1 ENS Live Breaking News

మహాత్మాగాంధీ కలను నిజం చేద్దాం

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావని కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కార్యక్ర మాల్లో పాల్గొనాలి అంటూ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.సురేఖ తెలి పారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల లో మంగళవారం ఉదయం స్వచ్ఛభా రత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ వాకర్స్ క్లబ్, ఎన్ సి సి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  సురేఖ మాట్లాడుతూ పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సూచనలతో ఈరోజు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడమైనది. ప్రతి నెల 10వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. మనం మన పరిసరాలు శుభ్రం చేసుకోవాలి లనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిరభిచమని ఇది ఇక్కడికే పరిమితం కాకుండా ఎన్.సి.సి విద్యార్థులు ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పూర్తి సహకారం అందించారన్నారు.

ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో  వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్  పి.జి.గుప్తా,మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ ,స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు,క్లబ్ ప్రతినిధులు గోలీ ఉమామహేశ్వరరావు,ఎం.మల్లిబాబు, గోలీ సంతోష్,డాక్టర్ జి.నారాయణరావు , ఎన్.సి.సి విద్యార్థులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కళాశాల లెక్చరర్స్, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:30:54

పరిశుభ్రతకు తొలి అడుగుపడింది..

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పరిశుభ్రతకు అడుగు పడింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తెలవారక ముందే సైకిల్ పై పట్టణమంతా చుట్టుముట్టారు. పట్టణంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పారిశుధ్యం నుండి జాతీయ నాయకుల విగ్రహాల నిర్వహణ వరకు పరికించి చూసారు. జాతీయ నాయకుల విగ్రహాలు దూలి పట్టి ఉండటం చూసి చలించి పోయారు. స్వామి వివేకానంద  విగ్రహాన్ని స్వయంగా శుభ్రం చేసి స్ఫూర్తిని నింపారు. జాతీయ నాయకుల విగ్రహాలను గౌరవించడం మన విధి అని చెప్పకనే చెప్పారు. పట్టణంలో పలు అంశాల నిర్వహణ పట్ల తక్షణం చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలంను ఆదేశించారు.  మునిసిపల్ కమీషనర్ సైతం వెంటనే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలులో పెట్టుటకు చర్యలు చేపట్టారు. మంగళ వారం పట్టణంలో మరింత పరిశుభ్ర వాతావరణం నెలకొంది. జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రపరిచారు. జిల్లా కలెక్టర్ పట్టణంలో పర్యటించడం, వెను వెంటనే విగ్రహాలు శుభ్రపడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పట్టణంలో పారిశుధ్యం, మురుగు నీటి కాలువల కష్టాలు తొలగి పోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పట్టణం పొలిమేరల్లోని ఆవాసాల్లో విద్యుత్ కష్టాలు తొలగించుటకు జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు.

Parvathipuram

2022-05-10 05:56:41

విద్యార్థులకు సర్టిఫికెట్స్ జారీ చేయాలి

విద్యార్థుల ఉన్నత విద్యకు వివిధ సర్టిఫికేట్ లు అవసరమని, వాటిని సత్వరమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై సమీక్ష  నిర్వహించారు.  గృహ నిర్మాణాలు పై సమీక్ష నిర్వహిస్తూ ఇంటి నిర్మాణ పనులు, వివిధ దశలలో వేగవంతం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహనిర్మాణ పథకానికి   ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఈ పథకం అమలులో, లక్ష్యాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక్క గృహం కూడా గ్రౌండింగ్ కాకపోవడంపై ప్రశ్నించారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రతి అధికారి నిర్మాణాల పై బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలన్నారు.

ఉపాధి హామీ రోజువారీ  లక్ష్యాలను, పంచాయతీ వారీగా  నిర్దేశించుకుని పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజు కీలకమేనని, ఒక్క రోజు కూడా వృధా చేయకుండా లక్ష్యం మేరకు పని చేయాలన్నారు.  పంచాయతీ రాజ్ ద్వారా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్స్ ను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు.  సమగ్ర భూ సర్వే గ్రామ సదస్సులు నిర్వహించాలని, గ్రామస్తులకు ముందుగానే సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. భూ మ్యుటేషన్ కాలపరిమితి వరకు వేచి ఉండకుండా, వెంటనే పూర్తి చేయాలన్నారు.  జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్  మాట్లాడుతూ  సర్వేకు ముందుగానే మ్యుటేషన్ పూర్తిచేయాలని,  లేనిచో సర్వే సమయంలో తప్పనిసరిగా  మ్యుటేషన్ చేయాలన్నారు. డిజిటల్ సంతకం పెండింగ్ పూర్తిచేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా అధికారులు హాజరయ్యారు.


Parvathipuram

2022-05-10 05:55:01

డా.వైఎస్సార్ కలకు అంకురార్పణ జరిగేనా..?

