1 ENS Live Breaking News

కొట్యాడ సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కోట్యాడ పంచాయితీ సెక్రటరీ బంగారు తల్లిని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విధుల నుంచి గురువారం సస్పెండ్ చేసారు.  స్పందన వినతులపై  30 రోజుల గడువు దాటినప్పటికి స్పందిక పోవడంతో  సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.  గడువులోగా స్పందన వినతులు పరిష్కరించవలసి వుండగా గడువు దాటి  2 రోజులు అయినప్పటికి స్పందించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పంచాయతీల్లో ప్రజలకు పంచాయతీల నుంచి సేవలు అందకపోవడం పట్ల  వస్తున్న ఫిర్యాలు,  స్పందన పట్ల సిబ్బంది నిర్లక్ష్యంపై  జిల్లా కలెక్టర్ చాలా గుర్రుగా ఉన్నారు. స్వయంగా హెచ్చరికలు జారీచేసినా తీరు మార్చుకోకపోవడంతో ఈ రోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Vizianagaram

2022-05-19 12:50:17

నాడు-నేడు 2వ ద‌శ త్వరితగతిన చేపట్టాలి

కాకినాడ జిల్లాలో నాడు-నేడు రెండో ద‌శ కింద పాఠ‌శాల‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన ప‌నులను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో రెండోద‌శ నాడు-నేడు ప‌నుల‌పై క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. విద్య, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, స‌ర్వ శిక్షా అభియాన్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. నాడు-నేడు కార్య‌క్ర‌మం రెండో ద‌శ కింద అద‌న‌పు త‌ర‌గ‌తుల నిర్మాణంతో పాటు మ‌ర‌మ్మ‌తులు, విద్యుత్‌, తాగునీటి సౌక‌ర్యం త‌దిత‌ర ప‌నులు మంజూరైనందున‌.. వెంట‌నే గ్రౌండింగ్ మొద‌ల‌య్యేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌రం మేర‌కు సిమెంట్‌, స్టీల్ త‌దిత‌ర సామ‌గ్రికి ఇండెంట్ పెట్టాల‌ని.. అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్‌మెంట్ క‌మిటీ (డీపీసీ) స‌మావేశం నిర్వ‌హించి, ఇత‌ర సామ‌గ్రి సేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు.. క్షేత్ర‌స్థాయి ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నుల ప్రారంభానికి ఏవైనా అవ‌రోధాలు ఉంటే వెంట‌నే తొల‌గించి, గ్రౌండింగ్ జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప‌నుల్లో పురోగ‌తిపై రోజువారీ నివేదికలు స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో డీఈవో డి.సుభ‌ద్ర‌, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస‌రావు, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎం.శ్రీనివాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-05-19 11:34:26

కలెక్టరేట్ నిర్మాణానికి భూముల పరిశీలన

అనకాపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగం పుంజుకుంటున్నాయి. ప్రభుత్వభూముల్లో సువిశాల కలెక్టరేట్ నిర్మాణం చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కు శాశ్వత భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూములు పరిశీలిస్తున్నట్లు జెసి కల్పనా కుమారి చెప్పారు.  గురువారం ఆమె అనకాపల్లి మండలం లోని కోడూరు, కొండుపాలెం, అనకాపల్లి సౌత్ లలో ప్రభుత్వ భూములను పరిశీలించారు.  ప్రభుత్వ అంచనా మేరకు నిర్మించబోయే కలెక్టరేట్ లోనే సుమారు 75 ప్రభుత్వశాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు అంతపెద్ద స్థలాన్ని కూడా జిల్లా కలెక్టర్, జెసిల ఆధ్వర్యంలో గుర్తించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వ భూముల పరిశీలనలో  జెసి వెంట  రెవిన్యూ డివిజనల్ అధికారి చిన్నికృష్ణ, తాసిల్దార్ శ్రీనివాసరావు ఉన్నారు.

