1 ENS Live Breaking News

మహిళలను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే..

ఆంధ్రప్రదేశ్ లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత సహాయొ మహిళలకు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చేస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శనివారం శంఖశరం మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆమె పాల్గొని  ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ తో కలిసి  1055 సంఘాలకు రూ. 8  కోట్ల నాలుగు లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్ ఆసరాతో మహిళలంతా ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మహిళల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేయూతనందిస్తూ వస్తున్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వం చేయని విధంగా మహిళలకు ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాల మాఫీ దఫ దఫాలుగా  చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ జె.రాంబాబు, తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం, ప్రత్యేక అధికారి డా.వీరరాజు, ఏసీ అహ్మద్ వల్లీ, వెలుగు సిసి జివిప్రసాద్, నాగలక్ష్మి, సీత తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-16 11:31:16

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలి..

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయి లోని అర్హులైన ప్రజలకు అందించడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. గుడిపాల మండలంలోని నంగమంగళం గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హులు అనర్హుల జాబితాను, సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లను, సిబ్బంది హాజరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నంగమంగళం గ్రామ పరిధిలో 3270 మంది ఉన్నారని,1119 ఇల్లు ఉన్నాయని ఇప్పటివరకు 2672 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. మరో పది మంది మాత్రం వాక్సినేషన్ వేయించుకోవాల్సి ఉందన్నారు. గ్రామంలోని మొత్తం 1700 మంది మహిళలకు దీక్ష యాప్ ను డౌన్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మొత్తం 134 మందికి ఇళ్ల తలా లతోపాటు నిర్మాణాలకు మంజూరు కావడం జరిగిందని, 29 మంది సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా వైయస్సార్ చేయూత, తోడు, పింఛన్లు, రేషన్ కార్డుల వివరాలను కలెక్టర్ అడిగారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందించే ఈ సమయంలో అందరూ కలిసి పని చేయాలని ఏ సంక్షేమ పథకాలు కైనా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ,అనర్హుల జాబితాలను పరిశీలించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందిస్తున్న పథకాలను, అందించిన ఎరువుల వివరాలను, వేరుశెనగ విత్తన కాయల పంపిణీ, ప్రస్తుత దిగుబడి లను సమీక్షించారు. ఈ క్రాఫ్ బుకింగ్ 349 ఎకరాలకు చేయడం జరిగిందని ఇందుకు సంబంధించి కొన్నింటికి రసీదు ఇవ్వాల్సి ఉందని కలెక్టర్ కుతెలిపారు. ప్రజలు కు సంబంధించి ఎటువంటి విజ్ఞప్తులు వచ్చిన వెంటనే స్పందించాలని సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే వారి అర్హతల గురించి వాలంటీర్లు ద్వారా పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉన్న వారికి ఆ పథకాలు అందించే విధంగా చూడాలన్నారు. బొమ్మసముద్రం వద్ద నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీని కలెక్టర్ పరిశీలించారు. మొత్తం 42 మందికి ఆ కాలనీలో ఇండ్లు మంజూరు కావడం జరిగిందని ఒక్కరు మినహా అందరూ ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారని, 29 ఇండ్లు బేస్మెంట్ స్థాయి దాటాయని హౌసింగ్ అధికారులు వివరించారు. వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి పద్మనాభం, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, ఆర్డిఓ రేణుక, ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్,బాల గణేశ్ తదితర అధికారులు,అనధికారులు పాల్గొన్నారు.

Nangamangalam

2021-10-16 10:01:54

కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు సాధించవచ్చు..

