1 ENS Live Breaking News

శత శాతం డిజిటలైజేషన్ జరగాలి

బ్యాంకులు సుల‌భ‌త‌ర విధానాల‌ను అనుస‌రించ‌టం ద్వారా ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన సేవ‌లం దించాల‌ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు.  వివిధ ప‌థ‌కాల ద్వారా ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ల‌బ్ధిదారుల‌కు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాల‌ని బ్యాంకర్లకు  విజ్ఞ‌ప్తి చేశారు. క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డీఎల్ఆర్‌సీ (డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ క‌మిటీ) స‌మావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శత శాతం డిజిటలైజేషన్ ను ఆర్.బి.ఐ ఆదేశాలు ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డిజిటల్ అకౌంట్స్ ఖాతా వివరాలు బ్యాంకుల వారీగా రివ్యూ నిర్వహించి ఆరా తీశారు.  క్యూ కోడ్ లేని వారిని గుర్తించే విధంగా వాలెంటిర్ల ద్వారా సర్వే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ను ఆదేశించారు. బ్యాంకుల వారీగా ఋణాలు మంజూరు కేటాయించిన టార్గెట్లు పై సమీక్షించి టార్గెట్లు రీచ్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకొవాలని సూచించారు. రివ్యూ కమిటీ సమావేశానికి సంబంధించిన అధికారులు మాత్రమే హాజరు కావాలి, బ్రాంచ్ మేనేజర్ల తో బ్యాంకుల కంట్రోలర్స్  సమావేశాలు నిర్వహించి సంబంధిత మినిట్స్ లోడ్ బ్యాంక్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు..

జగనన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు సంబంధించి మంజూరు చేసిన ఋణాల పై సమీక్షించారు, ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న వివిధ ప‌థ‌కాల ద్వారా ఆర్థిక‌ ఫ‌లాలు త్వ‌రిత‌గ‌తిన ల‌బ్ధిదారుల‌కు అందేలా బ్యాంక‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. స‌మావేశంలో భాగంగా జ‌గ‌న‌న్న తోడు, చేయూత, ఆస‌రా, బీసీ కార్పొరేష‌న్ త‌దిత‌ర‌ ప‌థ‌కాల్లో భాగంగా అందించే రుణ ప్ర‌క్రియ‌పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది. బ్యాంకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.విజయ సునీత, డి.సి. సి కన్వీనర్ బి.కె.వి.ఎస్.ఎస్.గురునాథ్ రావు, ఎల్‌.డి.ఎం. జి.వి.బి.డి.హరిప్రసాద్, నాబార్డ్ డి.డి. ఎం వరప్రసాద్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ లక్ష్మీపతి, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, మెప్మా పీడీ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్  కె.శ్రీధర్, పశుశుసంవ‌ర్థక శాఖ ఎ.డి ఆర్.ప్రసాద రావు, లైన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్ హెడ్స్, కంట్రోలర్స్, కోఆర్డినేటర్, స్టాక్ హోల్డర్స్ డి.సి.సి అండ్ డి.ఎల్.ఆర్, వివిధ బ్యాంకుల రీజ‌న‌ల్ మేనేజ‌ర్లు, బ్రాంచి మేనేజ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆర్.బి.ఐ, డి.డి.ఎం తేజాడిప్త బెహరా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Srikakulam

2022-05-11 15:21:02

వాయు కాలుష్య నియంత్రణకు ప్రణాళిక

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక, సమయానుకూలమైన ప్రణాళికలు తయా రుచేసి సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవా రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం (NCAP) జిల్లా సమన్వయ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, రవాణా శాఖ, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మైనింగ్, పౌర సరఫరాలు ఇతర శాఖలు జిల్లాలో వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులపై అధ్యయనం చేయ్యాలన్నరు. ఆయా శాఖ లు సమిష్టిగా పనిచేసి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ఆయా ప్రాజెక్ట్ వివరాలు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుందని, ఇందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తగిన అవగాహన కల్పిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.  వాయు కాలుష్యము నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్. సి ఎ పి. కార్యక్రమాన్ని 2017-2024 లో అమలు చేస్తూ, అందుకోసం నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ద్వారా చేపట్టిన పనులు, పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. మరింత సమర్ధంతంగా కార్యాచరణ తయారు చేసి, అమలు చేయాల్సి ఉందన్నారు.  రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ద్వారా చేపట్టినపనుల వినిమయ ద్రువపత్రం జారీచేసి, కేంద్రానికి సమర్పించాలని మాధవీలత ఆదేశించారు. ఇంకా రెండు సంవత్సరాలు కాలవ్యవధి ఉందన్నారు. ఎన్. సి ఎ పి. కార్యక్రమానికి కేటాయించిన నిధుల్లో జిల్లాకి సంబంధించి మరో రూ.80 లక్షలు నిధులు  అందుబాటులో ఉన్నాయని, వాటిని సరైన ప్రతిపాదనలు సిద్ధం చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించ వలసి ఉందని, వొచ్చే సమావేశం నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. 

