1 ENS Live Breaking News

సీఎం వైఎస్.జగన్ కి వంశీ ఘన స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సోమవారం శ్రీకాకుళం హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయుటకు సోమవారం ఆయన జిల్లాకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా పలు అంశాలను సీఎం ద్రుష్టికి తీసుకెళ్లారు.  ఇంకా సీఎంకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, డిఐజి హరికృష్ణ, జిల్లా ఎస్పీ రాధిక, విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి,  నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు వి. కళావతి, గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ అధ్యక్షులు పి. తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, సీతంపేట ఐటిడిఎ పిఓ బి. నవ్య, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-27 12:23:19

హెలీపాడ్ వద్ద సీఎంకి ఘన స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి శ్రీకాకుళం హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయుటకు సోమవారం ఆయన జిల్లాకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, డిఐజి హరికృష్ణ, జిల్లా ఎస్పీ రాధిక, విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి,  నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు వి. కళావతి, గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ అధ్యక్షులు పి. తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, సీతంపేట ఐటిడిఎ పిఓ బి. నవ్య, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-27 07:45:10

జర్నలిస్టు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నెలకొల్పాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమ మంత్రిత్వ శాఖను నెలకొల్పాలని ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలోని మాధవధార శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాలులో నిర్వహించిన యూనియన్ ఉత్తరాంధ్ర ప్రతినిధుల సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. కనీస వేతనాలకు నోచుకోని పాత్రికేయుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తాను మరో మారు ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా హాజరైన వైసీపీ నేత సనపల బంగార్రాజు, ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వర రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బెండి వెంకట్రావులు జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర, వివిధ జిల్లాల ప్రతినిధులు,సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-26 14:25:53

నిశ్వార్ధ సేవకు నిలువెత్తు సత్కారం..

కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఆమె చేసిన అలుపెరగని సేవ మాటల్లో చెప్పలేం.. అర్ధరాత్రీ, అపరాత్రీ అనే తేడా లేకుండా  ప్రాణాలమీదకు వచ్చినవారిని ఎలాగైనా కోవిడ్ నుంచి కాపాడాలనే ఆమె తపన, చేసిన విధి నిర్వహణ అంతా ఇంతా కాదు. విపత్కర సమయంలో ప్రభుత్వ అధికారిగా మనవంతు సహకారం అందిస్తే కొంత మేరకైనా కోవిడ్ నుంచి ప్రజలను కాపాడవచ్చుననేది ఆమె బావన. దానికి తగ్గట్టుగానే 24 గంటల పాటు కోవిడ్ ప్రత్యేక కేంద్రం అధికారిగా విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణ అందించిన సేవలను వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తించి..ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా విసిసిఐ ఎక్స్ లెన్స్ అవార్డ్-2022తో సన్మానించింది. ప్రభుత్వ అధికారులు మనసు పెట్టి పనిచేస్తే ఎందరో నిరుపేదలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందడంతోపాటు, నాణ్యమైన వైద్యం కూడా అందుతందని నిర్వాహకులు కొనియాడారు. కోవిడ్ లాంటి పాండమిక్ లో జ్నానవేణిలాంటి అధికారుల సేవలు మరెందరికో ఆదర్శమంటూ కొనియాడారు. విశాఖలో జరిగిన అదే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎదురుగా భారీ విపత్తు..ఎందరో ప్రాణాలు పోగొట్లుకుంటున్నారు..ఆ సమయంలో ప్రభుత్వం ద్వారా అందించే వైద్య సహాయానికి నన్ను అధికారిగా జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన దగ్గర నుంచి ప్రతీరోజూ ఎంతమందిని కాపాడతాననే లక్ష్యంతోనే పనిచేశాను. ఆ సమయంలో తాను అస్వస్థతకు లోనైనా కోవిడ్ బారిన పడిన వారి ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క సంకల్పంతో పనిచేయడం ఎంతో సంత్రుప్తినిచ్చిందని అన్నారు.. కోవిడ్ మహమ్మరాభారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరోగ్య సూత్రాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చైతన్యం కల్పించినట్టు పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి అలవాటు చేసిన మంచి సుగుణమే తన సేవలకు తొలి కారణమని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను స్వీకరిస్తున్న ఈ సత్కారం, అవార్డు తన బాధ్యతను భవిష్యత్తులో మరింతగా పెంచిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారిగా తన సర్వీసు ఆఖరి వరకూ ఆ తర్వాత కూడా ప్రజాసేవలో రాజీలేకుండా ముందుకి సాగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వీరమోహన్, మల్లిక్, రవిగోడే, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-26 03:51:30