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడాలి.. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ  విద్యార్ధులే ప్రభుత్వంలోని ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖను నడిపించాలి.. ప్రభుత్వానికి కావాల్సిన ఐటీ సేవలు మొత్తం  ఐటీ విద్యార్ధులే చేపట్టాలి.. అధికారిక వెబ్ సైట్ల నుంచి మొబైల్ యాప్స్ వరకూ అన్నీ ఆ విద్యార్ధులతోనే చేయించాలి.. కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయనే ధీమాల కల్పిం చాలి.. దానికోసం ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలి.. ఇదే నాటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి కల. దానికి అనుగుణంగానే ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ కంప్యూర్ సైన్స్ కోర్సు ఏర్పాటు అయ్యాయి. యూవర్శిటీలు, కాలేజీలో బీటెక్ కంప్యూర్ సైన్స్ సీట్లు కూడా పెరిగాయి. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. నేటికీ డా.వైఎస్సార్ కల సాకారం కాలేదు. ప్రభుత్వంలో ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు.  ప్రభుత్వానికి కావాల్సిన అన్నిప్రభుత్వ శాఖలకు చెందిన మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్లను థర్డ్ పార్టీ నిర్వహకులతో ప్రభుత్వం చేయిస్తోంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు డా.వైఎస్సార్ ప్రత్యేక ప్రణాళిక అప్పట్లో అమలు చేయాలని భావించారు.  ఆయన మదిలో మెదిలిన ఆలోచనకు కార్యరూపంలోకి రావాల్సి వుంది. కానీ విధి వైపరీత్యం ఆయన హెలీకాఫ్టర్ ప్రమాదంలో కాలం చేశారు. ఆయనతోపాటు ఆ మంచి ఆలోచన కూడా మరుగున పడిపోయింది. దానితో ప్రభుత్వ అధికారిక పోర్టల్ నిర్వహణ కూడా వివిధ ప్తైవేటు సాఫ్ట్ వేర్ డెలప్ మెంట్, మెయింటినెన్సును ఆ  సంస్థలు నిర్వహి స్తున్నాయి. దానికి ప్రభుత్వం లక్షలాది రూపాయాలు మెయింటినెన్స్ చార్జీలు చెల్లిస్తుంది.


డా వైఎస్సార్ ఆ.. ఐటీ శాఖ ఆలోచన ఏవిధంగా అమలు చేయాలనుకున్నారో ఒక్కసారి తెలుసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్ లైన్ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలకు శాఖాపరమైన వెబ్ సైట్ ఏర్పాటుచేయాలి, అత్యవసర సేవలకు మొబైల్ యాప్ రూపొందించాలి. అవన్నీ బీటెక్ కంప్యూర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్ధులతోనే చేయించాలి. అసలు ఒక ప్రభుత్వ శాఖనే ఏర్పాటు చేసి అందులో ప్రతీ శాఖను కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్ధులే నిర్వహణ చేపట్టేలా చూడాలి. తద్వారా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అత్యధిక మొత్తంతో ప్రభుత్వం ఆ శాఖలోని ఉద్యోగులకే జీతాలు ఇవ్వొచ్చు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వమే స్వయంగా సాఫ్ట్ వేర్ డెవలెప్ మెంట్ ద్వారానే అన్ని రకాల కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి కూడా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో ఐటీశాఖను జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేసి  ప్రభుత్వానికి, ప్రభుత్వశాఖలకు కావాల్సిన కంప్యూర్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సేవలన్నీ వారితోనే చేయించడం ద్వారా ప్రభుత్వానికి ఆర్ధికంగా చాలా పెద్ద మొత్తం కలిసి వస్తుంది.  ప్రభుత్వమే ఒక ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వం వద్దనే వారి వారి సంస్థలకు కావాల్సిన సాఫ్ట్ వేర్లను, వెబ్ సైట్లను తయారుచేయించుకునే స్థాయికి ఎదగవచ్చు అనేది వైఎస్సార్ ఆలోచన. దానికి అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసి అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ బీటెక్  కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. వాటితో పాటు యూనివర్శిటీల్లోనూ బీటెక్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ సీట్లును పెంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తీరా ఆయన కల సాకారం కావడానికి బీజం పడుతుందనే సమయంలో ఆయన దూరమైపోయారు. నాటి నుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిశగా మళ్లీ అడుగులు వేయలేదు. నిజంగా దివంగత ముఖ్యమంత్రి ఆలోచన కార్యరూపం దాల్చితే ప్రభుత్వ శాఖలో ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖఏర్పాటు అయ్యేది. అన్నిజిల్లాల్లోనూ ప్రభుత్వ శాఖలకు కావాల్సిన కంప్యూర్లు, అందులోని సాఫ్ట్ వేర్లు, ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ యాప్ లు, వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు, కంప్యూటర్ మెయింటినెన్సులు, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన ప్రత్యేక సాఫ్ట్ వేర్లు.. ఇలా అన్ని రకాలగా ఆశాఖ ఎంతగానో ఉపయోగపడేది. వారే నిర్వహణ మొత్తం చేపట్టేవారు. తద్వారా ప్రతీ జిల్లాలోనూ ఉద్యోగాల కల్పన కూడా జరిగేది. కానీ ఆ ప్రయత్నం జరగకపోవడం వలన ప్రస్తుతం  ప్రతీది థర్డ్ పార్టీ ప్రైవేటు సంస్థలతోనే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించుకోవాల్సి వస్తుంది. నాడు డా.వైఎస్సార్ ఆలోచనలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్ధులకు కంప్యూటర్లపై అవగాహన కూడా కల్పించాలని. దాని కోసం సాధారణ ఉపాధ్యాయులు మాదిరిగా, బీటెక్, ఎంటెక్ చదివి విద్యార్ధులను కంప్యూటర్ కోర్సులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులుగా డిగ్రీ వరకూ నియమించాలనే ఆలోచన కూడా ఉండేదట. తద్వారా విద్యార్ధులు పదవతరగతికి వచ్చేనాటికే కంప్యూటర్ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన రావడంతోపాటు,  డిగ్రీ తరువాత వారు కూడా ప్రత్యేక కోర్సులు కళాశాలల్లోనే నేర్చుకుని ఆపై వెను వెంటనే సాఫ్ట్ ఉద్యోగాల్లో స్థిరపడటం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత దేశం అందునా ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ ఎగుమతులు, దిగుమతుల్లో అగ్రస్థానంలో నిలబడుతుందని ఆలోచన చేశారట.

