1 ENS Live Breaking News

25వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం

కాకినాడ 25వ డివిజన్‌లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి  మంగళవారం  గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు.  కొవ్వూరు రోడ్డు ప్రాంతంలో  ఇంటింటికీ వెళ్లి మూడేళ్ల ప్రభుత్వ పాలనలో నవరత్న పథకాల ద్వారా ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ... సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. కౌడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళా దీప్తికుమార్, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్, మాజీ కార్పొరేటర్లు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే  పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు  ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రతి కష్టానికి ఒక్కొక్క పథకం అమలులో ఉందన్నారు. 

నవరత్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో  94 శాతానికి పైగా  అమలు చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి వద్ద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టాలు,సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అందువల్లే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు జగన్నాథన్ విజయ్ కుమార్, కామాడి సీత, నల్లబెల్లి సుజాత, సంగాని నందం, వాసిరెడ్డి రాంబాబు, కర్రీ శైలజ,తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-10-18 14:47:12

రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యం..

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలంలో చిన్న తాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద  ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ హెచ్ .అరుణ్ కుమార్ మాట్లాడుతూ. రైతులు మిల్లర్లు,  దళారులు వద్ద మోసపోకుండా నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గత సంవత్సరం సాధారణ రకమునకు రూ .1,940  ఉన్న ధాన్యమును 2,040,ఏ గ్రేడ్ కి 1,960 రూపాయలు ఉన్న ధాన్యమునకు 2,060 రూపాయలు ఈ సంవత్సరం మద్దతు ధర కల్పించడం జరిగిందన్నారు. గోనె సంచులు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 

ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నవంబరు నెల నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసుకొని  ఈ కె వై సి నమోదు చేయించుకున్న రైతుల వద్దనుండే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్ బి కే నందు గల టెక్నికల్ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించుటకు రైతు పొలం కల్లం వద్దకు వచ్చి ధాన్యం నాణ్యతను పరిశీలిస్తారని అన్నారు. ఏ రోజు వస్తారో రైతులు ఆ రోజే ఆర్బీకే నుండి కూపన్ కచ్చితంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అనుసరించి రైతు భరోసా కేంద్రాల వద్ద  ధాన్యం కొనుగోలు సిబ్బంది  పరిశీలిస్తారన్నారు. రైతులు విక్రయించిన దాన్యము వాటి విలువ తదితర వివరములతో కూడిన రసీదు ఎఫ్డీఓ కొనుగోలు సమయంలో ఇవ్వటం జరుగుతుందని వివరించారు .రైతు కచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుకు 21 రోజులు లోపు వారి ఖాతాలలో డబ్బులు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని, టోల్ ఫ్రీ నెంబర్లు ద్వారా  సాంప్రదించవచ్చు అన్నారు. 
 
జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్న సమస్యలను రాష్ట్రస్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు .జిల్లాలో ధాన్యం సేకరణ మెరుగ్గా జరగాలన్నారు .ఈ క్రాప్ ద్వారా పంట నెంబర్లు చేసుకున్న రైతులు వద్దనుండే పంటను కొనుగోలు చేస్తామనిపునరుద్ఘాటించారు .అలాగే రైతుల కూడా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులు  మాట్లాడుతూ ధాన్యం తోలిన తర్వాత సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, గోని సంచులు కొరత కూడా బాగా ఎక్కువగా ఉందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. రైతులు ప్రత్యేకమైన పంటల పై కూడా మొగ్గు చూపాలని అన్నారు. మనం అవసరానికి మించి వరి పండించటం వలన ఈ ఇబ్బంది కలుగుతుందన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన దాన్యము వివరాలను ప్రజలకు తెలిసేలా రైతు భరోసా కేంద్రాలలో పెడతామన్నారు.

  ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి ముత్యాల ఆంజనేయులు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ముప్పూడి వెంకటేశ్వర రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వర్లు,సివిల్ సప్లై మేనేజర్ శివప్రసాద్,డిఎస్ఓ సరోజ ,అగ్రికల్చ ఏడి.మురళీకృష్ణ, ఎమ్మార్వో అప్పారావు ఎండిఓ ఎం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Tadepalligudam

2022-10-18 14:32:01

ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందాలి..

రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లు ద్వారా అభవృద్ధి సంక్షేమ ఫలా లు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోంమంత్రి డా. తానేటి వనిత అన్నారు. మంగళవారం కలవలపల్లి గ్రామములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొ న్నారు. ఈ సంద ర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథ కాలు ప్రతి ఇంటికి అందుతు న్నాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం  ఇంటింటి ప్రచా రం నిర్వహించారు, సంక్షేమ  పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలా లు అందు తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత రాజ కీయాలకు అతీతం గా సంక్షేమ పథకాలు అందు తున్నాయని తెలిపారు. లబ్ధి దారులు మూ డేళ్ల అమలు చేసిన పథకాలు అభివృద్ధి గురించి అడిగి ప్రజ లకు వివరించారు.

అమ్మఒడి, ఋణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి బృహత్తర పధ కాలు పేద పజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి తెలిపారు. పేదవాడి ఇంటి కల నిరవేర్చే దిశగా, రాష్ట్రం లో 32 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వండం జరుగుతొం దన్నార. అర్హత ఉండి ఇళ్ల స్థలా ల కోసం దరఖాస్తులు చేసుకుం టే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇ చ్చే విధంగా చర్యలు తీసుకోవ డం జరుగుతుందన్నారు.  

ఈ కార్యక్రమంలో జెడ్. పి వైస్ ఛైర్పర్సన్, పోసిన శ్రీలేఖ ఎంపీపీ మట్టా వీరస్వామి  గ్రామ సర్పంచ్ ఆకుల లక్ష్మి ఎంపీటీసీ సభ్యు లు ముళ్ళపూ డి గంగ భవాని చాపల రాధా గ్రామ ఉపసర్పంచ్ కొండేపటి హరినాథ్ నియోజకవర్గ నాయకులు బండి అబ్బులు ముదునూరు నాగరాజు ప్రతిపాటీ రామచంద్రరావు గూడపాటి శివ తాసిల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో బి రాంప్రసాద్ గ్రామ సచివాల సిబ్బంది వాలంటీర్లు రెవిన్యూ సిబ్బంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Kalavalapalli

2022-10-18 14:19:47

తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలి

రైతులు సాగుచేసే పంటకు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు జరగాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. మంగళవారం నిడదవోలు మండలం లోని పురుషోత్త పల్లి, గోపవరం, పెండ్యాల గ్రామాల్లో  ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను పరిశీలిచి, సదరు రైతుల నుంచి తనిఖీ నిర్ధారణ రశీదు ను కలెక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ,  సాగు చేసే  భూమిని ఖచ్చితంగా  ఈకేవైసీ లో నమోదు అయ్యేలా చూడాలని, అభిమానులు ఇందుకోసం ఆర్ బి కే , సచివాలయ వ్యవస్థ లో పని చేసే వ్యవసాయ అనుబంధ రంగంలోని సిబ్బందికి తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి వారి పంట ఈ క్రాప్, ఈ కేవైసి  అయ్యేలా సహకరించాలన్నారు. 

రావిమెట్ల గ్రామానికి చెందిన గ్రామ హార్టికల్చర్ సహాయకుడు టి. సూర్య ప్రకాష్ వంద శాతం ఈ క్రాప్ నమోదు చేసిన సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత  సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకాష్ తన పనితీరులో చూపిన విధంగా ప్రతి ఒక్కరూ వారి పరిధిలో నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి లో రైతులు సాగుచేసే పంటలకు చెందిన సాగు చేసే పంట, విస్తీర్ణం వంటి రికార్డులను, జారీ చేసిన ధృవ పత్రాలను నిర్ధారణ చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది  సర్వే నంబర్ల లోని వ్యవసాయ భూమిలో గుర్రం సీతారత్నం (పురుషోత్తపల్లి) మూడు సర్వే నంబర్ల లో,  జీ. రాజా రావు రెండు సర్వే నంబర్ల లో, గోపవరం కి చెందిన ఏం. రంగారావు, పెండ్యాల కి చెందిన జీ. గంగరాజు, ఎన్ వి ఎస్ సత్యనారాయణ ఒక్కో సర్వే నంబర్ లలో ఆయా  రైతులు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, తదితర వివరాలను నిర్ధారణ చేశామన్నారు. 