పర్యావరణ పాటయాత్రలో దేవిశ్రీ గొంతు

ప్రకృతి వనరులని  రక్షించుకోలేకపోతే  మానవాళికి మరణసశానమే అని పర్యావరణ కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజా గాయకుడు మజ్జిదేవిశ్రీ అన్నారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో ఉన్న అల్లూరి సీతారాం రాజు విగ్రహం నుంచి పాటయాత్ర పాదయాత్రగా ప్రారంభమై శ్రీశ్రీ విగ్రహం వరకూ సాగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ, ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయని తనదైన శైలిలో గొంతు పెకిలించి పాడిన చైతన్య గీతాలు ఆలోచింపచేసాయి. ఏమిచ్చావని ప్రకృతి వానయ్యింది.. ఏమిచ్చావని ప్రకృతి నీకు గొడుగుయింది.. ఏమిచ్చావని ప్రకృతి నీడయ్యింది.. అంటూ ఆలపించారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు అంటూ ప్రతీ ఒక్కరినీ అభ్యర్ధించారు. పర్యావరణ సమతుల్యాణికి ముప్పుతెచ్చిపెట్టే మానవతప్పిదాలు వల్లే అడవిలో జీవించవలిసిన పులి,సింహం,కొండచిలువ,వంటి వన్యప్రాణులు జనవాసాల్లోకి చొరబడి వస్తున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ పచ్చదనాన్ని పెంచేందుకుందు ముందుకు రావాలని కోరారు.  పర్యావరణ పరిరక్షణ నినాదాలు,ఆలోచన రేకెత్తించే అర్ధవంతమైన గీతాలుతో కార్యక్రమం ఆద్యంతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్ సాధిక్ మహమ్మద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు బాల మోహన్ దాస్ ,మంజుల, బాబీ వర్ధన్,కళా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణ మూర్తి పర్యావరణ కళా మండలి సభ్యులు పెద్దింటి శ్రీనివాస్ శ్రీకాంత్, సీత రోజా లక్ష్మి బొబ్బది అప్పారావు, న్యాయవాదులు  శ్రీరామ్ మూర్తి, వేణు ఆంద్రా విశ్వవిద్యాలయం పరిశోధకులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-25 10:13:21

