1 ENS Live Breaking News

దాసన్నపేటలో అల్లూరి విగ్రహం ఆవిష్కరణ

మ‌న్యంవీరుడు, స్వాతంత్య్ర పోరాట స‌మ‌రయోధుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆవిష్క‌రించారు. ఆయ‌న వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక దాస‌న్నపేట రైతు బ‌జార్ కూడలిలో క్ష‌త్రియ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన విగ్ర‌హాన్ని మంత్రి బొత్స‌, స్థానిక ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర స్వామి, ఎమ్మెల్సీ ర‌ఘురాజు, క్ష‌త్రియ సేవా స‌మితి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. విగ్ర‌హ ఏర్పాటుకు అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు రూ.10 ల‌క్ష‌లు వెచ్చించ‌గా చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చం, ఫౌంటేన్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ రూ.15 ల‌క్ష‌లు కేటాయించ‌టం ద్వారా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి బొత్స‌, ఇత‌ర నేత‌లు, అధికారులు అల్లూరి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. ఆయన త్యాగం మరువలేనిదని ఆయన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సేవలను, త్యాగాలను కొనియాడారు. కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి ర‌ఘురాజు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు కేఏసీ రాజు, ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎస్‌. రాజు, స్థానిక కార్పొరేట‌ర్లు, మున్సిపాలిటీ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-07 14:54:34

సచివాలయ నిర్మాణాలు పూర్తిచేయాలి

అనకాపల్లి జిల్లాలో గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ లు , రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు రవి పట్టంశెట్టి పంచాయతీ రాజ్ శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ   గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ లు మరియు రైతు భరోసా కేంద్రాలనిర్మాణాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. వివిధ దశల్లో వున్న నిర్మాణాల స్థాయిని మెరుగు పరుస్తూ వుండాలన్నారు.   జిల్లాలో సాంకేతిక సమస్యలను వేగంగా పరిష్కరించు కోవాలన్నారు.  సమస్య గుర్తించి వెంటనే పరిష్కరించి నట్లయితే నిర్మాణాలు వేగంగా పూర్తి అవుతాయన్నారు.  నిర్మాణాల కు అవసరమైన మెటీరియల్ మరియు స్థలం సమస్యలు  ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నిర్మాణాల ప్రగతిపై ప్రతి బుధవారం సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు. జూలై 31 నాటికి గ్రామ సచివాలయాలు , విలేజ్ హెల్త్ సెంటర్ ల నిర్మాణాలు మరియు ఆగస్ట్ 31 నాటికి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ కె. వీరం నాయుడు, డిఈ లు, ఏఈ లు  తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-05-06 15:50:36

పిల్లలను అత్యంత జాగ్రత్తగా సంరక్షించాలి

శిశు గృహం ద్వారా నిత్యం పిల్లలను జాగ్రత్తగా సంరక్షించవలసిన  ఆవశ్యకత ఉందని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం మర్రిపాలెంలోని ప్రత్యేక దత్తత  సంస్థ ను (శిశు గృహ) మంత్రి సందర్శించారు. అనంతరం అక్కడి సిబ్బంది వివరాలు మరియు  వివిధ రికార్డులను పరిశీలించారు. శిశు గృహ లోని మౌళిక వసతులు,  పిల్లలు కోసం నిర్వాహకులు అందిస్తున్న వివిధ సేవలకు సంభందించిన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ శిశు గృహ  పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ఆవశ్యకత గురించి ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. ఇటీవల శిశు గృహ నుండి తప్పిపోయిన  ముగ్గురు పిల్లల సంఘటనల లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా చూడాలని  సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కె జి హెచ్ లోని ఒన్ స్టాఫ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి సిబ్బంది నుండి  ఈ ఏడాది ఆసుపత్రిలో చేరిన వివిధ మహిళలు, బాలికలకు సంబంధించి నమోదు చేసిన  కేసుల వివరాలు, పురోగతిని గురించి సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు. బాధిత మహిళలు,  బాలికలకు సత్వర సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అక్కడి సిబ్బందికి సూచనలు, పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తప్పిపోయిన పిల్లలను శిశు గృహ లో చేర్చుకొని  కాసేవు వారితో ముచ్చటించి  పిల్లలతో కలిసి భోజనం చేసారు. అనంతరం కొత్త జాలారిపేటలో గల అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు  అన్న ప్రాసన చేసిన అనంతరం గర్భిణీ స్త్రీలకు  శ్రీమంతం  కార్యక్రమాలను నిర్వహించి వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ కిట్లను  పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో  శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి,  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపిసీఆర్) చైర్ పర్సన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, రీజినల్ ఆర్గనైజర్ మంతెన మాధవీ వర్మ,  ఆర్జేడీ జి.చిన్మయి దేవి,  ప్రోజెక్ట్ డైరెక్టర్ కె.వి.ఎల్.పద్మావతి,  జిల్లా బాలల సంరక్షణాధికారి ఎ.సత్యనారాయణ, సంబందిత అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-06 13:58:09

