1 ENS Live Breaking News

విద్యార్థుల మనో వికాసానికి క్రీడలు అవసరం

విద్యార్థులకు క్రీడలు చాలా ముఖ్యమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  ఆర్. కూర్మనాథ్   తెలిపారు. ఆదివారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా  మైదానంలో వేసవి కాల క్రీడా శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 70 క్యాంపులు ఏర్పాటుచేసి, 15 క్రీడల  నందు శిక్షణ ఇస్తున్నట్లు  తెలిపారు. ఆర్చరి, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, చెస్, తైక్వాండో, కరాటే, బాస్కెట్ బాల్, ఫెన్సింగ్  మరియు యోగ లలో  శిక్షణా తరగతులు  అందిస్తారని తెలిపారు.   పాఠశాల లలో  ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థుల మనోవికాసానికి, దేహ దారుఢ్యానికి క్రీడలు చాలా అవసరమని అన్నారు. నేటి కార్పొరేట్ విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దానివల్ల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,  ఈ క్రీడా శిబిరానికి విద్యార్థుల పంపిన తల్లిదండ్రులను అభినందిస్తున్న ట్లు తెలిపారు.  తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల ప్రోత్సాహం ఇవ్వాలని విద్యార్థులు ఆటలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కోరారు.  ఈ క్రీడా శిబిరంలో  శిక్షణ తీసుకున్న  విద్యార్థులు  చక్కగా రాణించి, పతకాలు  సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో  ట్రైబల్ వెల్ఫేర్, ఉపసంచాలకులు కిరణ్ కుమార్, డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్ర రావు, డి ఎస్ డి ఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎం హెచ్ ఒ అనిల్ కుమార్, కోఆర్డినేటర్ ఎం వాసుదేవరావు, జాతీయ ఆటగాడు జి గోపాల్  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-08 06:45:07

అకుంఠిత దీక్ష‌కు ప్ర‌తిరూపం భ‌గీర‌థుడు

తాను అనుకున్న‌ది సాధించేవ‌ర‌కూ విశ్ర‌మించ‌ని భ‌గీర‌థ మ‌హ‌ర్షి, అకుంఠిత దీక్ష‌కు ప్ర‌తిరూప‌మ‌ని, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు పేర్కొన్నారు. విద్యార్థులు, యువ‌త‌ త‌మ ల‌క్ష్య సాధ‌న‌కు, భ‌గీర‌థ మ‌హ‌ర్షిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కోరారు.  మ‌హ‌ర్షి భ‌గీర‌థ జ‌యంతి కార్య‌క్ర‌మం జిల్లా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ‌శాఖ ఆద్వ‌ర్యంలో, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన డిఆర్ఓ గ‌ణ‌ప‌తిరావు మాట్లాడుతూ, మ‌న పురాణాలు, ఇతిహాసాలు, మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ని పేర్కొన్నారు. ఎంతో ఘ‌న‌మైన వార‌స‌త్వ సంప‌ద మ‌న సొంత‌మ‌ని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌ని అన్నారు.  మ‌న‌ సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించేందుకు ఇలాంటి మ‌హ‌నీయుల జ‌యంతులు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. అలుపెర‌గ‌ని పోరాటం, ఓట‌మి ఎరుగ‌ని దీక్ష భ‌గీర‌థ మ‌హ‌ర్షి సొంత‌మ‌ని, జీవితంలో ఉన్న‌త స్థానాన్ని సాధించేందుకు  ఆయ‌న్ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కోరారు.  డిబిసిడ‌బ్ల్యూఓ డి.కీర్తి మాట్లాడుతూ, సగ‌ర‌, ఉప్ప‌ర కార్పొరేష‌న్ల విజ్ఞప్తి మేర‌కు ప్ర‌భుత్వం భ‌గీర‌థ మ‌హ‌ర్షి జ‌యంతి ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంద‌ని చెప్పారు. స‌గ‌ర వంశానికి చెందిన భ‌గీర‌థుడు, ప‌ట్టుద‌ల‌కు ప్ర‌తిరూప‌మ‌ని పేర్కొన్నారు. త‌న పూర్వీకుల‌కు స‌ద్గ‌తుల‌ను ప్రాప్తించేందుకు, ఆకాశ గంగ‌ను భువికి తెచ్చిన మ‌హ‌నీయుడు భ‌గీర‌థుడ‌ని కొనియాడారు. త‌న వంశం కోసం, స‌మాజం కోసం ప‌విత్ర గంగ‌ను మ‌న‌కు అందించార‌ని అన్నారు.