పోల్యూషన్ కంట్రోల్  బోర్డు ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. అశోక్ కుమార్ మాట్లాడుతూ, గాలిలొ కాలుష్యం 2024 నాటికి పర్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలలో 20% నుండి 30% తగ్గింపును సాధించడం లక్ష్యంగా ఎన్. సి ఎ పి కార్యక్రమం ఏర్పాటు చేసి, అమలు చేయడం జరుగుతోందన్నారు. కనీసం పార్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలలో 20% నుండి 30% తగ్గింపును సాధించాల్సి ఉందన్నారు. జిల్లాలో 60 ప్రదేశాల్లో పరికరాలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని శ్రీ ఆనం కళా కేంద్రం లో ఒక పరికరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత 4 సంవత్సరాలు వివరాలు తెలుపుతూ 2018-19 లో 63 సాంద్రత, 2019-20 లో 59 ; 2020-21 లో 73, 2021-22 లో 63 గా గాలి కాలుష్యం లో పార్టిక్యులేట్ మ్యాటర్  నమోదు ఉందని, జాతీయ స్థాయి లో కనీసం 60 పాయింట్స్ కు చేరుకావాలని లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు.  ఇందుకోసం దేశంలో 122 నగరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లో ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ చేపట్టి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్ ఏం సి అధికారులు మాట్లాడుతూ, నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ ఫౌంటైన్ లతో ప్రాజెక్ట్ లను చేపట్టడం జరిగిందని, ఫౌంటైన్ లకు చెందిన పనులు 60 నుంచి 80 శాతం పూర్తి అయ్యాయని తెలియచేశారు. ఈ సమావేశంలో సంబందించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-05-11 10:03:33

ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చూడాలి..

అసని తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను     ఆదేశించారు. బుధవారం అసని తుఫాన్ పై ముఖ్యమంత్రి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, సూపరింటెండెంట్ ఆఫ్  పోలీస్ రాధిక, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి   పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ రానున్న అసని తుఫాన్ ను ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. తీర ప్రాంత మండలాల్లో  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోరా వేయించడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు  తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  ప్రజలను అప్రమత్తం చేయాలని యంత్రాంగానికి ఆదేశించామని  తెలిపారు. జిల్లా,మండల,గ్రామ స్థాయి అధికారులు , సిబ్బంది  అందరూ అందుబాటులోనే ఉన్నారని తెలిపారు.  జిల్లా కేంద్రంలో  తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని 08942- 240557 నెంబర్ కు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని తెలిపారు. అలాగే తీర ప్రాంత మండలాలలో తుఫాన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పటు చేయడం జరిగిందన్నారు. మండల స్థాయి అధికారులు వాలంటీర్ల సేవలను వినియోగించు కావాలన్నారు. జిల్లాలో 21 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో  721 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను, వృద్ధులను తరలించడం జరిగిందన్నారు.  తుఫాన్ షెల్టర్లను లోతట్టు ప్రాంతాల ప్రజలు, వయోవృద్ధులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సామగ్రి  సిద్ధం చేసుకోవాలని తాసీల్దార్లకు సూచించారు.  

వైద్య-ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ, ఎస్.ఇ. ఆర్.డబ్ల్యూ. ఎస్ అధికారులు  సిబ్బంది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని,  విద్యుత్ శాఖ అధికారులు కరంట్ స్థంబాలు ఇతర సామగ్రితో తుఫాన్ ప్రభావిత  మండలాలలో సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా లో 108 వాహనాలు,  ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.టి.ఆర్. ఎఫ్ బృందాలను  సిద్ధంగా ఉన్నాయని వివరించారు.  జనరేటర్ల ను  అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని  తాసీల్దార్ల ను  ఆదేశించినట్లు చెప్పారు.  అసని  తుఫాన్ ను ఎదుర్కోవడానికి  జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఇళ్ళల్లోనే ఉండాలని తెలిపారు.  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రం రేవుకు వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చిందని, ఆసని తుఫాన్ ప్రభావంతో బంగారు రంగు గల రథం, తీరానికి చేరుకుందని, తీరప్రాంతంలో ఈ రధం పూర్తి భద్రత కల్పించడం జరిగిందన్నారు. మండల తహశీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. వారి నుంచి నివేదికలు వచ్చిన తరువాత  ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు.

