1 ENS Live Breaking News

జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూన్ 1వ తేదీన జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జూన్ 2వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. జూన్ 2వ తేదీ ఉదయం 10-30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు మార్పును గమనించి, మార్పు చేసిన తేదీరోజు అన్ని రకాల రికార్డులతో తప్పనిసరిగా  హాజరు కావాలని కోరారు. 

Vizianagaram

2022-05-31 11:01:15

భారత్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తోంది

దేశమంతా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రధాని నరేంద్రమోడి సారధ్యంలో భారత దేశం అన్నిరంగాలలో శక్తివంతంగా రూపొందుతోందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, ఆయుష్ మంత్రి శర్వానంద సోనోవాల్ పేర్కొన్నారు.  మంగళవారం నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన పేదల సంక్షేమ సమ్మేళనం  (వీడియో కాన్ఫరెనన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సంక్షేమ పథకాల పై లబ్దిదారులతో సంభాషణ) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులందరూ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి  చేందేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు.  అందరికీ సామాజిక న్యాయం జరిగేలా బడుగు బలహీన వర్గాల వారికి చేయూత నందిస్తున్నట్లు చెప్పారు.  తద్వారా మన దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారబోతోందన్నారు.  అదే విధంగా విశాఖపట్నం ప్రపంచానికే గమ్యనగరంగా నిలుస్తుందన్నారు.  ప్రధానికి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక అభిమానమని, రాష్ట్ర విభజన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు.  ఆత్మనిర్బర్ భారత్ ధ్యేయంగా ప్రధాని సారధ్యంలో అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.  కేంద్ర రాష్ల్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులు, మహిళలు, యువతకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు. 
రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి.శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి 8 సంవత్సరాల పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు.  కేంద్రం అందిస్తున్న రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.7 వేలు కలిపి మొత్తం రూ. 13 వేలు రైతుభరోసా అందిస్తున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులకు ఆర్ధికంగా లబ్ది చేకూరుతుందన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం  వారు వ్యవసాయానికి అప్పు చేయనవసరం లేకుండా ప్రభుత్వమే రైతుకు పెట్టుబడికి అందజేస్తున్నట్లు తెలిపారు. 
తరువాత ప్రధాన మంత్రి సంక్షేమ పథకాల మూలంగా లబ్ది పొందిన మహిళలు తమ అనుభవాన్నితెలియజేస్తూ మాట్లాడారు.  తమకు అందిన పథకం ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందినదీ తెలియజేశారు.  రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు, శాసన మండలి సభ్యులు పి.వి.మాధవ్, 
అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాని పాల్గొన్న కార్యక్రమం ప్రసారాన్ని అందరూ విక్షించారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి అవాజ్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ మరియు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్ భారత్ పి.ఎం.జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పధకాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల లబ్దిదారులతో వర్చువల్ విధానంలో  ప్రధానమంత్రి మాట్లాడారు. జగనన్న రైతుభరోసా (పి.ఎం.కిసాన్ యోజన) అనకాపల్లి జిల్లాకు సంబంధించి రూ. 43 కోట్ల, 45 లక్షల చెక్కును, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి  రూ.4కోట్ల 62 లక్షల చెక్కును  ఆయా జిల్లాల మహిళా రైతులకు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపి డాక్టర్ బి.వి.సత్యవతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, సునీల్ దేవ్ ధర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పోర్టు ఛైర్మన్  రామ్మోహన్ రావు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఏ.మల్లికార్టున, రవి పట్టన్ శెట్టి, జాయింట్ కలెక్టర్లు కె.ఎస్.విశ్వనాధన్, కల్పనాకుమారి జివియంసి కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. 

