా వ్యవస్థను తీర్చి దిద్దుతామని అన్నారు.  సహాయ కమీషనర్ ప్రసాద్  పవర్ పాయింట్ పై సచివాలయ ఉద్యోగుల  సేవలు, స్పందన వినతుల పరిష్కారం ,  ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాల పై వివరించారు. మున్సిపల్ ఇంజనీర్ దిలీప్, ఇతర సెక్షన్ హెడ్స్, ప్లానింగ్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. హైద్రాబాద్ నుండి వచ్చిన  సుధీర్ ఈ శిక్షిణా కార్యక్రమంలో మొటివేశనల్ తరగతి నిర్వహించారు.

Vizianagaram

2022-05-25 13:17:06

14న అప్పన్నకు 3వ విడత చందన సమర్పణ

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి వచ్చేనెల 14న మూడో విడతగా 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు  తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం సింహాద్రి నాధుడునీ దర్శించుకున్న శ్రీను బాబు స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. అప్పన్నకు చందనం సమర్పించేందకు చేపట్టే అంశాలను వివరించారు. జేస్ట  పౌర్ణమిని పురస్కరించుకొని ఆ రోజు 3 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారన్నారు. ఇప్పటికే చందనోత్సవం రోజు రాత్రికి మూడు మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించగా, ఆ తర్వాత వచ్చే వైశాఖ పౌర్ణమికి మరో మూడు మనుగులు చందనము (ఇప్పటి వరకుమొత్తం 250 కేజీలు) స్వామికి సమర్పించినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చే  ఆషాడ పౌర్ణమికి మిగిలిన మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారన్నారు. ఏడాదిలో నాలుగు విడతలుగా 12 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఆ తర్వాత వచ్చే శ్రావణ పౌర్ణమినీ  పురస్కరించుకుని కరాళ చందన సమర్పణ ఉంటుందన్నారు,, మూడో విడత కు అవసరమైన చందనాన్ని త్వరలోనే సిబ్బంది అరగదీస్తారని  చెప్పుకొచ్చారు. సింహగిరి పై జరుగుతున్న ఆర్జిత సేవలకు భక్తులు నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం స్వామివారికి ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యకల్యాణం, గరుడసేవ, లక్ష్మీనారాయణ వ్రతం, స్వర్ణపుష్పార్చన, స్వర్ణ తులసీదలార్చనతో పాటు అన్నప్రాసన ,అక్షరాభ్యాసం సేవలు అందుబాటులో ఉన్నట్లు శ్రీను బాబు వివరించారు. వీటిని భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని స్వామివారి సేవలో తరలించాలని మీడియా ద్వారా భక్తులను కోరారు.

Simhachalam

2022-05-25 08:38:40

బాధితులకు పరిహారంపై అవగాహన

విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో "బాధితులకు పరిహారం" అనే అంశం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బార్ అసోసియోషన్  లైబ్రేరి హాల్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా జిల్లా జడ్జ్ మరియు జిల్లా  లీగల్ సర్వీసెస్  అదారిటీ చైర్మన్ గౌ.ఎ.హరిహరనాధ శర్మ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాధులు భాదితులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్ర్రమంలో  రెండోవ అదనపు జిల్లా జడ్జి  ఎస్.శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. వి.రవీంద్ర ప్రసాద్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఎస్.కృష్ణమోహన్, బార్ అసోసియేషన్ కార్యదర్శి .వేణుగోపాల్, జిల్లా న్యాయ సేవాదికర సంస్ధ కార్యదర్శి  కె. కె. వి. బుల్లి కృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  శైలజ, ప్యానల్ అడ్వకేట్  ఆర్.శ్రీనివాస రావు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-24 14:25:54