Srikakulam

2022-05-11 09:45:07

వైశాఖపౌర్ణమికి 2వ విడత చందన సమర్పణ

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 2వ విడత 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.  ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకి తన నిజరూప దర్శనమిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్ర గా ,చందనోత్సవంగా పిలుస్తారు. నిజరూపదర్శనం రోజు రాత్రికి 3 మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించారు. 2వ విడతగా వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మరో 3 మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఇందుకోసం ఆలయ సిబ్బంది ఇప్పటికే చురుగ్గా చందనము అరగతీత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జేష్ట పౌర్ణమికి మూడో విడతగా 3మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆషాడ పౌర్ణమి 4 నాలుగో విడత గా మరో 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఇక. శ్రావణ పౌర్ణమికి కరాళ చందన సమర్పణ తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. ఇలా ఏడాదిలో 4 విడతలుగా  పన్నెండు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం పూర్వ చక్రవర్తుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కాగా గుమ్మడి పండు అలంకారంలోఉన్న సింహాద్రి నాధుడు ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి వరకూ స్వామి ఇదే అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు.

Simhachalam

2022-05-11 09:22:41

16న మన్యంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు ఈ నెల 16వ తేదీన జిల్లాలో పర్యటనకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేశారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు సీతంపేట మండలం ఆడాలి గ్రామాన్ని చేరుకుంటారని చెప్పారు. ఆడాలి గ్రామంలో 12:30 గంటల వరకు స్థానిక గిరిజనులతో మాట్లాడుతారని, అనంతరం సీతంపేట చేరుకుని భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఐటిడిఏ సమావేశ మందిరంలో వివిధ గిరిజన సంఘాలతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సమావేశం తరువాత శ్రీకాకుళం చేరుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.

Parvathipuram

2022-05-10 11:16:20

సుస్థిర అభివ్రుద్ధిలో జిల్లా ముందుండాలి..

అనకాపల్లి జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో  మొదటి స్థానంలో ఉండాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్లో ఈ విషయమై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చిన  475 లక్ష్యాలను సాధించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుని కృషి చేయాలన్నారు. విద్య ఆరోగ్యం పేదరిక నిర్మూలన ఉపాధి మొదలైన విషయాలలో లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళికాయుతంగా  చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లీలావతి జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మణ్ రావు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సీతా మహాలక్ష్మి  జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి పశుసంవర్ధక శాఖ గృహ నిర్మాణ మార్కెటింగ్ పరిశ్రమలు ఈపీడీసీఎల్ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-05-10 10:55:03

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

అనకాపల్లి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం అనకాపల్లి ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిష్కరించ దగ్గ సమస్యల పై తగు చర్యలు తీసుకుంటామన్నారు.  మిగిలిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు మే 10 మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి గారికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జర్నలిస్టు నాయకులు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కలెక్టర్ కు నివేదించిన అంశాలు తెలుసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం తక్షణం మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఇందులో అన్ని జాతీయ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలని, మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల పై దాడులను అరికట్టాలని, మీడియా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు కల్పించాలని కోరారు. అన్ని స్థాయిలలో  పనిచేస్తున్న జర్నలిస్టులకు రాయితీ రైల్వే పాసులు మంజూరు చేయాలని,  వర్కింగ్ జర్నలిస్టులందరికీ వేతనాలు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కరోనా వ్యాధి తో మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని, కొన్ని నిబంధనలను సడలిస్తూ అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల రక్షణ కోసం రాష్ట్ర స్థాయి మరియు దేశస్థాయిలో జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ స్కీమ్ పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని,  జర్నలిస్టుల కోసం  సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని,  రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పునరుద్ధరించాలని, రాఘవాచారి ప్రెస్ అకాడమీ కి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, జర్నలిస్టులకు సంబంధించి వివిధ స్థాయిల్లో, నియామకాలు నిలిపివేసిన , కమిటీలను వెంటనే పునరుద్ధరించాలని వినతిపత్రంలో కోరారు. 