దివంగత ముఖ్యమంత్రి తుదిశ్వాస విడిచిన తరువాత అధికారంలోకి  వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఆదిశగా ఆలోచన చేయలేదు. అలా చేసి ఉంటే నేటికి ప్రభుత్వానికి బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూర్ సైన్స్ కోర్సులు చదివిన విద్యార్ధులకు మెండుగా ఉపాది, ఉద్యోగ  అవకాశాలు వచ్చేవి. పైగా ప్రభుత్వంలోని ఒక శాఖ ఏర్పాటుతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పన చేయడానికి ఆస్కారం వుండేది. చాలా ఏళ్ల తరువాత డా.వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఐటీకి పెద్ద పీట వేశారు తప్పితే తండ్రి ఆలోచనలు మాత్రం పునికి పుచ్చుకోలేదు. ఈ ప్రభుత్వంలో కూడా నాటి ఐటీ శాఖ మంత్రి కూడా ఆ దిశగా ఆలోచనలు చేయలేదు. కానీ ఇపుడు అదేశాఖకు యువకుడు గుడివాడ అమర్నాధ్ మంత్రి అయిన తరువాత మళ్లీ ఆ దిశగా అడుగులు పడతాయనే భావన అందరిలోనూ కలుగుతోంది. కానీ వారికున్న పదవీకాలం చాలా చిన్నది. రాజకీయాలు చేయడానికి, సంక్షేమ పథకాల అమలుకే సమయం మొత్తం అయిపోతుంది. ఆ సమయంలోనే డా.వైఎస్సార్ కలను నిజం చేస్తారా..?  లేదంటే ఆయన కంటే మిన్నగా ఆలోచించి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ఐటీ శాఖను ఏర్పాటు చేసి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా  క్రుషి చేస్తారానే చర్చ కూడా రాష్ట్రంలో గట్టిగా జరుగుతోంది. దానికి కారణం మంత్రి కూడా బీటెక్ చదివిన వ్యక్తికావడంతో ఐటీశాఖను  రాష్ట్రప్రభుత్వ శాఖలన్నింటిలోనూ అగ్రభాగన నిలబెడతారనే భావనను అంతా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి డా.వెఎస్సార్ కన్న ఐటీశాఖ ఏర్పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటవుతుందా లేదా అనేది.

Tadepalli

2022-05-10 04:04:46

స్పందనకు అధికారులు హాజరు తప్పనిసరి

 ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమానికి  జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మండల స్థాయిలో కూడా మండల స్థాయి  అధికారులు మాత్రమే   స్పందన కార్యక్రమం నిర్వహించాలని, స్పందన కార్యక్రమం నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.    స్పందన కార్యక్రమం లో  వచ్చిన ప్రజా ఫిర్యాదులను సత్వరమే   పరిష్కరించాలని తెలిపారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, గ్రామ సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఎక్కువగా అర్జీలు అందజేశారు.  స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్  మరియు సంయుక్త కలెక్టర్   ఒ. ఆనంద్, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాధ్, డి ఆర్ ఒ వెంకటరావు పాల్గొని వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి మొత్తం 85 వినతులు అందాయి. 

జయ్యమ్య  వలస మండలం అoకవరం  గ్రామం పంచాయతీ లో నిర్మియించిన రైతు భరోసా కేంద్రం భవన అద్దె బకాయి చెలించాలని  వి.వెంకట రమణ కోరారు.  మరి పల్లి గ్రామానికి చెందిన శ్రీకాకుళం నరేంద్ర కుమార్ డిప్లమో పూర్తి చేశానని ఉపాధి చూపించాలని దరఖాస్తు పెట్టుకున్నారు.  పార్వతీపురం మండలం  బాలగుడబ  రెవెన్యూ పరిధిలో వాగుల తూము వద్ద సర్వే జరిపించి హద్దులు  నిర్ణయించాలని, చెరువు  గర్భంలో  ఆక్రమణలు తొలగించి హద్దులు  నిర్ణయించి తూము నిర్మాణం చేపట్టాలని హాయిగా సంఘం అధ్యక్షురాలు యండా రాజేశ్వరి కోరారు.  గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన తంగుడు   జయనరాణి వైఎస్ఆర్ చేయూత మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.  గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం పంచాయతీ కార్యదర్శి రావాడ సిమ్మయ్య జీతభత్యాల బకాయిలు ఇప్పించవలసిందిగా కోరారు.  మక్కువ  మండలం శంబల గ్రామం లో ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలు సక్రమంగా   అందడంలేదని, గ్రామానికి వాలంటీర్ ను నియమించాలని గ్రామస్తులు  నమ్మి సత్యనారాయణ  ఇతరులు వినతి పత్రం అందజేశారు.  పాచిపెంట మండలం కర్ర వలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 154-3, 154-5, 155-6 లలో సాగు చేసుకుంటున్న గిరిజనులకు   ఎ7.18 ట్లు  భూమికి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఆదివాసి వికాస్ పరిషత్ అధ్యక్షులు సిహెచ్.  జోగయ్య కోరారు.