క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి

క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారులు,  మున్సిపల్ కమిషనర్లు,  తాహాసిల్దార్లు, ఎంపీడీవో లు పర్యటించి ఇంటి నిర్మాణాలు పనులను వేగవంతం చేయాలని ఈ విషయంలో మరో మాటకు తావులేదని జిల్లా కలెక్టర్ కె. మాధవిలత స్పష్టం చేశారు. మంగళవారం క్షేత్రస్థాయి అధికారులతో ఓటిఎస్ , ఇళ్ల నిర్మాణాలు పై  కలెక్టర్  టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత సమీక్షిస్తూ మండలాల్లో ఇళ్ల నిర్మాణాల వారం వారం లక్ష్యాలను వేగవంతం చేయాలన్నారు. తాసిల్దార్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పాలన్నారు.  ప్రతి 15 రోజులకు ఒకసారి  ముఖ్యమంత్రి ,  ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటి నిర్మాణాలపై కలెక్టర్లతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్స్  అధికారులు వారి పరిధిలో గల ప్రతి మండలం లోని  లేఅవుట్లలో తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని లేఅవుట్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్  ఆర్డీవో మల్లిబాబు ను  ఆదేశించారు. నిడదవోలు మునిసిపాలిటీ పరిధిలో 990 పైగా ఇల్లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 58పనులు ప్రారంభం అయి, మిగిలినవి  కాకపోవడంపై ప్రశ్నించారు.  మునిసిపల్ వార్డు సచివాలయం  పరిధిలో కనీసం వారానికి 10 ఇల్లు ప్రారంభించాలని ఇందుకు సిబ్బందికి లక్ష్యాలను విధించాలన్నారు. 

ప్రతి వారం 30 ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సచివాలయం పరిధిలో 5 ఇళ్లు ప్రారంభించేలాగా తాహాసిల్దార్ లు, ఎంపీడీవోలు హౌసింగ్ అధికారులతో సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు. జగనన్న లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీలు అందుబాటులో ఉంచుతున్నందున పనులు వేగవంతం చేయాలన్నారు. డిఆర్డిఎ, మెప్మా  స్వయం సహాయక మహిళలకు  ప్రభుత్వం అందించే రూ.15 వేలకు అదనంగా మరో రూ.35 రుణాన్ని మంజూరు చేసి, ఇంటిని నిర్మించేందుకు ముందస్తు చేయూత ను ఇస్తున్నామని, ఆ మొత్తంతో ఎటువంటి జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్ట గలుగుతామన్నారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ,  లబ్ధిదారులకు ఓటీఏస్ ద్వారా చేకూరే ప్రయోజనాలు వివరించి లక్ష్యాలను సాధించాలన్నారు.  అదే విధంగా ఎంపిడివోలు, తహశీల్దార్లు, హౌసింగ్ ఆధికారులు సమన్వయం తో పనిచేస్తు లాక్ష్యాలను అధిగమించాలన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్,నగరపాలక సంస్థ  కమీషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఏ.చైత్రవర్షిని, ఎస్.మల్లిబబాబు, తాహసిల్దార్లు, ఎంపిడీవోలు తదితరులు. పాల్గొన్నారు.