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, జిల్లా కార్యదర్శి పెంటకోట జోగినాయుడు,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా(ఏపీ యూ.ఎమ్.జే ఏ  ఉపాధ్యక్షులు ఆళ్ల వెంకట అప్పారావు, కోశాధికారి కొయిలాడ చంద్రశేఖర్,సహాయ కార్యదర్శి కాండ్రేగుల మోహన్ బాబు, మల్ల భాస్కరరావు, అజయ్ గంగాధర్, అవతారం, నానాజీ, శ్రీనివాసరావు, రమణాజీ, నటరాజ్, శశి, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-05-10 10:49:40

పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదు

శ్రీకాకుళం జిల్లాలో జలకళ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నా రు.మంగళవారం జిల్లా కలెక్టర్  చాంబర్ లో  జలకళ సంబంధిత పనులపై ఆయన సమీ క్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జళకల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జలకళ పనులపై ఆరా తీశారు.  డ్వామా ప్రోజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2296 బోర్లు తీసేందుకు జియాలజిస్ట్లు ఇప్పటికే సర్వే నిర్వహించారని తెలుపగా జియాలజిస్ట్లు వారీగా వివరాలను కలెక్టర్ అడుగగా వివరాలు పిడి వద్ద లేకపోవడం పై పూర్తి డేటాలతో సమీక్షకు హాజరు కావాలన్నారు. పనులు అపడం కాకుండా పరిష్కారానికి కావలసిన అనుమతుల నిమిత్తం ఫైల్స్ పంపించాలన్నారు. కాంట్రాక్టర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతికి సహకరించని సిబ్బందికి వేటు తప్పదన్నారు. ఏమైనా సమస్యలు తెలిపితే పరిష్కారం చూపిస్తామన్నారు.  కాంట్రాక్టర్లు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, బిల్లులు సకాలంలో అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో డ్వామా పి.డి. ఎం.రోజా రాణి, జియాలజిస్ట్లు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:39:45

డేటాఎంట్రీ త్వరిత గతిన పూర్తిచేయాలి

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ డేటాని తప్పులు లేకుండా అప్లోడ్ వేగవంత చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.  మంగళవారం కలెక్టర్ చాంబర్లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ డేటా అప్లోడ్ పై సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి, ఆర్.ఐ.ఓ, సర్వశిఖ అభియాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా వెనుకబడి ఉందని త్వరితగతిన ఎంట్రీ పూర్తిచేయాలన్నారు. రేపు సాయంత్రానికి శత శాతం ఎంట్రీ పూర్తి కావాలని జిల్లా విద్యా శాఖాధికారి, ఆర్.ఐ.ఓ, సర్వశిఖ అభియాన్ అధికారులను ఆదేశించారు. నేటికీ నిర్వహించిన డేటా ఎంట్రీల పై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశానికి సర్వశిక్షా అభియాన్ ఎ.పి.సి డా.ఆర్. జయప్రకేష్, జిల్లా విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ,  రీజనల్ ఇంటర్ మీడియట్ అధికారి ఎస్. తవిటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:37:52

ఉన్నత సమాజనిర్మానానికి విద్య ప్రధానం

విలువ‌లున్న విద్య‌తోనే ఉన్న‌త స‌మాజ నిర్మాణం సాధ్య‌మని, అందుకు వైస్సార్  స‌ర్కార్ నిరంత‌రం ప‌నిచేస్తోందని, పరిత‌పిస్తోంద‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వెల్ల‌డించారు. స్థానిక బాపూజీ క‌ళా మందిర్ లో జ‌గ‌న‌న్న విద్యా దీవెన, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌కి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌దస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నాణ్య‌మైన విద్య‌తోనే స‌మాజంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయ‌ని, త‌ద్వారా దేశాభ్యున్న‌తి సాధ్య‌మ‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్యారంగంలో మెరుగైన అవ‌కాశాలు అంద‌రికీ వ‌ర్తించే విధంగా ప‌నిచేస్తోంద‌ని, అందుకు త‌గ్గ ఆర్థిక స్థోమ‌త  క‌ల్పించేందుకు అధిక మొత్తం వెచ్చిస్తోంద‌ని చెప్పారు. చదువుకునే అవకాశం లేని సమాజం ఎంత మాత్రం ముందున్న కాలంలో ఎవ‌రి ఆమోద యోగ్యత‌నూ సాధించ‌దు అని అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి విద్యార్థులు ఉంటే, వారే బలమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించ‌డం త‌థ్యం అని అన్నారు. ఉన్న‌త విద్య ఉంటేనే మేలిమి రీతిలో సమాజం, తద్వారా రాష్ట్ర నిర్మాణం ప్ర‌గతి దిశ‌గా సాగ‌నుండ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.