Anakapalle

2022-05-19 11:29:50

వేసవి శిబిరాలు ఉత్సాహంగా నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. వేసవి క్రీడ శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని క్రీడా శిక్షణా శిబిరాలు పక్కాగా నిర్వహించాలని తద్వారా క్రీడల పట్ల యువత ఆసక్తి పెరగుతుందని సూచించారు. చిన్నతనం నుండే అభిరుచి పెరగడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని, మానసికంగా ధైర్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉన్నతమైన శిక్షణ కల్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని సూచించారు.  జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, క్రీడల శిక్షకులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-19 09:56:09

మినుములూరుని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

మినుములూరు గ్రామాన్ని ప్రజా భాగస్వామ్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ సూచించారు.  గురువారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో 330 గృహాలకు గాను మూడు ట్రై సైకిల్స్, పుష్ కార్టులు ఉన్నప్పటికీ, ఎత్తైన కొండ ప్రాంతంలో గృహాలు ఉన్నందున ఇంటింటికి చెత్త సేకరణ లో కొంత ఇబ్బంది అవుతుందని సర్పంచ్ ఎల్ చిట్టమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  చెత్త సేకరణలో భాగంగా గ్రామానికి అవసరమైన ఆటోలను అద్దెకు తీసుకోమని సూచించిన కలెక్టర్ యువత ఐదు వేల రూపాయలు సేకరిస్తే తన వంతుగా మరో ఐదు వేల రూపాయలు రెండు మూడు నెలల పాటు అందజేస్తామని తెలిపారు.  తద్వారా చెత్త సేకరణ సులభతరం అవుతుందన్నారు.  గ్రామంలో యూజర్ చార్జీలు వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్, కార్యదర్శులను కలెక్టర్  కోరారు. నెలకు అరవై రూపాయల యూజర్ చార్జీలు చెల్లించడం ద్వారా చెత్త సేకరణ లో సమస్యలు తొలగిపోతాయని తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని కలెక్టర్ వివరించారు.  గ్రామస్తులతో వెలుగు సిబ్బందిని కలుపుకొని సమావేశమై యూజర్ చార్జీల గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వాలంటీర్ తోపాటు, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు, వ్యవసాయ సహాయకులు, మహిళా పోలీస్ తదితర సిబ్బంది 50 ఇళ్ల నుండి కుటుంబీకులను చైతన్య పరిచి యూజర్ చార్జీలు వసూలు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్  ఎరువును తయారు చేసి లబ్ధి పొందాలన్నారు. సామాజిక భాద్యతతోనే అభివృద్ధి సాధ్యమని హితబోధ చేశారు. 

        పారిశుధ్య కార్మికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుగా సేకరించి వాటిని అమ్మి వచ్చిన సొమ్మును  వారే వినియోగించుకోవచ్చని సూచించారు.  పారిశుధ్య కార్మికులకు నెలకు ఒకసారి తప్పనిసరిగా హెల్త్ చెక్ చేయాలని ఆదేశించారు. వారికి గత ఆరునెలలుగా వేతనాలు అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా కలెక్టర్ స్పందిస్తూ.. కమిషనర్, కార్యదర్శిల దృష్టికి తీసుకు వెళ్లి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎల్ చిట్టమ్మ, జిల్లా పంచాయతీ అధికారి పిఎస్ కుమార్, ఎంపీడీఒ కెవి నర్సింహ రావు, ఇఒపిఆర్డి పి విజయలక్ష్మి, కార్యదర్శి బి. చిన్ని, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-05-19 09:49:59

పరిశ్రమల ఏర్పాటుకి ముందుకి రావాలి..

ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేందుకు మ‌హిళ‌లు ముందుకు రావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కు మారి పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఎన్నో అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంద‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. విటి అగ్ర‌హారం టిటిడిసిలో జిల్లా స‌మాఖ్య స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌హిళా సంఘాల స‌భ్యుల‌కు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో క‌న్వ‌ర్జెన్సీ మీటింగ్‌ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా రాణించేందుకు ప్ర‌స్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు, ఇప్ప‌టికే ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను కూడా అభివృద్ది చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. ఫ‌లితాన్ని సాధించేవ‌ర‌కూ ప్ర‌యత్నం చేయాల‌ని అన్నారు.  వివిధ ర‌కాల‌ పంట‌ల‌ను, ఉత్ప‌త్తుల‌ను ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి నేరుగా విక్ర‌యించ‌డం, వాటితో ప‌చ్చ‌ళ్లు, ఇత‌ర ప‌దార్ధాల‌ను త‌యారు చేయ‌డం త‌దిత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌ని సూచించారు. మ‌హిళ‌లు దైర్యంగా ముంద‌డుగు వేసి, ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు. అన‌వ‌స‌ర భ‌యాల‌ను విడ‌నాడాల‌ని, తామే మ‌రికొంద‌రికి ఉపాధిని క‌ల్పించేందుకు కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం ప్ర‌తీఒక్క‌రికి డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్‌ అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికోసం కేంద్ర‌ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించింద‌ని, త్వ‌ర‌లో దీనిని జిల్లాలో అమ‌లు చేయ‌నున్నామ‌ని చెప్పారు. స‌చివాల‌య స్థాయిలో ఉచితంగా అమ‌లు చేయ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి, వ‌లంటీర్ల ద్వారా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంద‌ని సూచించారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారికి స‌ర్టిఫికేట్‌ను కూడా అంద‌జేస్తామ‌ని చెప్పారు. అలాగే ప్ర‌తీ మ‌హిళా, ఆంగ్ల భాషా ప‌రిజ్ఞానాన్ని పెంచుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

              ఈ స‌మావేశంలో డిఆర్‌డిఏ, వైకెపి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, ఎపిడి సావిత్రి, జిల్లా స‌మాఖ్య అధ్య‌క్షురాలు సిహెచ్ వెంక‌ట‌ల‌క్ష్మి, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, ఇండ‌స్ట్రీస్ జిఎం పాపారావు, ఐసిడిఎస్ పిడి శాంత‌కుమారి, మ‌త్స్య‌శాఖ‌ డిడి నిర్మ‌లాకుమారి, ఉద్యాన‌శాఖ‌ డిడి శ్రీ‌నివాస‌రావు, ఎపిఎంఐపి పిడి ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు, మండ‌ల స‌మాఖ్య‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ముందుగా పిఎంఎఫ్ఎంఇ ప‌థ‌కం గురించి, ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ఎపి ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీస్‌ మేనేజ‌ర్ మారుతి వివ‌రించారు.

Vizianagaram

2022-05-19 08:43:20

మీలోని నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి..

మిష‌న్ నిర్మాణ్ - 2022 పేరిట స్థానిక‌ ఆనంద గజపతి ఆడిటోరియంలో ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌బోయే శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం గురువారం అట్ట‌హాసంగా జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. శిక్ష‌ణ పొందేందుకు హాజ‌రైన విద్యార్థుల‌ను ఉద్దేశించి ఆమె ప్రారంభోపాన్యాసం చేశారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విశ్వాస‌మే ఆయుధంగా నైపుణ్యాల‌కు ప‌దును పెట్ట‌డం ద్వారా చ‌రిత్ర మెచ్చే విజేత‌లుగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. స‌మ‌గ్ర శిక్షా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీషు, ఏస్‌, 21 స్ట్ సెంచ‌రీ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకునేందుకు ఇలాంటి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని, విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. భావిత‌రంలో మీరంతా మంచి స్థానాల్లో స్థిర‌ప‌డడానికి ఇదొక చ‌క్క‌ని వేదికవ‌వుతుంద‌ని, తొలి అడుగులు ఇక్క‌డ నుంచే ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. నేటి పోటీ ప్ర‌పంచంలో నిల‌దొక్కుకోవాలంటే ఆంగ్ల భాష త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. ఆంగ్ల భాష‌పై ప‌ట్టు సాధించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. భ‌యం పోవాల‌ని విశ్వాసం పెర‌గాల‌ని హిత‌వు ప‌లికారు. బిడియం వీడి ధైర్యంగా ఇంగ్లీషు మాట్లాడాల‌ని సూచించారు. ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంపై శ్ర‌ద్ధ పెట్టి ప్ర‌తీ అంశాన్నీ క్షుణ్నంగా నేర్చుకోవాల‌ని చెప్పారు. సందేహాల‌ను నివృత్తి చేసుకొని, నిపుణుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు పొందాల‌ని సూచించారు. ప‌రీక్ష‌లు ముగిసిన‌ నేప‌థ్యంలో విద్యార్థుల సౌక‌ర్యార్థం, సెల‌వుల‌ను స‌ద్వినియోగం చేసుకొనేలా ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌ని అంద‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహకారంతో విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