Anakapalle

2022-05-31 10:58:35

ఆరోగ్య సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి

శ్రీకాకుళం జిల్లాలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది, ఎం.పి.హెచ్.ఇ.ఓలు, ఆడ, మగ సూపర్ వైజర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి సిబ్బందికి తెలియజేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి హెచ్చరించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో సిహెచ్ఓలు,ఎం.పి.హెచ్.ఇ.ఓలు, సూపర్ వైజర్లతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తగ్గుముఖం పట్టాయని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలలో కూడా వెనుకబడి ఉందని ఆమె స్పష్టం చేసారు. మరో 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని, నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక ఆసుపత్రులలో వైద్యాధికారులతో పాటు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసారు. ప్రతి సూపర్ వైజర్ ఏఎన్ఎంతో కలిసి తమ పరిధిలో గర్భిణీ స్త్రీల వివరాలను సేకరించి ప్రతి వారం ఐరన్ మాత్రలు అందించాలని, అలాగే వైద్యులు నెలలో ఒకసారి తనిఖీ చేసి వారికి అవరసమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జె.ఎస్.వై ( జననీ సురక్ష యోజన ) మరియు పి.ఎం.ఎం.వి.వై ( ప్రధానమంత్రి మాతృ వందన యోజన ) పథకాల పట్ల గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జననీ సురక్ష యోజన క్రింద గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలకు రూ.1000/-లు, పి.ఎం.ఎం.వి.వై క్రింద రూ.5వేలు ప్రభుత్వం అందిస్తున్న సంగతిని ప్రతి గర్భిణీకి తెలియజేయాలన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వసతుల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేనందునే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని, ఇకమీదట ప్రతి గర్భిణీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునేలా చైతన్యపరచాలని, ఆ దిశగా వైద్యాధికారులు, వైద్యసిబ్బంది కృషిచేయాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు టి.టి ఇంజిక్షన్లు ఇచ్చేలా చూడాలని, బిడ్డ పుట్టిన వెంటనే పోలియో చుక్కలు, హెపటైటిస్ – బి తప్పనిసరిగా వేయాలని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాలంటరీ వ్యవస్థ నేడు ఉందని, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు సమన్వయంతో ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీల వివరాలతో పాటు ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. హెల్త్ సూపర్ వైజర్లు తమ పి.హెచ్.సి పరిధిలో గల గృహాలను సందర్శించి ఎన్.సి.డి ( నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ) పై వివరాలు సేకరించాలని అన్నారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చేపట్టిన వివరాలు రోజువారీ అందించాలని, లేనిఎడల హాజరుకానట్లుగా పరిగణిస్తామని ఆమె అన్నారు. వచ్చే 10 రోజుల్లో అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్నింటా మంచి స్థానంలో నిలిపేందుకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఎస్.ఓ నాగేశ్వరరావు, డెప్యూటీ ఎస్.ఓ శ్రీనివాస పట్నాయక్, జిల్లా ప్రోగ్రామ్ అధికారి వి.వి.అప్పల నాయుడు, రవికుమార్, కె.నారాయణరావు,  వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-31 07:38:39

పొగాకు వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలి

పొగాకు వినియోగం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మంది మరణిస్తు న్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని, కావున ప్రతీ ఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండా లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి జిల్లా ప్రజలకు సూచించారు. మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీ కార్యక్ర మాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కళావేదిక వద్ద మంగళవారం నిర్వహించింది.  ఈ కార్యక్ర మానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీకి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభిం చారు. పొగకుతో పర్యావరణానికి ముప్పు అనే నినాదంతో అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీలో పాల్గొని మొక్కలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకుతో వచ్చే ప్రమాదాలు గురించి తెలిసినప్పటికీ యువత ధూమపానానికి అలవాటు పడుతున్నారని, ఇది ప్రాణాంతకమని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కోరారు. పొగాకు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశముందని ఆమె గుర్తుచేసారు. పొగాకు వినియోగం వలన వచ్చే సమస్యలను ప్రజలకు వివరించడమే కాకుండా, వాటికి దూరం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పొగాకు రహిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. కావున యువత పొగాకు వినియోగానికి దూరంగా ఉంటూ తమతో పాటు తమ తోటి వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటును అందించాలని ఆమె అభిలషించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, రవిప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-31 07:37:46

కనకమహాలక్ష్మి అమ్మకు ఆర్జిత సేవలు..