కస్తూరిభా విద్యాలయంలో ప్రవేశాలు

క‌స్తూరిభా గాంధీ బాలికా విద్యాల‌యాల్లో 6,7,8 త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు అర్హ‌త గ‌ల వారినుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా స‌మ‌గ్ర శిక్ష ఛైర్మ‌న్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌లో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కెజిబివిల్లో ప్రవేశాల కొరకు, అర్హులైన విద్యార్ధినులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల‌కు అనుగుణంగా,  కేజీబీవీల్లో దరఖాస్తులు కోరడం జరుగుతుంది ఆమె తెలిపారు. ఈ 2022-23 విద్యా సంవత్సరానికి గాను, జిల్లాలోని కెజిబివిలలో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలతో పాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భ‌ర్తీకి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఇందులో భాగంగా, బ‌డిబ‌య‌ట ఉన్న పిల్ల‌ల‌ను,  జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక అధికారి ఆధ్వర్యంలో జిసిడిఓ, అసిస్టెంట్ జిసిడిఓలతోపాటు జిల్లాకు చెందిన కేజీబివి పాఠశాల ప్రిన్సిపాళ్లు గుర్తించి, వారిని కెజిబివీల్లో  చేర్పించేందుకు కృషి ఆదేశించారు. అలాగే బ‌డి బ‌య‌ట ఉన్న పిల్ల‌ల‌తోపాటు,  డ్రాపౌట్స్, అనాధ, అర్ధ అనాధ, పి.హెచ్.సి విద్యార్థులకు ఈ పాఠ‌శాల‌ల్లో ముందుగా అవకాశం కల్పించాలని సూచించారు. అనంతరం ఎస్.సి, ఎస్.టి, ఓ.బి.సి, మైనారిటీ వ‌ర్గాలు, పేద పిల్ల‌ల‌కు ఎంపిక‌లో ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌ని చెప్పారు. కెజిబివి లలో దరఖాస్తుల కోసం అభ్యర్ధులు https://apkgbv.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇత‌ర‌ వివరాల కోసం, జిల్లా జిసిడిఓ 9000204925, అసిస్టెంట్ జిసిడిఓ 9440160049 లను సంప్రదించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఉన్న కెజిబివిల ప్రిన్సిపాళ్లంద‌రూ,  దరఖాస్తుల స్వీకరణలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీట్లను భర్తీ చేయాలని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2022-05-06 11:25:04