దేశంలో అన్ని రాష్ట్రాల‌లో కంటే పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే వెచ్చిస్తున్నాం అని, విశాలమైన భావజాలం కలిగి ప‌థ‌కాల అమ‌లుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని వివ‌రించారు. సాంకేతికంగానూ, సామాజికంగానూ శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తున్న ప్రపంచంతో పోటీ ప‌డేందుకు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీష్ మధ్యమాన్ని ప్ర‌వేశపెట్టాం అని, పేద పిల్లలంద‌రూ ఉన్నత విద్యా ఫ‌లాలు అందుకోవాల‌ని, బాగా చదువుకోవాలని, ఆ ఉద్దేశం మ‌రియు దృక్ప‌థంతోనే అర్హుల‌యిన వారంద‌రికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నామ‌ని చెప్పారు. 69 వేల మందికి జిల్లాలో వసతి దీవెన అందిస్తున్నామని, అదేవిధంగా విద్యా దీవెన పేరిట కూడా అర్హులంద‌రికీ ఆర్థిక ల‌బ్ధి అందుతోంద‌ని అన్నారు. వారంద‌రికీ త‌మ ప్ర‌భుత్వం త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు చెబుతూ ప్ర‌సంగం ముగించారు.

శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ రామన్, ఎంఆర్వో వెంకటరావు,తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు,  మాజీ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ మెంటాడ వెంక‌ట పద్మావతి, జెడ్పీటీసీ సభ్యురాలు రుప్ప దివ్య,  ఎంపీపీలు గొండు రఘురాం, అంబటి నిర్మలా శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు అంబటి శ్రీనివాస రావు, గొండు కృష్ణ, చల్లా శ్రీనివాసరావు, సాధు వైకుంఠ రావు, మూకళ్ల తాత బాబు, డాక్ట‌ర్ పైడి మహేశ్వరరావు, ముంజేటి కృష్ణ, ప్రకాశ్, మార్పు పృధ్వి, సీజు చల్లా అలివేలు మంగ,  ఎం.మహాలక్ష్మి, సుగుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:36:00

మహాత్మాగాంధీ కలను నిజం చేద్దాం

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావని కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కార్యక్ర మాల్లో పాల్గొనాలి అంటూ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.సురేఖ తెలి పారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల లో మంగళవారం ఉదయం స్వచ్ఛభా రత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ వాకర్స్ క్లబ్, ఎన్ సి సి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  సురేఖ మాట్లాడుతూ పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సూచనలతో ఈరోజు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడమైనది. ప్రతి నెల 10వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. మనం మన పరిసరాలు శుభ్రం చేసుకోవాలి లనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిరభిచమని ఇది ఇక్కడికే పరిమితం కాకుండా ఎన్.సి.సి విద్యార్థులు ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పూర్తి సహకారం అందించారన్నారు.

ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో  వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్  పి.జి.గుప్తా,మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ ,స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు,క్లబ్ ప్రతినిధులు గోలీ ఉమామహేశ్వరరావు,ఎం.మల్లిబాబు, గోలీ సంతోష్,డాక్టర్ జి.నారాయణరావు , ఎన్.సి.సి విద్యార్థులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కళాశాల లెక్చరర్స్, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:30:54

పరిశుభ్రతకు తొలి అడుగుపడింది..

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పరిశుభ్రతకు అడుగు పడింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తెలవారక ముందే సైకిల్ పై పట్టణమంతా చుట్టుముట్టారు. పట్టణంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పారిశుధ్యం నుండి జాతీయ నాయకుల విగ్రహాల నిర్వహణ వరకు పరికించి చూసారు. జాతీయ నాయకుల విగ్రహాలు దూలి పట్టి ఉండటం చూసి చలించి పోయారు. స్వామి వివేకానంద  విగ్రహాన్ని స్వయంగా శుభ్రం చేసి స్ఫూర్తిని నింపారు. జాతీయ నాయకుల విగ్రహాలను గౌరవించడం మన విధి అని చెప్పకనే చెప్పారు. పట్టణంలో పలు అంశాల నిర్వహణ పట్ల తక్షణం చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలంను ఆదేశించారు.  మునిసిపల్ కమీషనర్ సైతం వెంటనే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలులో పెట్టుటకు చర్యలు చేపట్టారు. మంగళ వారం పట్టణంలో మరింత పరిశుభ్ర వాతావరణం నెలకొంది. జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రపరిచారు. జిల్లా కలెక్టర్ పట్టణంలో పర్యటించడం, వెను వెంటనే విగ్రహాలు శుభ్రపడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పట్టణంలో పారిశుధ్యం, మురుగు నీటి కాలువల కష్టాలు తొలగి పోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పట్టణం పొలిమేరల్లోని ఆవాసాల్లో విద్యుత్ కష్టాలు తొలగించుటకు జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు.