అనంత‌రం కేంబ్రిడ్జ్ క‌న్స‌ల్టెంట్ భ‌ర‌త్ సుబ్ర‌మ‌ణ్య అయ్య‌ర్‌, కేంబ్రిడ్జ్ ప్ర‌జెంట‌ర్ షీతల్ బందేక‌ర్‌, సివిల్ స‌ర్వీసెస్ సీనియ‌ర్ మెంటార్ అనుకుల రాజ్ కుమార్ విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ ప్రంపంచంలో మిగ‌తా వారితో పోటీ ప‌డి గెలవాలంటే ఇంగ్లీషు భాష‌లో నైపుణ్యం అవస‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఇంగ్లీషు భాష‌లో ప్రావీణ్యం ఉంటే త్వ‌రిత‌గ‌తిన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో స‌మ‌గ్ర శిక్షా అభియాన్‌ అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ వి. అప్ప‌ల స్వామినాయుడు, డీఈవో ఎం. జ‌య‌శ్రీ, డైట్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఎన్.టి. నాయుడు, వివిధ క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, వివిధ పాఠ‌శాల‌ల హెచ్‌.ఎం.లు, అధిక సంఖ్య‌లో విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు. మొద‌టి రోజు శిక్ష‌ణ‌లో భాగంగా ఆంగ్ల భాష ప్రాముఖ్య‌త‌పై, భ‌విష్య‌త్తు అవ‌కాశాల‌పై వివ‌రించారు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంట్ ద్వారా ప‌లు అంశాల‌పై విశ‌దీక‌రించారు. కేంబ్రిడ్జ్ క‌న్స‌ల్టెంట్ భ‌ర‌త్ సుబ్ర‌మ‌ణ్య అయ్య‌ర్‌, కేంబ్రిడ్జ్ ప్ర‌జెంట‌ర్ షీతల్ బందేక‌ర్‌, సివిల్ స‌ర్వీసెస్ సీనియ‌ర్ మెంటార్ అనుకుల రాజ్ కుమార్ ఆంగ్ల భాషపై విద్యార్థుల‌కు త‌ర్ఫీదు ఇచ్చారు. ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలి.. నేర్చుకుంటే భ‌విష్య‌త్తులో ల‌భించే అవకాశాల గురించి సంపూర్ణంగా వివ‌రించారు. విద్యార్థుల‌తో ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అవ‌టం ద్వారా తొలి రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

Vizianagaram

2022-05-19 07:43:17

పుస్తకపఠనం ఉన్నత విద్యకు తొలిమెట్టు

ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం మంచి లక్షణమని,  వేసవి సెలవుల్లో సబ్జెక్ట్ తో పాటు వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి అన్నారు. బుధవారం విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన  వేసవి విజ్ఞాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి  మాట్లాడుతూ ఆటలతో, పాటలతో పాటు ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం మంచి లక్షణమని,  వేసవి సెలవుల్లో సబ్జెక్ట్ తో పాటు మీకు వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్దులకు సూచించారు. వివిధ రకాల పుస్తకాలు చదవడంతో లోక జ్ఞానం వస్తుందన్నారు.  ఈ శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలన్నారు.  జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ కొండా రమాదేవి మాట్లాడుతూ పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్ధులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో గ్రంధాలయ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజటల్ లైబ్రరీ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో విద్యార్దులు టివి, పోన్లలకు భానిసలు కాకుండా సమాజిక విజ్ఞానం పెంపోదించుకోనేందుకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఉపయెగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధీనంలో ఉన్న అన్ని గ్రంథాలయాలలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఈ రోజు నుండి జూన్ 30వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ వేసవి శిబిరంలో కధలు వినుట, చెప్పడం, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దల నుంచి విన్న అముద్రిత కథలు చెప్పుట, చిత్రలేఖనము, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజూ ఉదయం 8.00 గం॥ నుంచి మధ్యాహ్నం 12.00 గం॥ల వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు ఈ వేసవి శిబిరాలకు హాజరై సృజనాత్మకతను పెంచుకొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించవలసినదిగా కోరారు. అలాగే గ్రంథాలయాల్లో త్రాగునీరు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలను గ్రంధాలయాలకు పంపినప్పుడు దగ్గరుండి తీసుకురావాలని తీసుకు వెళ్లాలని  కోరారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మర్ క్యాంపు  గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి వరుదు కళ్యాణి, మత్స్య శాఖ చైర్మన్ కోలగురువులు,  జిల్లా గ్రంధాలయ కార్యదర్శి ఎన్ లలిత, సంబందిత  అధికారులు మరియు పిల్లలు వారి తల్లదండ్రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-18 16:11:39