స్పందన పై ప్రజలకు నమ్మకం కలిగించండి

స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వెంట వెంటనే పరిష్కరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటిడి ఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ  స్పందనకు అధికారులందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.  ఫిర్యాదుదారులు తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎన్నో వ్యయ ప్రయాశాలకు ఓర్చి,ఎంతో దూరం నుండి వస్తారని అటువంటి వారిని నిరుత్సాహ పరచకుండా వారి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని హితబోధ చేశారు. స్పందనలో ఫిర్యాదు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని కలెక్టర్ సూచించారు.  శుక్రవారం జరిగిన స్పందనకు  84  దరఖాస్తులు అందాయి.  వాటిలో ముఖ్యoగా పెదబయలు మండలం మారడపల్లి గ్రామంలో బి.టి రోడ్డు సౌకర్యం కల్పించాలని, తొలగించిన  తెల్ల రేషన్ కార్డును పునరుద్దరించాలని, గంపరాయి నుండి జామిగూడ వరకు ఐదు కిలోమీటర్ల మట్టి రోడ్డును శ్రమ దానంతో వేయించుకున్నామని  దానిని బి.టి. రోడ్డుగా వేయించాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయి.  
    సొవ్వ  పంచాయతీ  తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ.ఎం. డుంబ్రిగుడ మండల కమిటీ ఫిర్యాదు చేసింది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగం కొరకు కొంతమంది దరఖాస్తు చేసియున్నారు. మూడు సంవత్సరాల నుండి జీతం రావటం లేదని ఒక ఆశ కార్యకర్త ఫిర్యాదు చేసింది. పాఠశాలకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కల్పించనందున ఉద్యోగం కల్పించాలని దరఖాస్తులు అందాయి. ఈ స్పందన కార్యక్రమం లో సుబ కలెక్టర్ అభిషేక్, డిఆర్ఓ దయానిధి, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు మణి  కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Paderu

2022-05-06 09:03:42

సత్యనారాయణ సేవలు ప్రశంసనీయం

సీనియర్ పాత్రికేయులు ఎన్.సత్యనారాయణ సమాజానికి అందించిన సేవలు ప్రశంస నీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.  ఈ మేరకు శుక్రవారం  విశాఖలోని గోపాలపట్నం ఆయన నివాసంలో సత్యనారాయణ వర్ధంతిని  ఆయన మిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినఈ కార్యక్రమంలో  శ్రీనుబాబు సహచర మిత్రులుతో కలసి పాల్గొన్నారు. తొలుత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శీనుబాబు మాట్లాడుతూ,  మూడు దశాబ్దాల కాలం పాటు పత్రికా రంగంలో జర్నలిస్టులకు  సత్యనారాయణ  పూర్తి స్థాయిలో సేవలందించారని  వివరించారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేకమంది మిత్రులు, సన్నిహితులు, పాత్రికేయులు అభిమానులు, మిత్ర బృందం తరపున సుబ్బారావు, మోహన్, నాయుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Gopalapatnam (rural)

2022-05-06 08:18:19

ఉద్యోగులు ఏపీజీఎల్ఐ తీసుకోవాలి..

ప్రభుత్వ ఉద్యోగులు  చెల్లించిన ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం మొత్తానికి పాలసీలు తీసుకోవాలని విశాఖ జాయింట్ డైరక్టర్ డి.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 55సంవత్సరం లోపు ప్రభుత్వ ఉద్యోగులు ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం చెల్లించుచూ పాలసీలు పొందని వారు, 55 సంవత్సరంలు దాటి సర్వీసులో ఉన్న ఉద్యోగులు తేది 30-6-2022 లోగా ప్రతి పాదనలు జిల్లా బీమా కార్యాలయంనకు సమర్పించి పాలసీలను పొందాలని  కోరారు.  తేది 30-6-2022 లోపు పాలసీ ప్రతిపాదనలను సమర్పించి తగిన రశీదు తీసుకోవాలని తెలిపారు. అదే విదంగా  55 సంవత్సరములు దాటిన  ప్రభుత్వ ఉద్యోగులు ప్రీమియం హెచ్చింపు చేయరాదని, అదే విధంగా    తేది 30-6-2022 తరువాత సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించబడవని ఆ ప్రకటనలో తెలిపారు. 

