1 ENS Live Breaking News

రేపటి నుంచి 2వ విడత వార్డు సభ్యులకు శిక్షణ..

శంఖవరం మండలంలో రెండవ విడత వార్డుసభ్యుల శిక్షణ బుధవారం నుంచి 2రోజులు పాటు జరగనుందని ఎంపీడీఓ జె.రాంబాబు  తెలియజేశారు. మంగళవారం శంఖవరంలో ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అన్నవరం, కత్తిపూడి, సీతాయంపేట,వజ్రకూటం, నెల్లిపూడి, కొంతంగి గ్రామపంచాయతీల్లో వార్డు సభ్యులకు ఈ శిక్షణ ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంమ్మార్సీ సమావేశ మందిరంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9గంటల కు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ పర్వత రాజబాబు, జెడ్పీటీసీ సభ్యులు ప్రారంభిస్తారని ఎంపీడీఓ ఆ ప్రకటనలో తెలియజేశారు. 

Sankhavaram

2021-10-05 18:01:25

విద్యార్ధినిలకు ఉచితంగా నేప్కిన్లు అందజేత..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా ప్రవేశపెట్టిన స్వేచ్చా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏజెన్సీలోని గిరిజన బాలికల ఆశ్రమ పాటశాలలు, కాలేజీలలో చదువుతున్న బాలిలకలకు ప్రతి నెల శానిటరీ నాప్కిన్స్ అందిస్తామని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.  మంగళవారం స్ధానిక సీతపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాటశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా ప్రవేశపెట్టిన స్వేచ్చా కార్యక్రమాన్ని పురస్కరించుకొని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య విద్యార్ధుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీలోని ఐ.టి.డి.ఎ. ఆద్వర్యంలో వివిధ పాటశాలల్లో చదువుతున్న ఏడోవ తరగతి పైబడిన బాలికలకు ప్రతినెల శానిటరీ నాప్కిన్స్ అందజేయడం జరుగుతుందని పి.ఒ. తెలిపారు. అదేవిదంగా  ఏజెన్సీలోని 35 గిరిజన బాలికల ఆశ్రమ పాటశాలల్లో 5500 మందికి, 5 ఎ.పి.ఆర్. బాలికల పాటశాలల్లో 2400 మంది బాలికలకు, 5 జూనియర్ కాలేజీలలో చదువుతున్న 1750 మంది బాలికలకు, అదేవిదంగా గిరిజన సంక్షేమ శాఖ 14 కాలేజీలల్లో 2500 మందికి మొత్తం 12150 మంది వివిధ పాటశాలల్లో చదువుతున్న బాలికలకు ప్రతీనెలా ఈ శానిటరీ నాప్కిన్లు అందజేయడం జరుగుతుందని పి.ఒ. తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం.సరస్వతి, ఎ.టి.డబ్ల్యు.ఒ. లు కె.సుజాత, ప్రాదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ప్రసున్న తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం

2021-10-05 14:02:43

సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

విజయనగరం జిల్లా బొండ‌ప‌ల్లి మండ‌లం అంబ‌టివ‌ల‌స గ్రామ స‌చివాల‌యాన్ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. అనంతరం స్పంద‌న విన‌తులుపై ఆరా తీశారు. గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను మాత్రమే జిల్లా కేంద్రంలోని స్పందనకు పంపాలి తప్పితే, సాధ్యమైనంత వరకూ గ్రామసచివాలయా స్పందన ద్వారానే సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. స‌చివాల‌య ప‌రిధిలో వివిధ ప‌థ‌కాల అమ‌లు ఏవిధంగా జరుగుతుందో తెలుసుకున్నారు. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Bondapalli

2021-10-05 13:04:55

నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా చిటికెల భాస్కరనాయుడు..

నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఏఎల్ పురానికి చెందిన చిటికెల భాస్కరనాయుడుని ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి ఉత్తమ సేవలు అందించిన వారికి పార్టీ ఏ స్థాయిలో గుర్తింపు ఇస్తుందో భాస్కరనాయుడుకి దక్కిన పదవిని ఉదాహరణగా ఎమ్మెల్యే వివరించారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో చాలా మందికి డైరెక్టర్లుగా కూడా నియమించినట్టు పేర్కొన్నారు. త్వరలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుల సారధ్యంలో ప్రమాణ స్వీకారాలను ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఎమ్మెల్యే తెలియజేశారు. మంచి నాయకులు, గుర్తింపు పొందిన కార్యకర్తలకు మంచి పదవులు దక్కడం పట్ల నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Narsipatnam

2021-10-05 11:07:56

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయ నిధితో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయంటే ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని నర్సపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వందల వేల మంది అభాగ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేడు సహాయం అందుతుందన్నారు. మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 20వ వార్డు సీతయ్యపాలెం గ్రామానికి చెందిన పైల అప్పలనాయడు భార్య కన్నతల్లి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ.75వేల చెక్కులను ఎమ్మెల్యే  తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు ఇన్‌చార్జ్‌ ఈశ్వరరావు,, 19 వార్డ్‌  కౌన్సిలర్‌ బైపురెడ్డి చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-05 10:52:18

వైఎస్సార్ ఆసరాపై అవగాహన పెంచుకోవాలి..

ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ ఆసరా పథకం పై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని క్రిష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు పసగడుగుల గిరిబాబు చెప్పారు. గొలుగొండ మండలంలో క్రిష్ణదేవిపేట గ్రామంలో డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలకు వైయస్సార్ ఆసరా పథకంపై  అవగాహన కార్యక్రమంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్పీ నాయకులు గిరిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే ప్రతీ పథకంపై  మహిళలకు అవగాహన ఉండాలన్నారు. తద్వారా పథకాల అమలు సులభతరం అవుతుందని అన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.  
 ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఎం.వరహాలు,ఎం.నానాజీ, అర్జునరావు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Krishnadevipeta

2021-10-05 10:39:30

అన్నవరం దేవస్థానం అధికారులపై రాజ్ భవన్ సీరియస్..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అధికారులపై రాజ్ భవన్ సీరియస్ అయ్యింది. అన్నవరం పంచాయతీ సర్పంచ్ కు ప్రోటోకాల్ పాటించని విషయంలో వివరణ కోరింది. ఈ మేరకు ఒక లేఖను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కు పంపించింది. అందులో ప్రోటోకాల్ పాటించని విషయాన్ని రాజ్ భవన్ లోని గవర్నర్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దీనితో ప్రస్తుతం ఈ లేఖ దేవాదాయశాఖలో సంచలనం స్రుష్టిస్తోంది. ఆది నుంచి అన్నవరం దేవస్థానం ఈఓ, అధికారులు ప్రోటోకాల్ పాటించే విషయంలో నిబంధనలు పాటించడం లేదనే బలమైన ఆరోపణలున్నాయి. అసలు దేవస్థానంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా కూడా జాగ్రత్తపడుతూ వస్తారనేది బహిరం రహస్యమే. ఇదే విషయాన్ని  రాజ్ భవన్ లోని గవర్నర్ కు అన్నవరం దేవస్థానం అధికారులు నిభందనల ప్రకారం ప్రోటోకాల్ పాటించలేదనే  సర్పంచ్ కుమార్ రాజా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి జిల్లా యంత్రాంగం సైతం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రాజ్ భవన్ నుంచి లేక రావడంతో దేవస్థానం అధికారులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే ఇప్పటికైనా సర్పంచ్ కి నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తారా..ఎప్పటి మాదిరిగానే దేవస్థాన అధికారుల పనివారు చక్కబెట్టుకుంటారా అనేది తేలాల్సి వుంది..

Annavaram

2021-10-05 09:07:13

అన్నవరంలో రైతుబజార్ ఏర్పాటుపై కదలిక..

అన్నవరంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే  ప్రతిపాదనలో అధికారుల స్పందన వచ్చిందని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా  చెప్పారు. సోమవారం అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవరంలో రైతుబజారు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు చేసిన అభ్యర్ధనపై వసతి చూపిస్తే రైతు బజారు ఏర్పాటు చేస్తామనే లిఖిత పూర్వక సందేశం వచ్చిందన్నారు. ఈ మేరకు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నుంచి అన్నవరంలో రైతుబజార్ ఏర్పాటుకి వసతి చూపించాలంటూ  లేక అందిన విషయాన్ని ఆయన తెలియజేశారు. అన్నవరంలో రైతుబజారు ఏర్పాటు అయితే ప్రజలతో పాటు రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని సర్పంచ్ వ్యక్తం చేశారు.

