1 ENS Live Breaking News

ఏజెన్సీలో సత్వరమే నిర్మాణాలు పూర్తిచేయాలి

రంపచోడవరం  ఏజెన్సీలోని  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న వివిధ భవనాలు త్వరితగతిన పూర్తిచేయాలని  రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సూరజ్ గనోరే సంబంధిత ఇంజనీర్లను  ఆదేశించారు, మంగళవారం  ఐటీడీఏ పీఓ చాంబర్లో  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న భవనాలు పై సంబంధిత ఇంజనీర్లతో  ప్రాజెక్ట్ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా పీఓ సూరజ్ గనోరే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏడు మండలాలలో నాబార్డ్, సి సి డి పి, నిధులతో నిర్మిస్తున్న భవనాల ప్రగతిని ప్రాజెక్ట్ అధికారి మండలాల వారీగా నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు , నాబార్డ్, సి సి డి పి,నిధులు ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది  ఇంకా ఎంత నిధులు అవసరమోగుచున్నవిది మండలాల వారీగా ఆయన ఆరా తీశారు. ఈ శాఖ ద్వారా నిర్మిస్తున్న కల్వట్, గోడౌన్లు. తదితర భవనాలకు ఇసుక, సిమెంటు, మెటల్ ఎక్కడ నుండి కొనుగోలు చేయుచున్నది అదేవిధంగా మెటల్ యూనిట్ ఖరీదు ఎంత  ఇసుక యూనిట్ ఖరీదు ఎంత అదేవిధంగా ఇసుక, సిమెంటు, మెటల్ ఎంత పట్టుతున్నది తదితర వివరాలు   ప్రాజెక్ట్ అధికారి అడిగి తెలుసుకున్నారు. గుడిస  పర్యటక ప్రాంతాములో నిర్మిస్తున్న  భవనాలు, బొదులూరు గ్రామంలో నిర్మిస్తున్న గోడన్ రాజవొమ్మంగి,అడ్డతీగల మండలల లో నిర్మిస్తున్న కల్వర్టులు,కు సంబంధించిన పనులు ఈ దశలో ఉన్నవి ఆయన ఆరా తీశారు.

ఈ భవనాలకు ఏ సైజు మెటలు అవసరమగుచున్నది ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు , గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న భవనాలన్నిటికీ కరెంటు తో సహా  మౌలిక సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని అన్నారు, ఏజెన్సీలోని  ఎంపీక చేసిన ప్రదేశాలలో హాట్ బజార్లు ఏర్పాటు చేయుటకు ఎక్కడెక్కడ ఎంపిక చేసింది ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి. డేవిడ్ రాజ్, ఆస్టింటే ఇంజనీర్లు, సత్యనారాయణ, నాగరాజు, మహేశ్వర రావు, వీరభద్రరావు  తదితరులు పాల్గొన్నారు,

Rampachodavaram

2022-11-15 12:48:09

వచ్చే విద్యాసంవత్సరం నుంచి త‌ర‌గ‌తి గ‌దుల్లో డిజిట‌ల్ బోర్డులు

వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో 3వ త‌ర‌గ‌తి నుంచి డిజిట‌ల్ బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. 1,2 త‌ర‌గ‌తుల‌కు స్మార్ట్ టీవీల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. వీటి ర‌క్ష‌ణ కోసం ప్ర‌తీ పాఠ‌శాల‌కు ఒక వాచ్‌మెన్‌ను నియ‌మించ‌డ‌మే కాకుండా, సిసి కెమేరాల‌ను కూడా అమ‌ర్చ‌నున్న‌ట్లు వెళ్ల‌డించారు. ఎంపిపి మీసాల విజ‌య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త‌న ఎంపిడిఓ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ గ‌రివిడి మండ‌ల ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యారోగ్యం, గృహ‌నిర్మాణం, స్త్రీశిశు సంక్షేమం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు.