Parvathipuram

2022-05-09 09:24:10

డిప్యూటీ సీఎం బూడిని కలిసిన మంజుల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి మత్యాలనాయుడుని గాజువాక వైఎస్ఆర్సిపీ మహిళా నాయకులు, వాంబే కాలనీ శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త మంత్రి మంజుల సోమవారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గాజువాకలోని  వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించాలని డిప్యూటీ సీఎంను ఆమె కోరారు. అనంతరం మూడు జిల్లాల కోఆర్డినేటర్, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ని కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-09 09:15:35

తుఫాన్ పట్ల జిల్లాయంత్రాంగం అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసాని తుఫాన్ పట్ల పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సోమ వారం తగు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తుఫాన్ సమాచారం అందించాలని ఆయన సూచించారు. అన్ని ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, రవాణాకు బస్సులు, వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న వంట ఏజెన్సీలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకొనుటకు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖను అదేశించారు.  నూర్పిడులు పూర్తి అయిన ధాన్యం భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. తహసీల్దార్లు ధాన్యం సేకరణ కేంద్రాలు పరిశీలించి సేకరణ వేగవంతం చేసెలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులను అప్రమత్తం చేయాలన్నారు.  రోడ్లపై  చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా వివిధ మండలాల్లో ఉంచాలని ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేటట్లు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు.  లోతట్టు  ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. మత్స్య శాఖ దేశీయ మత్స్యకారులకు సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.  తుఫాన్ సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యాధులు ప్రభలుటకు అవకాశం ఉందని వాటి చికత్సకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చి విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటే తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందుగా టాంక్ లు నింపడం, జనరేటర్లను సిద్దంగా ఉంచడం చేయాలని ఆర్.దబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో విద్యుత్ అంతరాయం వలన చికిత్సలకు ఆటంకం లేకుండా ముఖ్యంగా అత్యవసర శస్త్ర చికిత్సలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం తక్షణం పునరుద్దరణకు సిబ్బంది, విడి పరికరాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే పునరుద్దరణకు అవసరమగు స్తంభాలు సిద్దంగా ఉంచాలని చెప్పారు. తుఫాను సమయంలో విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంభందిత టెలి కమ్యూనికేషన్ ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను, వరదల అనంతరం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఒ. ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాధ్, జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-09 07:16:31

డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించండి..

విజయనగరం జిల్లాలోని వివిధ శాఖల విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వరిత‌గ‌తిన భ‌ర్తీ చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ హాలులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో ఖాళీగా ఉండే డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల‌ను నియ‌మించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారులకు సూచించారు. దానికోసం శాఖల వారీగా జిల్లా శాఖల అధికారులు వివరాలు తెలియజేయాలన్నారు. అంతేకాకుండా  డీడీఓల కోడ్‌ల‌ను పునఃప‌రిశీలించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆలస్యం కాకుండా చూసుకోవాలని జాల్లా  కలెక్టర్ అధికారులకు సూచించారు.

Vizianagaram

2022-05-09 05:55:07

అస‌ని తుఫాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అస‌ని తుఫాను హెచ్చ‌రికల నేప‌థ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. తుఫాను ప్ర‌భావం వ‌ల్ల‌ ఇంట‌ర్మీడియట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల‌ని సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఆసుప‌త్రుల వ‌ద్ద, ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల వ‌ద్దా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌ని చెప్పారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ప‌లు అంశాల‌పై ఆమె స‌మీక్షించారు. చేప‌ల వేట‌కు వెళ్లిన వారంతా తిరిగి వ‌చ్చేశారో లేదో ప‌రిశీలించుకోవాల‌ని, ఇంకా ఎవ‌రైనా ఉండిపోతే త‌క్ష‌ణ‌మే తీసుకొచ్చేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌త్స్య శాఖ డీడీని ఆదేశించారు. జ‌న‌సంచారం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో ప్ర‌మాద‌ర‌కరంగా ఉండే హోర్డింగుల‌ను తొల‌గించాల‌ని లేదా గ‌ట్టిగా క‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను తుఫానుపై అప్ర‌మ‌త్తం చేయాల‌ని సుర‌క్షిత చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో గ‌త రెండు, మూడు రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంద‌రూ విధిగా మాస్కులు ధ‌రించాల‌ని, కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని అన్ని విభాగాల అధికారుల‌కు సూచించారు. ఆయా విభాగాల్లో ప‌ని చేసే అధికారులు, సిబ్బంది త‌ప్ప‌కుండా మాస్కులు ధ‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

స‌చివాల‌య ఉద్యోగుల్లో మ‌నోధైర్యం నింపాల‌ని, ప్ర‌ధానంగా నైతిక విలువ‌ల ప్రాధాన్య‌త తెలియ‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక అధికారుల‌కు సూచించారు. ఎస్‌. కోట‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని చెప్పారు. ప్ర‌త్యేక అధికారులు స‌చివాల‌యాల సంద‌ర్శ‌న‌లో అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించాల‌ని సూచించారు. స‌చివాల‌యాల్లో డిజిట‌ల్ అసిస్టెంట్లు న‌మోదు చేసిన వివ‌రాల‌ను త‌దుప‌రి అధికారి ప‌రిశీలించ‌టం లేద‌ని ఫ‌లితంగా ప‌నుల్లో జాప్యం జ‌రుగుతుంద‌ని దృష్టి సారించాల‌ని చెప్పారు. స్పంద‌న పోర్ట‌ల్‌లో న‌మోద‌య్యే ఫిర్యాదుల‌కు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం చూపాల‌ని ఆదేశించారు.

సమీక్షా స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీపీఎం ప‌ద్మావ‌తి, డీఆర్డీఏ పీడీ అశోక్ కుమార్, సీపీవో విజ‌య‌కుమార్‌, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-09 05:52:02

ఏది నిజం..? ఏది కల్పితం..? ఏమాకధ..?

