1 ENS Live Breaking News

ఇష్టంతో చదవితే విజయం మీ సొంతం

ఇష్టంతో చదివితే విజయం మీదేనని జిల్లా కలెక్టర్ నిశాంత్ అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మండలం పెద బొండపల్లి పాఠశాలలో మంగళ వారం విద్యా శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టంతో చదువాలని అప్పుడు పేదరికం, ఆకలి అనే ఏది ఆటంకంగా నిలువలేవన్నారు. శ్రమ నీ ఆయుధం కావాలని... అప్పుడు విజయం నీ వెన్నంటి నిలుస్తుందని చెప్పారు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఉన్నత లక్ష్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ఆశయాలు ఉండాలి... వాటిని సాధించాలని ప్రేరణ కల్పించారు. చదువుతో కుటుంబ సామాజిక, ఆర్థిక హోదా మారుతుందని ఆయన అన్నారు. పేదరికం నుండి బయట పడాలంటే చదువు ద్వారా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. చదువుతో విజ్ఞానం, సామాజిక స్పృహ కలుగుతుందని ఆయన పేర్కొంటూ పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తుందని వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు.

 పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి పోటీతత్వం అలవరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్న దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగా నాడు నేడు పనులు కింద పాఠశాలలో ఆధునీకరణ, పేద విద్యార్థికి విద్యను అందించే విధంగా అమ్మఒడి పథకం, జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులకు ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కష్ట తరంగా ఉండేదని, కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తోనే సాధ్యమైందని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సాఫ్టు స్కిల్స్, బృంద చర్చలు అలవరచి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సుమారు రూ.931 కోట్ల జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయగా జిల్లాలో విద్యార్థులకు రూ.20 కోట్ల విలువైన కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  ప్రతీ విద్యార్థికి దాదాపు రూ.2వేలు విలువైన జగనన్న విద్యా కానుక క్రింద పాఠశాల తెరచిన రోజు నుండే ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. 

పార్వతీపురం మన్యం జిల్లాలో 1,03,883 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించడం జరుగుతుందన్నారు. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం క్రింద మూడు జతల బట్టలు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, రెండు జతర సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, జత బూట్లు, డిక్షనరీలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బలిజిపేట మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 56 పాఠశాలల్లోని 4,635 మంది విద్యార్థులకు, భామిని మండలంలో ఐదు స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 66 పాఠశాలలలోని 5,355 మంది విద్యార్థులకు, గుమ్మలక్ష్మీ పురం మండలంలో 9 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 172 పాఠశాలల్లోని 9,023 మంది విద్యార్థులకు, గరుగుబిల్లి మండలంలో ఐదు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 57 పాఠశాలల్లోని 4,612 మంది విద్యార్థులకు, జియ్యమ్మ వలస మండలంలో ఏడు స్కూలు కాంప్లెక్స్ ల కింద 95 పాఠశాలల్లోని 5,284 మంది విద్యార్థులకు, కొమరాడ మండలంలో ఏడు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 127 పాఠశాలల్లోని 6,093 మంది విద్యార్థులకు, కురుపాం మండలంలో పది స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 177 పాఠశాలల్లోని 7,835 మంది విద్యార్థులకు, మక్కువ మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ కింద 80 పాఠశాలల్లోని 5,458 మంది విద్యార్థులకు, పాచిపెంట మండలంలో తొమ్మిది స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 121 పాఠశాలల్లోని 7,496 మంది విద్యార్థులకు, పాలకొండ మండలంలో ఏడు స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 60 పాఠశాలల్లోని 5,822 మంది విద్యార్థులకు, పార్వతీపురం మండలంలో 11 స్కూల్ కాంప్లెక్స్ లో కింద 116 పాఠశాలల్లోని 10,493 మంది విద్యార్థులకు,  సాలూరు మండలంలో 12 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 177 పాఠశాలల్లోని 11,849 మంది విద్యార్థులకు, సీతంపేట మండలంలో 15 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 163 పాఠశాలల్లోని 10,076 మంది విద్యార్థులకు, సీతానగరం మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ కింద 64 పాఠశాలల్లోని 4,445 మంది విద్యార్థులకు, వీరఘట్టం మండలంలో ఆరు స్కూలు కాంప్లెక్స్ ల క్రింద 62 పాఠశాలల్లోని 5,407 మంది విద్యార్ధులకు వెరసి 121 స్కూల్ కాంప్లెక్స్ కింద 1593 పాఠశాలల్లోని 1,03,883 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయడం జరిగింది. ఇందులో 52,195 మంది బాలురు, 51,668 మంది బాలికలు ఉన్నారని వివరించారు. 

శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక చిన్నారులకు వరం అన్నారు. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు తీసిపోని విధంగా  చిన్నారులు తరగతులకు హాజరు కావాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అన్నారు. అందుకే ఎనిమిది వస్తువుల కలయికతో కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. టై, బూట్లు, బ్యాగుతో సహా అందించడం జరుగుతుందని దానితో పిల్లవాని రూపు రేఖలు మారిపోతుందని అన్నారు. బిడ్డలను చూసి తల్లులు మురిసిపోతున్నారని చెప్పారు. పాఠశాలలో చదువుతున్న అశ్వని అనే బాలిక మాట్లాడుతూ జగనన్న కానుక కిట్లు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాన్వెంట్లకు వెళ్ళే పిల్లలను చూసి బాధ పడే వారమని అయితే ఇప్పుడు సంతోషంగా జగనన్న ఉంచుతున్నారని చెప్పారు. అమ్మ ఒడి వస్తుందని, చదువు ఎలా అని బెంగ లేదని, విద్యా కానుక తో పుస్తకాలు వచ్చాయని, బూట్లు, టై లేవనే బాధ లేదని పేర్కొన్నారు.

Pedabondapalli

2022-07-05 08:47:36

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

రైతులకు  విత్తనాలు,  ఎరువులు పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలని, అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్  తెలిపారు.  మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ హాలునందు  ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయాధికారులతో  జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో ఎరువులు పంపిణీ చాలా ముఖ్యమని తెలిపారు. ఎరువులు కేటాయింపులకు ప్రణాళిక ఉండాలని, జిల్లా యంత్రాంగం నుండి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే కేటాయింపులు, రవాణా చేయాలని ఎరువుల కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. డీలర్లకు 50శాతం, మార్క్ ఫెడ్ కు 50 శాతం వంతున సరఫరా చేయాలని తెలిపారు. జాయింటు కలెక్టరు నుండి ఎరువుల కేటాయింపులకు సంబంధించి ఆమోదం తీసుకోవాలని తెలిపారు. ఎరువులు సరఫరాపై సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. మండలంలో అవసరాన్ని బట్టి కేటాయింపులు ఉండాలనితెలిపారు. ఎరువులు  అంతర్ జిల్లాల, అంతరాష్ట్ర రవాణా నిషేదమని, డీల్లర్లు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, అమ్మకాలు, నిల్వలకు తేడాలు రాకూడదని హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 అనంతరం వ్యవసాయ, అనుబంధ శాఖలైన ఉద్యానశాఖ, పశుసంవర్థక,మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ శాఖ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ జరగాలన్నారు.  విత్తనాలు, ఎరువులు పంపిణీపై ప్రజలనుండి, ప్రజా ప్రతినిధులనుండి పిర్యాదులు రాకూడదన్నారు. గ్రామాలు, రైతు భరోసా కేంద్రం వారీగా డిమాండు, సప్లయిపై నివేదిక తయారుచేసుకొని, దాని ప్రకారం పంపిణీ చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, ఎరువులు కొరత వచ్చిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు తగినన్ని నిల్వలు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు అవసరమైనన్ని  కంది, మినుము విత్తనాలు పంపిణీ చేసి వాటి వాడకంపై పర్యవేక్షణ చేయాలని అదికారులకు తెలిపారు. కౌలు రైతులకు రుణ అర్హత  కార్డులు అందజేయాలన్నారు. బ్యాంకు లింకేజీ కాని రైతుల బ్యాంకు అక్కౌంటులు ఆధార్ తో లింక్ చేసి వారికి ప్రభుత్వ పధకాలు అందేలా చర్యలుతీసుకోవాలని తెలిపారు.

