1 ENS Live Breaking News

ఈనె 20 నుంచి దూరవిద్య డిగ్రీ తరగతులు..

ఆంధ్రాయూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2020-2021 విద్యాసంవత్సరానికి వారంతపు తరగతుల షెడ్యూల్ ను విడుదల చేసిందని సర్పవరంలోని రాజీవ్ గాంధీ డిగ్రీకాలేజి మరియు స్టడీ సెంటర్ నిర్వహాకులు ఎన్.సూరిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నవంబరు 20, 21,27, 28 మరియు డిసెంబరు నెలలో 4, 5, 11, 12, 18, 19 తేదీలో బీఏ, బీకాం కోర్సులు చదువుతున్న మొదటి, రెండవ, మూడవ సంవత్సరం విద్యార్ధులు కాకినాడ రూరల్ పరిధిలోని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో జరిగే తరగతులకు హాజరు కావాల్సి వుంటుందన్నారు. అభ్యర్ధులు తమ గుర్తింపు కార్డుతో వారాంతపు తరగతులకు హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా విద్యార్ధులు తమ వార్షిక ట్యూషన్ ఫీజు డిసెంబరు 15 లోపు స్టడీ సెంటర్ లోగానీ, ఆన్ లైన్ ద్వారా గానీ చెల్లించాలన్నారు. డిసెంబరు 15 దాటితే డిసెంబరు 30వ తేదీ లోపు 200 రూపాయలు అపరాద రుసుముతో  చెల్లించాల్సి వుంటుదని పేర్కొన్నారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Kakinada

2021-11-17 06:34:55

రైతులకు రూ.3.24 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందజేత..

తూర్పుగోదావరి జిల్లాలో 2021, సెప్టెంబ‌ర్‌లో సంభ‌వించిన గులాబ్ తుపాను వ‌ల్ల 2,168.07 హెక్టార్ల‌లో పంట న‌ష్ట‌పోయిన 3,100 మంది రైతుల‌కు రూ.3.24 కోట్ల ఇన్‌పుట్ స‌బ్సిడీ అందుతున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ వెల్ల‌డించారు. గులాబ్ తుపాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు పంట న‌ష్ట‌పరిహారం అందించే కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ హాజ‌రై జిల్లాలో తుపాను వ‌ల్ల న‌ష్ట‌పోయిన రైతులు, దెబ్బ‌తిన్న పంట‌లు, ఇన్‌పుట్ స‌బ్సిడీ వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. 2,150.89 హెక్టార్ల‌లో వ‌రి పంట న‌ష్ట‌పోయిన 3,078 మంది రైతులు, 2.10 హెక్టార్ల‌లో ప‌త్తిని న‌ష్ట‌పోయిన అయిదుగురు రైతులు, 15.08 హెక్టార్ల‌లో మినుము పంట‌ను న‌ష్ట‌పోయిన 17 మంది రైతుల‌కు ప‌రిహారం అందిన‌ట్లు వెల్ల‌డించారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు నీట‌మునిగిన పంట‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయిలో పంట న‌ష్టం వివ‌రాల సేక‌ర‌ణ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. అదే విధంగా జిల్లాలోని 1,018 రైతు భ‌రోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా ఖ‌రీఫ్-2021 సీజ‌న్ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకోసం ఆర్‌బీకేల ప‌రిధిలో గ‌న్నీ బ్యాగుల‌ను అందుబాటులో ఉంచ‌డం, రవాణా ఏర్పాట్లు వంటివి చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ తెలిపారు. స‌మావేశంలో జిల్లా వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీడీ (ఏ) ఎస్‌.మాధ‌వ‌రావు, జేడీ (ఫిష‌రీస్‌) శ్రీనివాస‌రావు, డీడీ (హెచ్‌) ఎస్‌.రాంమోహ‌న్‌, వివిధ ప్రాంతాల రైతులు, అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు:
- కాకినాడ‌, సామ‌ర్ల‌కోట‌, పెద‌పూడి, క‌ర‌ప‌, కాజులూరు, కోరుకొండ‌, గోక‌వ‌రం, సీతాన‌గ‌రం, యు.కొత్త‌ప‌ల్లి, వీఆర్ పురం
మండ‌లాల్లోని 72 గ్రామాల ప‌రిధిలో వ‌రి పంట న‌ష్టం వాటిల్లిన రైతులకు మంగ‌ళ‌వారం ఇన్‌పుట్ సబ్సిడీ అందింది.
- గులాబ్ తుపాను కార‌ణంగా సీతాన‌గ‌రం మండ‌లంలోని ఒక గ్రామం ప‌రిధిలో ప‌త్తికి, అదే విధంగా వీఆర్ పురం మండ‌లంలోని ఓ గ్రామం ప‌రిధిలో మిన‌ప పంట‌కు న‌ష్టం వాటిల్లింది.
- వ‌రి, ప‌త్తి పంట న‌ష్టానికి హెక్టారుకు రూ.15,000 చొప్పున ప‌రిహారం అంద‌గా, మినప పంట‌కు రూ.10,000 ప‌రిహారం అందింది. 

అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం పెద‌పూడికి చెందిన రైతు కోరా వీర్రాజు ..
గ్రామాల్లో రైతు భ‌రోసా కేంద్రాలు మాకు దేవాల‌యాల మాదిరి ఉన్నాయి. మేము అయిదెక‌రాల సొంత భూమి, మ‌రో అయిదు ఎక‌రాలను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాం. గులాబ్ తుపాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన పంట‌కు మా కుటుంబానికి రూ.90,000 వ‌ర‌కు ప‌రిహారం అందింది. పంట న‌ష్టం జ‌రిగిన 45 రోజుల్లోపే ఇన్‌పుట్ స‌బ్సిడీ అందుకోవ‌డం సంతోషం క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ఈ-క్రాప్ విధానం వ‌ల్ల రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతోంది. రైతు భ‌రోసా, సున్నావ‌డ్డీ రుణాలు, ఇన్‌పుట్ స‌బ్సిడీ వంటివి స‌కాలంలో అందేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇప్పుడు ప్ర‌భుత్వం నుంచి అందిన ఇన్‌పుట్ స‌బ్సిడీని ర‌బీ సీజ‌న్‌లో సాగుకు పెట్టుబ‌డిగా ఉప‌యోగ‌ప‌డుతుంది. రైతు భ‌రోసా కేంద్రాల్లో నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంటున్నాయి. 

Kakinada

2021-11-16 12:30:09

వీరాసనంలో శ్రీ అభయాంజనేయ స్వామి..

విశాఖ మహానగరంలోని జాతీయ రహదారిపై సూర్యనగర్లో వేంచేసిఉన్న శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి వారు కార్తీక మాసం రెండవ మంగళవారం సందర్భంగా వీరాసనంలో అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు.  ఆలయ అర్చకులు ఏ.శ్రీకాంత్,  ఏ శ్రీహర్షలు శ్రీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారిని తమలపాకులమాల వడమాల గజమాల వివిధపూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సింధూరఅర్చన శ్రీరామఅష్టోత్తరం చేశారు. ఆలయ వ్యవస్థాపకులు పెనుమత్స సుబ్బరాజు తొలి పూజలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Visakhapatnam

