1 ENS Live Breaking News

ఉన్నత చదువులకి ఇంగ్లీషు తప్పనిసరి

వేసవి విజ్ఞాన శిబిరం లో భాగంగా రెండవ రోజు బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు, కార్యదర్శి కె.కుమార్ రాజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ ను ప్రాథమిక స్థాయి నుంచే  నేర్చుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఇంగ్లీషు భాషలో మాట్లాడడం వ్రాయుటము వంటివి చేయాలన్నారు. విద్యార్థులతో జాతీయ నాయకుల పుస్తకాలను చదివించారు. కొంతమంది విద్యార్థులు తమకు తెలిసిన కథలను చెప్పారు. మరికొంత మంది విద్యార్థులు దేశభక్తి గేయాలు పాటల రూపంలో పాడారు. 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లో డిప్యూటీ లైబ్రేరియన్ జి.తిరుమల కుమారి, గ్రంథాలయ సిబ్బంది చిరంజీవులు, యోగానంద్, పి.ఈశ్వరరావు, టి.రాంబాబు, పి.రామమోహన్, పి.భానుమతి, ప్రత్యూష, గణేష్ తదితరులు పాల్గోన్నారు.

Srikakulam

2022-05-18 15:01:11

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ప్రజా జీవితంలో ప్రజా ప్రతినిధులు సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిన్న జీయర్ స్వామి వారిని గోదావరి నదీ తీరాన గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి వెంట రాజా నగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు కర్రీ పాపా రాయుడు, ఆకులవీర్రాజు తదితరులు ఉన్నారు. 

Rajahmundry

2022-05-18 13:40:25

టిఎంఎఫ్ ప్రాజెక్ట్ లో ఉద్యోగ అవకాశాలు..

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లాలో పాఠశాల పారిశుద్ధ్య కార్యక్రమం అమలు చేసేందుకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసిటన్టు జిల్లా విద్యాశాఖ అధికారి డా. పి రమేష్ తెలిపారు. పిఎంయు లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయుటకు ఒక ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించినందున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.  పథక సమన్వయకర్త (ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్)  పోస్టుకు దరఖాస్తు చేయదలచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండి పాఠశాల లేదా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో సహాయ సంచాలకులు లేదా పర్యవేక్షకులు లేదా ప్రధానోపాధ్యాయులుగా పని చేసి పదవీ విరమణ పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, వారికి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేయదలచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ మరియు ఎంఎస్ ఆఫీస్ నందు,  తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ లో నైపుణ్యం కలిగి ఉండాలని, వారికి నెలకు 18500 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు.  జిల్లా విద్యాశాఖ లో పనిచేయుచున్న సహాయ సంచాలకులు, ఉప విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా మాన్ పవర్, ఔట్సోర్సింగ్ కమిటీకి పంపి, కమిటీ ఆమోదంతో అవుట్ సోర్సింగ్ విధానం లో  నియామకం జరుగుతుందని డిఇఓ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి, సంబంధిత ధ్రువ పత్రాలు జతపరచి పూర్తి వివరాలతో దరఖాస్తును ఈనెల 25వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నేరుగా గాని పోస్టు ద్వారా గాని సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలు, సందేహ నివృత్తి కోసం కార్యాలయ పని వేళల్లో 8309994622 లేదా 9441328097 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. 

Paderu

2022-05-18 13:28:21

ఇక డా.భీఆర్.అంబేత్కర్ కోనసీమ జిల్లా

కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్. అంభేత్కర్ జిల్లాగా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ ప్రాంతీయుల చిరకాల కోరిక తీరినట్టు అయ్యింది..

కోనసీమ

2022-05-18 13:24:00

మిషన్ నిర్మాణ్ ను వినియోగించుకోండి..