విశాఖలోని బురుజుపేట వెలసివున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు జరుగు తున్న ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుం దని, ఇందుకు భక్తుల తాకిడి నిదర్శనంగా పేర్కొనవ చ్చు అని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవా రిని దర్శించుకున్న శ్రీనుబాబు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లిగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కనకమహా లక్ష్మి అమ్మవారు ఎంతో ప్రసిద్ధి గాంచారన్నారు. అమ్మవారిని దర్శించుకునీ
సేవించు కొన్నవారికి 
అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గా శ్రీను బాబుఅభివర్ణించారు. ఈ కార్యక్రమంలో

Visakhapatnam

2022-05-28 06:19:20

సకాలంలో కోవిడ్ వేక్సినేషన్ పూర్తిచేయాలి

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జె నివాస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, అర్హులైన అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా విస్తృతంగా స్ప్రేయింగ్ చేయాలని సూచించారు. గతంలో ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో స్ప్రేయింగ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. నవంబరు, డిసెంబరు సమయంలో నిమోనియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని వాటిపై అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సూత్రాలు, అంటువ్యాధులపై సంతలలో అవగాహన కల్పించుటకు చర్యలు చేపట్టామని తెలిపారు. పౌష్టికాహార కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వాటికి నిధులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-26 09:37:17

రీసర్వే, మ్యూటేషన్ సకాలంలో పూర్తి చేయండి

జగనన్న భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో భూముల రీ సర్వేను వేగవం తంగా చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లను సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ ఆదేశించారు. గురువారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుండి జగనన్న భూ హక్కు - భూరక్ష పథకం అమలు అంశంలో భాగంగా డ్రోన్ సర్వే, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మ్యూటేషన్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డీ.కె బాలాజీ, సర్వే అధికారులు పాల్గొన్నారు. సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ...భూమి రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని స్వచ్ఛమైన.. శాశ్వత భూమి రికార్డులను రూపొందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లకు సూచించారు. జగనన్నభూ సర్వేపై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలను కారణాలు లేకుండా తిరస్కరించరాదని ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం చేయాలన్నారు. డ్రోన్ సర్వే, భూమి కొలతలు, భూమి హద్దులు  ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మ్యూటేషన్, రీ సర్వే పనుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి తరచూ సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి వివరిస్తూ జగనన్న భూ హక్కు - భూరక్ష పథకంలో భాగంగా  డ్రోన్ సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో 34 మండలాలలో 1050  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని అందులో నాలుగు డివిజన్లలో 52 గ్రామాలలో ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేశామని, మిగిలినవి నిర్దేశించిన సమయం మేరకు పూర్తి చేస్తామని తెలిపారు. 

Tirupati

2022-05-26 09:19:34

ఆసుపత్రి పనులు ప్రారంభం కావాలి

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంజూరైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపీఎంఎస్ ఐడిసి ఇంజనీర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, సంబంధిత అధికారులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి ఎదురుగా ఉన్న వెటర్నరీ క్లినిక్ ను సిఆర్పిఎఫ్ బరాక్ వద్దకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. బరాక్ కు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆయన సూచించారు. పోలీస్ క్వార్టర్స్ కొంత మేర తొలగించాల్సి ఉంటుందని, వాటిని తొలగించి స్థలాన్ని చదును చేసి తక్షణం పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్వతిపురంలో 49 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసిన సంగతి విదితమే.  మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఐదు విభాగాలతో పాటు వంద పడకలు రానున్నాయి. దీంతో మన్యం జిల్లా కేంద్రంలో ఇప్పటికే మంచి సేవలు అందిస్తున్న జిల్లా ఆస్పత్రికి అదనంగా మరో మంచి మౌలిక వసతి కలగడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ చికిత్సలు లభ్యం కానున్నాయి. 

దీన్ని త్వరగా నిర్మించి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం వైద్య సేవలకు మకుటాయమానంగా నిలవాలని నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లో జిల్లా ఆసుపత్రి తనిఖీలో భాగంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షించడమే కాకుండా వెటర్నరీ క్లినిక్ ను తరలిస్తున్న సిఆర్పిఎఫ్ బారక్ ను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు బరాక్ కు చేపట్టాల్సిన మరమ్మతులపై ఏపీఎంఎస్ ఐడిసి ఇంజినీర్లు పరిశీలించారు.  ఈ సమీక్ష సమావేశంలో ఏపీఎస్ఎంఐడిసి పర్యవేక్షక ఇంజినీర్ కె.శివ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ ఏం.సూర్య ప్రభాకర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసన్న కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-26 09:11:07