                  ఈ సమావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, విద్య‌, వైద్యారోగ్యం, వ్య‌వ‌సాయ రంగాల‌కు ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని అన్నారు. ఎటువంటి స‌మ‌స్య‌నైనా చ‌ర్చించి, ప‌రిష్క‌రించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్టు చెప్పారు. నాడూ-నేడు కార్య‌క్ర‌మం ద్వారా ద‌శ‌ల‌వారీగా అన్ని పాఠ‌శాల‌ల్లో  మౌలిక, అధునాత‌న‌ స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు.  సంక్రాంతి పండుగ లోగా రాష్ట్రంలోని సుమారు 5 ల‌క్ష‌ల‌మంది, 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉచితంగా ట్యాబ్‌ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్య‌మం చాలా అవ‌స‌ర‌మ‌ని, ఇది పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. స‌భ్యుల సూచ‌న‌ల మేర‌కు ఇంగ్లీషు భాషా ప‌రిజ్ఞానం కోసం ప్ర‌తీ శ‌నివారం వారం ఒక పీరియ‌డ్‌ను కేటాయించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. స‌ర్పంచ్‌లు, ఎంపిటీసీలు వారంలో రెండు రోజులు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, మ‌ధ్యాహ్న భోజ‌నం, పారిశుధ్యం, త‌ర‌గ‌తుల‌ నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించాల‌ని కోరారు. దీనికోసం అన్ని పాఠ‌శాల‌ల్లో త్వ‌ర‌లో విజిట‌ర్స్ బుక్‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌తీ ఒక్క‌రూ చ‌దువుకోవాల‌న్న ఉద్దేశంతోనే, అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

                 గృహ నిర్మాణ శాఖ‌పై స‌మీక్షిస్తూ, నిర్మాణం ప్రారంభించ‌ని ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. మండ‌లంలో 176 మంది ఇప్ప‌టికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించ‌లేద‌ని, మ‌రికొంత‌మంది గోతులు త‌వ్వేసి వ‌దిలేశార‌ని అధికారులు తెలిపారు.  వీరికి నోటీసులు ఇచ్చి, డిసెంబ‌రు 15 వ‌ర‌కు గ‌డువు ఇవ్వాల‌ని, అప్ప‌టికీ నిర్మాణాన్ని ప్రారంభించ‌క‌పోతే ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. వారి స్థానంలో అర్హ‌త ఉన్న‌కొత్త వారికి ఇళ్లు మంజూరు చేయాల‌ని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రికీ పోష‌కాహారం అందించాల‌ని ఐసిడిఎస్ అధికారుల‌ను ఆదేశించారు. పాలు కొర‌త‌ మ‌ళ్లీ త‌లెత్త‌కుండా చూడాల‌ని, సంబంధిత అధికారుల‌తో మాట్లాడారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో గుర్తించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, ప్ర‌తిపాదిత ప‌నుల‌న్నిటినీ త్వ‌ర‌లో మంజూరు చేస్తామ‌ని చెప్పారు. అర్హులంద‌రికీ నేరుగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి విధాన‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అర్హులు ఎవ‌రైనా ఏదైనా కార‌ణం వ‌ల్ల‌ ప‌థ‌కాలు అంద‌కుండా మిగిలిపోతే,  అటువంటి వారికి కూడా ఇప్పించేందుకు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు క‌లిసిక‌ట్టుగా, స‌మ‌న్వ‌యంతో ప్ర‌జల‌కు సేవ‌లందించాల‌ని మంత్రి కోరారు.

               జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, త్వ‌ర‌లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ ప్రారంభం కానుందని, పార‌ద‌ర్శ‌కంగా, ప‌క‌డ్డంధీగా నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ ప్ర‌క్రియ‌పై ముందుగానే రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. స‌భ్యుల కోరిక మేర‌కు మొక్క‌జొన్న పంట‌కు కూడా అవ‌స‌ర‌మైన ఎరువుల‌ను వెంట‌నే స‌ర‌ఫ‌రా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఫ్యామిలీ ఫిజీషియ‌న్ సేవ‌లు అంద‌రికీ అందేలా చూడాల‌న్నారు. ఒక స‌చివాల‌యం ప‌రిధిలో రెండు గ్రామాలు ఉంటే, ఒక విడ‌త ఒక గ్రామానికి, రెండో విడ‌త రెండో గ్రామానికి  వెళ్లి వైద్య సేవ‌ల‌ను అందించాల‌ని ఛైర్మ‌న్‌ సూచించారు.

               ఈ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, ఆర్‌డిఓ ఎం.అప్పారావు, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, డిఇఓ కె.వెంక‌టేశ్వ‌ర్రావు, ఆర్‌విఎం పీవో డాక్ట‌ర్ స్వామినాయుడు, ఎపిఎంఐపి పిడి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, డిపిఓ నిర్మ‌లాదేవి, డిప్యుటీ సిఈఓ కె.రాజ్‌కుమార్‌, జెడ్‌పిటిసి వాకాడ శ్రీ‌నివాస‌రావు, మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ ధ‌న్నాన జ‌నార్ధ‌న్‌, తాశీల్దార్ తాడ్డి గోవింద‌, ఎంపిడిఓ గొర్లె భాస్క‌ర‌రావు, స‌ర్పంచ్‌లు, ఎంపిటీసీలు, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Garividi

2022-11-15 12:13:35

మధుమేహ వ్యాధిని తరిమి కొట్టాలి

మధుమేహవ్యాధిని తరిమికొట్టాలని శ్రీకాకుళం జిల్లా జిల్లావైద్యఆరోగ్య శాఖ అధికారి డా.బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు కారణంగా మధుమేహం విస్తరిస్తోందని ఆమె పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని స్టార్ వాకర్స్ క్లబ్ మరియు లైన్స్ క్లబ్ సెంట్రల్  శ్రీకాకుళం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేశారు. జెమ్స్ ఆసుపత్రి వర్గాలు ఉచిత వైద్యశిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో  ఆమె మాట్లాడుతూ... మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల కొంతవరకు వ్యాధి వ్యాప్తి జరగకుండా నివారించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని ,రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఏటా కొన్ని కోట్లమంది మధుమేహం బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ను మధుమేహ రాజధానిగా గుర్తించడం మనకు ఎంత సిగ్గుచేటన్నారు. 

స్వంచ్చంద సంస్థలు, ప్రభుత్వాలతో పాటు చొరవ తీసుకొంటే పెద్దఎత్తున ఈ ప్రమాదం నుండి కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. జెమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. సుధీర్ మాట్లాడుతూ... మధుమేహం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సమస్య అని,సరైన అవగాహన మాత్రమే ఈ వ్యాధినుండి రక్షిస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ, పూర్వీకులు మనకు ప్రసాదించిన ఆహారాన్ని తీసికుంటే బాగుంటుందని అన్నారు.జింకు ఫుడ్స్ కు అలవాట్లు కాకుండా పిల్లలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మధుమేహం చిన్నారుల శారీరక ,మానసిక ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తుందని అన్నారు.కోవిడ్ అనంతరం మధుమేహం పెరుగుతుందని దీని నియంత్రణకు అందరూ నడుమ కట్టి ముందుకు రావాలని  ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు హరికా ప్రసాద్,వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా,మాజీ వాకర్స్ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, కూన వెంకట రమణ మూర్తి,గుడ్ల సత్యనారాయణ, ఎస్.సంజీవరావు, గోలీ సంతోష్,ఉమా, లైన్స్ క్లబ్ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాధనాయుడు,నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్, బాడాన దేవభూషణ్ రావు, జెమ్స్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, ఇతర వైద్యులు, జెమ్స్ మేనేజర్ ఆబోతుల రామ్మోహన్ రావు,తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన  అవగాహనర్యాలీని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఇండియన్ ఆర్మీ విద్యార్థులు, జెమ్స్ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్స్,లైన్స్ క్లబ్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు.