మిష‌న్ నిర్మాణ్ - 2022 పేరిట ఐదు రోజుల పాటు స్థానిక‌ ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో వివిధ అంశాల‌పై నిపుణుల చేత ప్ర‌త్యేక‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. విద్యార్థుల‌కు ఇదొక సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని అంద‌రూ సద్వినియోగం చేసుకోవాల‌ని బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా సూచించారు. స‌మ‌గ్ర శిక్షా అభియాన్ ప‌ర్య‌వేణ‌లో కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీషు, 21 సెంచ‌రీ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ, ఏసీఈ సంస్థ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. కెరియర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్ర‌త్యేక‌ వర్క్ షాప్‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి రోజూ ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కేంబ్రిడ్జ్  విశ్వవిద్యాలయం సర్టిఫై చేసిన శిక్షకులతో ప్రత్యేక‌ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు చ‌దివే విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌వ‌చ్చ‌ని ఆస‌క్తి క‌లిగిన వారు వివ‌రాల‌ను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాల‌ని సూచించారు. ఇత‌ర వివ‌రాలకు 90002 04925, 90002 01525 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ్చ‌ని చెప్పారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు స‌మ‌గ్ర శిక్షా అభియాన్ పీవో స్వామినాయుడు తెలిపారు.

Vizianagaram

2022-05-18 12:56:03

సక్రమంగా సేవలందించకపోతే రెడ్ లిస్ట్

గ్రామ స‌చివాల‌యానికి స‌మ‌యానికి రాకుండా.. ప్ర‌జ‌ల‌కు సంతృప్తిక‌ర సేవ‌లందించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించే స‌చివాల‌య ఉద్యోగుల‌ను, వాలంటీర్ల‌ను రెడ్ లిస్టులో పెట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌ర ప‌రిధిలోని వ‌సంత విహార్ స‌చివాల‌యాన్ని ఆమె బుధ‌వారం ఉద‌యం 10.15 గంట‌ల‌కు ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ స‌చివాల‌య ప‌రిధిలో సేవ‌లు స‌రిగ్గా అంద‌టం లేద‌ని ప‌రిశీలిద్దామ‌ని ఇక్క‌డికి వ‌చ్చాం.. కానీ ఇక్క‌డెవ‌రికీ క్ర‌మశిక్ష‌ణ ఉన్న‌ట్లు క‌నిపించ‌టం లేద‌ని క‌లెక్ట‌ర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆమె వెళ్లిన అర‌గంట‌ త‌ర్వాత కూడా కొంత‌మంది సిబ్బంది రావ‌టంతో వారిని ప్ర‌శ్నించారు. మీకు స‌మ‌య‌పాల‌న లేదా అని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. వాలంటీర్లు కూడా ఎవ‌రూ రాక‌పోవ‌టంతో ప‌నితీరు ఆధారంగా నివేదిక‌లు త‌యారు చేయాల‌ని, ప‌నితీరు బాగులేని ఉద్యోగుల‌ను, వాలంటీర్ల‌ను రెడ్ లిస్టులో పెట్టాల‌ని జిల్లా స‌చివాల‌య కో-ఆర్డినేట‌ర్ అశోక్‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఇక నుంచి ప్ర‌తి స‌చివాల‌యం తాలూక ప్ర‌గ‌తి నివేదిక‌లను ప‌రిశీలించి జాబితా త‌యారు చేయాల‌ని సూచించారు.