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమరనాధ్ పార్టీ నాయకులు, కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి నియోజకవర పార్టీ ప్లీనరి సన్నాహక సమావేశం స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2024లో జరగనున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ ఇప్పటి నుంచే సిధ్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇందుకు తగినట్టుగా అధికారిక యంత్రాంగాని ఆయా ప్రాంతాల్లో నియమించుకోవాలని, అందుకు తన సహాయ, సహకారాలు అందిస్తానాని అమర్ నాధ్ వెల్లడించాలి. వచ్చే ఎన్నికల్లో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత పార్టీ క్యాడర్పైనే ఉందని అన్నారు. జగన్ అధికార లోకి వచ్చిన మూడేళ్లలో 95శాతం హామీలను నెరవేర్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సంక్షేమ కార్య క్రమాల అమలులో క్షణం ఆలస్యం జరగకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. సామాన్య నాయకునిగా ఉన్న నన్ను మంత్రిగా చేసి, ముఖ్యమంత్రి సరసన నన్ను నిలబెట్టినది. మీ అభిమానమేనని మంత్రి సమావేశానికి వచ్చినాయకులు, అభిమానులనుద్దేశించి అన్నారు. అందరి మీద నేను  ప్రేమాభిమానాలను నేరుగా వ్యక్త పరక పోవచ్చు. కాని మీ అందరిని పేరుపేరునా గుర్తుంచుకున్నాను. మీరు నా గుండెల్లోనే ఉంటారు' అని అమర్ చెప్పారు. రానున్న ఎన్నికలలో  విజయానికి మనమంతా కలిసికట్టుగా  పనిచేయాల్సి ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ నెల 28న జరగనున్న ప్లీనరి సమావేశాన్ని విజయవంతం చేయలని అమర్ కోరారు. పార్టీ పరిశీలకులు రాజారాం మాట్లాడతూ గుడివాడ అమర్  కుటుంబానికి మూడు తరాల రాజకీయ అనుభవం ఉందని అన్నారు. అమర్ నిమళ్ళీ గెలిపించుకోడానికి అందరూ కంకణ బద్ధులు కావాలని ఆయన కోరారు. కోవిడు కాలంలో కూడా మూఖ్యమంత్రి జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిం చారని అన్నారు. ప్లీనరికి ముందు ఏర్పాటు చేసుకునే కమిటీలో  మహిళలకు 50 శాతం స్థానం కల్పించాలని ఆయన సూచించారు. మరో పరిశీలకులు, డీసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతు మంత్రి అమరనాధ్ కు మంచి పేరు తీసుకువచ్చేలా పార్టీ కార్య కర్తలు, నాయకులు పని చేయులని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీపు కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ విజయంకోసం సమష్టిగా పనిచేయాలని కోరారు. 2019 లో ప్రజలకు  మనం ఏమిచేయకుండానే, ప్రజలు పార్టీకి 151 సీట్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో 1,40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మనకు వచ్చే  ఎన్నికలలో 175 కి 175 సీట్లు మన పార్టీకి అందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటు అడిగే హక్కు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వుందని  ఆయన అన్నారు.  ఈ సమావేశంలో పెద్దయెత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం  అనకాపల్లి లో ప్లీనరి జరిగే  పెంటకోట కల్యాణ మండపాన్ని మంత్రి  అమరనాధ్ పరిశీలించారు.

Anakapalle

2022-06-25 10:03:29

అంతా నాఇష్టం.. నేనే యాక్టింగ్ జెడ్పీచైర్మన్

అంతా నా ఇష్టం..నేనే యాక్టింగ్ జెడ్పీ చైర్మన్.. మీకు తెలియదా..చైర్మన్ కు ఏం తెలియదు.. తెలియడానికైనా జిల్లా పరిషత్ లోనూ, పంచాయతీరాజ్ శాఖలోనూ రూల్ పొజిషన్.. ఏ వింగ్ లో నుంచి ఎవరు ఎక్కడెక్కడికి వస్తారు..ఎలా వస్తారు.. అవన్నీ మనకు తెలుసుకనుక..అవే చైర్మన్ కి చెప్పి మాట్లాడిస్తున్నాం.. ఆమెకి తెలియని విషయాలు  మనం ఎంత చెబితే ఆమెకి అంత..ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడపెడతారు.. ఆఖరికి జెడ్పీ సీఈఓ కూడా డమ్మీ.. చైర్మన్ ఫైనల్ చేసి పంపిన ఫైలుపై నామ్ కే వాస్తే సీఈఓ కూడా సంకతాలు చేయాలి.. జిల్లా పరిషత్ బదిలీల్లో కూడా ఆదాయం వచ్చే మార్గాలు మనమే చెప్పాం.. ఇంజనీరింగ్ సెక్షన్ కావాలంటే లక్ష 50వేలు.. జనరల్ సెక్షన్ కావాలంటే లక్ష, జిల్లా పరిషత్ కావాలంటే 75వేలు, కావాల్సిన రోడ్డు పాయింట్ మండలాలు కాలన్నా లక్ష ఇస్తే పనిజరిగిపోతుంది.. నేనే స్వయంగా చేయించేస్తాను.. అందుకే నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేల్యు, ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖలను కూడా పక్కన పెట్టేశారు జెడ్పీ చైర్మన్.. ఆఖరికి జీవిఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ లు స్వయంగా వచ్చి చెప్పినా ఖాతరు చేయడంలేదు అంతా మన కనుసన్నన్నల్లోనే జరుగుతుంది.. ఏంటీ ఇదేదో సినిమా స్క్రిప్టు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియలో జరుగుతున్న తంతు.. ఎప్పడూ లేనివిధంగా జిల్లాపరిషత్ లో ఒక యూనియన్ నేత, చైర్మన్ పక్కనే పనిచేస్తున్న ఒక ఉద్యోగి చేస్తున్న కను సన్ననలలోనే కావాల్సిన వారికి..కాసులిచ్చిన వారికి పని జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే వీటిని జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి శుభద్ర, జెడ్పీ సీఈఓ మీడియా ముందు ఇదంతా మాపై ట్రోల్ అవుతున్న గాసిప్ ప్రచారమే అని కొట్టి పడేస్తున్నారు.