సమాజసేవకు మరింగా ముందుకి రావాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని అన్ని స‌దుపాయాల‌తో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సేప్టీ సపోర్ట్ అంబులెన్స్‌ను ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా జిల్లాకు స‌మ‌కూర్చింది. రూ.30 ల‌క్ష‌ల సీఎస్ఎర్ నిధుల‌తో జిల్లాకు కేటాయించిన ప్ర‌త్యేక‌ అంబులెన్స్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ సౌత్ రీజియ‌న్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ కుమార్‌తో క‌లిసి గురువారం ప్రారంభించారు. ముందుగా అంబులెన్స్ లోప‌ల క‌ల్పించిన స‌దుపాయాల‌ను, ప్ర‌త్యేక‌ వెంటిలేట‌ర్‌, స్ట్రెచ‌ర్‌, ఆక్సిజ‌న్ మానిట‌ర్ త‌దిత‌ర ప‌రిక‌రాల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించ‌గా దీనిలో క‌ల్పించిన స‌దుపాయాల గురించి వైద్యులు ఆమెకు వివ‌రించారు. మిగ‌తా వాటికంటే అడ్వాన్స్‌డ్ స‌దుపాయాల‌తో కూడిన అంబులెన్స్ అని దీని స‌హ‌కారంతో త్వ‌రిత‌గతిన సేవ‌లందించ‌వ‌చ్చ‌ని, ఆక్సిజ‌న్ బెడ్‌పై ఉన్న రోగుల‌ను కూడా ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించ‌వ‌చ్చని చెప్పారు. 

అనంత‌రం ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఈడీ, రెడ్ క్రాస్ సొసైటీ ప్ర‌తినిధులతో క‌లిసి స్థానిక క‌లెక్ట‌రేట్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నుంచి క‌లెక్ట‌ర్ జెండా ఊపి అంబులెన్స్‌ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు. క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ జిల్లా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని మాన‌వ‌తా దృక్ప‌థంతో అంబులెన్స్ ను కేటాయించటం అభినంద‌నీయ‌మ‌ని, ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ వారికి ధ‌న్యావాదాలు తెలుపుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. జిల్లాలో రిఫ‌రెల్ కేసులో ఎక్కువ‌గా ఉండే ఎస్‌. కోట‌, ఎల్‌. కోట‌, కొత్త‌వ‌ల‌స ప‌రిధిలోని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఈ అంబులెన్స్‌ అందుబాటులో ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెడ్ క్రాస్ సొసైటీ ప్ర‌తినిధుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ ప‌ద్మావ‌తి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్‌ కె.ఆర్‌.డి. ప్రసాద‌రావు, రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, సీతం కళాశాల యూత్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-26 08:14:07

సచివాలయాలపై ప్రజలకు నమ్మకం పెంచాలి

సచివాలయానికి  సమస్యల  తో వచ్చేవారికీ సరైన పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరుకు అద్దం పట్టేలా సచివాలయ  వ్యవస్థ పని చేస్తోందని, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు.   కలెక్టరేట్ ఆడిటోరియం  లో బుధవారం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నున్న  వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి,  విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల  వీరభద్ర స్వామి హాజరయ్యారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతి పాదనలు పంపుతున్నామని,  ఉద్యోగులు ఇంకా ఉత్తేజంగా, చిత్తశుద్ధి తో  పని చెయ్యాలని అన్నారు.  కార్పొరేషన్ పరిధి లో రెవిన్యూ కలెక్షన్ లో, సిటిజెన్ అవుట్ రీచ్ లో ముందున్నామని, అయితే ఇంకా అనేక సేవలలో మెరుగు పడాల్సి ఉందని పేర్కొన్నారు.  చేసే పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అప్పడే పూర్తిగా మనసు పెట్టి చేయగలమని అన్నారు.  ఎందరికో రానటువంటి  అవకాశం మీకు వచ్చిందని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి క్రమ శిక్షణ తో పని చేయాలనీ హితవు పలికారు.,  పదవి తో సంబంధం లేకుండా  శాసన సభ్యులు కోలగట్ల నిత్యం  ప్రజలతో మమేకం అవుతూ ప్రజా  సమస్యలు వారే స్వయంగా పరిష్కరిస్తున్నారని, అందుకోసం వారిని ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు.  మంచి పని చేసే వారిని  ఏ ఒక్కరూ అడ్డుకోరని , ఎంతైనా చేయవచ్చని, అది పది మందికి ఉపరించేలా ఉండాలని అన్నారు.  జాబు చార్ట్ లోని పనులే కాకుండా వినూత్నంగా అలోచించి ప్రజలకు మేలు చేసే పని దేనినైనా స్వాగతిస్తామని తెలిపారు. 

శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించి, పారదర్శకంగా , ప్రతిభను ప్రాతిపదికగా తీసుకొని సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టారని, మీ ప్రతిభను ప్రజా సమస్యల పరిష్కారం లో చూపించాలని అన్నారు.  ఎంతో నమ్మకం తో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రారంభించారని, ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించాలని అన్నారు.  సచివాలయ వ్యవస్థకు తోడుగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసారని , ప్రజలతో మమేకం అయి, అందరిని కలుపుకొని  పని చేయాలనీ అన్నారు.  పాలన అనేది నిరంతర ప్రక్రియ అని, బాధ్యతాయుతంగా నడిపిస్తే  వ్యవస్థ చక్కగా నడుస్తుందని అన్నారు. జిల్లా కలెక్టరు గా చేరిన నుండి సూర్య కుమారి గారు  కఠినంగా వ్యవహరిస్తూ  అలసత్వాన్ని సహించేది లేదంటూ జిల్లా పాలనను గాడిలో పెట్టారని తెలిపారు.  కలెక్టరు, కమీషనర్ మాత్రమే  బాధ్యత తీసుకుంటే కుదరదని, ప్రతి ఉద్యోగి వారి బాట లో నడిచి విధి నిర్వహణ లో చిత్తశుద్ధి కనపరచాలని అన్నారు.  అంతే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా కలుపుకొని వెళ్ళాలని  అప్పుడే ప్రజలకు అవసరమగు సేవలు అవసరమైనపుడు అందుతాయని పేర్కొన్నారు.  క్రింది స్థాయి వారితో మాట్లాడడం తక్కువని  భావించరాదని,  సేవ చేసే అవకాశం రావడమే అదృష్టమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్  ఆర్.శ్రీ రాములు నాయుడు మాట్లాడుతూ వార్డు సచివాలయ సిబ్బందికి అవసరమగు శిక్షణలు అందిస్తూ ,  వారి సేవల పర్యవేక్షణకు నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసామన్నారు.  ప్రజామోద యోగ్యమైన సేవలందించేలా వ్యవస్థను తీర్చి దిద్దుతామని అన్నారు.  సహాయ కమీషనర్ ప్రసాద్  పవర్ పాయింట్ పై సచివాలయ ఉద్యోగుల  సేవలు, స్పందన వినతుల పరిష్కారం ,  ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాల పై వివరించారు. మున్సిపల్ ఇంజనీర్ దిలీప్, ఇతర సెక్షన్ హెడ్స్, ప్లానింగ్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. హైద్రాబాద్ నుండి వచ్చిన  సుధీర్ ఈ శిక్షిణా కార్యక్రమంలో మొటివేశనల్ తరగతి నిర్వహించారు.