అభివ్రుద్ధి అవకాశాలకోసమే దావోస్ పర్యటన

ధావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన అన్ని అవకాలను అందిపుచ్ఛుకోవటం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. గురువారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24,25,26 తేదీల్లో ధావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ సదస్సులో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ సదస్సు 18 అంశాల్లో జరుగుతుందని, అందు 10 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొంటున్నట్లుగా మంత్రి తెలిపారు. కోవిడ్ కు ముందు జరిగిన సదస్సుల కంటే కోవిడ్ తదుపరి జరిగే ఈ సదస్సులో మార్పు ఉంటుందన్నారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో వనరులు, అవకాశాలను చూపించే వేదికగా వ్యవసాయ, అధునాతన సాంకేతిక అంశాలలో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వనరులకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో ఐటి ను అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా, బీచ్ ఐటి ను ప్రమోట్ చేసే దిశగా సదస్సులో ప్రస్తావిస్తామన్నారు. ఆంద్రప్రదేశ్ లో విశాఖను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని, అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో స్టార్ట్ఆప్ ఆలోచనలను ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.   రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. విశాఖను రాష్ట్ర ఐటి హబ్ గా తీర్చుదిద్దడం  జరుగుతుందన్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు మల్టీ నేషనల్ కంపెనీ వచ్చిందని,   మరికొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రతినిధులతో చర్చించడం జరిగిందన్నారు. అదే విధంగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో  గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అపూర్వ స్పందన కనిపిస్తుందన్నారు.

Visakhapatnam

2022-05-18 16:08:24

విజయనగరంలో న్యాయసేవపై అవగాహన

రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి న్యాయసేవా సంస్థ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మే 25న కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ జిల్లా యంత్రాంగంతో కలసి నిర్వహిస్తున్న ఒక రోజు శిక్షణ కార్యక్రమం కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బుధవారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మ, సమగ్ర శిక్ష, డ్వామా ఆద్వర్యంలో స్టాల్ లు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తవలసకు చెందిన స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేపట్టాలని ఆర్.డి.ఓ. భవానీ శంకర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. డ్వామా ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, డ్వామా పిడి ఉమా పరమేశ్వరి, పి.డి. మెప్మ సుధాకర్, డి.ఆర్.డి.ఏ. పి.డి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-18 16:06:30

ఉన్నత చదువులకి ఇంగ్లీషు తప్పనిసరి

వేసవి విజ్ఞాన శిబిరం లో భాగంగా రెండవ రోజు బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు, కార్యదర్శి కె.కుమార్ రాజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ ను ప్రాథమిక స్థాయి నుంచే  నేర్చుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఇంగ్లీషు భాషలో మాట్లాడడం వ్రాయుటము వంటివి చేయాలన్నారు. విద్యార్థులతో జాతీయ నాయకుల పుస్తకాలను చదివించారు. కొంతమంది విద్యార్థులు తమకు తెలిసిన కథలను చెప్పారు. మరికొంత మంది విద్యార్థులు దేశభక్తి గేయాలు పాటల రూపంలో పాడారు. 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లో డిప్యూటీ లైబ్రేరియన్ జి.తిరుమల కుమారి, గ్రంథాలయ సిబ్బంది చిరంజీవులు, యోగానంద్, పి.ఈశ్వరరావు, టి.రాంబాబు, పి.రామమోహన్, పి.భానుమతి, ప్రత్యూష, గణేష్ తదితరులు పాల్గోన్నారు.