 మెప్మా పిడి సుధాక‌ర‌రావు మాట్లాడుతూ,  ప్ర‌తీ చారిత్ర‌క పురుషుడినుంచీ మ‌నం ఎంతో నేర్చుకోవాల్సి ఉంద‌న్నారు. మ‌న దేశ చ‌రిత్ర సుసంప‌న్న‌మైన‌ద‌ని, ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవ‌న విధానానికి దిక్సూచి వంటిద‌ని పేర్కొన్నారు. త‌మ పూర్వీకుల‌కు పుణ్యలోక ప్రాప్తిని క‌ల్గించేందుకు కృషి చేసిన‌  భ‌గీర‌థ మ‌హ‌ర్షి  చ‌రిత్ర‌ను, దాని ప్రాస‌శ్త్యాన్ని వివ‌రించారు. విలువ‌తో కూడిన జీవ‌న విధానానికి, మంచి న‌డ‌వడిక‌కు మ‌హ‌నీయుల జీవిత విశేషాల‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నేటి మ‌న శాస్త్ర‌, సాంకేతిక ప‌రిజ్ఞానానికి మూలాలు అన్నీ మ‌న వేదాలు, పురాణాల్లోనే ఉన్నాయ‌ని, వాటినుంచి మ‌నం స్ఫూర్తిని పొందాల‌ని సూచించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌ర్యాట‌క శాఖాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, బిసి సంక్షేమాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-08 06:26:40

ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ జిల్లాగా విశాఖ..

ఒకప్పుడు విశాఖలో పనిచేయాలంటే అధికారులందరూ క్యూ కట్టేవారు. అతిపెద్ద మహానగ రం, దానికి సువిశాలమైన రూరల్ జిల్లా ప్రాంతం. జిల్లా కలెక్టర్ నుంచి ఇతర 75శాఖల జిల్లా అధికారులు ఇక్కడ అధికారిగా చేరితే జిల్లాపై పట్టు సాధించడానికే ఏడాదికి పైనే సమయం పట్టేసేది. ఇపుడు జిల్లాల విభజన తరువాత రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లాగా విశాఖపట్నం మారిపోయింది. అలా మారిపోయినా రాజధాని ప్రాంతానికున్న ట్రాన్సిట్  హాల్ట్ ప్రోటోకాల్ జిల్లా హోదా విశాఖపట్నానికి వచ్చేసింది. ఇక్కడ అంతర్జాతీయ ఏయిర్ పోర్టు ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎవరు వచ్చినా ఇక్కడే ప్రోటోకాల్ ఇచ్చే సదుపాయం ఏర్పడిపోవడంతో ఈవిశాఖ మహానగరం ప్రోటోకాల్ మహానగరంగా మారిపోయింది. దీనితో ఈ జిల్లాలో పనిచేయాలంటే ప్రస్తుతం అధికారులంతా హడలిపోతున్నారు. నిత్యం ఏదోఒక రాష్ట్ర అధికారి, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, ఇతర త్రివిధ దళాల అధికారులుల నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రాంతంగా మారిపోవడంతో విశాఖలో పనిచేయాలంటే ఇపుడు అధికారులు కాస్త తడుముకుంటున్నారు. ఒకప్పుడు విశాఖసిటీలో పనిచేయడమంటే అఖిలభారత స్థాయి అధికారులకే కాదు, జిల్లాశాఖల అధికారులకు కూడా ఒక పేషన్ గా ఉండేది. కొత్తజిల్లాలతో స్వరూపం పూర్తిగా మారిపోయి అతి చిన్నజిల్లా మారిపోవడంతోపాటు ప్రముఖుల తాకిడి అధికమైపోయింది. 