ఈ క్రాప్ యొక్క ప్రయోజనాలు  క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు ను పరిశీలన కోసం క్షేత్ర స్థాయి  పర్యటించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టర్ వెంట  వ్యవసాయ అధికారి జి.సత్యనాయణ, హార్టికల్చర్ అధికారి గంజి రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది రైతులు ఉన్నారు.

Gopavaram

2022-10-18 14:15:35

మురికివాడల ప్రజల పట్ల కలెక్టర్ ఔదార్యం

ఎవరేమైపోతే నాకేంటి అనే ఈ రోజుల్లో.... తణుకు పట్టణంలో  పేదలకు స్థలం కేటాయింపుకు అవసరమైన భూమిని పరిశీలించేందుకు ఈ నెల అక్టోబర్ 14న వెళ్ళిన జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతికి అదే త్రోవల కనిపించిన దృశ్యానికి చెలించి పోయారు. డంపింగ్ యార్డుకు ఆనుకొని అపరిశుభ్రత వాతావరణంలో గుడారాల్లో నివసిస్తున్న కుటుంబాలు జిల్లా కలెక్టర్ కంట పడ్డాయి.  వారికి బాసటగా నిలిచేందుకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో ప్రయాణిస్తున్న వాహనం నుండే తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆనాటి నుండి మదిలో ఉన్న ఆలోచనలకు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టి, ఐదు రోజులు గడవకముందే ప్రత్యేక క్యాంపు ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు.  

మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో ఉదయమే పెద్దలకు, పిల్లలకు శుభ్రంగా క్రాప్ చేయించడం జరిగింది. డంపింగ్ యార్డ్ సమీపంలో కొండాలమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యాంపుకు 18 కుటుంబాలను తీసుకువచ్చారు.  వారిలో 18 సంవత్సరాల లోపు 22 మంది పిల్లలు, 41 మంది పెద్దలు ఉన్నారు.  సచివాలయ సిబ్బందితో కంప్యూటర్లు ఏర్పాటు చేసి అక్కడే వారందరికీ ఆధార్ నమోదు చేయడంతో పాటు, వైద్య సిబ్బందిచే వైద్య పరీక్షలు చేయించి అవసరమైన వారికి మందులను కూడా పంపిణీ  చేయడం జరిగింది. ఆధార్ నమోదు అనంతరం రేషన్ కార్డులు జారీకి జాబితాను సిద్ధంచేసి పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ తాసిల్దార్ ను ఆదేశించారు. అలాగే లేఔట్ లో ఖాళీగా ఉన్న  స్థలాలను వారికి కేటాయించి ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలని,  లేనిపక్షంలో 18 కుటుంబాలకు ప్రత్యేకంగా భూ సమీకరణ చేసి ఇళ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 

రెడ్ క్రాస్, తహసిల్దార్, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ, తార్పాలిన్లు, పిల్లలకు దుస్తులను అందజేయడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సంస్థ ఈరోజు క్యాంపు వద్ద ఆయా కుటుంబాలకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.  ఈ  చర్యలన్ని చక, చక జరిగిపోవడంతో 18 కుటుంబాలతో పాటు, అధికారులు కూడా ఒకింత ఆశ్చర్యానికి, సంతోషానికి లోనయ్యారు.  చాలా సంవత్సరాలుగా 18 కుటుంబాల వారు డంపింగ్ యార్డ్ పక్కనే నివసిస్తూ అందరూ చెత్తను ఏరుకొని, దానిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి జీవితాలలోరాని మార్పు కేవలం ఐదు రోజులు గడవక ముందే  జిల్లా కలెక్టర్ కృషితో వారి జీవితాల్లో మార్పుకు తొలి బీజం పడింది.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా కుటుంబాలతో మాట్లాడుతూ చదువుకోవడం ద్వారా ఎలా అభివృద్ధి చెందవచ్చో, ఎలా మంచిగా జీవించవచ్చో వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు. ప్రస్తుతం చేస్తున్న పనిని మీరందరూ మానేయాలని చెబుతూ, పిల్లలను బడికి పంపించాలని వారిని కోరారు. జిల్లా కలెక్టర్ చెప్పిన మంచి మాటలకు వారు పిల్లలు చదువు కునేందుకు అంగీకరించారు.  హాస్టల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ,  సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెద్దలకు కూడా పారిశుద్ధ్య కార్మికులుగా అవకాశం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వారికి తెలిపారు. ప్రత్యేక క్యాంపు కార్యక్రమంలో అడిషనల్ డిఎం&హెచ్ఓ బి.భాను నాయక్, ఐసిడిఎస్ పిడి శ్రీమతి బి.సుజాత రాణి, తహసిల్దార్ పి ఎన్ డి ప్రసాద్, ఎంఈఓ శ్రీనివాసు, మున్సిపల్ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tanuku