Rajahmundry

2022-05-24 11:44:46

3ఏళ్ల సమస్యకు శాస్వత పరిష్కారం

వంశధార డిస్ట్రిబ్యూటరీ - 5 కాలువ పనులకు మూడు సంవత్సరాల తరువాత పరిష్కారం లభించింది. వివరాలను పరిశీలిస్తే  భామిని మండలం పెద్ద దిమిలి గ్రామానికి సమీపంలో డిజైన్ ప్రకారం వంశధార వరద కాలువ నిర్మాణం జరగాలి. అయితే పెద్ద దిమిలి గ్రామస్తులు కాలువ నిర్మాణం వలన గ్రామంలో చెమ్మ వస్తుందని, కాలువలో ప్రమాదాలు జరగవచ్చని వివిధ సందేహాలతో గత మూడేళ్లుగా నిర్మించకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు వారికి పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ ససేమిరా అన్నారు. గ్రామం సమీపంలో నిర్మించాల్సిన దాదాపు ఆరు వందల మీటర్ల కాలువ మినహా మిగిలిన 1.20 కీలో మీటర్ల మేర నిర్మించారు. ఇంతలో జిల్లాల విభజన జరగటం, భామిని మండలం శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం మన్యం జిల్లాలో చేరడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల గూర్చి సమీక్షలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఈ అంశాన్ని తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించి దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. పెద్ద దిమిలి గ్రామస్తులతో మాట్లాడాలని నిర్ణయించి మంగళ వారం ఒక సమావేశాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత సమక్షంలో సమావేశం జరిగింది. గ్రామస్తుల సంశయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆలకించారు. వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలో చెమ్మ రాకుండా అవసరమగు సిమెంట్ కట్టాడాలు నిర్మిస్తామని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సాగు నీరు పారుదలకు సహకరించాలని కోరారు. వంశధార రాష్ట్రంలో ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టు అని, అటువంటి ప్రాజెక్టును చిన్న కారణాలతో నిలిపివేయడం సరికాదని సూచించడంతో గ్రామస్తులు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీనితో మూడు సంవత్సరాలుగా సాగుతున్న సమస్య యువ అధికారుల చొరవతో సానుకూలంగా పరిష్కారం జరిగి ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టుకు జిల్లాలో సజావుగా పనులు సాగుటకు అవకాశం కలిగింది. గ్రామంలో అవసరాలు గుర్తించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో పాలకొండ డిఎస్పి శ్రావణి, వంశధార కార్యనిర్వాహణ ఇంజినీర్ ఎం.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 11:40:53

యువత మాత్రుభూమిని మరువకూడదు

నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉన్నతవిద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. యువత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2025 నాటికి దేశంలో 1.2 కోట్ల మంది యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. దేశ భవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని అన్నారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి దేశ విదేశాలకి వెళ్తారని, ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని, సామాజిక బాధ్యతని తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు మల్లారెడ్డి వర్సిటీ ఛాన్సిలర్ డీఎన్ రెడ్డి), వీఎస్ యూ వైస్ ఛాన్సిలర్ సుందరవల్లి, రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి హాజరయ్యారు.

Nellore

2022-05-24 11:34:48

సిఆర్పిఎఫ్ బరాక్ లోకి పశువుల ఆసుపత్రి

చాకలి బెలగాం లోని సిఆర్పిఎఫ్ బరాక్ లో ఉన్న భవనంలోకి వెటరినరీ ఆసుపత్రి మార్చాలని జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. వెటరినరీ ఆసుపత్రి మార్పు కోసం మంగళ వారం సిఆర్పిఎఫ్ బరాక్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భవనానికి అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి సిద్ధం చేయాలని అన్నారు. ఒపి విభాగం, మందులు నిల్వ గదిని   ప్రాథమికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దశల వారీగా పూర్తి స్థాయి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రికి అదనంగా భవనాలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచుటకు ప్రతి పాదనలు ఉన్న సంగతి తెలిసిందే. అదనపు భవనాలను అదే ప్రాంగణంలో నిర్మించుటకు అనువుగా అచ్చట ఉన్న వెటరినరీ ఆసుపత్రిని మార్చుటకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అర్.కూర్మనాథ్, నోడల్ అధికారి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 11:10:06

జిల్లామైక్రో ఇరిగేషన్ అధికారిగా మన్మథరావు

పార్వతీపురం మన్యం జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారిగా కె.మన్మథ రావు నియమితు లయ్యారు. ఈ మేరకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మన్మథ రావు ఇప్పటి వరకు సూక్ష్మ నీటిపారుదల ఇన్ ఛార్జ్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారిగా నియమిస్తూ పార్వతీపురం మన్యం జిల్లాకు నియమితులయ్యారు. సూక్ష్మ నీటిపారుదల ద్వారా రైతులు అధిక సాగుచేసి దిగుబడులు సాధించుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచియం చేసుకున్నారు.