2021-11-16 06:29:34

ప్రతిభ చూపిన గిరిజన విధ్యార్ధులకు సత్కారం..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల్లో మంచి ప్ర‌తిభ క‌నబ‌రిచి ఉత్త‌మ ర్యాంకులు సాధించిన గిరిజ‌న విద్యార్థుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ట్రైబెల్ వెల్ఫేర్ డైరెక్ట‌ర్ రంజ‌త్ భాషా, ఐటీడీఏ పీవో కూర్మ‌నాథ్‌, జేసీ మ‌యూర్ అశోక్‌ స‌త్క‌రించారు. కురుపాం ట్రైబెల్ వెల్ఫేర్ జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దివిన వీరు తాజాగా జ‌రిగిన జేఈఈలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. జేఈఈ మెయిన్స్‌లో 4988 ర్యాంకు సాధించిన మ‌చ్చా స్వాతికి బిలాస్‌పూర్ ఎన్‌.ఐ.టి.లో కెమికల్ ఇంజ‌నీరింగ్ విభాగంలో సీటు రాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 341 ర్యాంకు సాధించిన వి. లావణ్య కేర‌ళలోని పాల‌క్క‌డ్ ఐఐటీలో మెకానిక‌ల్ విభాగంలో సీటు వ‌చ్చింది. మంగ‌ళ‌వారం వారిని పిలిపించుకొని క‌లెక్ట‌ర్ త‌న ఛాంబ‌ర్‌లో దుస్సాలువాల‌తో స‌త్క‌రించారు. పుష్ప గుచ్ఛాలు అంద‌జేసి అభినందించారు. మ‌రింత ప‌ట్టుద‌ల‌తో చ‌దివి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో ట్రైబెల్ వెల్ఫేర్ డైరెక్ట‌ర్ రంజిత్ భాషా, పార్వ‌తీపురం ఐటీడీఏ పీవో ఆర్‌. కూర్మ‌నాథ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్‌, ట్రైబెల్ వెల్ఫేర్‌ డీడీ కె. కిర‌ణ్ కుమార్‌, కురుపాంలోని ఏపీ ట్రైబెల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ జూనియ‌ర్ క‌ళాశాల కన్వీన‌ర్ ప్రిన్సిపాల్ ఎం. రాధాకృష్ణ‌, ప్రిన్సిపాల్ ఎ. స‌త్య‌వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-16 06:22:35

దేశ చ‌రిత్ర‌పై విద్యార్ధుల‌కు అవ‌గాహ‌న వుండాలి..

దేశ చ‌రిత్ర‌, మ‌న‌ సంస్కృతి త‌దిత‌ర అంశాల‌పై విద్యార్దుల్లో అవ‌గాహ‌న వుండాల‌ని స‌మాచార పౌర‌సంబంధాల శాఖ స‌హాయ సంచాల‌కులు, జిల్లా గ్రంథాల‌య సంస్థ డైర‌క్ట‌ర్‌ డి.ర‌మేష్ అన్నారు. గ్రంథాల‌య వారోత్స‌వాల్లో భాగంగా స్థానిక గుర‌జాడ కేంద్ర గ్రంథాల‌యంలో జిల్లా గ్రంథాల‌య సంస్థ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చారిత్ర‌క పుస్త‌కాల ప్ర‌ద‌ర్శ‌నను స‌మాచార శాఖ ఏ.డి. సోమవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విద్యార్ధుల‌కు త‌మ స‌బ్జెక్టుల‌కు సంబంధించిన విష‌య ప‌రిజ్ఞానంతోపాటు త‌మ దేశం, త‌మ ప్రాంత చ‌రిత్ర‌, దేశ నాయ‌కులు, చారిత్ర‌క వ్య‌క్తుల‌కు సంబంధించిన ప‌రిజ్ఞానం అవ‌స‌ర‌మ‌న్నారు. చ‌రిత్ర‌కు సంబంధించిన అన్ని పుస్త‌కాల‌ను ఒకేచోట పాఠ‌కుల‌కు అందుబాటులో వుంచి మంచి అవ‌కాశం క‌ల్పించిన జిల్లా గ్రంథాల‌య సంస్థ‌ను అభినందించారు. పుస్త‌క పఠ‌నాన్ని అల‌వాటు చేయ‌డంలో గ్రంథాల‌య వారోత్స‌వాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా గ్రంథాల‌య వారోత్స‌వాల రెండో రోజున పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశామ‌ని గ్రంథాల‌య సంస్థ కార్య‌ద‌ర్శి ఎన్‌.ల‌లిత‌, జిల్లా కేంద్ర గ్రంథాల‌య అధికారి గోపాల‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-15 15:55:12

