1 ENS Live Breaking News

పవిత్రతకు మారుపేరు రంజాన్ మాసం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పరిశ్రమలు ఐటీ శాఖ  మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం అనకాపల్లి పట్టణంలోని శారదా నగర్ లో గల కళ్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీ లో నలుగురు ముస్లింలకు ఎమ్మెల్యే లు గా స్థానం కల్పించాలని ఒకరికి ఒక ముఖ్య మంత్రి పదవి కూడా ఇచ్చారని చెప్పారు. మైనారిటీ ప్రయోజనాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని తెలిపారు.

అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి వి సత్యవతి మాట్లాడుతూ  పేదలకు దానాన్ని ఇమ్మని ఖురాన్ బోధిస్తోంది అని, ఇంకా ఎన్నో మంచి విషయాలు కురాన్ లో ఉన్నాయని వాటిని అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు.  సర్వ మత సామరస్యానికి భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ ప్రతీకగా నిలుస్తాయి అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముస్లింల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి మాట్లాడుతూ అనకాపల్లి నూతన జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.  ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.  స్పందన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. అనకాపల్లి జామియా మసీదు ప్రెసిడెంట్ పి ఎస్ ఎన్ హుస్సేన్ మాట్లాడుతూ ముస్లింలందరూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పారు.  ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతి కలెక్టర్ రవి పట్టం శెట్టి లకు అభినందనలు తెలియజేస్తూ ముస్లిం పెద్దలు సత్కరించారు.    ఈ కార్యక్రమం లో  జిల్లా రెవిన్యూ అధికారి పి వెంకట రమణ, ఆర్డీవో చిన్నికృష్ణ, జిలాని  రహమాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు‌.

Anakapalle

2022-05-01 14:03:42

అప్పన్నకు ఒడిస్సా భక్తులు విశేష పూజలు..

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని  వేర్వేరు ప్రాంతాల భక్తులు అనేక రూపాల్లో కొలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒరిస్సా బరంపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం తరలివచ్చారు. వీరంతా తొలుత వరహ  పుణ్య పుష్కరిణి వద్దకు చేరుకొని  పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ ఫల పుష్పాదులతో పానకాలతో  విశేష అభిషేకం చేపట్టారు. అనంతరం భక్తులందరినీ ఒడిస్సా భక్తబృందం ప్రతినిధి కామ ఆశీర్వదించారు.
భక్తులంతా సాష్టాంగ నమస్కారం చేస్తే వారి పెద్ద  కామ కర్రతో వీపు వైపు కొట్టి స్వామి చల్లగా చూడాలని దీవించారు. తాము ప్రతియేటా చందనోత్సవం కు ముందు రోజు వచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది సుమారు 300 మంది భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకున్నామని కామ తెలిపారు.
అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు  గంట్ల శ్రీను బాబు పుష్కరణి వద్ద  ఒడిషా భక్తులకు అవసరమైన సదుపాయాలను  పర్యవేక్షించారు. అంతే కాకుండా ఆయన వారితో పాటు  పూజాది కార్యక్రమాల్లో  మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా భక్తబృందం నుంచి శ్రీను బాబు ఆశీర్వాదం పొందారు.