2022-10-18 10:28:23

తొర్రేడులో ఈ-క్రాప్ బుకింగ్ ద్రువీకరణ

రైతులు సాగుచేసే పంటకు  ఈ- క్రాప్ బుకింగ్, ఈ కేవైసి ద్వారా భరోసా పొంద గలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. మంగళవారం ఉదయం  రాజమండ్రి రూరల్ తోర్రేడు గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను పరిశీలిచి, సదరు రైతులను తనిఖీ నిర్ధారణ రశీదు ను కలెక్టర్ తీసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ,  ప్రతి ఒక్క సాగు భూమి ఈకేవైసీ చేసే సమయంలో భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి లో రైతులు సాగుచేసే పంటలకు చెందిన సాగు చేసే పంట, విస్తీర్ణం వంటి రికార్డులను ధృవీకరణ చేసేందుకు తనిఖీ చేసినట్టు చెప్పారు.

 ఆ దిశలో తోర్రెడు గ్రామంలో ఏడు సర్వే నంబర్ల వ్యవసాయ భూమిలో సాగు విస్తీర్ణం కలిగిన నలుగురు భూ యజమానులు, ఇద్దరు కౌలు రైతులు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, తదితర వివరాలను నిర్ధారణ చేసి, సక్రమంగా ఉన్నట్లు ధృవీకరించటం జరిగిందనీ కలెక్టర్ పేర్కొన్నారు.  రైతులకు విత్తు నుంచి పంట కొనుగోలు చేసే వరకు ప్రతి ఒక్క స్థాయి లోనూ వారికి భరోసా కల్పిస్తూ అండగా నిలవడం జరుగుతోందని కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. ఈ క్రాప్ యొక్క ప్రయోజనాలు రైతులకు వివరించి, ప్రతి ఒక్క రైతు వారు సాగు చేసే పంట యొక్క వివరాలు ఈ క్రాప్ నమోదు తో పాటు ఈ కేవైసి తప్పనిసరి చెయ్యడం లో క్షేత్ర స్థాయి సిబ్బందికి సహకరించాలన్నారు.   క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు ను ఆయా క్షేత్ర స్థాయి లో తనిఖీ  కలెక్టర్ స్థాయి రెండు రోజుల క్రితం పిడింగొయ్య లో పర్యటించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.

Torredu

2022-10-18 07:17:05

శంఖవరంలో 15 అడుగుల కొండచిలువ వీడియో వైరల్

శంఖవరం మండలకేంద్రంలోని గ్రామ శివారులో రోడ్డుపై తెల్లవారుజామున కనపడ్డ కొండచిలువ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. శంఖవరం పీహెచ్సీవద్ద మంగళవారం సుమారు 15అడుగుల కొండచిలువ రోడ్డుదాటుతుండగా రౌతుల పూడివైపు వెళ్లే వాహన చోదకులు వీడియోలు తీశారు. ఆసుపత్రి పక్కనే జిల్లాపరిషత్ హైస్కూలు కూడా ఉండటంతో ఆ ప్రాంతం నుంచే కొండచిలువ రావడాన్ని చూసి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువైపుగా వెళ్లేవారికి జాగ్రత్తలు చెప్పారు.