Parvathipuram

2022-07-05 08:37:21

తిరుమలలో జూలై 10న ముగియనున్న దీక్ష

సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన " షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష " జూలై 10వ తేదీ పూర్ణాహుతితో ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో జూన్ 25న ఈ దీక్ష ప్రారంభమైంది. "రామ‌స్య‌పాదౌజ‌గ్రాహ‌ల‌క్ష్మ‌ణ‌స్య‌చ‌ధీమ‌తః " అనే మహామంత్రం ప్రకారం అర‌ణ్య‌కాండలోని మొత్తం 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, త‌ర్ప‌ణ‌, హోమాదులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌లకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

Tirumala

2022-07-05 08:20:48

విశాఖలోనూ జగనన్న మహిళా మార్ట్

విశాఖ మహా నగరంలో మహిళా మార్ట్ ప్రారంభానికి జివిఎంసి కమిషనర్ సూచనల మేరకు మల్కాపురంలో సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం యుసిడి(పి.డి.), కె.వి. పాపు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు ఆర్ధిక స్వాలంబన సాధించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెప్మా వారి ఆధ్వర్యంలో ఇదివరకే తిరుపతి, చిత్తూరు, గూడూరు, పులివెందుల, అద్దంకి తదితర ప్రాంతాలలో జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించారని తెలిపారు. కమిషనర్ సూచన మేరకు జివిఎంసి పరిధిలో మల్కాపురంలో ఈ మార్ట్ కి మంచి గిరాకీ ఉంటుందని అందువలన మల్కాపురం లో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా స్వయం సహాయక సంఘాలు(ఎస్.హెచ్.జి.), స్లం లెవల్ ఫెడరేషన్(ఎస్.ఎల్.ఎఫ్.) మరియు టౌన్ లెవల్ ఫెడరేషన్(టి.ఎల్.ఎఫ్) సభ్యుల నుంచి వాటాదనం రూ. 110/-లు మరియు సభ్యత్వ రుసుం కింద రూ.40/- లు, ఒక్కొక్కరికి మొత్తం రూ. 150/-లు చొప్పున మహిళా పరస్పర సహకార సంఘంలో రిజిస్ట్రేషన్ కాబడి, ఈ మార్ట్ ద్వారా అన్ని రకాల మహిళా సంఘాల ఉత్పత్తులు మరియు నిత్యావసరాలను విక్రయిస్తారని, ఇందులో సభ్యులే అన్ని బాధ్యతలూ నిర్వహిస్తారని తద్వారా వారి ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.      

జివిఎంసీ

2022-07-05 07:47:25

సర్వపాపహరణం నారసింహుని దర్శనం

విశాఖలోని పాతనగరం లో కొలువున్న శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు  అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వరాహ, నారసింహ అవతారాల్లో జగన్నాథుడు భక్తులకు  దర్శనం కల్పించి  కనువిందు చేస్తున్నారు. మంగళవారం నారసింహ అలంకరణలో  జగన్నాథుడు  భక్తులకు దర్శనం ఇవ్వగా  దర్శించుకున్నవారంతా భక్తిభావంతో పులకించిపోయారు. వరాహ ,నారసింహ అవతారాలలో ఉన్న జగన్నాథ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో అటువంటి భక్తులు సర్వ పాపాలు హరించుకుపోయి ,వారి కుటుంబాలు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటాయని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు నారసింహావతారం లో ఉన్న జగన్నాధుడుని మంగళవారం దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా స్వామి చల్లగా కాపాడాలని శ్రీను బాబు ఆకాంక్షించారు. గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని స్వామి ని వేడుకున్నట్లుగా శ్రీనుబాబు ఈ సందర్భంగా మీడియాకి చెప్పారు.