Parvathipuram

2022-05-10 05:56:41

విద్యార్థులకు సర్టిఫికెట్స్ జారీ చేయాలి

విద్యార్థుల ఉన్నత విద్యకు వివిధ సర్టిఫికేట్ లు అవసరమని, వాటిని సత్వరమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై సమీక్ష  నిర్వహించారు.  గృహ నిర్మాణాలు పై సమీక్ష నిర్వహిస్తూ ఇంటి నిర్మాణ పనులు, వివిధ దశలలో వేగవంతం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహనిర్మాణ పథకానికి   ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఈ పథకం అమలులో, లక్ష్యాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక్క గృహం కూడా గ్రౌండింగ్ కాకపోవడంపై ప్రశ్నించారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రతి అధికారి నిర్మాణాల పై బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలన్నారు.

ఉపాధి హామీ రోజువారీ  లక్ష్యాలను, పంచాయతీ వారీగా  నిర్దేశించుకుని పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజు కీలకమేనని, ఒక్క రోజు కూడా వృధా చేయకుండా లక్ష్యం మేరకు పని చేయాలన్నారు.  పంచాయతీ రాజ్ ద్వారా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్స్ ను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు.  సమగ్ర భూ సర్వే గ్రామ సదస్సులు నిర్వహించాలని, గ్రామస్తులకు ముందుగానే సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. భూ మ్యుటేషన్ కాలపరిమితి వరకు వేచి ఉండకుండా, వెంటనే పూర్తి చేయాలన్నారు.  జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్  మాట్లాడుతూ  సర్వేకు ముందుగానే మ్యుటేషన్ పూర్తిచేయాలని,  లేనిచో సర్వే సమయంలో తప్పనిసరిగా  మ్యుటేషన్ చేయాలన్నారు. డిజిటల్ సంతకం పెండింగ్ పూర్తిచేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా అధికారులు హాజరయ్యారు.


Parvathipuram

2022-05-10 05:55:01

డా.వైఎస్సార్ కలకు అంకురార్పణ జరిగేనా..?

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడాలి.. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ  విద్యార్ధులే ప్రభుత్వంలోని ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖను నడిపించాలి.. ప్రభుత్వానికి కావాల్సిన ఐటీ సేవలు మొత్తం  ఐటీ విద్యార్ధులే చేపట్టాలి.. అధికారిక వెబ్ సైట్ల నుంచి మొబైల్ యాప్స్ వరకూ అన్నీ ఆ విద్యార్ధులతోనే చేయించాలి.. కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయనే ధీమాల కల్పిం చాలి.. దానికోసం ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలి.. ఇదే నాటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి కల. దానికి అనుగుణంగానే ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ కంప్యూర్ సైన్స్ కోర్సు ఏర్పాటు అయ్యాయి. యూవర్శిటీలు, కాలేజీలో బీటెక్ కంప్యూర్ సైన్స్ సీట్లు కూడా పెరిగాయి. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. నేటికీ డా.వైఎస్సార్ కల సాకారం కాలేదు. ప్రభుత్వంలో ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు.  ప్రభుత్వానికి కావాల్సిన అన్నిప్రభుత్వ శాఖలకు చెందిన మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్లను థర్డ్ పార్టీ నిర్వహకులతో ప్రభుత్వం చేయిస్తోంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు డా.వైఎస్సార్ ప్రత్యేక ప్రణాళిక అప్పట్లో అమలు చేయాలని భావించారు.  ఆయన మదిలో మెదిలిన ఆలోచనకు కార్యరూపంలోకి రావాల్సి వుంది. కానీ విధి వైపరీత్యం ఆయన హెలీకాఫ్టర్ ప్రమాదంలో కాలం చేశారు. ఆయనతోపాటు ఆ మంచి ఆలోచన కూడా మరుగున పడిపోయింది. దానితో ప్రభుత్వ అధికారిక పోర్టల్ నిర్వహణ కూడా వివిధ ప్తైవేటు సాఫ్ట్ వేర్ డెలప్ మెంట్, మెయింటినెన్సును ఆ  సంస్థలు నిర్వహి స్తున్నాయి. దానికి ప్రభుత్వం లక్షలాది రూపాయాలు మెయింటినెన్స్ చార్జీలు చెల్లిస్తుంది.