చుట్టు ప్రక్కల జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ఆఖరికి విశాఖపట్నంజిల్లాను సందర్శించడానికి నిత్యం ఏదోఒక శాఖ అధికారి రావడంతో సమూహ జిల్లా ముఖ ద్వారంగా ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ డెస్టినేషన్  గా విశాఖపట్నం మారిపోయింది. జిల్లా అధికారులకైతే సదరు జిల్లాశాఖల పనికంటే ఆయా ప్రభుత్వశాఖల ప్రోటోకాల్ డ్యూటీలే అత్యధికంగా తగులుతున్నాయి. దీనితో విశాఖజిల్లా నుంచి తమ సొంత జిల్లాలుగానీ, దగ్గర్లోని జిల్లాలకు గానీ వెళ్లిపోయేందుకు అధికారులంతా విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బదిలీల్లో వెళ్లిపోతుండగా మరికొందరు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రాధాన్యతలేని ప్రభుత్వశాఖల అధికారులను కూడా ప్రభుత్వం ఈ ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ విధులకు వినియోగిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కొందరు అధికారులకు ఈ ప్రోటోకాల్ డ్యూటీలు ఆటవిడుపుగా వుంటున్నా ఎక్కువ మంది అధికారులకు తలకు మంచిన ఆర్ధిక భారం పడుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందులోనూ ట్రాన్సిట్, ప్రోటోకాల్ జిల్లా అయినప్పటికీ జిల్లా కేంద్రంలో అధికారులు, ముఖ్యమైన అధికారపార్టీ ప్రతినిధులు వచ్చే సమయంలో వారికి భద్రతా పరమైన వాహనాలను ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేపోతుంది. దీనితో ప్రైవేటు వాహనాలనే జిల్లా కలెక్టర్ నుంచి జిల్లాశాఖల అధికారులు ఆవ్రయించాల్సి వస్తుంది. అపుడెప్పుడో 15ఏళ్ల క్రితం కొన్న ప్రోటోకాల్ వాహనాలు తప్పితే..తరువాత ఏ ప్రభుత్వం కూడా కొత్తగా వాహనాలను కొనుగోలు చేయలేదు. దీనితో వాహనాల ఏర్పాటుకి కూడా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అన్నీ వెరసీ సుందరమైన మహానగరం విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిచిన్నజిల్లా మారి ఆఖరికి ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ జిల్లాగా మిగిలిపోవడం రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.

Visakhapatnam

2022-05-08 03:27:05

మాత్రు మరణాలు నియంత్రించాలి

కాన్పు సమయంలో పలు కారణాల వల్ల తల్లులు మరణించడం సంభవిస్తొందని  దీనిని పూర్తిగా నివారించాలని జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లికార్జున వైద్యాధికారులను ఆదేశించారు .శనివారం కలక్టరు అధక్షతన మాతృమరణాల పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలక్టరు మాట్లాడుతూ డెలివరీ సమయంలో ఏ చిన్న సమస్యను గుర్తించినా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  వైధ్యులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎమ్ లు, గర్భిణీ స్త్రీలకు తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎటువంటి సమస్య లేకుండా డెలివరీలు అయేందుకు కృషి చేయాలన్నారు. రక్తహీనత ఉన్న గర్భణీ స్త్రీలను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు నిపుణులు  ఉన్న పెద్ద ఆసుపత్రులకు తరలించాలన్నారు. ఈ సమావేశంలో డా.కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డా.మధుసూదన ప్రసాద్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,  జిల్లా ప్రోగ్రాం అధికారులు, కమిటీ సభ్యులు, వైద్యాధికారులు ,క్షేత్రస్థాయి సిబ్బంది కెజిహెచ్ గైనకాలజీ ప్రొఫెసర్లు, ఎక్సపర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .

Visakhapatnam

2022-05-07 15:53:24

లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవు

గర్భస్ధ  శిశు లింగ నిర్దారణ పరీక్షలు తీవ్రమైన నేరమని దీనిని పూర్తిగా నిర్వహించాలని ఆమేరకు తగు చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అధికారులకు సూచించారు.  శనివారం కలెక్టర్ అధ్యక్షతన పి.సి.పి.ఎన్.డి.టి కమిటి మరియు జిల్లాలో ధరఖాస్తు చేసుకున్న స్కానింగ్ కేంద్రములకు అనుమతులు మంజూరు చేయుట కొరకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అఫ్రోప్రీయేట్ ఆధారిటి మరియు ఎడ్వజర్ కమిటి సంయుక్త  సమావేశం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించబడినది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ కేంద్రాల కార్యకలాపాలను తనిఖీ లు నిర్వహించాలని కమిటి సభ్యులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రంలలో విధిగా స్కానింగ్ రిపోర్టులను ప్రతి నెల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికి సమర్పించాలని సూచించారు. ప్రతి డివిజన్లో, డెకాయి ఆపరేషన్స్ రెవెన్యూ, పోలీసు మరియు ఇతర సంబందిత అధికారుల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. డెకాయి ఆపరేషన్స్ చేసే టప్పుడు నిబంధనలు పాటించాలని సూచించారు.  నిబంధనలు అతిక్రమంచిన స్కానింగ్ కేంద్రాలపై  కఠిన చర్యలు తీసుకొనబడునని తెలియజేసారు.  ఇటువంటి పరీక్షలు నిర్వహించే వారికి  కఠిన చిక్సలు పడతాయన్నారు.  లింగ నిష్పత్తిలో  భేదం  అధికంగా ఉన్న ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు , ర్యాలీలు, కరపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.  ఈ కార్యక్రమాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, లీగల్ సర్వీసెస్, దిశ తదితర సంస్థలను కలుపుకొని పని చేయాలన్నారు.  జిల్లా నోడల్ అధికారి డా.మధుసూదన ప్రసాద్ గారు మాట్లాడుతూ స్త్రి , పురుష నిష్పత్తి తక్కువగల మండలాలలో “సేవ్ గర్ల్ చైల్డ్” అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేసారు.  డా.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రములలో ఇప్పటి వరకు 271 మందికి ఉచితంగా స్కానింగ్ చేసినట్లు వివరించారు.  ధరఖాస్తు చేసుకున్న 21 కేంద్రములకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి, విజయలక్ష్మి,జిల్లా ప్రోగ్రామ్ అధికారులు అప్రోప్రియేట్ ఆధారిటి మరియు ఎడ్వైజరీ కమిటి సభ్యులు , డెమో విభాగ సిబ్బంది,  పోలీసు అధికారులు,   తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-05-07 15:45:46

దాసన్నపేటలో అల్లూరి విగ్రహం ఆవిష్కరణ

మ‌న్యంవీరుడు, స్వాతంత్య్ర పోరాట స‌మ‌రయోధుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆవిష్క‌రించారు. ఆయ‌న వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక దాస‌న్నపేట రైతు బ‌జార్ కూడలిలో క్ష‌త్రియ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన విగ్ర‌హాన్ని మంత్రి బొత్స‌, స్థానిక ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర స్వామి, ఎమ్మెల్సీ ర‌ఘురాజు, క్ష‌త్రియ సేవా స‌మితి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. విగ్ర‌హ ఏర్పాటుకు అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు రూ.10 ల‌క్ష‌లు వెచ్చించ‌గా చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చం, ఫౌంటేన్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ రూ.15 ల‌క్ష‌లు కేటాయించ‌టం ద్వారా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి బొత్స‌, ఇత‌ర నేత‌లు, అధికారులు అల్లూరి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. ఆయన త్యాగం మరువలేనిదని ఆయన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సేవలను, త్యాగాలను కొనియాడారు. కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి ర‌ఘురాజు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు కేఏసీ రాజు, ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎస్‌. రాజు, స్థానిక కార్పొరేట‌ర్లు, మున్సిపాలిటీ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-07 14:54:34