Simhachalam

2022-05-01 09:29:49

ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం

గ్రామ స‌చివాల‌య స్థాయిలోని వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ద‌గ్గ‌రి నుంచి జిల్లాస్థాయి ఆసుప‌త్రి వ‌ర‌కు ప్ర‌తి దాంట్లోనూ అందుబాటులో ఉన్న మాన‌వ వ‌న‌రులు, మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకుంటూ ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించేందుకు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. శనివారం క‌లెక్ట‌రేట్‌లో వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమలుచేస్తున్న ఆరోగ్య ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు; ఆసుప‌త్రుల ద్వారా అందుతున్న సేవ‌లు, వ్యాధి నిరోధ‌క టీకా కార్య‌క్ర‌మం, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవ‌లు, సీజ‌నల్ వ్యాధులు, వైద్య నిపుణుల నియామ‌కాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 37 గ్రామీణ‌, 23 ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు; 465 వైఎస్సార్ ఆరోగ్య క్లినిక్‌లు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌, జీజీహెచ్‌ల త‌దిత‌రాల ద్వారా జిల్లాలో ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయ‌న్నారు. ఆసుప‌త్రుల‌కు స‌మ‌కూరుతున్న ఆధునిక ప‌రిక‌రాల వినియోగానికి సుశిక్షుతులైన సిబ్బంది ఉండాలి కాబ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌రం మేర‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. పీసీపీఎన్‌డీటీ చ‌ట్టాన్ని జిల్లాలో ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని.. స్కానింగ్ కేంద్రాల్లో డెకాయ్ ఆప‌రేష‌న్లు, ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టాల‌ని సూచించారు. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వైద్య సేవ‌లు అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింద‌ని.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యిమందికి ఒక‌టి చొప్పున‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 2,500 మందికి ఒక‌టి చొప్పున ఈ కేంద్రాలు ఉన్నందున వీటిద్వారా విస్తృత ఆరోగ్య సేవ‌లు అందించేలా క్షేత్ర‌స్థాయి సిబ్బంది కృషిచేసేలా చూడాల‌న్నారు. ఏఎన్ఎం, ఆశాల ప‌నితీరుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని.. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు పీహెచ్‌సీల్లో త‌నిఖీలు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఎంహెచ్‌వో డా. బి.మీనాక్షి, డీసీహెచ్ఎస్ డా. పి.బి.విష్ణువర్థిని, ఆరోగ్య శ్రీ కోఆర్డినేట‌ర్ డా. పి.రాధాకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. రమేష్, ఆర్బన్ డీపీవో డా .మహేష్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-30 10:17:24

అర్హులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలి..

అర్హులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారు లను ఆదేశించారు. నగరంలోని 48వ డివిజన్ లో శనివారం నిర్వహించిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమంలో మేయర్ వసీం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానికులను మేయర్ వసీం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అరా తీశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమన్నారు.అంతేకాకుండా సంక్షేమ పథకాలు అమలు తీరును స్వయంగా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలసి వెళ్లి పరిశీలించేందుకు సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అర్వత ఉండి సంక్షేమ పథకాలు అందకుంటే అక్కడికక్కడే వాటిని పరిష్కరించడమే   సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలలో మమేకమై వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సమస్యలను స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి,కార్పొరేటర్లు  శ్రీనివాసులు, అనిల్ కుమార్ రెడ్డి కమల్ భూషణ్,సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, నగర పలువురు అధికారులు, సచివాలయం  సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2022-04-30 09:24:08

జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి..

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుత వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కడా తలెత్తరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు గ్రామాల్లో ఉదయం పూట పర్యటన జరపాలని ఆయన ఆదేశించారు. తాగు నీటి ఎద్దడి -  వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, మునిసిపల్ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉన్నా ప్రతి అంశాన్ని పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉన్న నీటి వసతులు, వాటిని ప్రజలు ఉపయోగించే విధానాన్ని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. గ్రామంలో పలు నీటి వసతులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఒకే బోరుపై ఆధారపడుతున్నప్పుడు మిగిలిన బోర్ల పరిస్థితిని తనిఖీ చేయాలని ఆయన అన్నారు. నీటిని ల్యాబ్ కు పంపించి  నివేదికలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నీటిని పరీక్షించాలని, క్లోరినేషన్ చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి మండలంలో నీటి తీవ్రత ఉన్న గ్రామాలను ముందుగానే పరిశీలించి జాబితాలను తయారు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు నీటి ఎద్దడిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా తాగు నీరు అందని పరిస్థితి తలెత్తితే దగ్గర్లో ఉన్న నీటి వసతి నుంచి తాగునీటి సరఫరా చేయుటకు కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటిని నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఫిల్టర్  చేయాలని ఆయన స్పష్టం చేశారు. వేసవిలో ప్రజలకు నీటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో విస్తృత పర్యటనతో పాటు ఇతర విభాగాల ద్వారా సమాచారం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మండల స్థాయిలోనూ సమాచారం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.  జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలం శాఖాపరమైన వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా ఆరోగ్య ఉప ఇంజినీరింగ్ అధికారి విజయ్ కుమార్ సంభందిత అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-30 08:14:34

మలేరియా రహిత జిల్లాగా మార్చాలి..

పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా రహిత జిల్లా కావాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభల కుండా పటిష్ఠమైన చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో లేదా అకాల వర్షాలు కురిసే కాలంలో జ్వరాలు వ్యాప్తి ఉండే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో ఎక్కడా వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులపై  కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా నివారణకు ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలన్నారు. తద్వారా లార్వా పెరుగుదల లేకుండా చూడగలమని ఆయన పేర్కొన్నారు. లార్వా పెరుగుదల లేకుండా తగిన చర్యలు కూడా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఇంటింటికి వెళ్లి డ్రై డే పై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సైతం చైతన్యం కల్పించాలని ఆయన చెప్పారు.  ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నీరు నిల్వ జరిగే గ్రామాల జాబితాను ఉపాధి హామీ పిడికి అందజేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నీటి కుంతలలో నీరు నిల్వ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్య అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని భాగస్వామ్యం చేసి పకడ్బందీగా స్ప్రేయింగ్, ఫాగింగ్ జరుగుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వసతి గృహాలకు దోమల నివారణకు మెష్ లను పెట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. స్ప్రేయింగ్ కార్యక్రమాలపై ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు మాట్లాడుతూ మే 16 నుండి జిల్లాలో స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామన్నారు. గంభూషియా చేప పిల్లలను విడిచి పెట్టడం ద్వారా లార్వా నివారణకు చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. జిల్లాకు రెండు లక్షల గంభూషియస్ చేప పిల్లలు అవసరమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఇ ప్రభాకర రావు, ఉపాధి హామీ శ్రీనివాస రావు, మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలం, మత్స్య శాఖ క్షేత్ర అధికారి గంగాధర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-30 07:57:31

సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి..

గ్రామ వార్డ్ సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించేలా విధులు నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా స్థాయి గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి బి.లక్ష్మి పతి శనివారం పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరు పరిశీలించేందుకు మరింత మెరుగు పరిచేలా చర్యలు చేపట్టాలన్న ఉదేశ్యం జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. 2022, ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించిన వెబ్  కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మేరకు  శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ జిల్లా నోడల్ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ సిఈఓ, గ్రామ వార్డ్ సచివాలయం నోడల్ అధికారి లక్ష్మిపతి మాట్లాడుతూ గ్రామ, వార్డ్ సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించేందుకు నిరంతరం విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సేవలు, ఆధార్ సేవల లభ్యతను ప్రచారం చేయాలన్నారు. గ్రామ వార్డ్ సచివాలయంలో  లామినేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌లు, అసంఘటిత కార్మికులకు రిజిస్ట్రేషన్లు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు

అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇంటర్నెట్ మానిటరింగ్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం జరిగిందన్నారు.  బయో మెట్రిక్ హాజరును రోజుకు మూడుసార్లు తప్పని సరి అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల మధ్య స్పందన నిర్వహించి వచ్చిన వినతులు సంబంధిత అధికారులకు అందజేయా లన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో మెలిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేయాలన్నారు. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పంలో అందరూ భాగస్వామ్యులేనని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములై చెత్త సేకరణ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలు వారికి కావలసిన సేవల నిమిత్తం మీ పరిధిలో ఉన్న వాలంటీర్ సహాయంతో సేవలు పొందవచ్చునని జడ్పీ సీఈవో లక్ష్మీపతి పేర్కొన్నారు.  ప్రజల సమస్యలను ప్రతి రోజూ మధ్యాహ్నం సచివాలయంలో నిర్వహించే స్పందనలో తమ సమస్యలను పరిష్కరించే నిమిత్తం ఫిర్యాదులు అందజేయాలన్నారు. ప్రజలు గ్రామ, వార్డు వాలంటీర్ సేవలను వియోగించుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