డా వైఎస్సార్ ఆ.. ఐటీ శాఖ ఆలోచన ఏవిధంగా అమలు చేయాలనుకున్నారో ఒక్కసారి తెలుసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్ లైన్ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలకు శాఖాపరమైన వెబ్ సైట్ ఏర్పాటుచేయాలి, అత్యవసర సేవలకు మొబైల్ యాప్ రూపొందించాలి. అవన్నీ బీటెక్ కంప్యూర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్ధులతోనే చేయించాలి. అసలు ఒక ప్రభుత్వ శాఖనే ఏర్పాటు చేసి అందులో ప్రతీ శాఖను కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్ధులే నిర్వహణ చేపట్టేలా చూడాలి. తద్వారా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అత్యధిక మొత్తంతో ప్రభుత్వం ఆ శాఖలోని ఉద్యోగులకే జీతాలు ఇవ్వొచ్చు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వమే స్వయంగా సాఫ్ట్ వేర్ డెవలెప్ మెంట్ ద్వారానే అన్ని రకాల కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి కూడా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో ఐటీశాఖను జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేసి  ప్రభుత్వానికి, ప్రభుత్వశాఖలకు కావాల్సిన కంప్యూర్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సేవలన్నీ వారితోనే చేయించడం ద్వారా ప్రభుత్వానికి ఆర్ధికంగా చాలా పెద్ద మొత్తం కలిసి వస్తుంది.  ప్రభుత్వమే ఒక ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వం వద్దనే వారి వారి సంస్థలకు కావాల్సిన సాఫ్ట్ వేర్లను, వెబ్ సైట్లను తయారుచేయించుకునే స్థాయికి ఎదగవచ్చు అనేది వైఎస్సార్ ఆలోచన. దానికి అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసి అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ బీటెక్  కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. వాటితో పాటు యూనివర్శిటీల్లోనూ బీటెక్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ సీట్లును పెంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తీరా ఆయన కల సాకారం కావడానికి బీజం పడుతుందనే సమయంలో ఆయన దూరమైపోయారు. నాటి నుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిశగా మళ్లీ అడుగులు వేయలేదు. నిజంగా దివంగత ముఖ్యమంత్రి ఆలోచన కార్యరూపం దాల్చితే ప్రభుత్వ శాఖలో ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖఏర్పాటు అయ్యేది. అన్నిజిల్లాల్లోనూ ప్రభుత్వ శాఖలకు కావాల్సిన కంప్యూర్లు, అందులోని సాఫ్ట్ వేర్లు, ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ యాప్ లు, వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు, కంప్యూటర్ మెయింటినెన్సులు, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన ప్రత్యేక సాఫ్ట్ వేర్లు.. ఇలా అన్ని రకాలగా ఆశాఖ ఎంతగానో ఉపయోగపడేది. వారే నిర్వహణ మొత్తం చేపట్టేవారు. తద్వారా ప్రతీ జిల్లాలోనూ ఉద్యోగాల కల్పన కూడా జరిగేది. కానీ ఆ ప్రయత్నం జరగకపోవడం వలన ప్రస్తుతం  ప్రతీది థర్డ్ పార్టీ ప్రైవేటు సంస్థలతోనే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించుకోవాల్సి వస్తుంది. నాడు డా.వైఎస్సార్ ఆలోచనలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్ధులకు కంప్యూటర్లపై అవగాహన కూడా కల్పించాలని. దాని కోసం సాధారణ ఉపాధ్యాయులు మాదిరిగా, బీటెక్, ఎంటెక్ చదివి విద్యార్ధులను కంప్యూటర్ కోర్సులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులుగా డిగ్రీ వరకూ నియమించాలనే ఆలోచన కూడా ఉండేదట. తద్వారా విద్యార్ధులు పదవతరగతికి వచ్చేనాటికే కంప్యూటర్ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన రావడంతోపాటు,  డిగ్రీ తరువాత వారు కూడా ప్రత్యేక కోర్సులు కళాశాలల్లోనే నేర్చుకుని ఆపై వెను వెంటనే సాఫ్ట్ ఉద్యోగాల్లో స్థిరపడటం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత దేశం అందునా ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ ఎగుమతులు, దిగుమతుల్లో అగ్రస్థానంలో నిలబడుతుందని ఆలోచన చేశారట.