Vizianagaram

2022-05-25 13:17:06

14న అప్పన్నకు 3వ విడత చందన సమర్పణ

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి వచ్చేనెల 14న మూడో విడతగా 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు  తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం సింహాద్రి నాధుడునీ దర్శించుకున్న శ్రీను బాబు స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. అప్పన్నకు చందనం సమర్పించేందకు చేపట్టే అంశాలను వివరించారు. జేస్ట  పౌర్ణమిని పురస్కరించుకొని ఆ రోజు 3 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారన్నారు. ఇప్పటికే చందనోత్సవం రోజు రాత్రికి మూడు మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించగా, ఆ తర్వాత వచ్చే వైశాఖ పౌర్ణమికి మరో మూడు మనుగులు చందనము (ఇప్పటి వరకుమొత్తం 250 కేజీలు) స్వామికి సమర్పించినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చే  ఆషాడ పౌర్ణమికి మిగిలిన మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారన్నారు. ఏడాదిలో నాలుగు విడతలుగా 12 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఆ తర్వాత వచ్చే శ్రావణ పౌర్ణమినీ  పురస్కరించుకుని కరాళ చందన సమర్పణ ఉంటుందన్నారు,, మూడో విడత కు అవసరమైన చందనాన్ని త్వరలోనే సిబ్బంది అరగదీస్తారని  చెప్పుకొచ్చారు. సింహగిరి పై జరుగుతున్న ఆర్జిత సేవలకు భక్తులు నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం స్వామివారికి ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యకల్యాణం, గరుడసేవ, లక్ష్మీనారాయణ వ్రతం, స్వర్ణపుష్పార్చన, స్వర్ణ తులసీదలార్చనతో పాటు అన్నప్రాసన ,అక్షరాభ్యాసం సేవలు అందుబాటులో ఉన్నట్లు శ్రీను బాబు వివరించారు. వీటిని భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని స్వామివారి సేవలో తరలించాలని మీడియా ద్వారా భక్తులను కోరారు.

Simhachalam

2022-05-25 08:38:40

బాధితులకు పరిహారంపై అవగాహన

విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో "బాధితులకు పరిహారం" అనే అంశం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బార్ అసోసియోషన్  లైబ్రేరి హాల్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా జిల్లా జడ్జ్ మరియు జిల్లా  లీగల్ సర్వీసెస్  అదారిటీ చైర్మన్ గౌ.ఎ.హరిహరనాధ శర్మ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాధులు భాదితులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్ర్రమంలో  రెండోవ అదనపు జిల్లా జడ్జి  ఎస్.శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. వి.రవీంద్ర ప్రసాద్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఎస్.కృష్ణమోహన్, బార్ అసోసియేషన్ కార్యదర్శి .వేణుగోపాల్, జిల్లా న్యాయ సేవాదికర సంస్ధ కార్యదర్శి  కె. కె. వి. బుల్లి కృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  శైలజ, ప్యానల్ అడ్వకేట్  ఆర్.శ్రీనివాస రావు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-24 14:25:54

క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి

క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారులు,  మున్సిపల్ కమిషనర్లు,  తాహాసిల్దార్లు, ఎంపీడీవో లు పర్యటించి ఇంటి నిర్మాణాలు పనులను వేగవంతం చేయాలని ఈ విషయంలో మరో మాటకు తావులేదని జిల్లా కలెక్టర్ కె. మాధవిలత స్పష్టం చేశారు. మంగళవారం క్షేత్రస్థాయి అధికారులతో ఓటిఎస్ , ఇళ్ల నిర్మాణాలు పై  కలెక్టర్  టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత సమీక్షిస్తూ మండలాల్లో ఇళ్ల నిర్మాణాల వారం వారం లక్ష్యాలను వేగవంతం చేయాలన్నారు. తాసిల్దార్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పాలన్నారు.  ప్రతి 15 రోజులకు ఒకసారి  ముఖ్యమంత్రి ,  ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటి నిర్మాణాలపై కలెక్టర్లతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్స్  అధికారులు వారి పరిధిలో గల ప్రతి మండలం లోని  లేఅవుట్లలో తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని లేఅవుట్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్  ఆర్డీవో మల్లిబాబు ను  ఆదేశించారు. నిడదవోలు మునిసిపాలిటీ పరిధిలో 990 పైగా ఇల్లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 58పనులు ప్రారంభం అయి, మిగిలినవి  కాకపోవడంపై ప్రశ్నించారు.  మునిసిపల్ వార్డు సచివాలయం  పరిధిలో కనీసం వారానికి 10 ఇల్లు ప్రారంభించాలని ఇందుకు సిబ్బందికి లక్ష్యాలను విధించాలన్నారు. 

