1 ENS Live Breaking News

భారత్ లో అత్యంతపొడవైన రబ్బర్ డ్యామ్..?(UPSC/APPSC)

భారత దేశంలోనే అత్యంత పొడవైన గయాజీ రబ్బర్ డ్యామ్ ను భీహార్ లోని ఫాల్గు నదిపై నిర్మించారు. దీనిని భీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. కాగాసెప్టెంబరు 22న 2020న రబ్బర్ డ్యామ్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి 2022 సెప్టెంబరు నాటికి పూర్తి చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం కోసం  రూ.324 కోట్ల ఖర్చుచేశారు. దీనిని ఐఐటీ రూర్కీ నిపుణులు రూపొందించారు. ఈ రబ్బర్ డ్యామ్ పొడవు 411 మీటర్లు, వెడల్పు 95.5 మీటర్ల.. మూడు మీటర్ల ఎత్తుతో వుంటుంది. ఈ రబ్బర్ డ్యామ్ నిర్మాణంతో సితాకుండ్ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ రబ్బర్ డ్యామ్ దేశంలో అతిపెద్ద డ్యామ్ గా పేరుపొందింది. (BEST COACHING FOR SI & CONSTABLE : KEERTHI COMPETITIVE INSTITUTE : KAKINADA ‌-9032228708)

Visakhapatnam

2022-12-28 10:25:02

సింహాచలంలో ముక్కోటికి ఏకాదశికి ముమ్మర ఏర్పాట్లు

సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మీ నృసింహ  స్వామి ఆలయంలోజనవరి 2న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి) పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంఛార్జి ఈవో వి.త్రినాథ్ రావు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది సూచనల మేరకు ఆలయ ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సుమారు 70 వేల మంది భక్తులు ఉత్తర ద్వారం లో కొలువుండే స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో త్రినాధరావు ఇప్పటికే అన్ని విభాగాలు అధికారులను కోరారు. ఇందుకోసం సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.100, 300, 500 టికెట్ లు పై క్యూ లైన్ లలో భక్తులు స్వామిని సులభంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరికీ ఉచితంగా పొంగలి, పులుసు ప్రసాదం అందజేసేందుకు ఏర్పాట్లు గావిస్తున్నారు. ఆలయాలకు అందముగా రంగులు వేసి బారీ విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు . క్యూ లైన్లు,షామియానాలు ఇప్పటికే వేస్తున్నారు.

  ఆలయ పురోహితులు ,అలంకార్ కరి సీతారామాచార్యులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజు, ఏస్. శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, దేవాలయ ఇన్స్పెక్టర్ సిరిపురపు కనకరాజు తదితరులంతా బుధవారం ఆయా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులు సులభంగా స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని వీరు అధికారులను  కోరారు. ఆరోజు తెల్లవారుజామున 1:00కు స్వామిని సుప్రభాత సేవ తో మేలుకొలిపి,తదుపరి  ఆరాధన గావిస్తారు అనంతరం 4:30  గంటలకు ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని ఆసీనులను చేసి, వ్యవస్థాపక ధర్మకర్త, ధర్మకర్తల మండలి సభ్యులకు దర్శనం కల్పిస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు పూర్తికాగానే ఉత్తర రాజగోపురము లో వైకుంఠ నాధుడు అలంకరణ లో ఉన్న సింహాద్రి నాధుడు ను ఆసీనులు  చేసి భక్తులందరికీ స్వామి దర్శనం లభించే విధంగా అన్ని ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నారు.

Simhachalam

2022-12-28 09:41:56

విద్యార్థినిలకు ఉచితంగా కుట్టు పనిలో శిక్షణ.