Visakhapatnam

2022-05-05 14:24:24

విశాఖజిల్లాకు విద్యాదీవెన రూ.32.36 కోట్లు

జగనన్న విద్యా దీవెన క్రింద జిల్లాకు రూ.32.36 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2021 - 22 ఏడాదికి సంబంధించి రెండువ విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయంను  విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.   జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాలులో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి  జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, గాజువాక ఎమ్.ఎల్.ఎ తిప్పల నాగిరెడ్డి, ఎమ్.ఎల్.సి వరుదు కళ్యాణి, సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరక్టర్ రమణమూర్తి, జిల్లా బి. సి  సంక్షేమ అధికారి శ్రీదేవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం జిల్లా కలక్టర్ విలేకరులతో  మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన క్రింద రాష్ట్రంలో 10.85 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  రూ.709 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. ఎవరైన అర్హత కలిగి ఉన్న విద్యార్థుల తల్లులకు నగదు  జమ కాకపోతే సోమవారం నాడు జరిగే గ్రీవెన్సులో ఫిర్యాదు చేసినచో వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా వెంటనే విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. 

విశాఖ జిల్లాలో 46,519 మంది విద్యార్థులకు సంబంధించి తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.32.36 కోట్లు జమ. ఇందులో 4,677 మంది ఎస్.సి విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.3.95 కోట్లు, 190 మంది ఎస్.టి విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.13.01 లక్షలు, 40,149 మంది బి.సి వెల్ఫేర్  విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ. 27.24 కోట్లు, 1273 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.83.73 లక్షలు, 230 మంది క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు గాను వారి తల్లులు ఖాతాల్లో రూ.18.92 లక్షలు జమ అవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినీ,విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.32.36 కోట్ల  రూపాయల మెగాచెక్ జిల్లా కలెక్టర్, మేయర్,ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు.

Visakhapatnam

2022-05-05 14:21:35

9న స్పందన కార్యక్రమం పెద్దాపురంలో

కాకినాడ జిల్లాలోని  ఈ నెల 9న  జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్ర మాన్నిపెద్దాపురం పట్టనంలోని మట్టేవారి కళ్యాణ మండపంలో ఉదయం 9-30 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా గురువారం ఒక ప్రకటన లో తెలియజేసారు. కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి 9వ తేదీన తమ అర్జీలను పెద్దాపురంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు.  అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ సోమవారం ఉదయం 9 గంటలకే పెద్దాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Kakinada

2022-05-05 13:47:16

విద్యాదీవెనతో పేదలకు ఉన్నతవిద్య

పేద కుటుంబాల పిల్ల‌ల‌కు ఉన్న‌త విద్య‌ను అందించి.. ఆ కుటుంబాలు అన్ని విధాలా అభివృద్ధి సాధించాల‌నే ఆశ‌యంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గొప్ప మ‌న‌సుతో జ‌గ‌న‌న్న విద్యా దీవెన (జేవీడీ) ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తున్నార‌ని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. జ‌గ‌నన్న విద్యా దీవెన ప‌థ‌కం కింద 2022, జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ మొత్తాన్ని విడుద‌ల చేసే కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం ఉద‌యం తిరుప‌తిలో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కాకినాడ జిల్లా క‌లెక్ట‌రేట్ వివేకానంద స‌మావేశ‌మందిరం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత‌, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ద‌వులూరి దొర‌బాబు, జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న‌, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌ళాదీప్తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం కింద ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ మొత్తాన్ని విడుద‌ల చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం ఎంపీ, హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్, మేయ‌ర్, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ త‌దిత‌రులు అధికారుల‌తో క‌లిసి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు మెగా చెక్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం కింద కాకినాడ జిల్లాలో 2022, జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి 47,347 మంది విద్యార్థుల‌కు సంబంధించి 42,075 మంది త‌ల్లుల ఖాతాల్లో రూ. 29.59 కోట్లు మొత్తాన్ని జ‌మచేయ‌డం జ‌ర‌గుతుంద‌న్నారు. ఒక క్యాలెండ‌ర్ ప్ర‌కారం చెప్పిన స‌మ‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వైద్య శాల‌ల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విద్యారంగ ప్రాధాన్యాన్ని గుర్తించి ఓ స‌మ‌గ్ర‌మైన విధానంతో ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌ని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: జేసీ ఇల‌క్కియ‌ 
కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న జ‌గ‌న‌న్న విద్యా దీవెన, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన త‌దిత‌ర ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకొని, ఉన్న‌త చ‌దువులు చ‌దివి భ‌విష్య‌త్ కెరీర్ ప‌రంగా ఉన్న‌తంగా ఎద‌గాల‌ని విద్యార్థుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగ‌ల‌క్ష్మీదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.మ‌యూరితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-05-05 13:42:15

మన్యం జిల్లా అభివ్రుద్ధే ప్రధాన లక్ష్యం..