Visakhapatnam

2022-07-05 06:24:27

అల్లూరి పోరాట పటిమను స్పూర్తిగా తీసుకోవాలి

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మన్యం వీరుడు 'విప్లవ జ్యోతి' అల్లూరి సీతారామరాజు  స్వాతంత్ర్య సముపార్జన కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడని  జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం రాజమండ్రి పి.వి. నరసింహారావు పార్క్  (గోదావరి బండ్) వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం  అధికారికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు జీవించినప్పటికీ  స్వాతంత్ర్య సుముపార్జనకు ఆంగ్లేయులను ఎదురొడ్డి  పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు.  స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ, ఆత్మ విశ్వాసం, దైర్యసాహాసాలు ఎనలేనివన్నారు. ఆయన స్ఫూర్తిని  భావితరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు జారిచేశారన్నారు. రాష్ట్రంలో ఆయన పేరు ఒక జిల్లా పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు  ఆ మహనీయుని జయంతి జరుపుకోవడంతోపాటు భావితరాలకు స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు భావితరాలకు చెప్పే విధంగా
ఫోటో ప్రదర్శన శాలను ఏర్పాటు చేసేందుకు  కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి 125 జయంతోత్సవం చిరస్మరణంగా ఉండే విధంగా గోదావరిపై ఉన్న పాత రైలు వంతెనకు లేదా అల్లూరి పోరాటానికి ముఖద్వారంగా ఉన్న మధురపూడి విమానాశ్రయానికి గాని అల్లూరి పేరు పెట్టాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరంకు అల్లూరి చరిత్ర ముడిపడి ఉందని అందువల్ల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం నిర్ణయించిందని ఆ విజ్ఞాన కేంద్రంలో అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించిన అపురూపమైన తైలవర్ణ చిత్రాలు, సాహిత్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయన కలెక్టర్ ని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా విభూది  బ్రదర్స్ ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ, అల్లూరి  వేషధారణ సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ కే. దినేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, జాతీయ అల్లూరి సీతారామరాజు   యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యులు, యర్ర ఉమామహేశ్వరరావు, ఎస్ఎస్ రాఘవేంద్ర, శ్యామల, పార్వతి,
 యర్ర కృష్ణ కుమార్, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను( ఈఎన్ఎస్ బాలు) తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-04 17:48:03

28 గ్రామ పంచాయితీలో రీసర్వే పూర్తి

తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులను ప్రామాణికత తో కూడి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత అధికాలను ఆదేశించారు.  సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరు ఛాంబరులో రీసర్వే అశంపై సర్వే, పంచాయితీ , రెవెన్యూ అధికారులతో కలెక్టరు మాధవీలత జాయింట్ కలెక్టరు సీహెచ్ శ్రీధర్ తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు  మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 272 గ్రామాల్లో రీసర్వే పనులను ప్రారంభించగా ఇప్పటి వరకు 28 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామన్నారు. రీసర్వేలో భాగంగా ఇంత వరకు 73 గ్రామాల్లో  డ్రోన్ సహాయంతో సర్వే చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 28 గ్రామాల్లో  సమగ్ర సర్వే అనంతరం 13 నోటిఫికేషన్ ఇచ్చి సర్వే పూర్తి చేశామని తెలిపారు. రెవిన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీ జోన్ యాక్టివీటీస్ కింద భూముల హద్దులను సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. 43 గ్రామాల్లో ఓఆర్(ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ) ఇచ్చిన వంద రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు . 21 గ్రామాల్లో  డ్రాఫ్టు ఆర్వోఆర్  పూర్తి చేసినట్లు తెలిపారు. రాజమహేంధ్రవరం డివిజన్ లోని కడియం మండలంలో 7,  గోకవరంలో 15, రాజానగరంలో 14, రంగంపేటలో 14, సీతానగరంలో 17,   కోరుకొండలో 19,  రాజమహేంధ్రవరం రూరల్ మండలంలో 7 గ్రామాల్లో డ్రోన్ ప్లే ద్వారా కవర్ చేశామని తెలిపారు. ప్రతి వారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు  రీసర్వే అంశంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏమైనా సందేహాలు ఉంటే సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో  జాయింట్ కలెక్టరు సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, ఎడీ సర్వే లక్ష్మణరావు,  జిల్లా పంచాయితీ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-04 15:48:20

భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన సేవ, చూపిన తెగువ, మన్యం ప్రజల హక్కుల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ పరిపాలనాధికారి డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ కొనియాడారు. విజయనగరం జల్లా కొండకారకంలో గల సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ దొరలపై అల్లూరి సీతారామరాజు చూపించిన వీరత్వం తెగువ అప్పటి ప్రజలను ఆకట్టుకున్నాయని అతడు బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశాడని అలాంటి విప్లవ వీరుడు 27 సంవత్సరాలకే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు చరిత్ర వీడియో ద్వారా ప్రదర్శించి సీతారామరాజు జీవిత చరిత్రను అతని తెగువను దేశం కోసం అతను ప్రాణత్యాగం చేసిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ వ్యక్తిగత కార్యదర్శి సుప్రియ దాస్, సెక్షన్ ఆఫీసర్ బానోతు రాము, డాక్టర్ పి వి పి ఎస్ అరుణ్, డాక్టర్ దేవాంజన నాగ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-04 14:15:34

మానవాళి మేలు కోసమే ప్రేరణ ప్రాజెక్టు

మానవాళి మేలు కొరకు ప్రజాపిత  బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 700 కోట్ల ప్రజలకు మేలుచేసే  ప్రేరణ ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని ఆల్‌ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్పిలేట్ అథారిటీ (ఏఐసిటిఈ)చైర్మన్ ఆచార్య జిఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. సోమవారం వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్లను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మేలు జరగాలన్నదే ఈ ప్రాజె క్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఇందు కోసం 700కోట్ల మంది ప్రజలు ఒక్కోక్క పని చేస్తే అందరికీ సంతోషం కలుగుతుందన్నారు. అది సేవలు, సహయం, ఇలా ఏ రూపంలోనైనా సాటివారికి మేలు చేసేదిగా ఉండాలన్నారు.  ప్రాజెక్టు నిర్వాహకులు రామ్ సింఘాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని యూఎస్ లో ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికి
40 దేశాల్లో 30 వేల కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో విద్యార్థులను కలిసి ఈ ప్రాజెక్టు ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడించారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ యూఎస్ లో ఒక చిన్న కార్యక్రమంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నేడు 40 దేశాలకు విస్తరించడం జరిగిందన్నారు.ఏడు వందల కోట్ల సత్కర్మలకు ప్రేరణ ప్రాజెక్టు నిర్వహణ ద్వారా ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఒక అద్భుతమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు.

 ప్రజలకు ఆనంతమైన ఆత్మీయ సంతోషం కలుగుతుందనే ఆలోచనతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు
ప్రాజెక్టు నిర్వాహకులు రామ్ సింఘాల్, సోదరి శివలీల మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన కార్యక్రమాలను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహించే ఒక మంచి అవకాశం రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ శాంతికి అలాగే ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశించిన  ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బికె రామేశ్వరి,  సోదరి సత్యవతి, శశికళ, లలిత తదితరులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుకు విశేష ప్రచారం కల్పించాలన్నదే బ్రహ్మకుమారీస్‌ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఆచార్య రాజును ఘనంగా సత్కరించారు. 