విద్యార్థి దశలోనే కుట్టు శిక్షణ పొందడం వలన భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని పీఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతి రాజేశ్వరి అన్నారు. మంగళవారం కాకినాడలోని పిఆర్ కళాశాల విద్యార్థి నులకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కుట్టుపనితో ఉపాది మెరుగు పరుచుకోవచ్చునన్నారు. క్లబ్ అధ్యక్షురాలు టిసి దేవకీదేవి మాట్లాడుతూ, 60 మంది  విద్యార్థినులకు నెలరోజులపాటు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించి అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉష ,పద్మ,  జోన్ చైర్మన్ రమా సుందరి, క్లబ్ సభ్యులు నాగిరెడ్డి లక్ష్మి, సౌమ్య, నల్లమిల్లి శ్రీదేవి రెడ్డి, శ్రీ వాణి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-27 06:32:05

ఫార్మాసిటీ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి

పరవాడ మండలం ఫార్మాసిటీలో లారస్ యూనిట్-3 లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం లంకెలపాలెం జంక్షన్ లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం జిల్లాలోని అన్ని కర్మాగారాల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటస్వామి కనకారావు రమణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Lankelapalem

2022-12-27 06:20:02

30న అరసవల్లిలో స్వామివారి హుండీ లెక్కింపు

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను ఈ నెల 30న లెక్కించనున్నట్లు సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాకి  ఒక ప్రకటన విడుదల చేసారు. డిసెంబర్ 30వ తేది ఉదయం 8 గం.లకు దేవాదాయ శాఖ సమక్షంలో అనువంశిక ధర్మకర్త, అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను నిబంధనల ప్రకారం తెరవనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

Arasavilli

2022-12-27 06:15:08

శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి రూ.లక్ష విరాళం

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్ధానంలోని శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన ట్రస్టుకి వల్లూరు గ్రామానికి చెందిన వెంకటరమణ పద్మజ దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఈఓ  కార్యాలయంలోని సిబ్బందికి అందజేశారు. అనంతరం దాతలు స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం తరపున దాతలకు తీర్ధప్రసాదాలను అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు.

Annavaram

2022-12-27 05:59:45

జంగాలపల్లి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

బైజ్యుస్ యాప్ తో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు  ప్రభుత్వం ట్యాబ్ లను మంజూరు చేసిందని పాఠశాల హెచ్.ఎం.గంగరాజు అన్నారు. మాకవరపాలెం మండలంలోని జంగాలపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8.వ.తరగతి  చదువుతున్న 16 మంది విద్యార్థులకు ట్యాబ్ లను సోమవారం హెచ్.ఎం.గంగరాజు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బైజ్యుస్ యాప్ తో విద్యార్థులకు పాట్యాంశాలను మరింత వివరంగా చేప్పేందుగుకు అవకాశం ఉంటుందన్నారు.అదేవిధంగా బై జ్యుస్ మెటీరియల్ విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Makavarapalem

2022-12-26 12:08:54

ఆ పంచాయతీలో Dr.YSR విగ్రహానికి ఘోర అవమానం

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోవుంది..ఆ నియోజవకర్గానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.. నిత్యం ఆ గ్రామానికి అధికారులు, అధికారి పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చిపోతుంటారు.. కానీ దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన చోట ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ భర్త, 
ఆ యాక్టింగ్ సర్పంచ్.. విగ్రహం చుట్టూ చెత్తా చెదారాన్ని వేస్తున్నా.. తనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించినా అధికారపార్టీ నాయకులు ప్రశ్నించరు.. అధికారులు అసలే పట్టించుకోరు.. ఎందుకు వేస్తున్నారని, ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా వాడుతున్నారని, విగ్రహం ఉన్న నిర్మాణాలు ఎందుకు కూల్చావని గానీ ఎమ్మెల్యేతో సహా ఎవరూ ప్రశ్నించారు. ఆ గ్రామమే వెలంపాలెం(జంగులూరు వెలంపాలెం). ఇది పాయకరావుపేట నియోజవకర్గం, ఎస్.రాయవరం మండలంలో ఉంది. సాక్షాత్తు వైఎస్సార్ విగ్రహం పెట్టిన ప్రాంతాన్ని చెత్త చెదారాన్ని వేయిస్తూ..తన కాంట్రాక్టు సామాగ్రిని ఇదే ప్రాంతంలో పెట్టుకొని షెడ్డులా వాడుతున్నారు స్థానిక టిడిపి యాక్టింగ్ సర్పంచ్ వజ్రపు శంకర్రావు.. అంటే ఇక్కడ సర్పంచ్ వజ్రపు క్రిష్ణకుమారి కానీ యాక్టింగ్ మొత్తం ఆమె భర్తదేనని గ్రామస్తులు మొత్తం ఏకమై చెబుతున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం కూడా ఇక్కడ పరిస్థితి చూసిన ఎవరికైనా కనిపిస్తుంది.