మన్యం జిల్లా అభివద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రివ్యూ కమిటీ సమావేశం గిరి మిత్ర సమావేశ మందిరంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన గురు వారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రాదాన్యత క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. తాగు నీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరులో గృహ నిర్మాణంపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరులో 10,850 గృహాలు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పక్కాగా అమలు జరిగి వేతనదారులకు మంచి వేతనం లభించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అటవీ ప్రాంత రహదారుల గూర్చి మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని అన్నారు. బొరబంద ఆర్.బి.కె నుండి తూర్పు గోదావరి జిల్లాకు ధాన్యం పంపించారని, అయితే సక్రమంగా నమోదు చేయలేదని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఏనుగులు వలన నష్టం జరిగిన వివరాలు, వచ్చిన నిధులు, వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

 జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి విప్లవాత్మక నిర్ణయాలలో భాగంగా జిల్లాల విభజన జరిగిందన్నారు. పరిపాలన చేరువ కావడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. పథకాలు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రూ.1.44 లక్షల కోట్లు నగదు బదిలీ పథకం క్రింద ప్రజలకు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. నీటి ఎద్దడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు వద్దకు సమస్యలు వస్తాయని వాటిని అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ముఖ్య మంత్రి మానస పుత్రిక గ్రామ సచివాలయం, ఆర్.బి. కె, వెల్ నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. అత్యధిక సంఖ్యలో రాష్ట్రానికి గృహాలు మంజూరు అయ్యాయని వాటిని నిర్మించుకోవాలని అన్నారు. నవరత్నాలు అమలు పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని తద్వారా జీవితాలు మారుతాయని, బయటి ప్రపంచంతో సంబంధాలు మెరుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అటవీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మన్యం జిల్లాను ఆదర్శంగా నిలుపుటకు కృషి చేద్దాం అని, ముఖ్య మంత్రి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి అన్నారు. 

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ తాగు నీటి సమస్య ఉంటే జిల్లా పరిషత్ నుండి సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. జల జీవన్ మిషన్ లో మన్యం జిల్లాలో నీటి సమస్య లేకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. సమగ్ర తాగు నీటి ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రత్యేక డిపిఆర్ లు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. పాలకొండ నియోజక వర్గంలో తాగు నీటి కొరకు రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అందులో మొదటిగా రూ.15 లక్షలు విడుదల చేస్తామని అన్నారు. సాలూరు మండలం పెదపాడు గ్రామ సచివాలయంను త్వరగా నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ సోలార్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన పథకాల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అన్నారు. శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ గతంలో చేపట్టిన తాగు నీటి పనులను కూడా పర్యవేక్షణ చేసి పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే నీటి సమస్య తలెత్తిందని అన్నారు. దాదాపు 6 వందల గిరిజన గ్రామాలకు తాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పక్కాగా ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. వీరఘట్టం మండలంలో 60 గ్రామాలకు మొదటి విడత క్రింద ఉందని, దానిపై చర్యలు చేపట్టాలని కోరారు. సీతంపేట, భామిని మండలాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరారు. హిల్ టాప్ గ్రామాలలో ఆర్.బి.కెలు, సచివాలయాల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని అన్నారు. సిబ్బంది లేక రికార్డింగ్ జరగక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆమె తెలిపారు. సీతంపేట ప్రాంతంలో కూడా ఏనుగుల సమస్య ఉందని ఆమె అన్నారు. ఏనుగుల వలన జరిగే నష్టపరిహారం కూడా అందటం లేదని ఆమె అన్నారు. హిల్ టాప్ లో బియ్యం సరఫరాకు సామర్థ్యం ఎక్కువ ఉన్న వాహనాలు అవసరమని తద్వారా సరఫరా చక్కగా సాగుతుందని అన్నారు. శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ సీతానగరం మండలంలో 16 గ్రామాలు తాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయని అన్నారు. నర్సిపురంలో 540 మందికి ఇళ్ళ స్థలాల పంపిణి చేయాలని ఆయన తెలిపారు.పట్టణంలో 13 వందలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. బెలగాంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంజూరుకు పరిశీలించాలని కోరారు. 

