1 ENS Live Breaking News

అన్నవరంలో డిప్యూటీ సీఎం కుమార్తెకు అన్నప్రసాన..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  దేవస్థానం చైర్మన్ ఐవి.రోహిత్, అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు. మంత్రి పుష్పశ్రీవాణి దంపతులు తమ కుమార్తెకు అతిథి భవనంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సత్యదేవుణ్ణి దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ, సత్యదేవుని సన్నిధిలో తమ బిడ్డకు అన్నప్రసాన చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. స్వామి కరుణతో కరోనా సమసిపోయి రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు. కాగా మంత్రి కుటుంబ సభ్యులకు దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం, శేష వస్త్రం అందించగా ప్రసాదాలను దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఐవీ.రోహిత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్వోకొండలరావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2021-10-10 17:44:26

మహిళల ఆర్ధిక వికాసానికే ప్రభుత్వ ఆసరా..

విజ‌య‌న‌గ‌రంజిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండో విడ‌త వై.ఎస్‌.ఆర్‌.ఆస‌రా సంబ‌రాలు ఆదివారం ఘనంగా  నిర్వ‌హించారు. బ‌లిజిపేట‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో స్థానిక శాస‌న‌స‌భ్యులు అల‌జంగి జోగారావు పాల్గొని మండ‌లంలోని మ‌హిళా స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు రెండో విడ‌త ఆసరా మొత్తాల‌ను అంద‌జేశారు. మండ‌లంలోని 1315 సంఘాల‌కు రూ.7.62 కోట్ల మొత్తానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జ‌గ‌న‌న్న అందిస్తున్న ఈ స‌హాయాన్ని వినియోగించుకొని రానున్న రోజుల్లో మ‌హిళా సంఘాలు మ‌రింత‌గా ఆర్ధిక వృద్ధి చెందాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీటీసీ అల‌జంగి ర‌వికుమార్‌, ఎంపిపి గుడివాడ నాగ‌మ‌ణి, వైస్ ఎంపిపి బెవ‌ర హేమ‌ల‌త‌, మండ‌ల ప్ర‌త్యేకాధికారి, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ డి.డి. కె.ముర‌ళీకృష్ణ‌, ఎంపిడిఓ పి.దేవ‌కుమార్‌, త‌హ‌శీల్దార్ ర‌ఫీజాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌యంశ‌క్తి మ‌హిళ‌ల‌తో క‌ల‌సి ఎమ్మెల్యే జోగారావు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు.

Balijipeta

2021-10-10 13:03:59

ఆసరా పథకం తోనే మహిళల జీవనోపాధి..

రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర పేర్కొన్నారు. ఆదివారం సాలూరు మండలంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాలూరు శాసన సభ్యులు పిడిక రాజన్న దొర, ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మండలంలో జీవనోపాధికి,  హౌసింగ్ బ్యాంక్ లింకేజిద్వారా  409 మహిళలకు ఒక కోటి డభై ఒక్క లక్ష నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల విలువ గల చెక్కును, వై.ఎస్.ఆర్.ఆసరా రెండవ విడత క్రింద 973 సంఘాలలో గల 10,812 మంది సభ్యులకు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కులను  శాసన సభ్యులు, ప్రోజెక్ట్ అధికారి స్వయం సహాయక సంఘాలు మహిళలకు అందజేశారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతు మహిళ ద్వారా కుటుంభానికి మంచి జరుగుతుందని గుర్తించిన ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని మహిళల పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసరా సొమ్ముతో పిల్లల చదువులకు, జీవనోపాధి.అభివృధి వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివద్ధి చెందాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలతో ఆర్థికంగా వారి కుటుంబాలు ఎలా అభివృధి చెందాయో సభ్యులు వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళల ఆర్థికాభివృదికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన  ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనీల్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ రెడ్డి పద్మావతి,   ఎం.పి.పి గరుగుబల్లి రాములమ్మ, వైస్ ఎం.పి.పి రెడ్డి సురేష్,  వై.ఎస్.ఆర్ క్రాంతి పథం  ఎ.పి.డి సత్యం నాయుడు, ఎం.పి.డి. ఓ  జి.పార్వతి, వైఎస్ ఆర్.సి.పి.నాయకులు, మండలంలో మహిళా సంఘాల సభ్యులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Salur

2021-10-10 13:01:13

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిధులు దారిమళ్లించారు..

ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనార్టీ సంక్షేమ నిధులలో సొమ్ముని దారి మళ్లిస్తుంటే కార్పొరేషన్‌ చైర్మన్‌లు ఏం చేస్తునన్నారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనార్టీ, కాపు కార్పొరేషన్‌ సంబంధించిన నిధులు దారి మళ్లిస్తుంటే కార్పొరేషన్‌ చైర్మన్‌లు చోద్యం చూస్తున్నారన్నారు. ఆయా జాతులకు సంబంధించి ఉపాధి అవకాశాల కోసం సబ్సిడీ రుణాల కోసం ఆ నిధిని ఖర్చు చేయాలి కానీ ఆ నిధులు దారి మళ్లింపుగా ఉంటే కనీసం ఏ కార్పొరేషన్‌ చైర్మన్‌ కూడా స్పందించిన పాపాన పోలేదన్నారు.  ఆ జాతుల వారికి ఉపాధి కల్పించే విధంగా సబ్సిడీ రుణాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి కానీ చైర్మన్‌ స్థాయిలో ఉన్న వ్యక్తులు కనీసం స్పందించకపోతే ఆ చైర్మన్‌ పదవికి అర్థం ఏముందన్నారు.  ప్రజలలో ఉన్నఅనుమానాలు నివృత్తి చేసేలా ప్రతి కార్పొరేషన్‌ చైర్మన్‌ స్పందించి ప్రజలకు తెలిసే విధంగా ఏఏ కార్పొరేషన్‌లో ఎంత ఉంది, ఆ డబ్బులు దేనికి వినియోగిస్తున్నామనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కార్పొరేషన్‌ చైర్మన్‌ కు ఉంటుందన్నారు. ప్రజలను మభ్య పెట్టే విధంగా కార్పొరేషన్లో ఎంత నిధులు ఉన్నాయో తెలియపరచకుండా  ప్రతి కార్పొరేషన్‌ చైర్మన్‌ మాత్రమే ఉంది ఆ నిధుల గురించి ప్రజలకు తెలియచేయకుండా అయోమయ స్థితిలో ఉంచి బ్యాంకులో రుణాలు రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, చెట్టుపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ పరవాడ శ్రీను, మోపాడ చిరంజీవి, పరవాడ లోవరాజు, కర్రీ శ్రీను, ఎర్ర ఈశ్వరరావు, రామచంద్ర. మోపాడ వంశీకృష్ణ, మటం వరహాలరావు తదితరులు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-10 11:48:46

స్పందన కార్యక్రమాన్ని వినియోగించుకోండి..

నర్సీపట్నంలో ఈ నెల 11వ తేదీ సోమవారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సమస్యలపై, అన్యాయాలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలన్నారు. గతంలో స్పందన కార్యక్రమం విశాఖపట్నంలోనే నిర్వహించేవారని, కానీ కలెక్టర్‌ నర్సీపట్నంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు అన్యాయంగా తీసేశారని, దీనిపై కలెక్టర్‌కు తెలియజేయాలన్నారు. అన్ని సమస్యలపై స్పందన కార్యక్రమంలో వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. 

Narsipatnam

2021-10-10 11:46:36

వంటగ్యాస్‌ పెంపుదలపై మహిళల ఆందోళన..

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతీ రోజు వంట గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్‌ గౌరీ. అన్నారు. పెంచిన గ్యాస్‌ ధరలను వ్యతిరేకిస్తూ నర్సీపట్నం పాతబజార్‌ వీధిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో గౌరీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్‌ ధరలను 500 రూపాయలకు పైగా పెంచిందన్నారు. గ్యాస్‌తో పాటు నిత్యవసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌ అన్నిరకాల ధరలను పెంచుతుందన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పెంచిన గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలని లేకుంటే మహిళలు తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుస్తుందని ఆమె అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలను వంచించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అన్ని రకాల ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందని మోడీ చర్యలను వ్యతిరేకించకపోతే దేశాన్ని అమ్మేస్తారన్నారు. గ్యాస్‌ ధరలు తగ్గించుకుంటే మహిళలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని మోడీని ఇంటికి పంపిస్తారన్నారు. ఈ  కార్యక్రమంలో మంగ, రమణమ్మ, లక్ష్మివెంకటమ్మ, దుర్గగోవిందమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-10 11:42:08

వైఎస్సార్ ఆసరాపై అవగాహన పెంచుకోవాలి..