అన్నవరంలో పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ఎంపీటీలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని సర్పంచ్ బి.కుమార్ రాజా అన్నారు. గురువారం అన్నవరంలో పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ఎంపీటీసీలతో సాధారణ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ, టెంపుల్ టౌన్ గా వున్న అన్నవరం పంచాయతీలోని అన్ని వార్డుల్లో ప్రధాన సమస్యలు గుర్తించడం ద్వారా వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ముఖ్యమంగా పారిశుధ్యం, త్రాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వార్డు సభ్యులు గుర్తించాలన్నారు. ప్రధాన సమస్యలను తమ ద్రుష్టికి తేవడం ద్వారా వాటిని పరిష్కరించి ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా పంచాయతీలో మూడు గ్రామ సచివాలయాలు ఉన్నాయని వాటి ద్వారా ప్రభుత్వం అందించే సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకునే లా కూడా పాలకవర్గ సభ్యులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సభ్యులను సర్పంచ్ ఘనంతా సన్మానించారు.

Annavaram

2021-10-14 15:13:45

శ్రీ కనకదుర్గమ్మకు వెండి చేయితొడుగు విరాళం..

రౌతులపూడి గ్రామ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మకు రూ.40వేల విలువైన అరకేజి వెండి చేయి తొడుగుని దివంగత పాసిల ముసిలి గుర్తుగా ఆయన తనయుడు, శంఖవరం గ్రామసచివాలయ జూనియర్ సహాయకులు పాసిలి రమణమూర్తి దంపతులు విరాళంగా సమర్పించారు. గురువారం అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాతూ, నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారికి వెండిచేయి విరాళంగా బహూకరించిన దంపతులను ఆయన అభినందించారు. అమ్మదయతో ఈ ప్రాంతం శుభిక్షంగా ఉందని, ఈ కరోనా మహమ్మరి కూడా పూర్తిగా సమసిపోయి తల్లి దీవెనలతో బాగుండాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జిగిరెడ్డి శ్రీను, జెడ్పీటీసీ గొల్లి చిన్నదివానం, ఎంపీపీ గట్టిమళ్ల రాజ్యలక్ష్మి, కోపరేటివ్ డైరెక్టర్ పులి మధు, రైతుపూడి ఉపసర్పంచ్ వాసిరెడ్డి భాస్కరబాబు, పైడిపాల సర్పంచ్ జిగిరెడ్డి సత్తిబాబు, అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-14 12:24:36

ప్రతీ కుటుంబానికి 100 రోజుల ఉపాది పని కల్పింస్తాం..

శంఖవరం పంచాయతీలోని ప్రతీ కుటుంబానికి 100 రోజుల ఉపాది హామీ పనులు కల్పిస్తామని ఎంపీపీ పర్వత రాజబాబు పేర్కొన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ మాట్లాడుతూ, 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఉపాది పనులను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది పథకంలో జాబ్ కార్డులేనివారంతా పంచాయతీలను సంప్రదించి జాబ్ కార్డులను పొందాలనున్నారు. అదేవిధంగా స్వచ్చ శంఖవరం కార్యక్రమంలో మన పంచాయతీ ముందుండేలా పంచాయతీని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపర్పంచ్ చింతనీడి కుమార్, మూడు గ్రామ సచివాలయా కార్యదర్శిలు, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, పంచాయతీ సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల బాషా, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-14 12:20:25

గ్రామస్థాయిలోనే ఉత్తమసేవలు అందించాలి..

గ్రామ సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందా లని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొ న్నారు.  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన గురువారం సీతానగరం మండలం పెదబోగిలి 1 & 2  గ్రామ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో  ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు.  ఈ పర్యటనలో సీతానగరం మండలం రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Seethanagaram

2021-10-14 10:12:04

2021-10-14 05:27:52

సంతపైడిపాలలో 930 లీటర్ల సారాధ్వంసం..