గాసిప్స్ మాత్రమే అనుకుంటే..కొత్తగా పదవిలోకి వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ కి పక్కనే వున్న సిబ్బంది, మోత మోస్తూ..అన్ని విషయాలూ చెప్పే ఆ యూనియన్ నేతలు..ఎందుకు ఏఏ విభాగాలకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ కి వస్తున్నారు..ఎందుకు వస్తున్నారు.. ఆయా విభాగాలకు రేటు ఎంత పలుకుతుంది.. దానికోసం ఏఏ శాఖల మంత్రుల లేఖలు తెస్తున్నారు..ఎవరెవరితో నేరుగా ఫోన్లు చేయిస్తున్నారు అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే సమాధానమే వస్తున్నది. జిల్లా పరిషత్ బదిలీల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తూ వారికి కావాల్సిన వారు, డబ్బులిచ్చిన వారికే లైన్ క్లియర్ చేస్తూ.. తమది కాని సెక్షన్ నుంచి బదిలీల ఉత్తర్వులు కూడా దగ్గరుండి మరీ తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగానే జిల్లా పరిషత్ బదిలీలంటే అంతా కాసులపైనే నడుస్తుంది. అలా నడిచినా కావాల్సిన ప్రదేశాలు కావాలంటే మరికొంచెం చేయి తడపాల్సిందే. మేము సత్య హరిశ్చచంద్రుల వంశానికి చెందిన వారమని చెప్పినా.. పైసా పెట్టకుండా ఏ పనీ జరగదు అది జగమెరిగిన సత్యం. అందులోనూ..చాలా కాలం తరువాత జెడ్పీ చైర్మన్ కూడా జిల్లా పరిషత్ సీటులో కూర్చోవచడంతో.. ఆమెను మచ్చిన చేసుకొని.. ఆమె దగ్గరకు మంచి అధికారులు, సిబ్బంది రాకుండా  అడ్డుంకుంటున్నారని ఆ యూనియన్ నేతలు, చైర్మన్ దగ్గర పనిచేసే ఉద్యోగి ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తాజా పరిణాలమాలు రుజువు చేస్తున్నాయి.

అధికాపార్టీ మీడియా మీడియా గొంతు నొక్కినా..మిగిలిన మీడియా మొత్తం జిల్లా పరిషత్ లో జరిగే బదిలీల్లో జరిగే తంతును ఒక్కోరోజు ఒక్కో విధంగా బయటకు తీసుకొస్తున్నది. ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగే సమయంలో సర్వసాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి కావాల్సిన అధికారులు, సిబ్బందికి సహాయం చేస్తుంటారు. ఇలా సహాయం చేయడానికి  బదిలీల సమయంలోనే సిఫార్సు లేఖలు కూడా ఇస్తుంటారు. కానీ జిల్లా పరిషత్ లో మాత్రం  తమకు కావాల్సిన సిబ్బంది విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని స్వయంగా ఫోన్లు చేసినా..లేఖలు ఇచ్చినా..జెడ్పీ చైర్మన్ చుట్టూ వుండే పైరవీదారులు ఆమెను తప్పుదోవ పట్టించి ఎలాంటి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆ విషయం కూడా స్వయంగా కొందరు ప్రజాప్రతినిధులే మీడియాకి లీకులిచ్చి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎవరో చాలా గట్టిగా ప్రభావితం చేస్తున్నారు.. అందుకే ఆమె ఎవరు చెప్పినా..ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు..ఆమె దగ్గరఉన్నవారి మాటలు మాత్రం వింటున్నారని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం చెప్పుకొస్తున్నారు వారంతా.