సచివాలయ నిర్మాణాలు పూర్తిచేయాలి

అనకాపల్లి జిల్లాలో గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ లు , రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు రవి పట్టంశెట్టి పంచాయతీ రాజ్ శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ   గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ లు మరియు రైతు భరోసా కేంద్రాలనిర్మాణాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. వివిధ దశల్లో వున్న నిర్మాణాల స్థాయిని మెరుగు పరుస్తూ వుండాలన్నారు.   జిల్లాలో సాంకేతిక సమస్యలను వేగంగా పరిష్కరించు కోవాలన్నారు.  సమస్య గుర్తించి వెంటనే పరిష్కరించి నట్లయితే నిర్మాణాలు వేగంగా పూర్తి అవుతాయన్నారు.  నిర్మాణాల కు అవసరమైన మెటీరియల్ మరియు స్థలం సమస్యలు  ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నిర్మాణాల ప్రగతిపై ప్రతి బుధవారం సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు. జూలై 31 నాటికి గ్రామ సచివాలయాలు , విలేజ్ హెల్త్ సెంటర్ ల నిర్మాణాలు మరియు ఆగస్ట్ 31 నాటికి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ కె. వీరం నాయుడు, డిఈ లు, ఏఈ లు  తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-05-06 15:50:36

పిల్లలను అత్యంత జాగ్రత్తగా సంరక్షించాలి

శిశు గృహం ద్వారా నిత్యం పిల్లలను జాగ్రత్తగా సంరక్షించవలసిన  ఆవశ్యకత ఉందని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం మర్రిపాలెంలోని ప్రత్యేక దత్తత  సంస్థ ను (శిశు గృహ) మంత్రి సందర్శించారు. అనంతరం అక్కడి సిబ్బంది వివరాలు మరియు  వివిధ రికార్డులను పరిశీలించారు. శిశు గృహ లోని మౌళిక వసతులు,  పిల్లలు కోసం నిర్వాహకులు అందిస్తున్న వివిధ సేవలకు సంభందించిన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ శిశు గృహ  పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ఆవశ్యకత గురించి ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. ఇటీవల శిశు గృహ నుండి తప్పిపోయిన  ముగ్గురు పిల్లల సంఘటనల లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా చూడాలని  సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కె జి హెచ్ లోని ఒన్ స్టాఫ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి సిబ్బంది నుండి  ఈ ఏడాది ఆసుపత్రిలో చేరిన వివిధ మహిళలు, బాలికలకు సంబంధించి నమోదు చేసిన  కేసుల వివరాలు, పురోగతిని గురించి సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు. బాధిత మహిళలు,  బాలికలకు సత్వర సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అక్కడి సిబ్బందికి సూచనలు, పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తప్పిపోయిన పిల్లలను శిశు గృహ లో చేర్చుకొని  కాసేవు వారితో ముచ్చటించి  పిల్లలతో కలిసి భోజనం చేసారు. అనంతరం కొత్త జాలారిపేటలో గల అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు  అన్న ప్రాసన చేసిన అనంతరం గర్భిణీ స్త్రీలకు  శ్రీమంతం  కార్యక్రమాలను నిర్వహించి వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ కిట్లను  పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో  శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి,  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపిసీఆర్) చైర్ పర్సన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, రీజినల్ ఆర్గనైజర్ మంతెన మాధవీ వర్మ,  ఆర్జేడీ జి.చిన్మయి దేవి,  ప్రోజెక్ట్ డైరెక్టర్ కె.వి.ఎల్.పద్మావతి,  జిల్లా బాలల సంరక్షణాధికారి ఎ.సత్యనారాయణ, సంబందిత అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-06 13:58:09