వెలంపాలెం(జంగులూరు వెలంపాలెం) గ్రామంలో రోడ్డు ప్రక్కన డా.వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని చిన్నపార్కులా మార్చాలని, గ్రామస్తులకు త్రాగునీరు అందించడానికి ఎస్.రాయవరానికి చెందిన కర్రధనరెడ్డి దాత గ్రామంలోని రోడ్డు ప్రక్కన వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ ప్రహారీ 
గోడ నిర్మాణాలు చేపట్టి.. తాగునీటి సౌకర్యం కోసం బోరు వేయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా, పంచాయతీ అనుమతి తీసుకోకుండా నిర్మించడానికి ఎవరికి అధికారం వుందంటూ జరుగుతున్న నిర్మాణాలను స్థానిక సర్పంచ్ భర్త శంకర్రావు జేసీబీతో గ్రామస్తులు చూస్తుండగానే కూల్చేశారని గ్రామ పెద్ద కర్రి సత్యారావు..కట్టుమూరి క్రిష్ణలతో పాటు మరికొంతమంది గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు దృష్టికి తీసుకెళ్లాని ఫలితం లేకుండా పోయిందన్నారు.  వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసినచోట చెత్తను వేసి, తన కాంట్రాక్టు పనులు చేసే ట్రాక్టర్ సామాగ్రిని విగ్రహం చుట్టూ వేసి షెడ్డులా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దివంగత ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఆ ప్రాంతంలోనే గ్రామానికి చెందిన చెత్త వేయడంతోపాటు, ఆ ప్రాంతంలో ఎవరూ కూర్చోకుండా నిర్మాణాలు కూలదోసిన సిమ్మెంటు స్థంబాలను కూడా అక్కడే ఉంచారని, పక్కనే వున్న ఇరిగేషన్ కాలువలో నీరు క్రిందకి పోకుండా..నీరు నిల్వ ఉండిపోయేలా చేసి.. వైఎస్సార్ 
విగ్రహం ఉన్నచోట ఎవరూ కనీసం కూర్చోవడానికి వీలు లేకుండా చేశారన్నారు. పేరుకి మాత్రమే వజ్రపు క్రిష్ణకుమారి గ్రామ సర్పంచ్ అని, గ్రామంలో ప్రభుత్వ వ్యతిరేక పనులు చేసేది..అక్రమ నిర్మాణాలు చేసేదీ ఆయన భర్త వజ్రపు శంకర్రావేనని ఆరోపించారు. ఇక్కడ అధికారంలో వున్న ఎమ్మెల్యేగానీ, పోలీసులుగానీ, 
మండల అధికారులు గానీ ఎవరూ గ్రామం జరుగుతున్న స్వచ్ఛంద అభివ్రుద్ధికి వ్యతిరేకించి..నిర్మాణాలను కూలగొట్టే విధానాలను ప్రశ్నించకపోతే ఇక గ్రామంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వీరు ప్రశ్నించారు. 

ఈయన అవినీతిపైనా.. అక్రమాలపైనా ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. మా గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కి విగ్రహం కట్టించి..ఆ ప్రాంతాన్ని చిన్న పార్కుగా మార్చుకోలేని దుస్థితో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా జిల్లా కలెక్టర్, రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నట్టు గ్రామస్తులు తెలియజేశారు. అధికారపార్టీ, ఎమ్మెల్యే ఉన్న చోట పతిపక్షపార్టీకి చెందిన సర్పంచ్ భర్త, యాక్టింగ్ సర్పంచ్ చేస్తున్న వ్యవహరాలపై అధికారపార్టీ నేతలు నోరు మెదకపోవడం ఆశ్చర్యమే. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీని నమ్ముకోవడానికి గానీ..అభిమానించడానికి గానీ.. ఆదరించడానకి గానీ ఎవరూ రానని గ్రామస్తు భహిరంగంగా చెప్పడం విశేషం..!