విశాఖలోని సింహాచలం దేవస్థానంలో అసలు విషయాన్ని పక్కన పెట్టి పెసల బేరాన్ని తెర పైకి తీసుకు రావడానికి కారణం ఏమిటీ? అసలు దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ డా.హరిజవహర్ లాల్ ఇచ్చిన మెమో ఏంటి? బయట మీడియాలో జరుగుతున్న ప్రచార మేంటి? ఎందుకు వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారు? అసలు సింహాచలం దేవస్థానంలో ఏం జరుగుతుంది? తెరువెనుక సూత్రదారులెవరు? తెరముందు డైరెక్టర్లు ఎవరు.. అనే అను మానాలు విశాఖలో ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్న ప్రశ్నలు. సరిగ్గా వాటికి ఊతమిస్తూ దేవాదా య శాఖ కమిషనర్ డా.హరిజహర్ లాల్ సింహాచలం దేవస్థానంలో జరిగిన పరకామణి లెక్కింపు విషయంలో ఏసి శాంతి, ఏఈఓ రమణమూర్తిలు, సిబ్బంది పరకామణి లెక్కింపులో షర్టులు వేసుకొని విధులకు హాజరైన విషయంలో సంజాయిషీ ఇవ్వాలనే విషయంలో తాకీదులు జారీచేస్తే..అది పక్కన పెట్టి ట్రస్టుబోర్డు సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు విషయంలో బురదచల్లే కార్యక్రమానికి తెరలేపారు. అసలు సింహాచలం దేవస్థానంలో జరిగిన కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే.. సింహాచలం దేవస్థానంలో ట్రస్టుబోర్డు ఏర్పాటైన తరువాత..స్వామివారి వైభవం మరింతగా పెరిగింది. అదే సమయంలో ట్రస్టుబోర్డు సభ్యులు చాలా మంది దాతల ద్వారా స్వామివారికి విరాళాలు ఇప్పించే విషయంలో కీలకంగా వ్యహరించారు. అందులో శ్రీనుబాబు పాత్ర చాలా ప్రముఖంగా వుందనేది జగమెరిగిన సత్యం. అంతేకాదు దేవస్థానంలో ఆయన సేవలు అటు ప్రభుత్వంలోనూ, ఇటుప్రజలకూ చాలా బాగా తెలుసు. పైగా తాను సంపాదించిన మొత్తంలో 10శాతానికిపైగా దానాలు, సేవలు, వ్రుద్ధాశ్రమాలకు వితరణ చేస్తుంటారు. ఎందరో పేద విద్యార్ధులను చదివించిన ఘనత కూడా శ్రీనుబాబుది. జర్నలిస్టుల పక్షపాతిగా ఉన్న ఏకైన జర్నలిస్టు సంఘ నాయకుడు ఆయన అలాంటి వ్యక్తిపై ఒక్కోసారి తేడా ప్రచారాలు సర్వసాధారణం.. 