Sankhavaram

2022-10-18 01:55:00

రైతులు ఈ- క్రాప్ లో నమోదుకావాలి

రైతులు ఇ క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. వీరఘట్టం మండలం వండవ గ్రామంలో ఇ క్రాప్ నమోదును శని వారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇ క్రాప్ నమోదు వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అందే వివిధ రైతు పథకాలు, విపత్తులలో కలిగే నష్టాలకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు ఇ క్రాప్ నమోదు కావడం వలన మాత్రమే లభిస్తుందని వివరించారు. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారో ఇందులో తెలుస్తుందని తద్వారా ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. ఇ క్రాప్ నమోదులో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

 సాంకేతిక సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. వెబ్ లాండ్ లో సవరణలు చేసే అవకాశం లేనందున కొన్నిసార్లు ఇబ్బందులు వస్తున్నాయని సచివాలయం సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, తహశీల్డార్ జె.మాధవిలత, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కే. మన్మథ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:13:29

చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, రోగాలను కడిగేయచ్చని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. జామి మండలం కుమరాం లోని కెజిబివిలో, శనివారం  గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థినిలు ముందు తమ ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని కోరారు. ఇందుకోసం చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. సబ్బుతో చేతులు కడుకున్నప్పుడు 7 రకాల సూత్రాలను పాటించాలని చెప్పారు. చేతులు కడిగే సమయంలో చేతి గోళ్ళు సందుల్లో ఎలాంటి మురికి లేకుండా ఉండేలా శుభ్రపరచుకోవాలని వివరించారు. ఇలా చేయడం వలన అంటురోగాలను దరిచేయకుండా జాగ్రత్తలు తిసుకోవచ్చునన్నారు. 

 ఆహారం తీసుకునే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కొని, ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. అలాగే చేతులను శుభ్రంగా ఉంచేందుకు తరచూ కడుక్కోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం  కాబట్టి, విద్యార్థినులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేడి నీళ్ళు తాగుతూ ఉండాలని తెలిపారు.  చదువులో విద్యార్ధినుల సామర్ధ్యాన్ని పరిశీలిచారు. వారితో మాట్లాడుతూ  బాగా చదువుకుని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.  10వ తరగతి విద్యార్థినిలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులచేత, విద్యార్ధినిలకు హిమోగ్లోబిన్ కౌంట్ పరీక్షలు చేయించిన రిపోర్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. అలాగే హెచ్.బి. కౌంట్ కు సంబందించిన రికార్డ్స్  పరిశీలిచారు. విద్యార్ధినిలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య తనిఖీలు చేపట్టాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. 

         సమగ్రశిక్ష పథక అధికారి డా. వేమలి స్వామినాయుడు మాట్లాడుతూ, విద్యార్ధినులకు ఉన్నత భవిష్యత్ అందించే దిశగా, సమగ్రశిక్ష అన్ని అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. విద్యార్ధినులకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా,  కెజిబివిలలో పని చేస్తున్న ఎఎన్ఎం దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్ధినులు నిత్యం తమ చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జె. జయశ్రీ, కెజిబివి ప్రిన్సిపాల్ బి. జ్యోతి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

2022-10-15 09:35:43

ఈ-క్రాప్ తనిఖీ చేసిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

విజయనగరం జిల్లా జామి మండలంలో  ఈ క్రాప్ న‌మోదును జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి శ‌నివారం త‌నిఖీ చేశారు. ప్ర‌తీ రైతు వివ‌రాల‌ను వ్య‌క్తిగ‌తంగా ప‌రిశీలించారు. జామి తాశీల్దార్ కార్యాల‌యంలో, ఆ గ్రామానికి చెందిన‌ రైతుల‌తో మాట్లాడి, రికార్డుల్లో న‌మోదు చేసిన వివ‌రాల‌ను త‌నిఖీ చేశారు. భూముల స‌ర్వే నంబ‌ర్లు, పొలాల విస్తీర్ణం, రైతులు ఏ ర‌కం పంట‌ను ఎంత విస్తీర్ణంలో వేశారో, విత్త‌నాలు ఎక్క‌డ తీసుకున్నారో త‌దిత‌ర‌ వివ‌రాలు తెలుసుకున్నారు. ఆయా భూముల‌కు నీటి స‌దుపాయంపైనా ఆరా తీశారు.  ఈ వివ‌రాల‌ను రికార్డుల్లో త‌నిఖీ చేసి, సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యామ్నాయ పంట‌లను సాగు చేయాల‌ని సూచించారు. త‌మ పంట‌ను రైతులు ఎక్క‌డైనా విక్ర‌యించే స్వేచ్చ ఉంద‌ని క‌లెక్ట‌ర్‌ స్ప‌ష్టం చేశారు. త‌నిఖీల్లో తాశీల్దార్ జె.హేమంత్‌కుమార్‌, డిప్యుటీ తాశీల్దార్ సునీత‌, ఏఓ కిర‌ణ్‌కుమార్‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-15 07:01:38

ఆక్వా ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి..