S Rayavaram

2022-12-19 04:21:17

రైతంగానికి భరోసా శాశ్వత భూ హక్కు పథకం

రాష్ట్రంలో రైతాంగానికి భూ రక్షణ భరోసాను కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినదే 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం' అని పార్లమెంటరీ చీఫ్ విప్, మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.  శనివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు సచివాలయం-1 ప్రాంగణంలో ' జగనన్న భూ హక్కు పత్రాలను' ఎంపీ భరత్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, సుమారు వంద సంవత్సరాల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ గ్రామ కంఠం‌ స్థిరాస్తుల సర్వేను సీఎం జగన్ ఒక మహాయజ్ఞంలా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ, పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతికి తావులేని రీతిలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు.‌ 

దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సచ్ఛీకరణ, వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం రికార్డుల తయారు చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకం‌తో భూ యజమానులు తమ భూములపై వేరొకరు సవాల్ చేయడానికి వీలులేని శాశ్వత హామీ, భూ వివాదాలు తగ్గుముఖం పడతాయని ఎంపీ పేర్కొన్నారు. ‌ఈ పథకంపై రైతులకు గ్రామ సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ‌రాజమండ్రి రూరల్ పరిధిలో ఈ కార్యక్రమం రాజవోలు జరిగిందని, ఇప్పుడు బొమ్మూరులో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ జరుగుతోందన్నారు. బొమ్మూరు గ్రామంలో 178 మంది రైతులకు ఈ భూహక్కు పత్రాలు పంపిణీ చేయబోతున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. చైత్రవర్షిణి, తహసీల్దారు చిన్నారావు, ఎంపీడీవో రత్నకుమారి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేతలు సోమన శ్రీను, అను, రాజేష్, రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bommuru

2022-12-17 11:13:54

విద్యార్ధుల కళలను మరింత ప్రోత్సహించాలి

ఇంత మంచి కళాకృతులను తయారు చేసి ప్రదర్శించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం భీమవరం పట్టణంలో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో టిఎల్ఎం  ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి  
ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పార్ట్ టైం ఉపాధ్యాయులు,  ఆయా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తయారుచేసిన సుమారు 600 వివిధ రకాల  కళాకృతులను ప్రదర్శించడం అభినందనియం అన్నారు. వీటిని  జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి తిలకించి వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరెన్నో కళాకృతులను విద్యార్థుల చేత తయారు చేయించాలని కలెక్టర్ తెలిపారు. 

ఈ స్టార్స్ లో ఏర్పాటుచేసిన విభిన్నమైన కళాకృతులు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా ఆకర్షించాయి. వీరు కాగితాలతో తయారుచేసిన  డైనోసార్, ప్లాస్టిక్ లేకుండా తయారు చేసిన వివిధ రకాల  పువ్వులు, దారాలతో  చేసిన బొమ్మలు ,అలాగే ఇంట్లో వినియోగించే గృహపకరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. పాలకోడేరు చెందిన కె.అంబిక ఉపాధ్యాయురాలు  పెయింట్ తో గీసిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కుటుంబ సభ్యుల చిత్రపటాన్ని కలెక్టర్ కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. వెంకటరమణ, సమగ్ర శిక్ష  ఏపీసీ పీ .శ్యాంసుందర్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాధినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-17 10:08:17