కస్తూరిభా విద్యాలయంలో ప్రవేశాలు

క‌స్తూరిభా గాంధీ బాలికా విద్యాల‌యాల్లో 6,7,8 త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు అర్హ‌త గ‌ల వారినుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా స‌మ‌గ్ర శిక్ష ఛైర్మ‌న్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌లో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కెజిబివిల్లో ప్రవేశాల కొరకు, అర్హులైన విద్యార్ధినులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల‌కు అనుగుణంగా,  కేజీబీవీల్లో దరఖాస్తులు కోరడం జరుగుతుంది ఆమె తెలిపారు. ఈ 2022-23 విద్యా సంవత్సరానికి గాను, జిల్లాలోని కెజిబివిలలో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలతో పాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భ‌ర్తీకి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఇందులో భాగంగా, బ‌డిబ‌య‌ట ఉన్న పిల్ల‌ల‌ను,  జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక అధికారి ఆధ్వర్యంలో జిసిడిఓ, అసిస్టెంట్ జిసిడిఓలతోపాటు జిల్లాకు చెందిన కేజీబివి పాఠశాల ప్రిన్సిపాళ్లు గుర్తించి, వారిని కెజిబివీల్లో  చేర్పించేందుకు కృషి ఆదేశించారు. అలాగే బ‌డి బ‌య‌ట ఉన్న పిల్ల‌ల‌తోపాటు,  డ్రాపౌట్స్, అనాధ, అర్ధ అనాధ, పి.హెచ్.సి విద్యార్థులకు ఈ పాఠ‌శాల‌ల్లో ముందుగా అవకాశం కల్పించాలని సూచించారు. అనంతరం ఎస్.సి, ఎస్.టి, ఓ.బి.సి, మైనారిటీ వ‌ర్గాలు, పేద పిల్ల‌ల‌కు ఎంపిక‌లో ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌ని చెప్పారు. కెజిబివి లలో దరఖాస్తుల కోసం అభ్యర్ధులు https://apkgbv.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇత‌ర‌ వివరాల కోసం, జిల్లా జిసిడిఓ 9000204925, అసిస్టెంట్ జిసిడిఓ 9440160049 లను సంప్రదించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఉన్న కెజిబివిల ప్రిన్సిపాళ్లంద‌రూ,  దరఖాస్తుల స్వీకరణలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీట్లను భర్తీ చేయాలని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2022-05-06 11:25:04

స్పందన పై ప్రజలకు నమ్మకం కలిగించండి

స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వెంట వెంటనే పరిష్కరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటిడి ఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ  స్పందనకు అధికారులందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.  ఫిర్యాదుదారులు తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎన్నో వ్యయ ప్రయాశాలకు ఓర్చి,ఎంతో దూరం నుండి వస్తారని అటువంటి వారిని నిరుత్సాహ పరచకుండా వారి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని హితబోధ చేశారు. స్పందనలో ఫిర్యాదు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని కలెక్టర్ సూచించారు.  శుక్రవారం జరిగిన స్పందనకు  84  దరఖాస్తులు అందాయి.  వాటిలో ముఖ్యoగా పెదబయలు మండలం మారడపల్లి గ్రామంలో బి.టి రోడ్డు సౌకర్యం కల్పించాలని, తొలగించిన  తెల్ల రేషన్ కార్డును పునరుద్దరించాలని, గంపరాయి నుండి జామిగూడ వరకు ఐదు కిలోమీటర్ల మట్టి రోడ్డును శ్రమ దానంతో వేయించుకున్నామని  దానిని బి.టి. రోడ్డుగా వేయించాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయి.  
    సొవ్వ  పంచాయతీ  తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ.ఎం. డుంబ్రిగుడ మండల కమిటీ ఫిర్యాదు చేసింది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగం కొరకు కొంతమంది దరఖాస్తు చేసియున్నారు. మూడు సంవత్సరాల నుండి జీతం రావటం లేదని ఒక ఆశ కార్యకర్త ఫిర్యాదు చేసింది. పాఠశాలకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కల్పించనందున ఉద్యోగం కల్పించాలని దరఖాస్తులు అందాయి. ఈ స్పందన కార్యక్రమం లో సుబ కలెక్టర్ అభిషేక్, డిఆర్ఓ దయానిధి, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు మణి  కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Paderu

2022-05-06 09:03:42

సత్యనారాయణ సేవలు ప్రశంసనీయం

సీనియర్ పాత్రికేయులు ఎన్.సత్యనారాయణ సమాజానికి అందించిన సేవలు ప్రశంస నీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.  ఈ మేరకు శుక్రవారం  విశాఖలోని గోపాలపట్నం ఆయన నివాసంలో సత్యనారాయణ వర్ధంతిని  ఆయన మిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినఈ కార్యక్రమంలో  శ్రీనుబాబు సహచర మిత్రులుతో కలసి పాల్గొన్నారు. తొలుత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శీనుబాబు మాట్లాడుతూ,  మూడు దశాబ్దాల కాలం పాటు పత్రికా రంగంలో జర్నలిస్టులకు  సత్యనారాయణ  పూర్తి స్థాయిలో సేవలందించారని  వివరించారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేకమంది మిత్రులు, సన్నిహితులు, పాత్రికేయులు అభిమానులు, మిత్ర బృందం తరపున సుబ్బారావు, మోహన్, నాయుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Gopalapatnam (rural)

2022-05-06 08:18:19

ఉద్యోగులు ఏపీజీఎల్ఐ తీసుకోవాలి..