స‌చివాల‌య సంద‌ర్శ‌న సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ప‌లు నివేదిక‌ల‌ను ప‌రిశీలించారు. బీయాండ్ ఎస్‌.ఎల్‌.ఎ. ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని, నిర్ణీత వ్య‌వ‌ధిలోగా ప్ర‌తి సమ‌స్య‌ను ప‌రిష్క‌రించాలని సిబ్బందిని ఆదేశించారు. సాంకేతిక ప‌ర‌మైన స‌మస్య‌లుంటే సంబంధిత అధికారుల‌ను సంప్ర‌దించి స‌త్వ‌రమే ప‌రిష్క‌రించాల‌ని, కాల‌యాప‌న చేయ‌రాద‌ని సూచించారు. స‌చివాల‌య ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా యూనిఫాం ధ‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. సిబ్బంది హాజరు ప‌ట్టిక‌ను, ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను క‌లెక్ట‌ర్ స్వ‌యంగా ప‌రిశీలించి ప‌నితీరు బాగులేని వారిని మంద‌లించారు. కార్ప‌రేష‌న్ ప‌రిధిలో ఉన్న స‌చివాల‌యాల‌ను త‌ర‌చూ సంద‌ర్శించాల‌ని స్థానిక మున్సిప‌ల్ అధికారి హ‌రీశ్‌ను ఆదేశించారు. సిబ్బందికి క్ర‌మ శిక్ష‌ణ అల‌వ‌ర్చాల‌ని, ప‌నితీరులో ఆశాజ‌న‌క మార్పు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఆమె వెంట సచివాల‌యాల జిల్లా కో-ఆర్డినేట‌ర్ అశోక్‌, స్థానిక మున్సిపాలిటీ అధికారి హ‌రీశ్, స‌చివాల‌య ఉద్యోగులు త‌దిత‌రులు ఉన్నారు.

Vizianagaram

2022-05-18 10:11:18

విజయనగరంలో 29న పోలిసెట్ పరీక్ష

విజయనగరం జిల్లాలో ఈ నెల 29 న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరుగుతుందని డి. ఆర్.ఓ గణపతి రావు తెలిపారు.  విజయనగరం జిల్లాలోని 10 కేంద్రాల్లో, బొబ్బిలి లో 9, గజపతి నగరం లో 4 కేంద్రాల్లో ఉదయం 10 నుండి 1 గంటవరకు పరీక్ష జరుగు తుందన్నారు. పరీక్ష హాల్ లోనికి ఒక గంట ముందు అనుమతిస్తారని, 11 తర్వాత నిమిషం  ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు.   విద్యా శాఖ నుండి ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  వేసవిని దృష్టి లో పెట్టుకొని ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, ప్రధమ చికిత్స కు అవసరమగు మందులను పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. పరీక్షల కేంద్రం వద్దకు పరీక్షా సమయం లో అవసరమగు బస్ లను నడపాలని ఆర్.టి.సి వారికీ సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.అన్ని  శాఖల సమన్వయం తో పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పోలీటెక్నిక్ ప్రిన్సిపాల్,  జిల్లా పరీక్షల సమన్వయాధికారి  విజయలక్ష్మి, డి.ఈ.ఓ కార్యాలయపు ఏ.డి లక్ష్మణ రావు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-18 10:04:15

లక్ష్మీకాంత్ నాయకోదాసు సేవలు ఆమోఘం

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఒడిశాకు చెందిన భక్తుడు లక్ష్మీకాంత్ నాయకో దాస్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ లు  సంఘం కార్యదర్శిగంట్ల శ్రీనుబాబు కొనియాడారు. బుధవారం సింహద్రి నాధుడుని దర్శించుకున్న శ్రీనుబాబు ఆతరువాత దాసుడు బాబు ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆషాఢ పౌర్ణమి వరకూ ఇక్కడే ఉండి పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దాస్ శ్రీను బాబుకి  తెలిపారు. ఇదే సమయంలో సింహాద్రినాధుడు కు  ప్రీతిపాత్రమైన ఆర్జిత సేవలను ఏటా మాదిరిగానే  తమ బృందం జరిపిస్తుందని దాస్ వివరించారు. సింహగిరిపై ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని శీనుబాబు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా నూతన వధూవరులకు నిత్య కళ్యాణం, స్వర్ణపుష్పార్చన సేవలు అందుబాటులోకి రావడం వల్ల భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు ఇక.. సింహగిరికి వచ్చే భక్తుల సంఖ్య ఇటీవల కాలములో ఘన నీయముగా పెరుగుతూ వస్తుందని, అందుకు హుండీలు ద్వారా లభిస్తున్న కానుకల ఆదాయమే  నిదర్శనంగా పేర్కొనవచ్చునన్నారు. ఐతే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా తమ వంతు కృషి చేయనున్నట్లు శ్రీనుబాబు  వివరించారు. ఆలయ ఈవో ఈఓ సూర్య కళ,  ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పూర్తిస్థాయిలో వీటిపై సారించాల్సిన అవసరం ఉందన్నారు. సింహాద్రినాధుడు చందనోత్సవం సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మొక్కుబడి తీర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ చందన స్వామి చల్లని కరుణాకటాక్షాలు లోకమంతా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు శ్రీనుబాబు మీడియా ద్వారా వివరించారు.