ఇంత జరుగుతున్నా జిల్లా పరిషత్  లో జరుగుతున్న బదిలీల విషయంలో మాత్రం ఆ యూనియన్ నేతలు, చైర్మన్ పక్కనే పనిచేసే ఉద్యోగి మాటలు, చేసిన ప్రచారం మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. నేరుగా ప్రజాప్రతినిధులు కలిసి చెప్పినా సదురు ఉద్యోగుల విషయంలో మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఎక్కడా తగ్గడం లేదనే ఆరోపణలున్నాయి. కాదు.. కాదు.. ఆవిధంగా చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. మీరు సీటులోకి రాగానే జరుగుతున్న బదిలీలు ఇపుడే మీరేంటో..మీ పవర్ ఏంటో చూపించాలన్నట్టుగానే చైర్మన్ ను పూర్తిగా మార్చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నది. వాస్తవానికన్నా..అబద్దానికి ఎక్కువ విలువ అన్నట్టుగా చెప్పుడు మాటలకు, కాసులతో జరిగే వ్యవహారాలకు మాత్రమే జిల్లా పరిషత్ లో పచ్చజెండా ఊపుతున్నారనే విషయం బయట గుప్పుమంటోంది. అయితే అవేమీ పట్టించుకోకుండా కావాలనుకున్న చోటుకి బదిలీ కావాలనుకున్నవారు మాత్రం మూడో కంటి తెలియకుండా బదిలీ చేయించుకుంటున్నారు. అందులోనూ జిల్లాల విభజన జరిగిన తరువాత కొన్ని ప్రాంతాలు, విభాగాల్లో పోస్టులకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉంటూ పనిచేసుకుంటూ పోదామనుకున్నవారు బదిలీల సమయంలో ఎంత అడిగితే అంతా ఇచ్చి కావాల్సిన ప్రదేశాలను కోరుకొని పనులు చేయించుకుంటున్నారు.

జిల్లా పరిషత్ లో జరుగుతున్న తంతుపైనా..చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్ లపైనా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ స్వయంగా చైర్మన్ ద్రుష్టికి తీసుకెళ్లింది. దానికి జిల్లా పరిషత్ చైర్మన్ స్పందిస్తూ..బదిలీల విషయంలో జరుగుతున్నదంతా కేవలం గాసిప్స్ మాత్రమేనని..జిల్లా పరిషత్ ఉద్యోగులు, వారి సమస్యలకే తాను పెద్ద పీట వేస్తున్నామని ఈ విషయంలో ఎవరూ తనను తప్పుదోవ పట్టించడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుంగా అటు జెడ్పీ సిఈఓ దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే..అసలు బదిలీల ప్రక్రియలో డబ్బులు చేతులు మారుతున్నాయని, యూనియన్ నేతలే స్వయంగా ఈ ప్రక్రియన దగ్గరుండి నడిపిస్తున్నారనే విషయం తనవరకూ రాలేదని చెప్పొకొచ్చారు. ఏమైనా ఆధారాలుంటే, బదిలీలకు డబ్బులిచ్చిన వారుంటే తమ ద్రుష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు(మరీ వెటకారంగా కావాల్సిన చోటుకి బదిలీ కావాల్సిన వ్యక్తి ఇచ్చిన డబ్బుల విషయం అధికారికంగా బయటకు చెబుతాడా). విశాఖపట్నం జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియ మొత్తం పైసలు, పైరవీలతోనే జరిగిపోతున్నా.. అటు జిల్లా పరిషత్ చైర్మన్, ఇటు సిఈఓలు ఏమీ జరగడం లేదని చెప్పడం..మరోపక్క యాక్టింగ్ చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్లు.. ప్రజాప్రతినిధులే స్వయంగా తాము చెప్పినా..ఆమె వినడం లేదనే ప్రచారం ఇపుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి..ముందు ముందు జిల్లా పరిషత్ లో ఇంకెన్ని సిత్రాలు చోటుచేసుకుంటాయనది..!