Visakhapatnam

2022-07-04 14:02:26

ఏఎంసీలో డా.క్రిష్ణబాబు సేవలు వెలకట్టలేనివి

విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో వైఎస్ ప్రిన్సిపాల్ డా.జి.క్రిష్ణబాబు సేవలు వెలకట్టలేనివని డా.ఎంవీవీ మురళీమోహన్ అన్నారు. శుక్రవారం ఆంధ్రామెడికల్ కాలేజీలో ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసి క్రిష్ణబాబును పలువురు వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లడుతూ, ఎన్నో ఏళ్ల చరిత్రగల ఏఎంసీలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉత్తమ సేవలు అందించారని అన్నారు. ఈ క్రమంలోనే ఎందరినో వైద్యులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగాలనికి ఉద్యోగ విరమణ ఉన్నా.. వైద్యునిగా జీవితాంతం ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.పద్మశ్రీ, డా.నాగమణి, డా.దేవీమాధవి, డాక్టర్ పి.జె.శ్రీనివాసల్ పలువురు మెడికోలు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-01 15:43:19

ఘనంగా AIIEA 72వ ఆవిర్భావ దినోత్సవం

ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 72వ ఆవిర్భావ దినోత్సవం విశాఖలోని ఎల్ఐసీ ప్రధానకార్యాలయంలో ఘనం జరిగింది. ఈ సందర్భంగా  ఏఐఐఈఏ జెండాను సీనియర్‌ ఉద్యోగి పి.వెంకట రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  హాజరైన మాజీ ఎమ్మెల్సీ  ఎంవిఎస్‌ శర్మ  మాట్లాడుతూ, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఉనికిలోకి రాకముందే 17-1951న AIIEA ఏర్పడిందని గుర్తుచేశారు. దీనికింద 245 ప్రైవేట్ బీమా కంపెనీలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. నాటి నుంచి ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్సు సంస్థను  రక్షించడానికి విశేషంగా క్రుషి చేస్తుంటే.. కానీ నేడు, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగాలను అమ్మేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని, అయితే అధికార బీజేపీ ఎప్పుడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. ఈ విభజన శక్తులను ఓడించి ఐక్యంగా ఉండటమే నేడు యూనియన్ సభ్యుల ముందున్న ప్రధాన సవాల్ అన్నారు.  దేశ ప్రజలను ఐక్యం చేసేందుకు, ప్రభుత్వ రంగ బీమాను పరిరక్షించేందుకు బీమా ఉద్యోగులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి వరప్రసాదరావు, గేట్ మీటింగ్‌ ఐసిఇయు అధ్యక్షురాలు ఎం.కామేశ్వరి అధ్యక్షత వహించారు. సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Visakhapatnam

2022-07-01 15:33:58

సులభతరం వాణిజ్యంలో మొదటి స్థానం

అన్ని శాఖల భాగస్వామ్యంతో దేశంలోనే సులభతరం వాణిజ్యం మొదటి స్థానం సాధించ డం చాలా సంతోషంగా ఉందని అదే స్ఫూర్తితో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ జిల్లాలో పోల్యుషన్ ప్రపోజల్స్ పెండింగులో ఉన్నాయని ఎస్.ఎల్. ఎ పీరియడ్ దాటకుండా చూడాలన్నారు.  పలాసలో నక్క ప్రవీణ్ కుమార్ పైప్స్ పరిశ్రమ నిమిత్తం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించి లోన్ మంజూరు చేయడం జరిగిందని, అయితే పరిశ్రమకు విద్యుత్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది అని తెలిపారు. అందుకు సంబంధించి బ్యాంక్ వారి అనుమతితో స్థలాన్ని మార్పు చేయు నిమిత్తం అనుమతులు కోరగా జిల్లా కలెక్టర్ మంజూరు తెలియజేశారు. ప్రస్తుతం పరిశ్రమలు నడుపుతున్న యూనిట్స్ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇతర పరిశ్రమలకు 10, 15 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తే ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందన్నారు. ఋణాలు తీసుకున్న పరిశ్రమలు ఋణాల రాయితీ పొందుతున్న వారు మంజూరు చేసిన ఋణం మొత్తం పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారా లేదా అన్న విషయం పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో  డి.ఐ.ఓ ఉమామహేశ్వర రావు, అగ్నిమాపక శాఖ అధికారి, డిపిఓ రవికుమార్, సేఫ్టీ అధికారి, పరిశ్రమల శాఖ ఎడి ఆర్ వి రమణ రావు, ఎడి రఘునాథ్, వివిధ పరిశ్రమల అసోషియేషన్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-01 15:23:07