Srikakulam

2022-04-30 06:23:02

స్మార్ట్ సిటీ ప‌నులను వేగ‌వంతం చేయాలి

కాకినాడ స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద మంజూరై, చేప‌ట్టిన ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచే సేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఎస్‌సీసీఎల్‌) ఛైర్‌ప‌ర్స‌న్ కృతికా శుక్లా ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వా రం క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న కాకినాడ కేఎస్‌సీసీఎల్ కార్యాల‌యంలో 33వ డైరెక్ట‌ర్ల బోర్డు స‌మావేశం జ‌రిగింది. కాకినాడ నగ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్‌, స్మార్ట్‌సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సీహెచ్ నాగ‌న‌ర‌సింహారావు; కాకినాడ నగ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్‌, బోర్డు డైరెక్ట‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న త‌దిత‌రులు హాజ‌రైన ఈ స‌మావేశంలో స్మార్ట్‌సిటీ మిష‌న్ ప్రాజెక్టులు, ప్ర‌స్తుత ప‌నుల్లో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ కింద చేప‌ట్టి ప్ర‌స్తుతం న‌డుస్తున్న ప‌నుల్లో వేగం పెంచి.. వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాల‌ని సూచించారు. ఈ ప‌నుల‌కు సంబంధించి అవ‌స‌రం మేర‌కు ఇత‌ర శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. గోదావ‌రి క‌ళాక్షేత్రానికి సంబంధించి 88 శాతం, సైన్స్ సెంట‌ర్‌కు సంబంధించి 80 శాతం మేర ప‌నులు పూర్త‌యినందున మిగిలియున్న ప‌నుల‌ను స‌త్వ‌రం పూర్తిచేయాల‌న్నారు. ప‌రీక్ష‌లు ముగిసిన వెంట‌నే వేస‌వి సెల‌వుల్లో జ‌గ‌న్నాథ‌పురం స‌ర్కిల్‌, ర‌మ‌ణ‌య్య‌పేట స‌ర్కిల్ త‌దిత‌రాల్లో పాఠ‌శాల‌ల అభివృద్ధికి సంబంధించిన ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌ని ఆదేశించారు. ప‌నుల్లో పురోగ‌తిపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హించి, నివేదిక‌లు పంపాల‌ని.. కాంట్రాక్ట‌ర్ల వారీగా ప్ర‌గ‌తిని ప‌రిశీలించాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద రూ. 16 కోట్ల విలువైన ర‌హ‌దారుల అభివృద్ధితో పాటు పిండాల చెరువు అభివృద్ధికి సంబంధించిన ప‌నులను స‌మావేశంలో ప్ర‌తిపాదించారు. స‌మావేశంలో చీఫ్ ఇంజ‌నీర్ స‌త్య‌నారాయ‌ణ‌రాజు, స్వ‌తంత్ర డైరెక్ట‌ర్ జేవీఆర్ మూర్తి, సీఎస్ ఎం.ప్ర‌స‌న్న కుమార్ త‌దిత‌రులు ప్ర‌త్య‌క్షంగా హాజ‌రుకుగా మిగిలిన‌వారు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-29 12:12:39

చెత్త నుంచి సంపదను పెంచాలి..

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ను ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ గ్రామం  వెంకటనగర్ లోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ,  సేంద్రియ వ్యర్థాలతో నిర్వహిస్తున్న ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యంత నాణ్యమైన ఎరువుగా పేర్కొన్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. సరైనమార్కెటింగ్ సౌకర్యం లేదని అధికారులు వివరించారు. మొత్తం జిల్లాలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ద్వారా వస్తున్న ఉత్పత్తి పై  సమగ్ర నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  మన జిల్లాలోని  లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని హార్టికల్చర్ శాఖ ద్వారా వినియోగం లోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు.  వీటిని వినియోగంలోకి తీసుకుని రావడం వలన దిగుబడిపెరగడమే కాకుండా ఖర్చుకూడాతక్కువఅవుతుందని తెలిపారు. త్వరలోనే సంబంధించిన శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 60 రోజులకు , రెండు నుంచి మూడు టన్నుల ఉత్పత్తి అవుతోందని వివరించారు. 

Rajahmundry

2022-04-29 11:55:39

సజావుగా పది పరీక్షలు జరిపించాలి..