Visakhapatnam

2022-06-25 09:06:34

తపాలా శాఖ ఆద్వర్యంలో ధాయ్ అఖర్

భారత తపాలా శాఖ ఆద్వర్యంలో జూలై 1 నుండి అక్టోబర్ 31 వరకు "ధాయ్ అఖర్" పేరిట "విజన్ ఫర్ ఇండియా 2047" అనే అంశంపై జాతీయ స్థాయి లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ను నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.కాంతారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనువారు తమ ఉత్తరములను ఇంగ్లీష్/తెలుగు/హిందీ భాషలలో రాయవచ్చని అన్నారు. వాటిని "సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం - 532 001 నకు అక్టోబర్ 31లోగా పంపాలని కోరారు. అభ్యర్థులు పంపే ఉత్తరములపై " ఎంట్రీ ఫర్ దాయ్ అఖర్ 22-23"అని వ్రాయవలెనని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్వలప్స్  పంపేవారు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని అన్నారు.ఈ కాంపిటిషన్ రాష్ట్రీయ మరియు జాతీయ స్థాయిలో నిర్వహించ బడుతుందని,రాష్ట్రస్థాయిలో గెలుపొందిన ప్రథమ విజేతకు రూ25వేలు, ద్వితీయ విజేతకు రూ.10వేలు, తృతీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి విజేతకు రూ.50వేలు, ద్వితీయ విజేతకు రూ25వేలు, తృతీయ విజేతకు రూ.10వేలు నగదును అందజేయబడుతుందని స్పష్టం చేశారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు తమ ఉత్తరములను అక్టోబర్ 31లోగా పంపించాలని, ఆ తదుపరి వచ్చిన ఉత్తరములు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.ఆసక్తి గలవారు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించ వచ్చని, అదనపు సమాచారం కొరకు www.appost.in వెబ్ సైట్ ను పరిశీలించుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
 

Srikakulam

2022-06-24 13:18:56

రేపు విశాఖలో పర్యావరణ పాటయాత్ర

విశాఖలో  పర్యావరణ పాటయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్టు పర్యావరణ కళామండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రజాగాయకుడు దేవిశ్రీ తెలియజేశారు. ఈ మేరకు శక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతీ శనివారం పుడమి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పాటయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. విశాఖను కాలుష్యం కోరల నుంచి రక్షించుకోవడానికి పాటలతో ప్రజలను చైతన్యం చేయడానికి విశాఖలోని బీచ్ రోడ్డులోని పామ్ బీచ్ లోని అల్లూరి విగ్రహం నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకూ ఈ పాటయాత్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ ప్రేమికులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీడియా ద్వారా దేవిశ్రీ కోరారు.

విశాఖపట్నం

2022-06-24 07:40:56

AERUఉత్తరాంధ్ర ప్రతినిధుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధుల సమావేశం ఈనెల 26న విశాఖపట్నం మాధవధార లోని శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరగనుందని జిల్లా కమిటీ ప్రతినిధులు నేమాల.హేమసుందరరావు, హనుమంతు లక్ష్మణ్, సీపాన ప్రసాద్, గొండు అచ్యుతరావులు తెలియజేశారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడుతో పాటు రాష్ట్ర కమిటీ ఇతర ప్రతినిధులు, వివిధ జిల్లాల యూనియన్ ప్రతినిధులు హాజరు కానున్నారని.. వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను యూనియన్ జిల్లా ప్రతినిధులతో కలిసి యూనియన్ రాష్ట్ర కమిటీ సలహాదారు కాకుమాను వెంకట వేణులు పరిశీలించారు. ఉత్తరాంధ్రాజిల్లాల ప్రతినిధుల సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలను చర్చించడంతోపాటు కార్యాచరణను కూడా ప్రకటిస్తామని ఈ సందర్బంగా వారంతా మీడియాకి వివరించారు.