ప్రతి వారం 30 ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సచివాలయం పరిధిలో 5 ఇళ్లు ప్రారంభించేలాగా తాహాసిల్దార్ లు, ఎంపీడీవోలు హౌసింగ్ అధికారులతో సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు. జగనన్న లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీలు అందుబాటులో ఉంచుతున్నందున పనులు వేగవంతం చేయాలన్నారు. డిఆర్డిఎ, మెప్మా  స్వయం సహాయక మహిళలకు  ప్రభుత్వం అందించే రూ.15 వేలకు అదనంగా మరో రూ.35 రుణాన్ని మంజూరు చేసి, ఇంటిని నిర్మించేందుకు ముందస్తు చేయూత ను ఇస్తున్నామని, ఆ మొత్తంతో ఎటువంటి జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్ట గలుగుతామన్నారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ,  లబ్ధిదారులకు ఓటీఏస్ ద్వారా చేకూరే ప్రయోజనాలు వివరించి లక్ష్యాలను సాధించాలన్నారు.  అదే విధంగా ఎంపిడివోలు, తహశీల్దార్లు, హౌసింగ్ ఆధికారులు సమన్వయం తో పనిచేస్తు లాక్ష్యాలను అధిగమించాలన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్,నగరపాలక సంస్థ  కమీషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఏ.చైత్రవర్షిని, ఎస్.మల్లిబబాబు, తాహసిల్దార్లు, ఎంపిడీవోలు తదితరులు. పాల్గొన్నారు.

Rajahmundry

2022-05-24 11:44:46

3ఏళ్ల సమస్యకు శాస్వత పరిష్కారం

వంశధార డిస్ట్రిబ్యూటరీ - 5 కాలువ పనులకు మూడు సంవత్సరాల తరువాత పరిష్కారం లభించింది. వివరాలను పరిశీలిస్తే  భామిని మండలం పెద్ద దిమిలి గ్రామానికి సమీపంలో డిజైన్ ప్రకారం వంశధార వరద కాలువ నిర్మాణం జరగాలి. అయితే పెద్ద దిమిలి గ్రామస్తులు కాలువ నిర్మాణం వలన గ్రామంలో చెమ్మ వస్తుందని, కాలువలో ప్రమాదాలు జరగవచ్చని వివిధ సందేహాలతో గత మూడేళ్లుగా నిర్మించకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు వారికి పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ ససేమిరా అన్నారు. గ్రామం సమీపంలో నిర్మించాల్సిన దాదాపు ఆరు వందల మీటర్ల కాలువ మినహా మిగిలిన 1.20 కీలో మీటర్ల మేర నిర్మించారు. ఇంతలో జిల్లాల విభజన జరగటం, భామిని మండలం శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం మన్యం జిల్లాలో చేరడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల గూర్చి సమీక్షలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఈ అంశాన్ని తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించి దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. పెద్ద దిమిలి గ్రామస్తులతో మాట్లాడాలని నిర్ణయించి మంగళ వారం ఒక సమావేశాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత సమక్షంలో సమావేశం జరిగింది. గ్రామస్తుల సంశయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆలకించారు. వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలో చెమ్మ రాకుండా అవసరమగు సిమెంట్ కట్టాడాలు నిర్మిస్తామని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సాగు నీరు పారుదలకు సహకరించాలని కోరారు. వంశధార రాష్ట్రంలో ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టు అని, అటువంటి ప్రాజెక్టును చిన్న కారణాలతో నిలిపివేయడం సరికాదని సూచించడంతో గ్రామస్తులు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీనితో మూడు సంవత్సరాలుగా సాగుతున్న సమస్య యువ అధికారుల చొరవతో సానుకూలంగా పరిష్కారం జరిగి ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టుకు జిల్లాలో సజావుగా పనులు సాగుటకు అవకాశం కలిగింది. గ్రామంలో అవసరాలు గుర్తించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో పాలకొండ డిఎస్పి శ్రావణి, వంశధార కార్యనిర్వాహణ ఇంజినీర్ ఎం.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 11:40:53

యువత మాత్రుభూమిని మరువకూడదు

నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉన్నతవిద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. యువత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2025 నాటికి దేశంలో 1.2 కోట్ల మంది యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. దేశ భవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని అన్నారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి దేశ విదేశాలకి వెళ్తారని, ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని, సామాజిక బాధ్యతని తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు మల్లారెడ్డి వర్సిటీ ఛాన్సిలర్ డీఎన్ రెడ్డి), వీఎస్ యూ వైస్ ఛాన్సిలర్ సుందరవల్లి, రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి హాజరయ్యారు.

Nellore

2022-05-24 11:34:48