Parvathipuram

2022-05-24 08:25:29

ఖరీఫ్ కు రైతులను సిద్దం చేయాలి

ఖరీఫ్ కు రైతులను సిద్దం చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను ముందుకు తీసుకు వస్తున్న దృష్ట్యా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయితీ లేని విత్తనాల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. పచ్చి రొట్ట విత్తనాలను రైతు భరోసా కేంద్రాలు వారీగా పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు వారీగా విత్తనాల అవసరాలు పక్కాగా గుర్తించాలని ఆయన అన్నారు. విత్తనాల నిలువకు గిడ్డంగుల కొరత ఉంటే ప్రైవేట్ భవనాలలో నిల్వ ఉంచుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విత్తనాల అవసరాలను మూడు రోజులలో జిల్లా వ్యవసాయ అధికారికి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో విత్తనాల సమస్య తలెత్తరాదని కలెక్టర్ పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ లాబ్ లను త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. మండలాల్లో కౌలు రైతులను గుర్తించి కార్డులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. గుమ్మలక్ష్మిపురం, సీతంపేట తదితర మండలాల్లో కౌలు రైతుల గుర్తింపులో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

 50 శాతం రాయితీతో పచ్చి రొట్ట విత్తనాలను సరఫరా చేయడం జరిగిందని, కొన్ని మండలాలకు 90 శాతం రాయితీ ఉందని ఏపి సీడ్స్ జిల్లా మేనేజర్ పద్మ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ విమల, ఏపిఎం.ఐ.పి ప్రాజెక్టు డైరెక్టర్ కె. మన్మథ రావు, ఇన్ ఛార్జ్ జిల్లా మత్స్య శాఖ అధికారి గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 06:47:31

ఘనంగా జూ.. ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

టాలీవుడ్ యంగ్ టైగర్ సినీ నటుడు ,జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల కోలాహలం నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. విశాఖలో శుక్రవారం ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్  సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో అప్పన్నదేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయజర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అభిమానులతో కలిసి ఆయన  కేక్ కట్ చేసారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో వృద్ధులకు అనాథలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి గంట్ల శ్రీనుబాబు  మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సినీ హీరోలు అభిమానులు అంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన అభిమానులను శ్రీనుబాబు అభినందించారు. గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా తాము జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు.. సమాజ సేవలో తాము ముందు వరుస లో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బ్రహ్మయ్య, చీఫ్ అడ్వైజర్ పొలమరశెట్టి శ్రీను, అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు సంతోష్, మహేష్, జాయింట్ సెక్రెటరీలు లక్ష్మణ్ చౌదరి, లోకేష్, అసిస్టెంట్ సెక్రటరీ తిరుమలరావు, కరస్పాండెన్స్ రవి, ప్రవీణ్, రవి, సురేంద్ర, సభ్యులు హరిప్రసాద్, నాని, హరిన్, దిలీప్, రెడ్డి, దివాకర్, హరి, ఆరిలోవ బుజ్జి, వెంకటేష్,  ఉప్పలపాటి సత్య రాజ్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు యల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-20 10:43:09

గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు

గడపగడపకు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్నదొర అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలం కందిరి వలస గ్రామంలో ఉప ముఖ్యమంత్రి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కనుక్కున్నారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని, సొంత ఇంటికి యజమాని కావాలని ఆయన కోరారు. ప్రతి ఇల్లు కనీసం రూ.15 లక్షలు విలువ చేస్తుందని ఆయన పేర్కొంటూ జగన్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉందని అన్నారు. మహిళలకు చేయూత, సున్నా వడ్డీ తదితర కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, పిల్లలకు బాల అమృతం వంటి కార్యక్రమాలను అందిస్తూ పౌష్టికాహారానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.

గర్భంలో ఉన్నప్పటి నుండే ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా మొత్తాలను సోమ వారం విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. లబ్దిదారులతో ముఖాముఖీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కందిరివలసలో ఒక వ్యక్తి రూ.2.41 లక్షలు విద్యా దీవెన క్రింద అందిందని, తన కుమారుడిని బి.టెక్ చదిస్తున్నానని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ పేదలకు మేలు చేయుటకు జగన్ మోహన్ రెడ్డి ముందు వరుసలో  ఉంటారని చెప్పారు. 

Pachipenta

2022-05-19 13:03:16