Annavaram

2021-10-04 10:19:25

అక్టోబరు 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

తిరుమల శ్రీవారికి అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు వార్షి‌క బ్రహ్మోత్సవాల‌ను పురస్కరించుకొని అక్టోబరు 5వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.  కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.  సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుంచి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంత‌రం భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 5వ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్  ఆళ్వార్ తిరుమంజ‌నం సంద‌ర్బంగా విఐపి బ్రేక్‌ దర్శనాలు ర‌ద్ధు చేశారు. అక్టోబ‌రు 4న బ్రేక్ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి పేర్కొంది. విఐపిలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Sankhavaram

2021-10-04 09:43:57

సమాజంలో మూఢ విశ్వాసాలను పారద్రోలండి..

సమాజంలో మూఢ విశ్వాసాలను పారద్రోలి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మేధావులు విజ్ఞానవంతులు ముందుకు రావాలని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన శాస్త్రీయ సమాజ నిర్మాణం గోడ పత్రికను ఉమా శంకర్ గణేష్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రజలను చైతన్య చేస్తున్న జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. టెక్నాలజీ పెరిగిన యుగంలో కూడా మూఢనమ్మకాల వలన చాలా మంది జీవితాలు బలైపోతున్నాయనే వాస్తవాలను గుర్తెరగాలన్నారు. ప్రతీ ఒక్కరూ అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని జీవితంలో ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తుల రెడ్డి, గౌరినాయుడు జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-04 09:25:47

శిక్షణతోనే ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన..

గ్రామపంచాయతీల్లోని వార్డు సభ్యులకు ప్రభుత్వం కల్పించే శిక్షణతోనే వివిధ కార్యక్రమాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుందని ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. సోమవారం శంఖవరం మండలం కేంద్రంలో ఉపసర్పంచులకు, వార్డు సభ్యులు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీపీ పర్వతరాజబాబుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చాలా కాలం తరువాత ప్రభుత్వం వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తుందన్నారు. ఈ రెండు రోజులు శిక్షణలో పలు అంశాలపై అవగాహన చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ రానున్న రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వార్డు సభ్యులు శిక్షణ పొందడం ద్వారా ప్రభుత్వపరమైన అన్ని అంశాలు అర్ధం చేసుకొని ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ జె.రాంబాబాబు, ఎంఈఓ ఎస్వీరమణ, ఈఓపీఆర్డీ తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-04 09:24:59

రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు..

శంఖవరం మండలంలో రెండు దఫాలుగా రేపటి నుంచి వార్డు సభ్యులకు  శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ జె.రాంబాబు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం శంఖవరంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 4,5 తేదీ లలో  వేలంగి, పెద్దమల్లాపురం, గౌరంపేట, జి. కొత్తపల్లి, అచ్చంపేట, ఎస్.జగ్గంపేట, శంఖవరం, మండపం  పంచాయతీలకు,  మిగిలిన పంచాయతీ లకు 6, 7 తేదీలలో శిక్షణ జరుతుందన్నారు. రేపు ఉదయం 9.30 గం. లకు ఎమ్మెల్యే, ఎంపీపీల సమక్షంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.

శంఖవరం

2021-10-03 13:12:40

రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం..

గుట్టుచప్పుడు కాకుండా బోర్ డ్రిల్లింగ్ వాహనంలో తరలిస్తున్న వెయ్యికిలోల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బోర్లు తవ్వే మిషన్ కంటేనర్ లో లోన మిషన్ తీసేసి అందులో గంజాయిని మూటలుగా కట్టి తరలిస్తుండగా సమాచారం అందుకున్న  స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్రుందం దానిని పట్టుకుందన్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.50లక్షలు వరకూ వుంటుందని ఎస్పీ తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, అక్రమార్కులు గంజాయి, గుట్కా, నాటుసారా ఏ రూపంలో తరలించడానికి ప్రయత్నించా జిల్లాలో వీలుపడదన్నారు. అన్ని చోట్లా భద్రతను, నిఘాను కట్టుదిట్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్  బ్యూరో బ్రుందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-10-03 08:17:54