వైద్యకళాశాల ఏర్పాట్లు పరిశీలన..

విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లపై వైద్య విద్య శాఖ డైరెక్టర్ డా.రాఘవేంద్ర రావు జిల్లాలో శుక్రవారం పర్యటించారు. నగరంలోని మహారాజ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఆసుపత్రిలో ప్రధమ సంవత్సరం వైద్య విద్యార్ధుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆసుపత్రి వైద్యులు, సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు లతో మాట్లాడారు. వచ్చే ఏడాది 2023-24 నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో  ప్రధమ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నందున ఆ విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించామని వైద్య విద్య డైరెక్టర్ చెప్పారు. ఆ మేరకు వసతులు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్ వివరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనాటమీ, ఫిజియాలజి, బయో కెమిస్ట్రీ తదితర సబ్జెక్టు లకు సంబంధించి సౌకర్యాలు అవసరమని డైరెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో వున్న సౌకర్యాలు, అదనంగా కల్పించే వసతులపై మ్యాప్ ద్వారా డైరెక్టర్ కు వివరించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డ్ లను డైరెక్టర్ సందర్శించారు.

గాజుల రేగ ప్రాంతంలో నూతన వైద్య కళాశాల భవనాల నిర్మాణాన్ని కుడా వైద్య విద్య డైరెక్టర్ పరిశీలించారు. జోరుగా కురుస్తున్న వర్షంలోనే నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులని పరిశీలించారు. పనులపై వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్ వివరించగా సంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో నిర్మాణంలో వున్న కొత్త వైద్య కళాశాలలన్నింటిలో ఇక్కడే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొంటూ ఇదే సరళిని కొనసాగిస్తూ పనులు మరింత వేగవంతం చేయాలని ఇ.ఇ. సత్య ప్రభాకర్ కు సూచించారు.

Vizianagaram

2022-07-01 14:02:14

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-30 03:34:58

కనీస వేతనాలపై కీలక ఆదేశాలు..

శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖలలో కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు.   కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కనీస వేతనాల అమలు పై బుధవారం ఆయన సమీక్షించారు. అన్ని ఇంజనీరింగ్ శాఖలలో కనీస వేతనాలు అమలు పై చర్చించారు.  ఇంజనీరింగ్ శాఖలతో పాటు డ్వామా, వ్యవసాయం, పట్టు పరిశ్రమ, కార్మిక, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన, మున్సిపల్ కార్పొరేషన్, తదితర శాఖల అధికారులతో ఆయన కనీస వేతనాలు పై చర్చించారు. ప్రస్తుతం అన్ని శాఖలలోను కనీస వేతనాలు అమలు జరుగుతున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడీ రోజారాణి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, పట్టు పరిశ్రమ శాఖ ఎడి అలజంగి విక్టర్ సాల్మన్ రాజు, పరిశ్రమల శాఖ డిడి ఉమామహేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ కృష్ణ మోహన్, ఉద్యానవన శాఖ ఎడి ప్రసాదరావు,  కార్మిక శాఖ నుండి శైలేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-29 15:33:34