శ్రీకాకుళం జిల్లాలో సజావుగా పదవ తరగతి పరీక్షలు  జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా శుక్రవారం పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో జలుమూరు మండలం చల్లవాని పేట జిల్లా పరిషత్ హైస్కూల్, శ్రీకాకుళం మునసబు పేట గురజాడ విద్యా సంస్థలలో  నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. జిల్లాలో 36,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో 18,455 మంది బాలురు, 17,668 మంది బాలికలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు జరిగే ఈ పరీక్షలు 248  కేంద్రాలను జరుగుతున్నా యని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 50 మంది రూట్ అధికారులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తున్నాయని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసేలా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరి,తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి  బస్సులను ఏర్పాటుచేయడం  జరిగిందన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-29 11:50:56

ఆలయాల అభివ్రుద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం..

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆంధ్రప్ర దేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎండోమెంట్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, ఆమదాలవలసలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంకు 60 లక్షలు, తోగారం గ్రామంలో ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవాలయంకి 50 లక్షలు,దివంజిపేట లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి 50 లక్షలు, కలివరం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి 50 లక్షలు, బెల్లమాం గ్రామంలో ఉన్న శివాలయం కి 40 లక్షలు, రామచంద్రపురం గ్రామంలో ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవాలయంకి 40 లక్షలు, గాజులకొల్లివలస గ్రామం లో ఉన్న పురాతన దేవాలయం సంగమేశ్వర దేవాలయం కి 30 లక్షలు, బూర్జ మండలం తమ్మీనాయుడుపేట గ్రామంలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయంకి 40 లక్షలు చొప్పున ఈ ఎనిమిది దేవాలయాలకు నూతన దేవాలయాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరయ్యాయని స్పీకర్ తమ్మినేని అన్నారు. సభాపతి కృషివలన త్వరితగతిన దేవాలయాలకు నిధులు మంజూరయ్యాయని ఎండోమెంట్ ఏసి కే శిరీష అన్నారు. అదేవిధంగా గ్రామాలలో దేవాలయ కమిటీలు ఏర్పాటు చేసి ఉమ్మడి బ్యాంక్ ఎకౌంటు ఏర్పాటు చేసి ఆ అకౌంట్లో గ్రామ ప్రజల వాటా 20 శాతం డబ్బులు జమ చేయాలన్నారు ప్రభుత్వము నుండి మిగతా 80 శాతం నిధులను ఆ అకౌంట్లో జమ అవుతాయని ఆమె అన్నారు. త్వరితగతిన గ్రామాలలో దేవాలయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహకరించిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేనా నాగేశ్వరరావు, జడ్పిటిసి బెజ్జీ పురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అవుట్సోర్సింగ్ డైరెక్టర్ ఖండపు గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు ఎండోమెంట్ ఏ సి కె శిరీష మరియు ఈ ఓ లు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-29 11:47:08

పరీక్ష కేంద్రాన్ని తనిఖీచేసిన కలెక్టర్..

పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండల కేంద్రంలో సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు విధానాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి,  డిపార్ట్ మెంటల్ అధికారి యు.అప్పారావును పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుటకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యేవరకూ ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్, పరీక్ష పత్రాలు లీక్ వంటి ఉదంతాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనవసరపు వదంతులు వ్యాప్తి కాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పరీక్ష జరుగుతున్నంత కాలం విద్యుత్ సరఫరా జరిగే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయుటకు అనుగుణంగా పరీక్ష కేంద్రం ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ రావు, తాహశీల్దార్ బుచ్చయ్య, ఆర్. ఐ  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం 10,631 మందికి గాను 10,581 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు.