Madhavadhara

2022-06-23 11:23:01

విశాఖలో చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేయాలి

విశాఖలో చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలి సంఘం ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ను కోరారు. శనివారం మిందిలోని స్ధానిక మంత్రి నివాసంలో పద్మశాలి సంఘం నాయకులు,ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర బడ్జెట్‌లో చేనేతలకు రూ.200కోట్లు మాత్రమే కేటాయిస్తోందని, దీంతో చేనేతలకు ప్రయోజనం చేకూరడంలేదని చెప్పారు. నేతన్న నేస్తం కింద చేనేతలకు 24వేల రూపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ఇది కొద్ది మందికే అందుతుందని మంత్రి అమర్‌కు తెలియజేశారు. చేనేత కులాల వారికి ఓల్డేజ్‌ హోం,ఫంక్షన్‌ హోల్‌,విద్య,వైద్య సదుపాయాలు కల్పించాలని ఆ వినతిపత్రంలో కోరారు.ఈ వినతి పత్రం అందించిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా అధ్యక్షుడు పప్పు రాజరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల రామ్ కుమార్‌, పెద్దల కమిటీ చైర్మన్‌ తెడ్లుపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-18 14:05:28

అయ్యన్నకు డా.షారోన్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్

 కన్నతల్లి లాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, దాని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపకులపతి పివిజిఆర్ ప్రసాద్ రెడ్డిల మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని ఏయు జెఏసి నేతలు ద్వజమెత్తారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి నాయకులు, అధ్యాపకులు, అనుబంధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన జ్వాల రగిలించారు. రోడ్లను నిర్బంధించి రెండు నిమిషాల పాటు మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మతిభ్రమించి మాట్లాడుతున్న అయ్యన్న వ్యాఖ్యలు ట్విట్టర్ లో పోస్టులు చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఖ్యాతిని అవమానపరిస్తే సహించేది లేదన్నారు. ప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత ఏయు మరింత అభివృద్ధికి నోచుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ టాప్ టెన్ లో ఉంచాలన్న ఆకాంక్షను  ఉపకులపతి పివిజిఆర్  ప్రసాద్ రెడ్డి ముందుకు తీసుకెళ్తూ నాడు నేడు పేరుతో విద్యార్థుల మౌలిక వసతి కల్పన, నూతన భవన నిర్మాణాలు, చే పడుతున్నారన్నారు. దానిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఏయూ ప్రతిష్టను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని, తక్షణమే అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సిపి స్టూడెంట్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బి కాంతారావు, ప్రొఫెసర్స్ టి శారున్ రాజు, ఎన్ ఎ డి పాల్, ఏయూ ఉద్యోగ సంఘాల నాయకులు జీ రవి కుమార్, రమణారెడ్డి, స్టూడెంట్స్ లీడర్స్ ఎం కళ్యాణ్, పూడి చరణ్, హేమచంద్ర , తుల్లి చంద్రశేఖర్, పితాని ప్రసాద్ , పవణ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2022-06-18 13:47:03