Srikakulam

2022-11-14 09:14:15

పారిశ్రామిక నగరంగా అనకాపల్లి, అచ్చుతాపురం

అనకాపల్లి, అచ్చుతాపురం  ప్రాంతం పారిశ్రామిక నగరంగా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలో నిలుస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఆదివారం ఎలమంచిలి నియోజకవర్గంలోని పూడి గ్రామంలో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో 15.76 ఎకరాల్లో చైనాకు చెందిన యమా రిబ్బన్స్ కంపెనీ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, షిప్ యార్డ్, బిహెచ్ఇఎల్ వంటి అనేక భారీ  పరిశ్రమలతో పెద్ద పారిశ్రామిక నగరంగా విశాఖ వెలుగొందుతోందని, ఇదే  సమయంలో అచ్యుతాపురం సెజ్ లో మరిన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక ప్రగతికి అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అన్నారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పనున్న యమా రిబ్బన్స్ కంపెనీలో రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. 1500 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఏ సిటీ టైర్ల కంపెనీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని ఆయన తెలియజేశారు.

 అచ్చుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి నుంచి కాకినాడ వరకు పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందని ఎన్ని పరిశ్రమలు వచ్చిన వాటికి భూమి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. యమ రిబన్స్ కంపెనీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయని అని చెప్పారు. జనాభా విషయంలో చైనా, భారతదేశం దాదాపు ఒకే విధంగా ఉందని, సాంకేతిక రంగంలో కూడా ఇరుదేశాలకు చెందిన వారు ప్రపంచంలోని అనేక ముఖ్య నగరాల్లో విధులు నిర్వహిస్తున్నారని విషయాన్ని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు. పీఎం మిత్ర స్కీమ్ ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని సమావేశానికి హాజరైన సెంట్రల్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ కు అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, త్వరలోనే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి ఈచ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉందని, సింగల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నారని చెప్పారు.

 ఎమ్మెల్యే యు.వి. రమణ మూర్తి రాజు మాట్లాడుతూ  ఈ ప్రాంతానికి వచ్చే కొత్త కంపెనీలు అన్నిటికీ పూర్తిస్థాయిలో సహకారం  అందిస్తామని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన ఈ సెజ్ లో  అనేక కంపెనీలు వస్తున్నాయని ఆయన చెప్పారు.  టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యమ రిబ్బన్స్ కంపెనీ 2000 మందికి ప్రత్యక్షంగాను,  మరో 2000 మందికి  పరోక్షంగాను ఉపాధి కల్పించడం ఉందని ఆయన చెప్పారు. చైనా జనరల్ కాన్సులేట్ జాలియో మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. వ్యాపార, వాణిజ్య రంగాలలో భారత్, చైనా సంబంధాలు మరింత  బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యమ ఇండియన్ హెడ్ స్టీవ్ , ఏపీఐఎస్సి జెడ్ ఎం త్రినాధ్, యమ రిబ్బన్స్ కంపెనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు.

Pudimadaka

2022-11-13 15:05:05

కుల మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం అని తన పాదయాత్రలో చెప్పిన విధంగా గ్రామాలలో పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా మధ్యవర్తిత్వం  లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే జమ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం కట్యచార్యుల పేట సచివాలయం పరిధిలోని వెదుళ్ళ వలస గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలు ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాల తరువాత ప్రతి గడపకు వెళ్లి అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తున్నామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ఉన్న నమ్మకమని స్పీకర్ తమ్మినేని అన్నారు. 

గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను బేరీజు వేయాలన్నారు. పనిచేసే ప్రభుత్వాo పది కాలాలపాటు నిలిచేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలకలపల్లి సురేష్, జడ్పిటిసి బెండి గోవిందరావు, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబిల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు మానుకొండ వెంకటరమణ, సోమరాజు జగన్నాథం, ఎన్ని చంద్రయ్య, సైలాడ దాసు నాయుడు, గురుగుబెల్లి నీలారావ్, టి రామారావు, పొన్నాడ రాము, గురుగుబిల్లి ప్రభాకర్ రావు, కూటుకుప్పల సన్యాసిరావు, మెట్ట ఆనందరావు, పొన్నాడ కృష్ణారావు,  మెట్ట వసంత, గురుగుబిల్లి చలపతి, మామిడి డిల్లేశ్వరరావు, గురుగుబెల్లి చంద్రయ్య, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-11-13 11:23:33

సామాజిక న్యాయమే న్యాయస్థానాల లక్ష్యం

 సమాజంలో నెలకొన్న సామాజిక అసమానతలను తొలగించడానికి న్యాయస్థానాలు కృషి చేస్తున్నాయని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  చట్టం దృష్టిలో అందరూ సమానమైనని, ధనిక వర్గాలకు చుట్టం కాదన్నారు. అన్యాయానికి గురైన నిస్సహాయులకు చేయూతనివ్వడానికి ప్రతి కోర్టులోనూ న్యాయ సేవాధికార సంస్థలు ఏర్పడ్డాయని అన్నారు. వీటి ద్వారా కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చు అని అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడమే న్యాయవ్యవస్థ ప్రాథమిక లక్ష్యం అని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

Kakinada

2022-11-11 09:23:38

నకిలీ లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు నకిలీ లోన్ యాప్ లు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష సూచించారు. శనివారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-1లో ఏర్పాటు చేసిన ఫేక్ లోన్ యాప్ అవగాహనా  కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు, నెంబర్లు ద్వారా వచ్చే కాలర్స్ తో మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా ఓటీపీలు, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబరు, ఏటీఎం నెంబరు చెప్పమని అడగినపుడు వెంటనే తిరస్కరించాలన్నారు.  ప్రభుత్వ రంగ బ్యాంకులు నుంచి ఎప్పుడు వినియోగదారులకు ఫోన్లు రావనే విషయాన్ని గుర్తించాలన్నారు. తెలిసిన వ్యక్తల మాదిరి ఎవరైనా నమ్మకంగా మాట్లాడినా.. అలాంటి వారిపట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఎవరైనా ఫోన్లు చేసి ఓటీపీలు, లోన్లు కోసం మాట్లాడినపుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల జిల్లా పోలీసుశాఖ విడుదల చేసిన బోర్డులలోని అంశాలను మహిళలకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా తక్షణమే సమాచారం  అందించాలన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో దిశయాప్ లను ఇనిస్టాల్ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయం-3 కార్యదర్శి శంకరాచార్యలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామంలోని మహిళలు పాల్గొన్నారు.

Sankhavaram

2022-11-05 16:44:52

వెంగలరాయసాగరం రిజర్వాయర్ లో చేప పిల్లలు విడుదల

ప్రభుత్వ సహకారంతో లైసెన్సుడు రిజర్వాయర్ లో విడుదల చేసిన చేప పిల్లలతో మత్స్యకారులు ఉపాది ఏర్పాటు చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. శనివారం మన్యం జిల్లా, సాలూరు మండలంలోని వెంగళరాయసాగరం లైసెన్సెడ్ రిజర్వాయర్ లో 4 లక్షల చేప పిల్లలను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఉపసంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ, విజయనగరం జిల్లా తాడిపూడి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో అభివృద్ధి చేసిన  80-100 ఎంఎం సైజుగల మూడు రకాల చేపపిల్లలను ఈ రిజర్వాయర్ లో విడుదల చేశామని వివరిరంచారు. లబ్దిదారులగా వాటా 40శాతం ప్రస్తుతం ఫిష్ షీడ్ ఫార్ం ద్వారా విడుదల చేశామని, త్వరలోనే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మరో ఆరు లక్షలు చేప పిల్లలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న ఆమె వివరించారు. మత్స్యకారులు ఫిష్ కియోస్క్ లు, ఇన్సులేటెడ్ వెహికల్స్, మినీ ఫిష్ రిటైల్ యూనిట్లు ఏర్పాటు ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందచ్చునన్నారు. 