ఏదైనా ఒక సంస్థ, ఆలయం, దేవస్థానం ప్రాచుర్యం పొందాలంటే ఆలయంలోని స్వామివారి శక్తి ప్రజలపై ప్రభావం చూపిస్తుంటుంది. అలాంటి సింహాచల దేవస్థానంలో అప్పన శక్తి ఎవరికీ తెలియనది కాదు. అంతటి లక్ష్మీనారసింహుని ముందు ఎవరూ కుప్పి గంతులు వేయాలని కూడా చూడరు. అది పాపం కూడా.. చూస్తూ చూస్తూ పాపపు పనులు బుద్దున్నవాడెవడూ ఆలయంలో చేస్తాడంటే ఎవరు మాత్రం నమ్ముతారు... ఈ వార్త చదువుతున్న మీకైనా ఎపుడైనా నోట్ల కట్టలపైనా, నాణేలాను తొక్కాలని, వాటిపై కూర్చావాలనే ఆలోచనా వచ్చిందా..? అంటే రాదు..డబ్బు అంటే లక్ష్మీదేవి కనుక. ఆ దేవతా మూర్తికి అపారమైన గౌరవం ప్రపంచంలోని ప్రతీ మానవుడూ ఇస్తాడుగనుక. ఇక్కడ ఒక సాంకేతిక అంశాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాల్సి వుంటుంది. ఎంతటి కోటీశ్వరుడైనా డబ్బులపై కూర్చునే సాహసం చేయరు. అందులోనూ దేవస్థానంలో అసలే చేయరు. డబ్బులు అంటే లక్ష్మీదేవితో సమానం. అలాంటి లక్ష్మీదేవి స్వరూపమైన డబ్బులపై కూర్చుంటే పరిస్థితి చాలా తేడాగా వుంటుందని అందరికీ తెలుసు. కానీ పరకామని లెక్కింపు విషయంలో చుట్టూ డబ్బులు ఉండి మధ్యలో ఎవరైనా వ్యక్తులు కూర్చుంటే వారు డబ్బులపైనే కూర్చున్నారనే బ్రమ కలుగుతుంది. అది ఒక్కోసారి ఫోటో ట్రాఫర్ చేతి మెలకువగా కనిపిస్తుంది. అదేవిధంగా ట్రస్టుబోర్డు సభ్యుడు కూడా పరకామణి పర్యవేక్షణకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ విషయంలో పంపిన ఆహ్వానం మేరకు మాత్రమే వెళ్లారు. అక్కడ పర్యవేక్షణలో భాగంగానే పరకామణి లెక్కింపు మధ్యలో కూర్చున్నారు. కాలికి అడ్డంగా వున్న నోట్లను దండంపెట్టి పక్కకు తీసే సమయంలో తీసిన ఫోటోను వైరల్ చేయడం అంటే ఒకరకంగా తేడా  పబ్లిసిటీ  అయిపోతుందని గమనించాలి. అదే సమయంలో మధ్యలోకి షర్టు వేసుకొని వచ్చిన ఏఈఓ రమణమూర్తి , ఏసి శాంతిల విషయంపై ఫిర్యాదులు వెళ్లడంతో వాటిపై వివరణ కావాలని కోరితే ఏకంగా ట్రస్టుబోర్డు సభ్యుడి వలన ఏదో జరిగిపోతుందనే విషయాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక అసలు తాకీదులు వచ్చిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఇక ట్రస్టుబోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు విషయానికొస్తే..ఆయన స్వస్థలం సింహాచలం.. ఆయన కుటుంబానికి ఆరాధ్య దైవం సింహాచల సింహాద్రి అప్పన్న. సాధారణంగానే శ్రీనుబాబు అప్పన్నకు వీరభక్తుడు. దేవుడు కొలువైన ఆలయంలో ఆయన కళ్లకి గంతలు కట్టి ఆలయంలోనికి పంపిస్తే అనవణువూ తిరిగి మళ్లీ ఆలయం బయటకు రాగల అవగాహన, పట్టు ఆలయంపై ఉన్నాయి ఆయను. శ్రీనుబాబు సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం కూడా స్వామివారి సేవకు శ్రీనుబాబును ఎంపిక చేసి ట్రస్టుబోర్డు సభ్యుడిగా నియమించింది. ఈయన నియామకం తరువాత ఆలయాన్ని, ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలను అన్ని రకాల మీడియా ద్వారా ప్రజల్లో విస్త్రుతంగా తీసుకెళ్లడంలో శ్రీనుబాబు చాలా కీకలంగా వ్యవహరించారు. అంతేకాదు చాలా మంది దాతల ద్వారా స్వామివారి సేవకు విరాళాలు తీసుకు రావడంలో ప్రధాన భూమిక పోషించారు. ఏం చేసినా స్వామి సేవలో అన్నట్టుగా ఉంటారాయన. ఈ ఉరుకుల పరుగుల జీవనంలో చావు కార్యాలకు వెళ్లాలంటే నూటికి 80శాతం మంది వెనుకడుగు వేస్తారు. కానీ శ్రీనుబాబుకి తెలిసిన వారు ఏ సమయంలో మ్రుత్యువాత పడినా.. తక్షణమే వారి కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు, దహన కార్యాలకు ప్రభుత్వం కూడా సహాయం చేయని విధంగా రూ.5వేలు మట్టిఖర్చులకు ఇచ్చి వస్తారు. ఏ జర్నలిస్టు ఆసుపత్రిలో ఉన్నా వారిని ఆదుకోవడానికి మందుల ఖర్చు, ఆసుపత్రి వైద్యం ఆయన దగ్గరుండి చేయిస్తారు. తెల్లవారి లెగిస్తే 24 గంటల్లో కనీసం ఐదు గంటలకు ప్రజా సేవకే అంకితం చేస్తారు. నిజంగా ఆమాటలు వింటే ఎవరైనా సేవకు ముందుకొస్తారు.. ఆ ఒక్క మాటే చెప్పే శ్రీనుబాబు ఎపుడూ చెబుతుంటారు.. పుట్టినపుడు తల్లి రక్తమాంసాలనే బట్టగా చేసుకొని పుడతాం.. పోయేటపుడు కుటుంబుం ఇచ్చిన ఆ ఒక్క తెల్లగుడ్డతోనే పోతాం..అదీ కూడా మన వెంట రాదు..కాటికాపరి తీసుకొని...మనపై కట్టె పేరుస్తాడని..అలాంటి జీవితానికి నిశ్వార్ధ సేవ ఒక్కటే మార్గమని తలిచి అప్పన్న ఆశీస్సులతోనే తాను ఈ సేవాల కార్యక్రమాలు చేయగలగుతున్నానని తడుముకోకుండా చెబుతారు.

ఇక ఆఖరిగా వివాదంలో ప్రధాన పాత్ర పరకామణి లెక్కింపు సమయంలో సిబ్బంది చొక్కాలు ధరించకూడదు అది వాస్తవం. అన్ని రూలు ప్రకారం చేసే దేవస్థాన ఈఓ ఈ విషయాన్ని ఎందుకు పెడచెవిన పెట్టారు..అంటే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసే ఇష్టం లేదని తేలిపోయింది. ఏక పక్షనిర్ణయాలు, ట్రస్టు సభ్యుల మెప్పు కోసం కార్యక్రమాలు, స్వామిదర్శనాలు ఇతరత్రా వ్యవహారాలు చేసే టపుడు ఆ పనులన్నీ వారితో చేయించేస్తే బాగుంటుందని ఈఓ చేపట్టిన పనులపై ఏ ఒక్క మీడియా వార్తలు రాయలేదు. అలాగని స్వామివారికి నిశ్వార్ధంగా సేవచేసిన వారి విషయంలోనూ వార్తలు రాలేదు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ఒకటి..దానిపై వచ్చే ప్రచారం ఒకటి రావడంతోనే అసలు తెరవెనుక ఏంజరుగుతుందనేది బయటకొచ్చింది.  పరకామణి విషయంలో వచ్చిన ఉత్తర్వులు శ్రీనుబాబు చుట్టూ పేర్చడం, డబ్బులపైనే ఆయన కూర్చున్నాడని, అతనిపై చాలా ఆరోపణలు ఉన్నాయని చెప్పడం బట్టీ చూస్తుంటే ఏదో జరుగుతుందనేది స్పష్టం అవుతుంది. దానిపై ఆరోపణల కోణాన్ని చూపడం అటుంచితే.. అసలు సింహాచలంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వంగానీ, ఇతర మీడియా సంస్థలు గానీ ఎందుకు వాస్తవాలు బయటకు తీయడం లేదని ప్రశ్నించం.. అది మాపని కాదు.. చిన్న విషయాలు బూతద్దంలో చూపిస్తే. పెద్ద మొత్తంలో జరిగిన విషయాలు మరుగున పడిపోతాయనేది ప్రధాన కారణం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి..పెసల విషయాన్ని రాద్దాం చేయవచ్చుననేది మరోక అంశం.. ట్రస్టుబోర్డు తాత్కాలికం..కాని పరకామణి వ్యవహారం శాస్వతం..కనీసం సీసి కెమెరాల పర్యవేక్షణ, ఈఓ పర్యవేక్షణ ఎందుకు చేపట్టలేదనే కోణం ఎక్కడికి పోయింది.? చొక్కాలు వేసుకువచ్చిన సిబ్బంది కరోనా సమయంలో మాస్కులు ఎందుకు ధరించలేదు, శానిటైజర్లు ఎందుకు వాడలేదు, సామాజిక దూరం ఎందుకు పాటించలేదు. ఈ ప్రధాన కారణాలు లోపాలు ఎక్కడికిపోయాయి...? అవన్నీ కాకెత్తుకెళ్లిపోయిందా..? అదీ కాదు..దేవాదాయశాఖ కమిషనర్ డా.హరిజవహర్ లాల్ నుంచి తాకీదులు రావడంతో అదే అదునుగా అంతా కాస్త హడావిడీ చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగినా ఏ ఒక్క జర్నలిస్టూ ఈఓని, ఏం జరిగిందని ఏసి శాంతని సైతం వివరణ కోరలేదు.. కానీ కమిషనర్ ఇచ్చిన Proceedings in Rc.No.V1/20026/7/2022-1, Dt: 04/05/2022 ఉత్తర్వులు ఈఎన్ఎస్ వద్ద పదిలంగా ఉన్నాయి..