యువత చక్కగా చదువుకోవాలి తప్పితే చెడు మార్గంలో పయనించకూడదని తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.కిషోర్ బాబు యువతకు సూచించారు. బుధవారం రౌతులపూడి మండలంలోని సంత పైడిపాల గ్రామంలో సుమారు 930 లీటర్ల సారాను, గ్రామ సమీప సెలయేరు ప్రాంతంలో 8,500 లీటర్ల బెల్లపు ఊటను కనుగొన్న పోలీసులు వాటిని నాశనం చేసారు. ఈ నేరాలకు బాధ్యులుగా భావిస్తున్న ఎనిమిది మందిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకోగా మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. గ్రామం, దాని పరిసరాలను బుధవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో చుట్టి ముట్టి (కార్డన్ సర్చ్) తనిఖీలు నిర్వహించారు. ఫలితంగా అక్రమంగా దాచిన సారా, బెల్లం ఊట నిల్వలను కనుగొన్నారు. ఈ సందర్భంగా  గ్రామ యువతను సమావేశ పరచిన సిఐ యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చదువుకుని, ఉన్నత ఉధ్యోగాలు పొందాలని, నాటు సారా, గంజాయి మొదలగు వాటికి దూరంగా ఉండాలని హితవు చెప్తూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు తెలిపి సహకరించాలని కొరారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎస్సై అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Rowthulapudi

2021-10-13 14:41:22

స్వచ్ఛ అన్నవరానికి ప్రజలు సహకరించాలి..

స్వచ్ఛ అన్నవరానికి ప్రజలు సహకరించాలని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. బుధవారం అన్నవరం క్రిందివీధి ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా పంచాయతీ ఏర్పాటు చేసిన చెత్తకుండీల్లో మాత్రమే చెత్తను వేయాలన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన అపారిశుధ్య పెరిగిపోతుందన్నారు. అన్నవరం మేజర్ పంచాయతీని స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

అన్నవరం

2021-10-13 03:51:17

అన్నవరంలో మంచినీటి సమస్య పరిష్కారం..

అన్నవరం పంచాయతీ వాసుల సమస్య పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందే ఉంటానని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. బుధవారం అన్నవరం గ్రామంలోని పంపా కెనాల్ పక్కనే వున్న ఏరియాలో ఏర్పాటు చేసిన మంచినటీకి కుళాయిలను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పంచాయతీ నుంచి ప్రజలకు చేపట్టాల్సిన అన్ని పనులనూ సకాలంలో పూర్తిచేస్తామన్నారు. త్రాగునీరు, పారిశుధ్యం, సమస్యల పరిష్కారంతో ముందుంటామన్నారు. పంచాయతీ పరిధిలో ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా గ్రామవాలంటీరు ద్వారా సచివాలయానికి, పంచాయతీ సిబ్బంది ద్రుష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీరామ చంద్ర మూర్తి.6,7, వార్డ్ మెంబర్లు తాటిపాక సిందూజా.గంపల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్నవరం

2021-10-13 03:50:35

స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌..

గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు గ్రామంలోనే అన్ని సేవలు అందించడంతోపాటు సమస్యు పరిష్కారం అయ్యేవిధంగా సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిజేశారు. మంగళవారం జిల్లాలోని డెంకాడ మండ‌లం మోపాడ గ్రామ వార్డు స‌చివాల‌యాన్ని, రైతు బరోసా కేంద్రాన్ని ఆమె  ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స్పంద‌న విన‌తులుపై ఆరా తీశారు. స‌చివాల‌య ప‌రిధిలో వివిధ ప‌థ‌కాల అమ‌లును తెలుసుకున్నారు. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్రజలకు ఏ సేవలైనే సచివావాలయంలోనే అందుతాయనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. అనంతరం రైతు బరోసా కేంద్రాన్ని సందర్శించి ఎరువులపై, ఈక్రాప్ నమోదు,రైతు సంక్షేమ పధకాలపై ఆరా తీసారు.

Denkada

2021-10-12 13:51:12

అక్క చెల్లెమ్మల స్వావలంబనే సీఎం ధ్యేయం..