మన్యం జిల్లా ఫిషరీష్ ఏడీ తిరుపతయ్య మాట్లాడుతూ, చేప పిల్లల విడుదలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వీటి ద్వారా మత్స్యకారులకు వేట, ఉపాది దొరుకుతుందన్నారు. జలాశయంలోని మత్స్యసంపద ద్వారా మత్స్యకారులు ఉపాదిని మెరుగు పరుచుకోవాలని సూచించారు.  వైఎస్ ఎంపీపీ గుణవతి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ చేప పిల్లల విడుదలను, తద్వారా వచ్చే మత్స్య సంపదను మత్స్యకారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓ  పార్వతి,  మాట్లాడుతూ, ఒకేసారి నాలుగు లక్షల చేప పిల్లలు విడుదల చేయడం ద్వారా అవి పెరిగి దశలవారీగా పెరిగి మత్స్యకారులకు ఉపాదికి మంచి మార్గం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి.రాములమ్మ, ఎంపిటిసి ఎం.అనూష, , ఎఫ్డీఓలు నాగమణి, ప్రసాద్, సిహెచ్వీ ప్రసాద్, ఈఓపీఆర్డీ ప్రసాద్, గిరిజన మత్స్యకార సంఘం అధ్యక్షులు తిరపతి, పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Salur

2022-11-05 16:08:18

నిరుద్యోగులకు శరభన్నపాలెంలో మినీజాబ్ మేళా

కొయ్యూరు మండలం శరభన్న పాలెం లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 31వ తేదీ సోమవారం మినీ జాబ్ మేళా ఏర్పాటు చేసామని, ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు.  రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మినీ  జాబ్ మేళాలో  మోహన్ స్పింటేక్ష్, సెంట్రల్ ఫార్మసీ, మథర్ అండ్ ఫాథర్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్ అనే మూడు సంస్థలు  పాల్గొంటాయని  వాటి  ద్వారా హెల్పర్స్, ఆపరేటర్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ట్రైనీస్, డెలివరీ బాయ్స్, బేసిక్ కేర్ టేకర్స్, నర్సింగ్ స్టాప్ మొదలగు 125 ఖాళీలు భర్తీ చేయటం జరుగుతుందని వివరించారు. ఈ జాబ్ మేళాకు ఆసక్తి గల  5 నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, ఎ ఎన్ ఎమ్ , ఎం పి హెచ్ డబ్ల్యు, జి ఎన్ ఎమ్ , బి.ఎస్.సి నర్శింగ్ శిక్షణ పొందిన 18 నుండి 35  సంవత్సరాల వయసు గల యువతీ యువకులు www.apssdc.ఇన్ అనే వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, లేదా ఆ రోజు నేరుగా హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.  ఎంపికైన అభ్యర్ధులు  విజయవాడ, విశాఖపట్నంలలో   పని చేయాల్సి ఉంటుందని, వారి అర్హతలు, ఎంపికైన సంస్థ ఆధారంగా రూ.7,500 నుండి రూ. 15,000ల వరకు జీతం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. జాబ్ మేళాకు హాజరయ్యేవారు వారి దరఖాస్తు, విద్యార్హతల జిరాక్ష్ ప్రతులు, ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకుని రావాలని, ఇతర వివరాలకు 94917 86463, 63026 36174 నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. 