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మన్యం జిల్లా గిరిజనులకు నిలయమని చెప్పారు.  జిల్లాలో విద్యా, వైద్యం, పేదల ఆదాయం పెంపొందించుటపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. పౌష్ఠికాహారంపై ప్రత్యేక చర్యలు చేపట్టి ఆరోగ్యం మెరుగు కృషి చేయాల్సి ఉందన్నారు. నీతి అయోగ్ సూచనల మేరకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాగు నీటిపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. విద్యుత్ కనెక్షన్లు పెండింగులో ఉన్న అంశాలపై ఆర్. డబ్ల్యూ.ఎస్, ఇపిడిసిఎల్ సంయుక్తంగా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.  మునిసిపాలిటీ పరిధిలో ని జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించుటకు మునిసిపల్ నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. పెద్ద లే అవుట్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని ఆయన చెప్పారు. గృహ నిర్మాణం, ఇతర భవనాల నిర్మాణ సామగ్రి కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు. అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై అటవీ అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహించి నివేదికలు త్వరితగిన సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. మార్చిలో జరిగిన జీడి మామిడి నష్టంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరిన మేరకు బృందాన్ని నియమించారని ఆయన చెప్పారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించామన్నారు. 

గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కూర్మి నాయుడు, ఉపాధి హామీ ఏపిడి శ్రీనివాస రావు, తదితరులు తమ శాఖల ప్రగతి వివరించారు.  పాలకొండ నియోజక వర్గంలోని మండలాలను పట్టణాభివృద్ధి అథారిటీ క్రింద తీసుకువచ్చుటకు ప్రతిపాదనలు సమర్పించాలని డి.ఆర్.సిలో తీర్మానించారు. ఈ మేరకు అన్ని మండలాలు తీర్మానాలు ఆమోదించి సమర్పించాలని, తద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సభ ఆమోదించింది. మార్చిలో జరిగిన జీడి పంట నష్టంకు నష్ట పరిహారం అందించాలని సభ తీర్మానించింది. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ , రాష్ట్ర టి చైర్మన్ జె. ప్రసన్న కుమార్, డిసిఎంఎస్ చైర్ పర్సన్ అవనాపు భావన, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు,  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు బి.నవ్య, ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, ఆర్.డి.ఓ కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-05 13:32:23

అల్లూరి జిల్లాలో 14801 మందికి లబ్ధి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 14801 మంది విద్యార్థులకు 6 కోట్ల 41 లక్షల 91 వేల044 రూపాయలు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.  కాగా బీసీ సంక్షేమ శాఖ నుండి 1960 మంది విద్యార్థులకు ఒక కోటి తొమ్మిది లక్షల 91 ఒక వేల 958 రూపాయలు, ఎస్ ఎస్ సి సంక్షేమ శాఖ నుండి 435 మంది విద్యార్థులకు 29 లక్షల 99 వేల 492 రూపాయలు, ఎస్ టి సంక్షేమ శాఖ నుండి 12347 మంది విద్యార్థులకు నాలుగు కోట్ల 87 లక్షల 57 వేల 926 రూపాయలు, మైనారిటీ సంక్షేమ శాఖ నుండి 109 మంది విద్యార్థులకు 28 లక్షల 83 వేల 336 రూపాయలు లబ్ధి చేకూర్చి నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి ఎ మణికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