అక్క చెల్లెమ్మల స్వావలంభనే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని అందులో భాగంగా ఆసరా కల్పిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 1,2 వ వార్డుల లబ్ధిదారులకు తగరపువలస బంతాట మైదానంలో, 3,4 వార్డుల లబ్దిదారులకు ఎగువ పేట నూకాలమ్మ గుడి వద్ద,  పద్మనాభం మండలంలో MPDO కార్యాలయం వద్ద జరిగిన    రెండో దశ ఆసర చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  ముందుగా సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, మహిళలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రెండో దశ ఆసరా కింద మహిళల బ్యాంకు ఎకౌంట్లలో నగదు జమ చేశారన్నారు. రాష్ట్రంలో 31లక్షలు ఇళ్లు లేని పేదలు ఉంటే వారికి పట్టాలు పంపిణీ చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తంశెట్టి మహేష్   కార్పొరేటర్లు అక్కరమాని పద్మావతి  ఎడుకొండలు,కోఆప్సన్ మెంబర్ కొప్పలప్రభావతి  భీమిలి  MPP వాసురాజు  ZPTC వెంకటప్పడు  పద్మనాభం  MPP మద్ది రాంబాబు, ZPTC సుంకర.గిరిబాబుతో పాటు మండలనాయకులు పాల్గొన్నారు.

Thagarapuvalasa

2021-10-11 13:27:13

వైయస్సార్‌ ఆసరాతో మహిళల ఆర్ధికాభివృద్ధి..

మహిళల ఆర్ధికాభివృద్ధికి వైయస్సార్‌ ఆసరా తోడ్పాటు ఇస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. సోమవారం నర్సీపట్నం మండల పరిషత్‌ కార్యాలయంలో వైయస్సార్‌ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సీపట్నం మండలంలో ఆసరా పథకం కింద రెండవ విడతలో 6856 డ్వాక్రా గ్రూప్‌ సభ్యులకు 6 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను మహిళలు పేరు మీదుగానే మంజూరు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని పథకాలు మహిళలు పేరుమీదుగానే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎంపీడీవో జయ మాధవి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-11 12:27:41

విశాఖ నుంచి నర్సీపట్నం వచ్చిన స్పందన..

విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి స్పందన కార్యక్రమం నర్సీపట్నం తరలి వచ్చింది. ఒకరు  కాదు ఇద్దరు కాదు జిల్లాలోని అన్నిశాఖల అధికారులూ నర్సీపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు హాజరయ్యారు. స్పందనపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెంచాలనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున వినూత్నంగా ముందడుగు వేశారు. స్పందన కార్యక్రమం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే కాదు. డివిజన్ కేంద్రం నుంచి గ్రామ సచివాలయం వరకూ ఎక్కడ నిర్వహించినా స్పందన ఒకేలా ఉంటుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. జిల్లా అధికారులంతా ఒకేసారి రావడంతో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనితో పెద్ద ఎత్తున ప్రజలు కలెక్టర్ కు తమ తమ సమస్యలపై అర్జీలు పెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎం వేణు గోపాలరెడ్డి,ఆర్డీవో ఆర్ గోవిందరావు ఏసిపి మణికంఠ చందోల్, జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి తదితరలు ఈ స్పందనలో పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-11 06:54:23

కత్తిపూడిలో డ్రైనేజీ పై పేలిన కట్టడాలు..

శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో హైవే డ్రేనేజిలపై విచక్షణా రహితంగా కట్టిన కట్టడాలు డ్రైనేజీ నుంచి వచ్చి గ్యాస్ వాయువల కారణంగా సోమవారం ఉదయం పేలిపోయాయి. అయితే ఆ సమయంలో ఎరికీ ప్రమాదం సంభవించలేదు. డ్రైనేజీలు పై ఎక్కడా గాలి బయటకు పోకుండా నిర్మాణాలు చేపట్టడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది ఆ ప్రాంతాలను పరిశీలించారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కత్తిపూడి మేజర్ పంచాయతీ పరిధిలో చాలా కాలం నుంచి డ్రైనేజీలు సక్రమంగా శుభ్రం చేయించడం లేదు. దీనితో డ్రైనేజీల్లోని మురికి నీరు నుంచి గ్యాస్ వాయువులు ఏర్పడి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పంచాయతీ అధికారులు పూర్థిస్థాయిలో విచారణ చేపట్టి డ్రైనేజీలపై నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. జరిగిన ప్రమాదంలో ఎవరైనా మనుషులు ఉండి ఉంటే ప్రాణాలు పోయేవని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kathipudi

2021-10-11 06:39:42