శరభన్నపాలెం

2022-10-30 14:34:45

పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలి

పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాలని ఎస్ఐ శోభన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ఓపెన్ హౌస్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో విరోచిత మరణం పొందిన పోలీసుల గుర్తుగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రక్షకబటులు ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తారు..అత్యవసర సమయంలో వారిని ఏ విధంగా కాపాడుతారు.. పోలీస్ సేవలను ప్రజలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి.. స్టేషన్ లో ఫిర్యాదులకు 100 ఏ ఏరకంగా ప్రజలకి ఉపయోగపడుతుంది.. ఏవిధం సద్వినియోగం చేసుకోవాలి.. తదితర అంశాలను కూడా ఎస్సై విద్యార్థినీ, విద్యార్థులకు విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్.శిరీష, పి.కళాంజలి, స్టేషన్ సిబ్బంది. విద్యార్ధులు పాల్గొన్నారు.

Annavaram

2022-10-26 06:48:07

ప్రతీగ్రామంలోనూ ప్రభుత్వ కార్యాలయం సీఎం లక్ష్యం

గ్రామాలలో సచివాలయం, వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి గ్రామ స్వరాజ్యనికి సరైన భాష్యం చెప్పారని బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. గురువారం  పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో  జెప్పి నిధులు రూ.7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు, రూ.40 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సచివాలయ భవనం, రూ.17.50 లక్షల వైద్యంతో ఏర్పాటు చేసిన వైయస్సార్ హెల్త్ క్లినిక్, రూ.21.80 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పారదర్శక పాలన సాగిస్తున్నారని, గ్రామ సచివాలయం, వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా పాలనను గ్రామాలకే చేర్చారన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో గాంధీజీ  కలలు కన్న గ్రామ స్వరాజ్యన్ని మన ముఖ్యమంత్రి సాకారం చేశారన్నారు. 3,648 కిలో మీటర్ల పాద యాత్ర లో ముఖ్యమంత్రి పేదల కష్టాలు చూశారన్నారు. 700 రకాల సేవలు  గ్రామ సచివాలంలో అందుతున్నాయన్నారు. గ్రామీణ భారతాన్ని బలపరిచిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చెప్పింది చేయని గత పాలకులను చూశామని, పేదరికం అనే దారిద్ర్యం పట్టి పీడిస్తున్న పేదలకు అండగా నిలిచిన నాయకుడన్నారు. ఆరోగ్యశ్రీ అనే సంజీవని తెచ్చిన నాయకుడు వై యస్ అర్ అని గత పాలకులు ఆ పథకాన్ని నీరు కార్చారన్నారు. 3,188 రోగాలను ఆరోగ్య శ్రీ లోకి తెచ్చిన మనసున్న నాయకుడని తెలిపారు. విద్యా వ్యవస్థ లో పెను మార్పులు తెచ్చాం అన్నారు. 

45 ఏళ్ల మహిళలకు చేయూత తో అండగా నిలిచాం అన్నారు. 31 లక్షలపై చిలుకు ఇళ్లు పేదలకు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి అన్నారు. నాలుగేళ్ల లో కరువు అనే మాట లేదని జలకళ ఉట్టిపడుతుందన్నారు.  భవన నిర్మాణాలకు శ్రద్ధతో కృషిచేసిన సర్పంచ్ గొట్టుముక్కల వెంకట శివరామరాజును మంత్రి అభినందించారు.  ఈరోజు ప్రారంభించిన నిర్మాణాలకు లక్షలు విలువ కలిగిన స్థలాన్ని డాక్టర్ భూపతి రాజు రామరాజు, డాక్టర్ భూపతి లక్ష్మీనరసింహ రాజు వారి తల్లిదండ్రులైన  కీర్తిశేషులు భూపతి రాజు, కాశీ అన్నపూర్ణ పేరున విరాళంగా ఇవ్వడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి, సర్పంచ్ గొట్టుముక్కల వెంకట శివరామరాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 

ఈకార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్,  డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి, ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం. యోగేంద్ర బాబు, సర్పంచ్ గొట్టుముక్కల వెంకట శివరామరాజు, స్థానిక నాయకులు గోకరాజు రామరాజు, మేడిది జాన్సన్ , మంల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Palakoderu