Paderu

2022-05-05 11:15:48

పేద విద్యార్థుల చదువు బాధ్యత నాది

 పేదరికం వల్ల విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకూడదు అనే ఆలోచనతో జగనన్న విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టి విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  గురువారం తిరుపతి నుండి జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభిస్తూ ప్రతి మూడు నెలలకు విద్యార్థుల ఫీజు ను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు.  ఈ త్రై మాసంలో 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ. 709 కోట్ల రూపాయలను బటన్ నొక్కి తల్లుల ఖాతాలలో జమ చేశారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి అందుకు అనుగుణంగా పథకాల లబ్ధి చేకూరుస్తున్నమన్నారు.  జగనన్న విద్యా దీవెన తో పాటు జగనన్న వసతి దీవెన కింద 2021-22 సంవత్సరంలో రెండో విడతగా 1024 వేల కోట్ల రూపాయలు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కాగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు పి ఎ మణికుమార్, విద్యార్థులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తిలకించారు.

Paderu

2022-05-05 11:14:15

ఫిష్ ఆంధ్ర నిర్వాహ‌కుల‌కు ప్రోత్సాహం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ఫిష్ ఆంధ్ర ప‌థ‌కంలో భాగంగా మినీ రిటైల్ యూనిట్లను న‌డుపుతున్న‌ నిర్వాహ‌కుల‌కు త‌గిన ప్రోత్సాహం అందించాలని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. నిర్వ‌హ‌ణ‌కు త‌గిన సామ‌గ్రి, స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేయాల‌ని సూచించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల నిర్వ‌హ‌ణపై సంబంధిత అధికారులు, ల‌బ్ధిదారుల‌తో ఆమె త‌న ఛాంబ‌ర్లో  స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల ద్వారా చాలా మందికి ఉపాధి క‌లుగుతుందని, కావున వాటి నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వ ప‌రంగా త‌గిన ప్రోత్సాహం అందించాల‌ని సూచించారు. రోజూ తాజా చేప‌లను సంబంధిత యూనిట్ల‌కు హ‌బ్ ల ద్వారా స‌ర‌ఫ‌రా చేయాల‌ని చెప్పారు. చేప‌ల‌ వినియోగాన్ని పెంచేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వీలుంటే స‌మీప వస‌తి గృహాల్లో మెనూలో అమ‌లు చేసేందుకు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాల‌ని ఆదేశించారు. అద‌నంగా మ‌రిన్ని యూనిట్ల‌ను ప్రారంభించాల‌ని, ఔత్సాహికులంటే గుర్తించి యూనిట్లు కేటాయించాలన్నారు. కేంద్రాల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రిని అంద‌జేయాల‌ని చెప్పారు. ఔత్సాహికుల నుంచి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ప్ర‌తి మండ‌ల కేంద్రంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసేలా చూసుకోవాల‌ని ఫిష‌రీస్ విభాగం ఉప సంచాల‌కులను ఆదేశించారు.

ప్ర‌తి యూనిట్‌కు ఇన్వ‌ర్టెర్ అంద‌జేయండి..
వేస‌విని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌తి యూనిట్టుకు ఇన్వ‌ర్టెర్ అంద‌జేయాల‌ని హ‌బ్ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. విద్యుత్ కోత‌ల వ‌ల్ల చేప‌లు పాడైపోకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, నిర్వాహ‌కుల‌కు న‌ష్టం వాటిల్ల కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొల్పిన కేంద్రాల్లో ఎక్కడెక్క‌డ ఇన్వ‌ర్టెర్ అవ‌స‌ర‌మో గుర్తించి త్వ‌రిత‌గిన అందించాల‌ని చెప్పారు. స‌మావేశంలో మ‌త్స‌శాఖ విభాగం ఉప సంచాల‌కులు నిర్మ‌లా కుమారి, డీఆర్డీఏ పీడీ అశోక్ కుమార్‌, మెప్మా పీడీ సుధాక‌ర్‌, ఫిష్ ఆంధ్ర రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ హ‌రేరామ్‌, జిల్లా కో-ఆర్డినేట‌ర్ కృష్ణ‌, ఇత‌ర అధికారులు జ‌గ‌న్ మోహ‌న్‌, భాస్క‌ర్ రావు, హ‌రిశ్చంద్ర‌, యూనిట్ల నిర్వాహ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-05 05:37:39