దివంగత ముఖ్యమంత్రి తుదిశ్వాస విడిచిన తరువాత అధికారంలోకి  వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఆదిశగా ఆలోచన చేయలేదు. అలా చేసి ఉంటే నేటికి ప్రభుత్వానికి బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూర్ సైన్స్ కోర్సులు చదివిన విద్యార్ధులకు మెండుగా ఉపాది, ఉద్యోగ  అవకాశాలు వచ్చేవి. పైగా ప్రభుత్వంలోని ఒక శాఖ ఏర్పాటుతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పన చేయడానికి ఆస్కారం వుండేది. చాలా ఏళ్ల తరువాత డా.వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఐటీకి పెద్ద పీట వేశారు తప్పితే తండ్రి ఆలోచనలు మాత్రం పునికి పుచ్చుకోలేదు. ఈ ప్రభుత్వంలో కూడా నాటి ఐటీ శాఖ మంత్రి కూడా ఆ దిశగా ఆలోచనలు చేయలేదు. కానీ ఇపుడు అదేశాఖకు యువకుడు గుడివాడ అమర్నాధ్ మంత్రి అయిన తరువాత మళ్లీ ఆ దిశగా అడుగులు పడతాయనే భావన అందరిలోనూ కలుగుతోంది. కానీ వారికున్న పదవీకాలం చాలా చిన్నది. రాజకీయాలు చేయడానికి, సంక్షేమ పథకాల అమలుకే సమయం మొత్తం అయిపోతుంది. ఆ సమయంలోనే డా.వైఎస్సార్ కలను నిజం చేస్తారా..?  లేదంటే ఆయన కంటే మిన్నగా ఆలోచించి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ఐటీ శాఖను ఏర్పాటు చేసి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా  క్రుషి చేస్తారానే చర్చ కూడా రాష్ట్రంలో గట్టిగా జరుగుతోంది. దానికి కారణం మంత్రి కూడా బీటెక్ చదివిన వ్యక్తికావడంతో ఐటీశాఖను  రాష్ట్రప్రభుత్వ శాఖలన్నింటిలోనూ అగ్రభాగన నిలబెడతారనే భావనను అంతా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి డా.వెఎస్సార్ కన్న ఐటీశాఖ ఏర్పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటవుతుందా లేదా అనేది.

Tadepalli

2022-05-10 04:04:46

స్పందనకు అధికారులు హాజరు తప్పనిసరి

 ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమానికి  జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మండల స్థాయిలో కూడా మండల స్థాయి  అధికారులు మాత్రమే   స్పందన కార్యక్రమం నిర్వహించాలని, స్పందన కార్యక్రమం నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.    స్పందన కార్యక్రమం లో  వచ్చిన ప్రజా ఫిర్యాదులను సత్వరమే   పరిష్కరించాలని తెలిపారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, గ్రామ సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఎక్కువగా అర్జీలు అందజేశారు.  స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్  మరియు సంయుక్త కలెక్టర్   ఒ. ఆనంద్, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాధ్, డి ఆర్ ఒ వెంకటరావు పాల్గొని వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి మొత్తం 85 వినతులు అందాయి. 

జయ్యమ్య  వలస మండలం అoకవరం  గ్రామం పంచాయతీ లో నిర్మియించిన రైతు భరోసా కేంద్రం భవన అద్దె బకాయి చెలించాలని  వి.వెంకట రమణ కోరారు.  మరి పల్లి గ్రామానికి చెందిన శ్రీకాకుళం నరేంద్ర కుమార్ డిప్లమో పూర్తి చేశానని ఉపాధి చూపించాలని దరఖాస్తు పెట్టుకున్నారు.  పార్వతీపురం మండలం  బాలగుడబ  రెవెన్యూ పరిధిలో వాగుల తూము వద్ద సర్వే జరిపించి హద్దులు  నిర్ణయించాలని, చెరువు  గర్భంలో  ఆక్రమణలు తొలగించి హద్దులు  నిర్ణయించి తూము నిర్మాణం చేపట్టాలని హాయిగా సంఘం అధ్యక్షురాలు యండా రాజేశ్వరి కోరారు.  గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన తంగుడు   జయనరాణి వైఎస్ఆర్ చేయూత మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.  గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం పంచాయతీ కార్యదర్శి రావాడ సిమ్మయ్య జీతభత్యాల బకాయిలు ఇప్పించవలసిందిగా కోరారు.  మక్కువ  మండలం శంబల గ్రామం లో ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలు సక్రమంగా   అందడంలేదని, గ్రామానికి వాలంటీర్ ను నియమించాలని గ్రామస్తులు  నమ్మి సత్యనారాయణ  ఇతరులు వినతి పత్రం అందజేశారు.  పాచిపెంట మండలం కర్ర వలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 154-3, 154-5, 155-6 లలో సాగు చేసుకుంటున్న గిరిజనులకు   ఎ7.18 ట్లు  భూమికి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఆదివాసి వికాస్ పరిషత్ అధ్యక్షులు సిహెచ్.  జోగయ్య కోరారు.

Parvathipuram

2022-05-09 09:24:10