2022-10-21 11:49:51

ప్రతీ రైతు ఈ-క్రాప్ లో నమోదు కావాల్సిందే

రైతులు సాగుచేసే పంటకు భరోసా ఇచ్చే దిశలో ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకునే లా శ్రమించాలని తూ.గో.జి. జెసి సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం లోని మద్దూరు, మద్దురులంక  గ్రామాల్లో  ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను  జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ,  సాగు చేసే ప్రతి రైతు తాను  సాగు చేసే  భూమిని ఖచ్చితంగా  ఈకేవైసీ లో నమోదు అయ్యేలా చూసుకోవాలన్నారు.   ఇందుకోసం ఆర్ బి కే , సచివాలయ వ్యవస్థ లో పని చేసే వ్యవసాయ అనుబంధ రంగంలోని సిబ్బందికి క్షేత్ర స్థాయి లో తగు సమాచారం సేకరించి వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చెస్తున్నట్టు పేర్కొన్నారు.

 భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి వారు సాగు చేసే పంట ఈ క్రాప్, ఈ కేవైసి  అయ్యేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ కేవైసి పూర్తి చేసిన వాటికి సంబందించిన రికార్డులను రాండమ్ గా పరిశీలించి, క్షేత్ర స్థాయి లో ధృవీకరణ చెయ్యడం జరుగుతోందన్నారు.

మద్దూరు లంక గ్రామంలో బొలిశెట్టి చిట్టి రామకృష్ణ , బొలిశెట్టి చిట్టినాగు,  చిగురులంక గ్రామంలో బొలిశెట్టి భాగయ్య మద్దూరు గ్రామంలో అన్నంరెడ్డి సూర్యారావు అన్నంరెడ్డి యతేంద్ర కుమార్ లు సాగు విస్తీర్ణం ఈ క్రాప్, ఈకెవైసి నమోదు వివరాలు తనిఖీ చేసి, సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట  వ్యవసాయ అధికారి సహాయ సంచాలకులు చంద్రశేఖర్,  తహశీల్దారు బి. నాగరాజు నాయక్ , జి.సత్యనాయణ, సచివాలయ, అర్భికే వ్యవసాయ, హార్టికల్చర్  సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది,  రైతులు ఉన్నారు.

Kovvur

2022-10-19 14:52:47

కాకినాడ జిల్లాకలెక్టర్‌ డా. కృతికాశుక్లా ఔదార్యం

కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తన ఔదార్యన్ని మరోసారి చాటుకున్నారు. బుధవారం ఏలేశ్వరం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్నిపరిశీలించారు. జనరల్ వార్డులో టైఫాయిడ్ నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏలేశ్వరానికి చెందిన ఎం. లలితను(16) జిల్లా కలెక్టరు కృతికా శుక్లా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పుట్టుక‌తో మానసిక విభిన్న ప్రతిభావంతురాలు అయిన తన కుమార్తె లలితకు వీల్‌ఛైర్ మంజూరుచేయాల్సిందిగా తల్లి సింహాచలం కలెక్టరును అభ్యర్థించగా జిల్లా కలెక్టరు కృతికా శుక్లా వెంటనే స్పందించి లలితకు అవసరమైన వీల్‌ఛైర్ అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తమకు ఆసరాగా నిలిచిన కలెక్టర‌మ్మకు ల‌లిత, ఆమె తల్లి సింహాచలం జిల్లా కలెక్టరుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Yeleswaram

2022-10-19 14:13:19

ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర పాలన సాగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు మండలం సారిక సచివాలయం దండిగాం పంచాయతీ గాలిగబడారు, కుంబి మడ, నేరేళ్లవలస, కొత్తూరు, మిర్తిగుడ్డివలస, దండిగాం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బుధ వారం నిర్వహించారు.  గ్రామాల్లో గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించుటకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పారు. 

పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి కలిగిన లబ్ధిని వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో  లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. 

పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం, వై.ఎస్ ఆర్ చేయూత తదితర పథకాల క్రింద ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

Salur

2022-10-19 13:44:15