Parvathipuram

2022-04-29 08:09:58

అనధికారికంగా మందులు నిల్వచేస్తే జైలే

శ్రీకాకుళం జిల్లాలో అనధికార మందుల నిల్వ చేసేవారికి  జైలు శిక్ష తప్పదని జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు యం.చంద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. ఔషధ చట్టం, 1940  నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే ముద్దాయికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయల జరిమానాను టెక్కలి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విధించిందని స్పష్టం చేసారు. 2018 సం.లో లైసెన్సులు లేకుండా మందులు నిల్వ ఉంచి అమ్ముతున్నారని సమాచారం మేరకు అప్పటి పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లు కూన కళ్యాణి, ఎ.కృష్ణ, ఎ.లావణ్య ఆకస్మికంగా తనిఖీ చేసి సదరు బగాది కూర్మినాయుకులు నిల్వ ఉంచిన మందులను స్వాధీన పరచుకొని టెక్కలి కోర్టులో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కోర్టులో నేరం నిరూపణ అయినందున సదరు ముద్దాయికి రూ.30వేల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష వేసినట్లు చెప్పారు. ఔషధ చట్ట ప్రకారం లైసెన్సులు లేకుండా మందులు విక్రయాలు ఎవరైనా జరిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సహాయ సంచాలకులు  యం.చంద్రరావు ఆ ప్రకటనలో హెచ్చరించారు.

Srikakulam

2022-04-28 14:49:04

ప్రారంభం కాని ఇళ్లన్నీ రద్దైపోతాయ్..

విజయనగరం జిల్లాలో మే నెల 15 నాటికి స్లాబ్ పడని  గృహాలు  రద్దు చేయడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక సారి రద్దయితే ఆ ఆధార్ పై మళ్లీ మంజూరు అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువలన గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఈ నెలాఖరు లోగా గ్రౌండింగ్ చేసుకొని, మే 15 నాటికి స్లాబ్ లెవెల్ కు చేరి కనీసం ఒక పేమెంట్ ను  పొందాలన్నారు. గుంకలాం వంటి పెద్ద లే ఔట్ నందు కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మెటీరియల్ కూడా సిద్ధంగా ఉందని, మెప్మా వారి సహాయం తో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు వెంటనే ప్రారంభించుకోవాలని తెలిపారు. మంజూరైన గృహాలు  రద్దు కాకుండా  వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు.

Vizianagaram

2022-04-28 14:46:39

మే1 నుంచి రబీ ధాన్యం కొనుగోలు

ప్రస్తుత ర‌బీ సీజ‌నులో జిల్లాలోని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు 167 రైతుభ‌రోసా కేంద్రాల ద్వారా సేక‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేశామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ వెల్ల‌డించారు. మే 1వ తేదీ నుంచి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. జిల్లాలోని రైతులంతా ర‌బీ సీజ‌నులో తాము పండించిన ధాన్యాన్ని రైతుభ‌రోసా కేంద్రాల్లో విక్ర‌యించి మ‌ద్ధ‌తు ధ‌ర పొందాల‌ని కోరారు. ఈ కొనుగోలు కేంద్రాల‌ను 78 ధాన్యం స‌హాయ‌క సంఘాల‌కు అనుసంధానం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లాలో ప్ర‌స్తుత ర‌బీలో 8,986 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి వుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని, ఇందులో 6,290 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొన‌గోలుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ర‌బీ ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆధ్వ‌ర్యంలో గురువారం ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతులు ధాన్యం తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన గోనె సంచుల‌ను పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ స‌మ‌కూరుస్తుంద‌ని పేర్కొన్నారు. ధాన్యం ర‌వాణాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, రైతులు త‌మ సొంత ఖ‌ర్చుల‌తో ధాన్యం ర‌వాణాచేస్తే ర‌వాణా ఖ‌ర్చులు కూడా చెల్లిస్తామ‌న్నారు. రైతులు ఎవ‌రైనా ఇప్ప‌టివ‌ర‌కూ ఇ-క్రాప్ చేయించుకోనట్ల‌యితే వెంట‌నే రైతుభ‌రోసా కేంద్రాల‌కు వెళ్లి చేయించుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే ధాన్యం విక్ర‌యించేందుకు సిద్ధంగా వున్న రైతులు రైతుభ‌రోసా కేంద్రాల్లో షెడ్యూలింగు చేసుకోవాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా వ్యవ‌సాయ అధికారి బి.టి.రామారావు, జిల్లా స‌హ‌కార అధికారి ఎస్‌.అప్ప‌ల‌నాయుడు, పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్ మీనా, పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి పాపారావు, వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ అధికారి శ్యాం త‌దిత‌రులు వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు, స‌హ‌కార సంఘాల సిబ్బంది త‌దిత‌రుల‌కు కొనుగోలు ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న క‌లిగించారు.

Vizianagaram

2022-04-28 14:43:57