Simhachalam

2022-05-18 09:08:43

జిల్లా కలెక్టర్ ను కలిసిన అడిషనల్ ఎస్పీ

కాకినాడ జిల్లా  కృతికా శుక్లాను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. శ్రీనివాస్ మంగళవారం కలెక్టరేట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈయన ఇటీవలే ఏఎస్పీ(అడ్మిన్) గా విధుల్లోకి చేరారు. ఈ మేరకు జిల్లాలోని ముఖ్య అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకుంటున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తరువాత పరిపాలన విభాగంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కీలకంగా వ్యవహరిస్తారు. జిల్లా ఎస్పీ లేని సమయంలో కూడా ప్రభుత్వం ఏస్పీలకే అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తుంది. ఈ తరుణంలో జిల్లాపై పూర్తిస్థాలోయిలో ఏఎస్పీలకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అడిషనల్ ఎస్పీలుగా విధుల్లో చేరిన వారు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎంపీలు ఇలా ప్రముఖలందరినీ కలిసి పరిచేసుకుంటున్నారు. నూతనంగా విధుల్లోకి చేరిన ఏఎస్పీ అడ్మిన్ పి.శ్రీనివాస్ కు ముక్కుసూటి అధికారిగా కూడా మంచి పేరుంది. 

Kakinada

2022-05-17 16:29:31

మోదమాంబకు వస్త్రాలు సమర్పించిన మంత్రి

గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణ ధ్యేయంగా శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మూడు రోజుల పాటు నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్ కె రోజా పేర్కొన్నారు. మంగళవారం పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన మోదకొండమ్మ అమ్మవారి జాతరకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా జాతర జరుపుకోలేకపోయామని గుర్తు చేసిన మంత్రి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సంతోషంగా ఉండాలని అభిలషించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అందించని సేవలు, సౌకర్యాలు మన ముఖ్యమంత్రి జగనన్న గిరిజనులకు అందిస్తున్నారని వెల్లడించారు.  జిల్లాల విభజన లో భాగంగా గిరిజనుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న అభిమానం అని మంత్రి వివరించారు. 
ఆలయానికి, దేవతకు ముఖ్యమైన చరిత్ర ఉందనీ,  గిరిజన, గిరిజనేతర వర్గాలచే పూజించబడుతున్న ఏజెన్సీ ప్రాంతంలో శక్తివంతమైన దేవతగా మోదకొండమ్మ అమ్మవారు పరిగణించబడుతుందనీ పేర్కొన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధికి మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయటమే కాకుండా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.

పర్యాటకంగా అభివృద్ధికి కృషి

అరకు వ్యాలీలో ఎన్నో సహజసిద్ధమైన అందాలు ఉన్నాయని, బొర్ర గుహలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని పేర్కొన్న మంత్రి అరకు పేదవారి స్విట్జర్లాండు గా అభివర్ణించారు.  అటువంటి అరకు, పరిసర ప్రాంతాలను పర్యాటక ఆకర్షణ గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

     శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రివర్యులను ముందుగా ఐటిడిఎ పిఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్ ఘన స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో అమ్మవారి ఆలయంలోకీ తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసారు.  అనంతరం అమ్మవారి చిత్ర పటాన్ని బహూకరించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