ఇక్కడ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ న్యూస్ యాప్ ens live, అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ఎవరికీ కొమ్ముకాయదు. అలాగని శ్రీనుబాబు సేవలను గుర్తు చేస్తూ వార్త ఇచ్చినంత మాత్రాన ఆయనకి విధేయత అనీకాదు.. వాస్తవాలను మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ప్రజలు, ప్రభుత్వం ముందు ఉంచుతుంది. ఇంత స్థాయిలో ప్రజలను ఆలోచించజేసే విధంగా వార్త రాసినందుకు నాకు ఏదో పెద్ద మొత్తంలో ముట్టిందని అనుకున్నా పోయేది ఏమీ లేదు. అలాగని ఇదే వ్యక్తి తేడా పనులు చేసినా ఇదేస్థాయిలో వార్తలు రాస్తామని కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నాం. ఎవరైనా మంచిని మంచిగానే స్వీకరించాలి... చెడుని చెడుగానే పరిగణించాలి.. సేవా బావం కోణంలోనే ప్రజలకు తెలియజేయాలి. ఆ విషయంలో ఈఎన్ఎస్ తన పంధాను మార్చుకోదని చెబుతున్నాం. ఈ విషయంలో మీడియా సంస్థలుగానీ, అందులోని ప్రముఖులుగానీ నా విషయంలో ఏంటీ కాస్త తేడాగా ఉందే వ్యవహారం అని అనుకున్నా ఇబ్బందేమి లేదు. వచ్చిన నష్టమూ లేదు. ముందే చెప్పాం ఏం జరిగినా..జరిగింది ..జరిగినట్టుగానే ప్రజల ముందుకి తీసుకెళతామని. ఇలాంటి విషయంలో ఏదీ ఆశించాల్సిన అవసరం, సందర్భం ఈఎన్ఎస్ కి లేదు. రాదు, రాబోదు. వాస్తవాలకు ప్రజలు, ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రగాఢంగా నమ్మే మీడియాగా ఏది నిజం..? ఏది కల్పితం..? ఏమాకధ..? రూపంలో ఈ కధనాన్ని అందిస్తున్నాం. ఇంతలా రాసిన మేము.. రేపు అన్నరోజు తేడా వచ్చినా అంతకంటే భారీస్థాయిలోని పతాక శీర్షికతోనే మీ ముందుకి నిర్భయంగా వస్తామని గుర్తుచేస్తున్నాం. సేవను గౌరవించండి.. సేవకులను గుర్తించండి.. సేవపేరుతో నాటకాలాడే అధికారులను, ప్రజాప్రతినిదులను ప్రజలముందుంచండి..!

Simhachalam

2022-05-09 03:53:41

తలస్సేమియా సెంటర్ ప్రారంభించిన గవర్నర్

అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రిలో తలస్సేమియా సెంటర్ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం వర్చువల్ విధానంలో రాజ్ భవన్ దర్బార్ హాల్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో తల సేమియా తో బాధపడే గిరిజనులకు ఉచితంగా రక్తం సరఫరా చేయాలని సూచించారు.  జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేయాలని, అవసరమైన రక్తం నిల్వలను రెడ్  క్రాస్  బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 250 యూనిట్లు వరకు అన్ని గ్రూపులకు చెందిన రక్త నిల్వలు ఉన్నాయన్నారు. అయితే రక్తాన్ని అవసరం మేరకు వినియోగించి ప్రాణాలు కాపాడాలని సూచించారు.  అదేవిధంగా కళాశాలలు, గిరిజన ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రక్తదానాన్ని ప్రోత్సహించాలని, అవసరానికి మించి రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రక్త దానం ప్రాణ దానంతో సమానమని, ఎటువంటి అపోహలకు లోను కాకుండా రక్త దానానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, రెడ్ క్రాస్ కార్యదర్శి రాజు, ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ గౌరిశంకర్, పలువురు వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-05-08 13:36:25