ఆక్వా సాగుపై స్పందన కార్యక్రమంలో అందుతున్న ఫిర్యాదులకు ఖచ్చితమైన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి మురళి మత్స్య శాఖ  అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్  ఈ-ఫిషింగ్, లైసెన్స ల జారీ, స్పందన పిటిషన్ లపై మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వాపై స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పిటిషన్లు అందుతున్నాయని దీనిపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ఫిర్యాదులకు మొక్కుబడిగా జవాబు ఇవ్వకుండా, క్షుణ్ణంగా పరిశీలించి  క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు.  ఈ-ఫిషింగ్ నమోదు, లైసెన్సులు జారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగాచార్యులు,    సహాయ సంచాలకులు ఆనందరావు, ఎల్ఎల్ఎన్ రాజు, ఎఫ్.డి.ఓలు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 14:05:23

విద్యతోనే అభివ్రుద్ధి సాకారం అవుతుంది..

విద్యతోనే అభివృద్ధి సాధ్యం మని విద్యాభివృద్ధికి రాష్ట్ర ముఖ్య మంత్రి  వై యస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలలు, వినియోగ దారుల శాఖ మంత్రి డా.కారుమూరి. వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం పాలకొల్లు మండలం పాలకొల్లు శ్రీ అద్దే పల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు మంచి చదువు నేర్చి ప్రయోజకులు కావాలన్నదే మన ముఖ్యమంత్రి సంకల్పం అని ఇందుకు అనుగుణంగా విద్య కోసం వేలాది కోట్ల బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అద్దే పల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో  వేలాది మందికి బంగారు భవిషత్ ను ఇచ్చి ఈ రోజు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకొనడం ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం మంచి అవకాశంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు.

 ధనిక, పేద అంతరాలు తొలిగేలా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దామన్నారు. మనబడి నాడు - నేడు కార్యక్రమం క్రింద అభివృద్ధి చేయడంతో విద్యార్థులకు యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్, షూస్ వంటివి పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరిగింది అన్నారు. అమ్మవడి, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద, విద్యాకానుక వంటి పథకాల ద్వారా  ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు,  విదేశీ ఉన్నత విద్య వంటి కార్యక్రమాలను అమలు చేసి ఎంతో మంది విద్యార్థులకు చేయూతనివ్వడం జరిగిందన్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి  చేయడం ఎంతో అభినందించ విషయం అని ఆదర్శంగా  తీసుకోవాలన్నారు. జూనియర్ కాలేజి, డిగ్రీ కళాశాలలకు ఇంకా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు మనబడి నాడు - నేడు క్రింద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి పెండింగ్ పనులకు పూర్తి చేస్తామని మంత్రి కారుమూరి  వెంకట నాగేశ్వరావు రావు అన్నారు.

కోడి రామకృష్ణ కాంస్య విగ్రహానికి కృషి..

పాలకొల్లులో పుట్టిపెరిగి సినీ దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్న స్వర్గీయ కోడి రామకృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రజలు అభీష్టం మేరకు నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. చరవాణీ ద్వారా జిల్లా అధికారులకు స్థల సేకరణ,నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆదేశించారు .

పూర్వపు అధ్యాపకులు, ఉపా ద్యాయులకు శాలువా, పూల మాలలు వేసి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ను అందజేసి మంత్రి కారుమూరి  వెంకట నాగేశ్వరావు ఘనంగా సన్మానించారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావుని అధ్యాపకులు, ఉపా ద్యాయులకు, పట్టణ ప్రముఖులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, యం బి సి చైర్మన్ పెండ్ర వీరన్న,యస్ సి కమీషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాజీ శాసన మండలి సభ్యులు మేకా. శేషుబాబు, మాజీ డి సి యం యస్ చైర్మన్ యడ్ల.తాతాజీ, కళాశాలల ప్రిన్సిపాల్స్ టి. రాజ రాజేశ్వరి, వి కె మల్లేశ్వర రావు, గజల్స్ శ్రీనివాస్, తది తరులు పాల్గొన్నారు.