       ఈ కార్యక్రమంలో స్థానిక పాడేరు శాసనసభ్యులు కె. భాగ్యలక్ష్మి, ఎంఎల్సి వరుధు కల్యాణి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ శొభా స్వాతిరాణి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింహాచలం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-05-17 10:17:13

పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని ఆర్జించాలి

పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్  సువ్వారి సువర్ణ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్ధులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ, వారి ఆధీనంలో ఉన్న అన్ని గ్రంథాలయాలలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఈ రోజు నుండి జూన్ 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ వేసవి శిబిరంలో కధలు వినుట, చెప్పడం, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దల నుంచి విన్న అముద్రిత కథలు చెప్పుట, చిత్రలేఖనము, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజూ ఉదయం 8.00 గం॥ నుంచి మధ్యాహ్నం 12.00 గం॥ల వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు ఈ వేసవి శిబిరాలకు హాజరై సృజనాత్మకతను పెంచుకొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించవలసినదిగా కోరారు. అలాగే గ్రంథాలయాల్లో త్రాగునీరు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరింరు. తల్లిదండ్రులు పిల్లలను గ్రంధాలయాలకు పంపినప్పుడు దగ్గరుండి తీసుకురావాలని తీసుకు వెళ్లాలని  కోరారు.

జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ మాట్లాడుతూ ఆటలతో, పాటలతో పాటు రీడింగ్ అవసరమని, ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం మంచి లక్షణమని  వేసవి సెలవుల్లో సబ్జెక్ట్ తో పాటు మీకు వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. వివిధ రకాల పుస్తకాలు చదవడంతో లోక జ్ఞానం వస్తుందన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఇటువంటి సమయంలో మీరు బైట తిరగకుండా పుస్తకాలు చదవాలనే దృక్పథంతో ఈ శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి కుమార్ రాజా, ప్రత్యేక అతిధి సువ్వరి సత్యనారయణ, ఉప గ్రంధాలయ అధికారి తిరుమల కుమారి, గ్రంధాలయాధికారి ఎస్.వి.రమణమూర్తి, జి.గోవిందా రావు, పిల్లలు వారి తల్లదండ్రులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-17 10:07:02

చెత్త నుంచి సంపదను తయారుచేసుకోవాలి

చెత్త చెత్తగా ఉంచేయకుండా దానిని సంపదగా మార్చాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరిశుభ్రమైన జిల్లా ఆవిర్భావం కావాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లా యావత్తూ పరిశుభ్రమైన జిల్లాగా అవతరించాలని ఆయన పిలుపునిస్తూ మంగళవారం సీతానగరం మండలం పెదభోగిల గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను తనిఖీ చేశారు. కేంద్రంలో చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుగా మార్చే విధానం, మార్కెటింగ్, ప్లాస్టిక్ వస్తువులను వేరుచేసే ప్రక్రియ ఇతర అంశాలను వివరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుండి సంపద కేంద్రాలు అన్ని పూర్తిస్థాయిలో పని చేయాలని పేర్కొన్నారు. కేంద్రాల పరిధిలో ఉన్న చెత్త శతశాతం సేకరణ జరగాలని, ఈ కేంద్రాలకు తీసుకువచ్చి శాస్త్రీయ విధానంలో ప్రక్రియను చేపట్టి సేంద్రియ ఎరువులుగా మార్చాలని అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఆ పంటలకు మంచి ఆదాయం లభిస్తుంది, రైతులకు సేంద్రియ ఎరువుల వినియోగం తెలియజేయాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూ సారం తగ్గుతుందని, సేంద్రియ ఎరువులు వాడటం వలన భూసారం రోజురోజుకు పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. రైతుల్లో అవగాహన పెరగడం వలన ఎరువుల వినియోగం పెరుగుతుందని చెప్పారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది అందరూ చిత్తశుద్ధితో చేయడం వలన ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులు దిగుబడి, మార్కెటింగ్ చేయుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంలో సైతం సేంద్రియ ఎరువుల కొనుగోలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత సంకల్ప వాహనాలను పంచాయతీలు పూర్తిస్థాయిలో వినియోగించాలని, వాటికి డ్రైవర్లను పంచాయతీ నిధుల ద్వారా నియమించు కోవాలని  సూచించారు. ప్లాస్టిక్ పదార్థాలను వేరు చేయడం, సరైన విధానంలో ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయుటకు అవకాశాలను  పరిశీలించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారిస్తూ జిల్లా పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం పెద్ద మొత్తంలో తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, తాహశీల్దార్ అప్పల రాజు, ఆర్. డబ్ల్యు.ఎస్ జెఇ పవన్ కుమార్,  ఇఓ ఆర్డీ ప్రసాద్, పంచాయతీ ఈవో వెంకట్, సర్పంచ్ జొన్నాడ థేరీశమ్మ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-17 09:45:25

శతశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలి

పార్వతిపురం మన్యం జిల్లాలో మంజూరైన హోసింగ్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు మొదలైన పధకాలకు శతశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో   వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై సమీక్ష  నిర్వహించారు.  గృహ నిర్మాణాలు పై సమీక్ష నిర్వహిస్తూ  లక్షాలు మేరకు గ్రౌండింగ్  పూర్తి చేయాలని, ఇంటి నిర్మాణ పనులు దశలవారీగా   పురోగతి ఉండాలన్నారు.  పథకం అమలులో సచివాలయం స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకొని  పనులు  పూర్తి చేయాలన్నారు.  పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టిన  సచివాలయం, రైతు భరోసా కేంద్రాల  భవనాలు నిర్మాణ నులను వెంటనే  మొదలుపెట్టి పూర్తి చేయాలన్నారు. ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్స్ లక్ష్యంమేరకు యివ్వాలన్నారు.  నరేగా పథకం ద్వారా  ఉపాధి కల్పన వేగవంతం చేయాలని,  రోజువారీ  లక్ష్యాలను, పంచాయతీ వారీగా  నిర్దేశించుకుని లక్ష్యం పూర్తి చేయాలన్నారు.  కనీస వేతనం వచ్చేవిదంగా చూడాలని, పనిని బట్టి కూలీలను కేటాయించాలని, చిన్న పనికి ఎక్కువ మందిని పెడితే  వేతనం గిట్టుబాటు కాదన్నారు.  ఇంటి ఆధార్ సీడింగ్, ఈ కే వై సి,   విద్యుత్ కనెక్షన్ ఆధార్ సీడింగ్,  పధకాలు పెండింగ్ లబ్ధిదారులు వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు. స్పందన, మీ సేవ, ఈ సేవ లలో దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. ప్రతి పధకం సచివాలయం వారీగా డేటా తయారు చేసుకోవాలన్నారు.
 
     జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్  మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే ముందుగా గ్రామ సదస్సులు నిర్వహించి మొదలుపెట్టాలని, గ్రామస్తులకు ముందుగానే సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. మొదటి సభలో సమాచారం అందించి  సర్వేకు ముందుగానే మ్యుటేషన్ పూర్తిచేయాలని,  లేనిచో సర్వే సమయంలో తప్పనిసరిగా   మ్యుటేషన్ చేయాలన్నారు.  రెండవ గ్రామ సభలో వ్యక్తిగత నోటీసులు అందించి సర్వే మొదలు పెట్టాలని తెలిపారు.డిజిటల్ సంతకం  పెండింగ్ పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Parvathipuram