హౌసింగ్ లేవుట్లలో నిర్మాణాలు వేగం పెంచాలి

జగనన్న హౌసింగ్ లే ఔట్ లోని గృహాలకు మౌలిక వసతుల  కల్పన సత్వరమే పూర్తి చేయాలని, స్టేజి కన్వర్షన్ లో పురోగతి ఉండాలని మూడవ కేటగిరి లబ్దిదారులకు అవగాహన కల్పించి పూర్తిచేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్ణయించిన నేపథ్యంలో నేటి  శనివారం  ఉదయం వడమాలపేట మండలం కాయం  లే అవుట్ లో నిర్మితమవుతున్న గృహాలను జిల్లా కలెక్టర్ ఆకశ్మిక తనిఖీ నిర్వహించి పలు సూచనలు చేసారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ లే ఔట్ లో మిద్దె, గోడ స్థాయి పూర్తి స్థాయిలో ఇళ్ళు అయిన వాటికి విద్యుత్ మీటర్లు ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. ఎ.ఈ నిబందనల మేరకు సత్వరమే ఏర్పాటు చేయాలని ఆదేశించగా,  విద్యుత్ పోల్ లు అన్ని తీగలతో అనుసంధానం చేసి పూర్తి స్థాయిలో ఉన్నాయని త్వరితగతిన  మీటర్లు ఏర్పాటు చేస్తామని ఎ.ఈ. తెలిపారు. ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు ఇంటింటికీ త్రాగు నీటి కుళాయిల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హౌసింగ్ ఎ.ఈ.  వెంకటరత్నం కాయం లే ఔట్ లో 798 గృహాలకు గాను 152 బి.బి.ఎల్, 347 పునాది స్థాయి, 58 గోడల స్థాయి, స్లాబ్ స్థాయి 135, 102 గృహాలు పూర్తి అయ్యాయని తెలుపగా పునాది స్థాయి కన్నా దిగువన, పునాది స్థాయిలో  ఉన్న లబ్దిదారులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ వాలంటీర్లు అవగాహన కల్పించి స్టేజి కన్వర్షన్ ఉండేలా రోజువారి పురోగతి చూపించాలని ఆదేశించారు. ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. క్రింద బిల్లులు లబ్దిదారుల ఖాతాలలో జమ అయిందని పథక సంచాలకులు డ్వామా లబ్దిదారులకు తెలిపారు. ఎప్పటికప్పుడు బిల్లులు ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లే ఔట్ కు రోడ్డు మరియు ఆర్చ్ ను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో  హౌసింగ్ పి.డి. ఇంచార్జ్ శ్రీనివాస ప్రసాద్, ఈ.ఈ. హౌసింగ్ చంద్రశేఖర్ బాబు, సంబందిత సచివాలయ సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు. 

Vadamalapeta

2022-12-17 09:00:36

వినియోగధారులకు చట్టరీత్యా న్యాయ రక్షణ

వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించడానికి వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. శనివారంలో కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు అడబాల రత్న ప్రసాద్ అధ్యక్షతన వినియోగదారుల రక్షణ చట్టం  వారోత్సవాలను పురస్కరించుకుని జరిగిన అవగాహనా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నష్టపోయిన వినియోగదారుడికి ఎటువంటి ఖర్చు లేకుండా వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించడానికి చట్టం రూపొందించింది అని అన్నారు. వస్తువు కొన్న తర్వాత సేవలు అందించకపోయినా, అసంపూర్తి సేవలకు కూడా పరిహారం పొందవచ్చని అన్నారు. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు తీసుకున్నప్పుడే వినియోగదారుడికి హక్కు వస్తుందని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-17 08:38:03

తలసరి చేపల వినియోగం పెంచడమే ప్రధాన లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ లో తలసరి చేపల వినియోగం 8 నుంచి 22 కేజీలవరకూ పెంచడమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఫిష్ ఆంధ్రాషాపులకు మత్స్యకారుల ద్వారా పెద్ద ఎత్తున సబ్బిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యేల కంబాలజోగులు పేర్కొన్నారు. గురువారం రాజాం నియోజవకర్గంలోని రాజాం, సంతకవిటి, ఆర్. ఆముదాల వలస ప్రాంతాల్లోని 22 చేపల చెరువుల్లో 3.39లక్షల చేప పిల్లల(బొచ్చు, రాగండి, ఎర్రమైల)ను మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో చెరువుల్లోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం 2020-21కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని లీజు చెరువుల్లో వదిలిపెట్టిన చేప పిల్లలను పూర్తిస్థాయిలో మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఔట్ టెల్లు ఏర్పాటు చేసుకొని ఆర్ధికంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 
మత్స్యశాఖ ఉప సంచాలకులు నిర్మలకుమారి మాట్లాడుతూ, పీఎంఎంఎస్ వై పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు 60శాతం సబ్సిడీ, ఇతరులకు జనరల్ మత్స్యకారులకు 40శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్ల ద్వారా మత్స్యకారులు ఆర్ధికంగా పరిపుష్టి సాధించడానికి ఈ పథకం ఎంతో చక్కగా పనిచేస్తుందన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మత్స్యకారుల అభివృద్ధి చెందేవిధంగా ఈ పథకాన్ని మత్స్యకారులందరికీ చేరువ చేస్తున్నట్టు వివరించారు. మరింత మంది మత్స్యకారులు ముందుకి వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 
రాజాం టౌన్ కన్వీనర్ శ్రీనివాసరావు, ఎంపీపీ రాజగోపాలరావు, జెడ్పీటీసీ బండి నర్శింగరావు, సర్పంచ్ లు, మత్స్యశాఖ సహాయ తనిఖీదారు 
సిహెచ్వీవీ.ప్రసాదరావు, ఏఎఫ్ఓ వెంకటేష్, విఎఫ్ఏ లు సత్యన్నారాయణ, శారద, శ్రీనివాస కిరణ్, చైతన్య, రఘురామ్, ఉమామహేశ్వర్రావు, వెంకట్ మత్స్యకార 
సంఘం సొసైటీ అధ్యక్షుడు తవుడు, సంఘ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Razam