27న ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ

ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ "ఛలో వైజాగ్" ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు పాడేరు మాజీ ఎమ్మెల్యే, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకే రాజారావు తెలిపారు. రామటాకీస్ అంబేద్కర్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాన్ని సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  27న సోమవారం ఆర్కే బీచ్ లో మధ్యాహ్నం 3 గంటలకు బహుజన చైతన్య సభ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. .ఉత్తరాంధ్ర నేడు ఆంధ్రప్రదేశ్ బహుజన రాజ్యస్థాపన లో ముందు భాగంలో నిలవాలని ఆకాంక్షించారు. అదే మనం సాహు మహారాజ్ కి ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఉత్తరాంధ్ర బహుజనులకు తమ ప్రాంతంపై నిర్ణయాత్మకమైన అధికారం ఉండాలన్నారు. వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి సరైన పరిష్కారాలు కావాలంటే అధికారం ఉత్తరాంధ్ర బహుజన చేతుల్లోకి రావాలని కోరారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు దళితులంతా ఏకం కావాలన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున జరగనున్న బహుజన చైతన్య సభను జయప్రదం చేయాలని లకే రాజారావు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కరణం తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు బోను కృష్ణ, సోము రాంబాబు, పీరుబండి ప్రకాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-06-18 13:41:56

రిటైర్డ్ ఎడీ న‌ర్సింహులు క‌న్నుమూత‌

ఆంధ్రప్రదేశ్ స‌మాచార శాఖలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఎవి న‌ర్సింహులు (78) క‌న్నుమూశారు. చిన‌ముషిడివాడ‌లోని త‌న స్వ‌గృహంలో ఆయ‌న నిద్రలోనే కాలం చేశారు. ఆదివారం సాయంత్రం త‌మ బంధువుల ఇంటికి వెళ్లి వ‌చ్చిన ఆయ‌న రాత్రి నిద్ర‌పోయి మ‌రి సోమ‌వారం ఉదయం లేవలేదు. నిద్ర‌లోనే గుండెపోటు రావ‌డంతో మృతి చెందిన‌ట్లు పెద్ద‌కుమారుడు అర‌వింద్ తెలిపారు. కొన్నేళ్ళ క్రితం భార్య‌ను కొల్పోయిన న‌ర్సింహులు త‌న కుమారులు అర‌వింద్‌, బాలాజీల‌తో క‌లిసి ఉంటున్నారు. వివాహిత అయిన కుమార్తె ఒడిస్సాలో ఉంటున్నారు. స‌మాచార శాఖ‌లో ఏపీఆర్‌వో నుంచి ఏడీ వ‌ర‌కు ఎదిగిన ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలో చాలా కాలం ప‌నిచేశారు. అప్ప‌ట్లో డెక్క‌న్ క్రానిక‌ల్‌కు ప్ర‌త్యేక వార్తలు రాసి పేరు గాంచారు. అత్యంత సౌమ్యునిగా, వివాద ర‌హితునిగా పేరుగాంచిన న‌ర్సింహులు మృతి ప‌ట్ల ప‌లువురు అధికారులు, పాత్రికేయులు సంతాపం తెలిపారు.  వార్త‌ల ప‌ట్ల అవ‌గాహ‌న‌, స‌మాచార శాఖ‌లో ప్ర‌తిభ చూపిన న‌ర్సింహులు మృతి త‌మకు వ్య‌క్తిగ‌తంగా చాలా తీర‌ని బాధ‌ను మిగిల్చింద‌ని విశ్రాంత సమాచార అధికారులు పి. గోవిందరావు ఆర్.త్యాగరాజు, పి.వెంకటప్పారావు, ఏ.బాబ్జి, డిడి మణిరామ్,  డిపిఆర్ఓలు గోవిందరాజులు సాయిబాబా  తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా న‌ర్సింహులు భౌతిక కాయానికి సోమ‌వారం సాయంత్రం చిన‌ముషిడివాడ శ్మ‌శాన‌వాటికిలో కుమారుడు అర‌వింద్ చేతుల మీదుగా అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. పెద్ద సంఖ్య‌లో అభిమానులు , బంధువులు హాజ‌రై తుది వీడ్కోలు ప‌లికారు.

Visakhapatnam

2022-06-13 11:30:07

ఉత్స‌వ‌మూర్తుల‌కు కవచాల‌ తొలగింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులకు కవచం తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో గంట తరువాత రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. సాధార‌ణంగా జ్యేష్ఠాభిషేకానికి ముందు మంగ‌ళ‌వారం క‌వ‌చాల‌ను తొల‌గించి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-06-07 12:48:06