మహిళా మనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని నర్సీపట్నం ఎంపిపి  సుర్ల రాజేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం ధర్మసాగరం సర్పంచ్‌ గొంప కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలో మాట ఇచ్చి మడమ తిప్పకుండా అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి 100 శాతం హామీలు నెరవేరుస్తున్నారన్నారు. అదేవిధంగా పథకం అమలు కాకుండా అర్హులై ఉన్నవారు గ్రామసచివాలయాల్లో సంక్షేమ సహాయకులను సంప్రదించాలన్నారు. మహిళా సంఘాలు అభివ్రుద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. 

Narsipatnam

2021-10-09 12:31:38

జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి..

జాతీయ స్థాయిలో నర్సీపట్నం కీర్తిని ఇనుమడింపజేసే విధంగా క్రీడాకారులు తయారు కావాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ పోటీలలో మన నర్సీపట్నంకు చెందిన ఇద్దరు బాక్సర్లు బంగారు పథకం సాధించారు. ఈ నెల 2,3తేదీల్లో విశాఖ లో జరిగిన స్టేట్‌  సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ ట్రైల్స్‌ విభాగంలో పాపని నాగమౌనిక(75కేజీలు), కోలుకుల కృష్ణవేణి(66కేజీలు) గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే , ఇమ్మానుయేల్‌ హాస్పిటల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సంస్థలు అధినేత కే.జీవన్‌రాయ్‌ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్‌ మాట్లాడుతూ నర్సీపట్నంలో ఎక్కువ మంది మహిళా క్రీడా కారులు మెడల్స్‌ సాదిస్తున్నందు వలన మనకు త్వరలో మహిళా కోచ్‌ను  స్పోర్ట్స్‌ అథారిటీ ద్వారా తీసుకు రానున్నట్లు తెలిపారు. జీవన్‌రాయ్‌ మాట్లాడుఉతూ ఇమ్మానుయేల్‌ కాలేజీలో నర్సింగ్‌ స్టూడెంట్‌రాష్ట్ర స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నింజాస్‌ అకాడమీ ద్వారా నర్సీపట్నంలో ఎన్నో పతకాలు సాధిస్తున్న క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. నింజాస్‌ అకాడమీ చైర్మన్‌ వెలగా నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్నో పతకాలు సాధిస్తున్న మన క్రీడాకారులకు నర్సీపట్నం ప్రముఖులు, ఎమ్మెల్యేచే నగదు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు పాపని నాగమౌనిక, కోలుకులకృష్ణవేణిలు ఇది వరకు 8కి పైగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, అందులో మౌనిక ఐదు నేషనల్‌ మెడల్స్‌, కృష్ణవేణి 4 మెడల్స్‌ సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్‌ సిరసపల్లి నాని, వైసిపి నాయకులు, నర్సింగ్‌ కాలేజీ స్టాఫ్‌ పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-09 12:30:16

మహిళాభివ్రుద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుంది..

మహిళా ఆర్ధికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. శనివారం గొలుగొండ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో వైయస్సార్‌ ఆసరా పథకం నిధులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ హాజరై చెక్కులు పంపీణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహిళలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలన్ని మహిళల పేరుతోనే అమలు చేయడమే దీనికి నిదర్శనమన్నారు.  పథకం ద్వారా మండలంలో 1022 సంఘాలలో 13744 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని చెప్పారు. మొదటి విడతగా గత ఏడాది కూడా ఆసరా పథకం ద్వారా రూ.7కోట్లు అందజేశామన్నారు. ఈ ఏడాది రెండో విడతగా రూ.7.40కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ధి చెందాలన్నారు. అనంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో ఆర్‌.గోవిందరావు, ఎంపిడిఒ డేవిడ్‌ రాజ్‌, తహశీల్దార్‌ వెంకటేశ్వరావు, నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిటికెల భాస్కర్‌నాయుడు, గొలుగొండ ఎంపిపి గజ్జల మణికుమారి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, వైస్‌ ఎంపిపి సుర్ల బాబ్జి, ఏఎసి చైర్మన్‌ లెక్కల సత్యనారాయణ, గొలుగొండ సర్పంచ్‌ బుజ్జి, స్టేట్‌ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ సాయి బాబా, ఏపిఎం గోవిందరావు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-09 12:27:23

అన్నవరం సత్యదేవుని హుండీ లెక్కింపు వాయిదా..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణస్వామి వారి దేవస్థానంలో ఈనెల 11న జరగాల్సిన హుండీ లెక్కింపు కార్యక్రమం 25వ తేదీ నాటికి వాయిదావేస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. శనివారం ఈమేరకు అన్నవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలకు హాజరవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆ ప్రకటనలో ఈఓ పేర్కొన్నారు. మార్చిన తేదీలో హుండీల లెక్కింపు జరుగుతుందన్నారు.