2022-05-17 09:41:10

త్రాగునీటి సమస్యకు 2రోజుల్లో పరిష్కారం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తీసుకువచ్చిన త్రాగునీటి సమస్యకు రెండు రోజుల్లో పరిష్కారం చూపి తమది ప్రజా ప్రభుత్వం అని మరోసారి చాటామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.  అనంతపురం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని భవాని నగర్ పైప్ లైన్ రోడ్ లో నీటి సమస్య అధికంగా ఉందని రెండు రోజుల క్రితం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికులు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి  దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు సమస్యను వెంటనే  పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.దీనితో అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించగా డివిజన్ పరిధిలోని నాలుగు వీధులు మిట్ట ప్రాంతంలో ఉండటంతో నీటి సరఫరా జగగడం లేదని గుర్తించారు. వెంటనే సరఫరా జరిగే విదంగా ప్రత్యేకంగా గేట్ వాల్వ్ ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడంతో సోమవారం ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా జరగడంతో మేయర్ మహమ్మద్ వసీం గారు ఆ ప్రాంతంలో పర్యటించగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను వీలయినంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి ఆదేశం మేరకు భవాని నగర్ పైప్ లైన్ రోడ్ లో నీటి సమస్య పరిష్కరించామన్నారు.ప్రజలు కూడా నీటిని వృధాచేయకుండా  కుళాయిలకు మూతలు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు.కార్యక్రమంలో డిఈ చంద్రశేఖర్, కార్పొరేటర్ కమల్ భూషణ్,నాయకులు గంగాధర్ తోపాటు అధికారులు పాల్గొన్నారు.

Anantapur

2022-05-16 07:59:41

ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం..

ప్రపంచం అంత ఒకటే కుటుంబం అని బౌద్ధమతం బౌద్ధులకు మాత్రమే కాకుండా మనందరికి  'వసుధైవ కుటుంబకం' అనే సందేశాన్ని ఇస్తుందని  రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.  సోమవారం  ఉదయం మంత్రి కార్యాలయంలో బౌద్ధ గురువు వేన్ సుమేధా బోధి మంత్రిని కలిసి స్థలం కోసం మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ,  ప్రపంచంలో అన్ని సమాజాలు శాంతియుతంగా సహజీవనం చేయడానికి బౌద్ధ మతం  మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నదన్నారు. బుధుని బోధనలకు మరియు హిందూ మత బోధనలకు దగ్గరి సంబంధం ఉందన్నారు.  బుద్ధుని బోధనలు వలన సాధకుడు  జ్ఞానోదయం పొందుటయే గాక సమాజములో మానవత్వం, దయ వంటి సద్గుణములు అభివృద్ధి చెంది శాంతియుత సహజీవనమునకు దోహద పడుతుంది. 

ఈ రోజుల్లో, మనకు మతపరమైన ఆచారాలలో విప్లవాత్మక మార్పులు అవసరం. డిజిటల్ యుగానికి అనుగుణంగా సాధన విధానమును ఆచారాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని వేన్ సుమేధా బోధి పేర్కొన్నారు.  సాంఘిక, రాజకీయ మరియు ఆర్థిక అంశాలలో మార్పు కారణంగా పురాతన ఆచారాలు మరియు వ్యవస్థలు ఇప్పుడు ఆచరణలో లేవన్నారు.  ఒక బౌద్ధ భిక్షువుగా నూతనమైన   'సామాజిక బౌద్ధ ధర్మ'  విధానం  ద్వారా సమాజంలో మార్పే గాక  తప్పుడు మార్గములో ఉన్నవారిని సాధన ద్వారా సంస్కరించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.  డా.బీ.ఆర్.అంబెద్కర్   సూచించిన విధముగా సోషల్ జస్టిస్ కోసం కృషి చేస్తామని దమ్మ సోల్జర్ సుమేద బోధి చెప్పేరు.  ధవళేశ్వరం లో  గాని కొవ్వూరు లో గాని బుద్ధ విహారం  తో పాటు కుటీరం నిర్మించడాని కోసం 3 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలని మంత్రిని  కోరారు. 

Rajahmundry

2022-05-16 06:04:56