ఘనంగా మహర్షి భగీరథ జయంతి

సాగునీరు, త్రాగునీరు క్రిందకు తెచ్చిన మహా వ్యకిని నేడు స్మరించు కోవడం, అటువంటి మహనీయుని జయంతి వేడుకలు జరుపుకోవడం మన అందరి అదృష్టమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం మహర్షి భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా శాసన సభాపతి మాట్లాడుతూ లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని, భగీరథ మహర్షి జీవిత సారాంశమన్నారు.  భగీరథ మహర్షి గంగని పూజించి నేలపైకి తెచ్చినరోజు ఈ రోజని, అటువంటి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించు కోవడానికి ప్రధాన కారణం ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని వివరించారు. ప్రతి ఒక్కరూ భగీరథ దీక్షతో ప్రభుత్వ సంక్షేమ అభివృధి కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కృషి చేయాలన్నారు. బి.సి.అంటే బేక్ బోన్ ఆఫ్ కంట్రీ మనం బలహిన వర్గాలకు చెందిన వారమే కానీ బలహీనుల కాదని గుర్తించాలన్నారు.  తప్పసుతో శక్తిని సంపాదించిన మహావ్యక్తి, పిల్లలు అనుకున్నది సాధించ గలరనే అనే సంకల్పంతో ఫలితాలు సాధించేలా భగీరథ ప్రయత్నం చేయాలన్నారు.   మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి  వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

 మహర్షి భగీరథ చిత్ర పటానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, జాయింట్ కలెక్టర్ ఎం.విజయసునిత, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత మహర్షి భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఈ వేడుకలలో బి.సి కార్పొరేషన్ ఇ.డి గడెమ్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి, బి.సి.వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరత్నం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట. చంద్రపతి రావు, సగర /ఉప్పర సంఘం జిల్లా అధ్యక్షులు పిండి వేంకట రామారావు, కార్యదర్శి గజ్జల మాధవ రావు, నక్క సాయి కుమార్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది, పలు కళాశాలల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-08 10:18:01

భగీరథుని సంకల్పం స్పూర్తిదాయకం..

మ‌హ‌ర్షి భ‌గీర‌థుని సంక‌ల్ప బ‌లం, ప‌ట్టుద‌ల ప్ర‌తి ఒక్క‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. గంగ‌ను దివి నుంచి భువికి తెచ్చిన మ‌హ‌నీయుడు భ‌గీర‌థుడు జ‌యంతి సంద‌ర్భంగా ఆదివారం కాకినాడ క‌లెక్ట‌రేట్ వివేకానంద‌హాల్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. కాకినాడ మేయర్ సుంకర శివ ప్రసన్న, డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, స‌గ‌ర సంఘ ప్ర‌తినిధులు త‌దిత‌రుల‌తో క‌లిసి భ‌గీర‌థుని చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. భూమిపై స‌క‌ల జీవ‌రాశికి గంగా జ‌లాన్ని అందించిన మ‌హ‌ర్షి భ‌గీర‌థుని దీక్షాద‌క్ష‌త‌ను ఈ సంద‌ర్భంగా స్మ‌రించుకున్నారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దీక్ష‌కు, స‌హ‌నానికి మ‌హ‌ర్షి భ‌గీర‌థుడు ప్ర‌తిరూప‌మ‌ని.. ఎంత క‌ష్టాన్న‌యినా లెక్క‌చేయ‌క అనుకున్న‌ది సాధించిన‌వారిని భ‌గీర‌థునితో పోల్చుతామ‌ని పేర్కొన్నారు. భ‌గీర‌థుని గురించి నేటి త‌రం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల‌ని.. ముఖ్యంగా విద్యార్థులు, యువ‌త ఆయ‌న సుగుణాల‌ను అల‌వ‌ర‌చుకొని స‌మున్న‌తంగా ఎద‌గాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. కార్య‌క్ర‌మంలో బీసీ కార్పొరేష‌న్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.మ‌యూరి, కాకినాడ డివిజ‌న్ బీసీ సంక్షేమ అధికారి టీవీ ప్ర‌సాద్‌, స‌గ‌ర సంఘం జిల్లా అధ్య‌క్షుడు నక్కా కిషోర్‌, స‌గ‌ర కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ జె.అప్ప‌య్య‌మ్మ వెంక‌టేష్‌, స‌గ‌ర సంఘం ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-05-08 08:38:23

తిరుపతి కలెక్టరేట్ కి ఆర్టీసీ బస్సు సౌకర్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ఈ నెల 9 వ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగే స్పందన కార్యక్రమానికి తిరుపతి ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉందని అర్జీ దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్పందన కార్యక్రమానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరి హాజరు కావాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ సాయంత్రం తప్పనిసరిగా స్పందన వినతులను స్వీకరించాల్సి ఉంటుందని అలాగే సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులకు ఆ వినతులను పరిష్కార నిమిత్తం వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేసారు. 

Tirupati

2022-05-08 07:56:40

నేటి సమాజానికి స్పూర్తి భగీరధుడు..

భగీరథ మహర్షి  నేటి సమాజానికి స్ఫూర్తి అని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం జిల్లా బిసి సంక్షేమ  శాఖ కార్యాలయంలో  భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రాజెక్టు అధికారి   మాట్లాడుతూ పరోపకారానికి, దీక్షకు, సహనానికి  ప్రతిరూపమైన భగీరధుని ఆదర్శంగా తీసుకొని సమాజం కొరకు సేవ  చేయాలన్నారు.   కఠోర పరిశ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ నిరూపించారని వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత లక్ష్యాలను సాధించి విజయాలు అందుకోవాలని తెలిపారు.  భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఎస్. కృష్ణ,  పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై విజయ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, బిసి వెల్ఫేర్ కార్యాలయం సూపరిండెంట్ సన్యాసిరావు, సిబ్బంది హాజరైనారు.

Parvathipuram

2022-05-08 07:26:51