Srikakulam

2022-05-18 15:01:11

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ప్రజా జీవితంలో ప్రజా ప్రతినిధులు సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిన్న జీయర్ స్వామి వారిని గోదావరి నదీ తీరాన గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి వెంట రాజా నగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు కర్రీ పాపా రాయుడు, ఆకులవీర్రాజు తదితరులు ఉన్నారు. 

Rajahmundry

2022-05-18 13:40:25

టిఎంఎఫ్ ప్రాజెక్ట్ లో ఉద్యోగ అవకాశాలు..

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లాలో పాఠశాల పారిశుద్ధ్య కార్యక్రమం అమలు చేసేందుకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసిటన్టు జిల్లా విద్యాశాఖ అధికారి డా. పి రమేష్ తెలిపారు. పిఎంయు లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయుటకు ఒక ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించినందున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.  పథక సమన్వయకర్త (ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్)  పోస్టుకు దరఖాస్తు చేయదలచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండి పాఠశాల లేదా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో సహాయ సంచాలకులు లేదా పర్యవేక్షకులు లేదా ప్రధానోపాధ్యాయులుగా పని చేసి పదవీ విరమణ పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, వారికి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేయదలచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ మరియు ఎంఎస్ ఆఫీస్ నందు,  తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ లో నైపుణ్యం కలిగి ఉండాలని, వారికి నెలకు 18500 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు.  జిల్లా విద్యాశాఖ లో పనిచేయుచున్న సహాయ సంచాలకులు, ఉప విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా మాన్ పవర్, ఔట్సోర్సింగ్ కమిటీకి పంపి, కమిటీ ఆమోదంతో అవుట్ సోర్సింగ్ విధానం లో  నియామకం జరుగుతుందని డిఇఓ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి, సంబంధిత ధ్రువ పత్రాలు జతపరచి పూర్తి వివరాలతో దరఖాస్తును ఈనెల 25వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నేరుగా గాని పోస్టు ద్వారా గాని సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలు, సందేహ నివృత్తి కోసం కార్యాలయ పని వేళల్లో 8309994622 లేదా 9441328097 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. 

Paderu

2022-05-18 13:28:21

ఇక డా.భీఆర్.అంబేత్కర్ కోనసీమ జిల్లా

కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్. అంభేత్కర్ జిల్లాగా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ ప్రాంతీయుల చిరకాల కోరిక తీరినట్టు అయ్యింది..

కోనసీమ

2022-05-18 13:24:00

మిషన్ నిర్మాణ్ ను వినియోగించుకోండి..

మిష‌న్ నిర్మాణ్ - 2022 పేరిట ఐదు రోజుల పాటు స్థానిక‌ ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో వివిధ అంశాల‌పై నిపుణుల చేత ప్ర‌త్యేక‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. విద్యార్థుల‌కు ఇదొక సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని అంద‌రూ సద్వినియోగం చేసుకోవాల‌ని బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా సూచించారు. స‌మ‌గ్ర శిక్షా అభియాన్ ప‌ర్య‌వేణ‌లో కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీషు, 21 సెంచ‌రీ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ, ఏసీఈ సంస్థ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. కెరియర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్ర‌త్యేక‌ వర్క్ షాప్‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి రోజూ ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కేంబ్రిడ్జ్  విశ్వవిద్యాలయం సర్టిఫై చేసిన శిక్షకులతో ప్రత్యేక‌ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు చ‌దివే విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌వ‌చ్చ‌ని ఆస‌క్తి క‌లిగిన వారు వివ‌రాల‌ను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాల‌ని సూచించారు. ఇత‌ర వివ‌రాలకు 90002 04925, 90002 01525 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ్చ‌ని చెప్పారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు స‌మ‌గ్ర శిక్షా అభియాన్ పీవో స్వామినాయుడు తెలిపారు.

Vizianagaram

2022-05-18 12:56:03