2022-12-15 16:19:34

రాష్ట్రంలో జనరంజకంగా సంక్షేమ పథకాల అమలు

సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసనసభ్యులుధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. గురువారం సారవకోట మండలం అలుదు పంచాయితీ మాకివలస సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. సంక్షేమ బావుటా బుక్లెట్ పంపిణీ చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం అదే గ్రామంలోని పిల్లల శిమ్మయ్య  తాను పక్షవాతంతో బాధపడుతున్నానని కిడ్నీ వ్యాధితో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, తక్షణమే స్పందిస్తూ తగు వైద్యం అందేదిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరంజకమైన సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను ప్రజలు ఇప్పటికే ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలలో ఇప్పటికే  95 శాతం పకడ్బందీగా అమలుచేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. జనవరి నుంచి సామాజిక పింఛన్ ను రూ.2,750కి పెంచుతున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి చెప్పుకునేవారని, ఇప్పుడే తామే జనం ఇంటి ముంగిటకు వెళుతున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ధర్మాన పద్మప్రియ, వరుదు వంశీకృష్ణ, నక్క తులసీదాస్, ఎంపిడిఓ విశ్వేశ్వరరావు, తహశీల్దార్ ప్రవల్లికా ప్రియ, ఇతర అధికారులు, సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Narasannapeta

2022-12-15 11:39:45

నిర్ణీత గడువులోపు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయాలి

నిర్ణీత గడువులోపు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయాలని దానికి అధికారి యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ సంబంధించి గాజుల కొల్లువలస లో సుమారు 1734 ఇళ్ల పట్టాలు మంజూరు చేసామన్నారు. ఈ లేఔట్ ని గురువారం స్పీకర్ తమ్మినేని అధికారులతో వెళ్లి పరిశీలించారు. ఇల్లు నిర్మాణంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఇప్పుడు నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని క్రొత్తగా ఉల్లనే ఈ ప్రభుత్వం నిర్మిస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1.70 లక్షల మంది లబ్ధిదారులకు 840 కోట్లు బిల్లులు చెల్లించిందన్నారు అందులో సిమెంటు ఐరన్ మొదలగు నిర్మాణ సామాగ్రికి 132 కోట్లు చెల్లించిందన్నారు ఇంతవరకు ఈ ఆర్థిక సంవత్సరానికి 6495 కోట్లు ఖర్చు చేశామన్నారు.

 రాష్ట్రంలో 31 లక్ష పట్టాలిచ్చామని అందులో 15 లక్షల ఇల్లు నిర్మాణం శంకుస్థాపన పూర్తిచేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం రవి సుధాకర్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మొండేటి కూర్మారావు, గురుగుబిల్లి ప్రభాకర్ రావు, కూన రామకృష్ణ, సాధు చిరంజీవి, చిన్నారావు, మెట్ట జోగారావు, బొడ్డేపల్లి రమణమూర్తి తదితర వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

Amadalavalasa

2022-12-15 11:22:44