Annavaram

2021-10-09 10:12:48

అన్నవరంలో మంచినీటి పథకానికి మరమ్మతులు..

అన్నవరం మేజర్ పంచాయతీలో మంచినీటి పథకానికి మరమ్మతులు చేయించి నీటిసరఫరా అంతరాయన్ని నియంత్రించినట్టు సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా చెప్పారు. శుక్రవారం ఈ మేరకు అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెదరావిచెట్టు కేంద్రం వద్ద పాడైన బోరుని, మంచినీటి పథకాన్ని తక్షణమే రిపేరు చేయించి వాడుకలోకి తీసుకొచ్చినట్టు ఆయన వివరించారు. ఈ పథకం కింద సుమారు 500పైగా ఇళ్లకు మంచినీరు సరఫరా జరుగుతుందని ఆయన తెలియజేశారు. గ్రామంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి క్రుషిచేస్తున్నట్టు సర్పంచ్ చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2021-10-08 16:37:44

అన్నవరం దేవస్థానంలో అన్నసత్రం ప్రారంభం..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణస్వామివారి దేవస్థానంలో చాలా కాలం తరువాత భక్తుల సౌకర్యార్ధం అన్నసత్రాన్ని తిరిగి ప్రారంభించారు. స్వామివారి అన్నసత్రంలో దేవస్థానం చైర్మన్ ఐవిరోహిత్ ఆధ్వర్యంలో ఈఓ వేండ్రత్రినాధరావు, సహాయ కమిషనర్ డిఎల్బీ రమేష్, ఇతర సభ్యులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, స్వామిదయతో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్నప్రసాదాన్ని భక్తులకు అందించాలనే సంకల్పంతో సత్రాన్ని తిరిగి ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు గాదె రాజశేఖర్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Annavaram

2021-10-08 14:28:55

రేపటి నుంచి సత్యదేవుని అన్నసత్రం అందుబాటులోకి..

అన్నవరం శ్రీశ్రీశ్రీ  వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా నిలుపుదల చేయబడిన  నిత్య అన్నదానం తిరిగి శుక్రవారం నుంచి భక్తుల సౌకర్యార్థం ప్రారంభిస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆయన అన్నవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు రేపటి నుంచి నిత్యాన్నదానం అందుబాటులోకి వస్తుందని, భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఈ సందర్భంగా ఈఓ ఆ ప్రకటనలో కోరారు.

Annavaram

2021-10-07 09:51:48

కాలేజీ యువత ఓటు నమోదు చేసుకోవాలి..

డిగ్రీ కాలేజీలో విద్య అభ్యసిస్తున్న 18ఏళ్లు దాటిన విద్యార్ధులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లంతా ఓటరుగా నమోదు కావాలని శంఖవరం తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం సూచించారు. గురువారం కత్తిపూడి సీతారామ డిగ్రీ కాలేజీలో ఓటు నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఓటు హక్కు వచ్చేనాటికి ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఓటు నమోదు చేసుకోవడానికి సవరణలు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక అండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీరబాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అక్కారావు, వెంకటరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

శంఖవరం

2021-10-07 07:10:39

గ్రామసచివాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

గ్రామసచివాలయాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్నిరకాల సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం సుమారు 750 రకాల సేవలను గ్రామసచివాలయాల నుంచే అందిస్తున్నదన్నారు. అన్నవరంలో 3 సచివాలయాల పరిధిలోని ప్రజలు ఆయా సచివాలయాలకు వెళ్లి సమస్యల పరిష్కారంతోపాటు, ప్రభుత్వ సేవలను సైతం వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ సేవల నుంచి కులద్రువీకరణ పత్రాల వరకూ అన్ని ఒకే చోట పొందవచ్చునని సర్పంచ్ చెప్పారు.

Annavaram

2021-10-06 05:33:24