చిరు ధాన్యాలు ఆరోగ్యకరం అని చిరుధాన్యాలు నిపుణులు రాంబాబు అన్నారు. ఆదివారం విశాఖలో ఓ హోటల్ లో గోఆధారిత ప్రకృతి వ్యవ సాయదారుల సంఘం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. చిరుధాన్యాలను ఎనిమిది గంటలు నాన బెట్టి వండుకోవాల న్నా రు. చిరుధాన్యాలు వందినప్పుడు వచ్చే గంజి తరువాతి రోజు తీసుకోవడం చాలా ఆరోగ్యకమైనది , శరీరానికి అవసరమైన పోషకాలు వుంటా యని వివరించారు. అల్లం, వెల్లుల్లి, మజ్జిగ మంచి బ్యాక్టీరియా ను పెంచుతుందని పేర్కొన్నారు. చిరుధాన్యాలు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి వాటిని పిండి చేసుకోవటం మంచిదన్నారు. రాగులతో చేసిన అల్వా వల్ల చాలా ఉపయోగాలున్నాయి అని ఆయన ఈ కార్యక్రమంలో భారతీయ కిసా న్ సంగ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు దాట్ల వర్మ, అశోక్, ఎం.యుగంధర్ రెడ్డి, జే వీ రత్నం, రుషి తదితరులు పాల్గొని మాట్లాడారు.