ప్రభుత్వ ఉద్యోగులు  చెల్లించిన ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం మొత్తానికి పాలసీలు తీసుకోవాలని విశాఖ జాయింట్ డైరక్టర్ డి.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 55సంవత్సరం లోపు ప్రభుత్వ ఉద్యోగులు ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం చెల్లించుచూ పాలసీలు పొందని వారు, 55 సంవత్సరంలు దాటి సర్వీసులో ఉన్న ఉద్యోగులు తేది 30-6-2022 లోగా ప్రతి పాదనలు జిల్లా బీమా కార్యాలయంనకు సమర్పించి పాలసీలను పొందాలని  కోరారు.  తేది 30-6-2022 లోపు పాలసీ ప్రతిపాదనలను సమర్పించి తగిన రశీదు తీసుకోవాలని తెలిపారు. అదే విదంగా  55 సంవత్సరములు దాటిన  ప్రభుత్వ ఉద్యోగులు ప్రీమియం హెచ్చింపు చేయరాదని, అదే విధంగా    తేది 30-6-2022 తరువాత సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించబడవని ఆ ప్రకటనలో తెలిపారు. 

Visakhapatnam

2022-05-05 14:24:24

విశాఖజిల్లాకు విద్యాదీవెన రూ.32.36 కోట్లు

జగనన్న విద్యా దీవెన క్రింద జిల్లాకు రూ.32.36 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2021 - 22 ఏడాదికి సంబంధించి రెండువ విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయంను  విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.   జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాలులో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి  జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, గాజువాక ఎమ్.ఎల్.ఎ తిప్పల నాగిరెడ్డి, ఎమ్.ఎల్.సి వరుదు కళ్యాణి, సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరక్టర్ రమణమూర్తి, జిల్లా బి. సి  సంక్షేమ అధికారి శ్రీదేవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం జిల్లా కలక్టర్ విలేకరులతో  మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన క్రింద రాష్ట్రంలో 10.85 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  రూ.709 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. ఎవరైన అర్హత కలిగి ఉన్న విద్యార్థుల తల్లులకు నగదు  జమ కాకపోతే సోమవారం నాడు జరిగే గ్రీవెన్సులో ఫిర్యాదు చేసినచో వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా వెంటనే విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. 

విశాఖ జిల్లాలో 46,519 మంది విద్యార్థులకు సంబంధించి తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.32.36 కోట్లు జమ. ఇందులో 4,677 మంది ఎస్.సి విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.3.95 కోట్లు, 190 మంది ఎస్.టి విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.13.01 లక్షలు, 40,149 మంది బి.సి వెల్ఫేర్  విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ. 27.24 కోట్లు, 1273 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.83.73 లక్షలు, 230 మంది క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు గాను వారి తల్లులు ఖాతాల్లో రూ.18.92 లక్షలు జమ అవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినీ,విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.32.36 కోట్ల  రూపాయల మెగాచెక్ జిల్లా కలెక్టర్, మేయర్,ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు.

Visakhapatnam

2022-05-05 14:21:35

9న స్పందన కార్యక్రమం పెద్దాపురంలో

కాకినాడ జిల్లాలోని  ఈ నెల 9న  జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్ర మాన్నిపెద్దాపురం పట్టనంలోని మట్టేవారి కళ్యాణ మండపంలో ఉదయం 9-30 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా గురువారం ఒక ప్రకటన లో తెలియజేసారు. కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి 9వ తేదీన తమ అర్జీలను పెద్దాపురంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు.  అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ సోమవారం ఉదయం 9 గంటలకే పెద్దాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Kakinada

2022-05-05 13:47:16