2022-10-14 14:03:33

ఈ క్రాప్ నమోదును తనిఖీ చేసిన కలెక్టర్

విజయనగరం జిల్లాలో  ఈ క్రాప్ నమోదును జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పరిశీలించారు. జామి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ క్రాప్ నమోదు వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. వారి పంట వివరాలను, నీటి వనరులను, భూమి విస్తీర్ణాన్ని తెలుసుకొని, వాటిని నమోదు చేసిన రికార్డులను తనిఖీ చేశారు. అన్నీ వివరాలు సరిపోవడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ఆరా తీశారు. ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జామి తహసీల్దార్ జె.హేమంత్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సునీత, ఆర్ఐ ఉషారాణి, ఏవో కిరణ్ కుమార్ ఉన్నారు.

2022-10-14 12:11:21

గర్భిణీ, శిశువుల నమోదు పక్కగా జరగాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణీ, శిశువుల వైద్య పరీక్షలు, వివరాల నమోదు పూర్తి స్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో   ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, అధికారులతో వైద్య సేవలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా, శిశు నమోదు పక్కగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సులభతరం అవుతుందన్నారు. ఎనీమియా ముక్తభారత్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత గా తీసుకొని గర్భిణీలకు  హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించి ఫలితాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలని సూచించారు.

 ఎన్ సి డి, సి డి సర్వేలో భాగంగా బి.పి, సుగర్ తోపాటు దీర్ఘ కాలిక రోగాలు, జ్వరాలు, మలేరియా వ్యాధుల వివరాల సర్వే పూర్తి కావాలన్నారు. శిశువులకు, చంటి పిల్లలకు సంబంధించి టీకా నిర్వహణ వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం క్రింద ప్రసవం అనంతరం అందిస్తున్న మొత్తాన్ని సకాలంలో చెల్లించాలని చెప్పారు. నాడు - నేడు కార్యక్రమం క్రింద నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు త్వరితగతిన జరగాలని ఏపిఎమ్ఎస్ ఐడిసి ఇంజనీరింగ్ అధికారి ప్రసన్న కుమార్ ను ఆదేశించారు. శత శాతం బయోమెట్రిక్ హాజరు నమోదు అయ్యేవిధంగా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. బగాదిజగన్నాథ రావును ఆదేశించారు. 

అనంతరం అయుష్మాన్ ఉత్కృష్ట పురస్కారం జాతీయ అవార్డు జిల్లాకు రావటం పట్ల వైద్య, ఆరోగ్య అధికారులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను దుస్సాలువాతో  ఘనంగా సత్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి మరియు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి. వాగ్దేవి, రాష్ట్రీయ బాల స్వస్త్యా కార్యక్రమం సమన్వయ అధికారి డా. ధవళ భాస్కర రావు, జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు, జిల్లా టి.బి. నియంత్రణ అధికారి సిహెచ్.విజయ్ కుమార్, జిల్లా రోడ్లు, భవలనాల శాఖ ఈ ఈ ఎమ్.జేమ్స్,  పార్వతీపురం, సీతంపేట డిప్యూటీ డిఎంహెచ్ ఓ లు పి.అనిల్, లక్ష్మీ పార్వతీ,  ప్రోగ్రామ్ అధికారులు, వైద్యులు, తదితరులు, పాల్గొన్నారు.

2022-10-14 09:57:29

స్మార్ట్ ఫోన్లతో కంటి సమస్యలు ఉత్పన్నం

మన శరీర అవయవాలలో కళ్ళకు ఎంతో ప్రాధాన్యత ఉందని, కంటి చూపు లేకపోతే అంతా అంధకారమేనని కానీ కంప్యూటర్లు, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లతో పలువురు వయసు తారతమ్మత లేకుండా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోటు క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాతావరణ కాలుష్యం, ప్రమాదాలు, రసాయన పరిశ్రమలలో పనిచేసే వారికి, విటమిన్ల లోపం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి వలన కంటి చూపు మందగిస్తుందన్నారు. వంశపారంపర్యంగా కూడా కంటిచూపు సమస్యలు ఏర్పడవచ్చు అని అన్నారు. ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా 'కళ్ళను ప్రేమించు' నినాద లక్ష్యమని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 16:26:03