భారీ వ‌ర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

విజ‌య‌న‌గ‌రం ఈ నెల 17,18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న ద్వారా సూచించారు.  బంగాళాఖాతంలోని అండ‌మాన్ నికోబార్ దీవుల స‌మీపంలో  అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని, ఇది నెమ్మ‌దిగా నైరుతి దిశ‌గా క‌దులుతోంద‌ని భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. ఇది వాయుగుండంగా మారి, ఈనెల 18న మ‌న రాష్ట్ర తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌న్నారు. అందువ‌ల్ల 17,18 తేదీల్లో భారీ వ‌ర్షాల‌తోపాటు, గంట‌కు 45-65 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మ‌త్స్య‌కారులు స‌ముద్రంలోకి వెళ్ల‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు మ‌త్స్యకారుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, జిల్లా మ‌త్స్య‌శాఖ‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. భారీ వ‌ర్షాల‌ను, ఈదురు గాలుల‌ను దృష్టిలో పెట్టుకొని, ఆర్‌డిఓ, స‌బ్ క‌లెక్ట‌ర్‌తోపాటు అన్ని మండ‌లాల తాశీల్దార్లు, ఎంపిడిఓలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌గిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.  ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగిన ప‌క్షంలో, త‌క్ష‌ణ‌మే క‌లెక్ట‌రేట్‌లోని కంట్రోల్ రూముకు స‌మాచారాన్ని అందించాల‌ని సూచించారు.

Vizianagaram

2021-11-15 15:50:25

మాస్కులేకుండా తిరిగిన వారిపై 166 కేసులు..

తూర్పుగోదావరి జిల్లాలో మాస్కులేకుండా తిరుగుతున్నవారిపై 166 కేసులు నమోదు చేసి 16వేల 600 రూపాయలు అపరాద రుసుము వసూలు చేసినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. దీనితో ఈ సంవత్సరం మార్చి 26  నుంచి నవంబరు 15వ తేదీ వరకూ ఒక లక్షా 69వేల 692 చాలనాలు విధించామన్నా ఎస్పీ వాటి ద్వారా ఒక కోటి 48 లక్షల 62 వేల 180 రూపాయలు అపరాద రుసుము వసూలు చేసినట్టు చెప్పారు. వాహనదారులు తప్పని సరిగా మాస్కుధరించి మాత్రమే ప్రయాణాలు చేయాలన్నారు. అలాకాకుండా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు తప్పవని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు హెచ్చరించారు.

Kakinada

2021-11-15 15:35:05

ఓ.టి.ఎస్ చెల్లింపుల వేగం పెంచాలి..కలెక్టర్

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియ ను వేగంగా జరిగే లా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి మండల  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్  ఎం పి డి ఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకా ధికారులతో ఓ.టి.ఎస్ పై టీమ్ కాన్ఫరెన్స్ ద్వారా మండల వారీగా పురోగతి పై సమీక్షించారు. అనేక మండలాల్లో సున్నా ప్రగతి ఉందని, మంగళవారంలోగా ఎక్కడా  జీరో కనపడకూడదని, వి.ఆర్ ఓ లు తమ పనితీరు చూపించేలా లక్ష్యాలను చేరాలని  అన్నారు.  మండల ప్రత్యేకాధికారులు  గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల తో వెంటనే సమావేశం  ఏర్పాటు చేసి ఓ.టి.ఎస్. పై అవగాహన కల్పించి, గ్రామాల్లో ప్రచారం జరిగేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ జరిపి ఓ.టి.ఎస్ విధి విధానాలను వివరించాలన్నారు. ఎంత  చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి  , దాని వలన లాభాలేంటి  అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు.  పట్టాలు, భూ  సమస్యలు ఉన్న చోట జె.సి రెవిన్యూ పరిష్కరిస్తారని, వారి దృష్టి లో పెట్టాలని అన్నారు. విజయనగరం అర్బన్, రూరల్ లో పురోగతి తక్కువ గా ఉందని, జె.సి రెవిన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 
సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ డేటా ఆమోదం అయితేనే చలానా  జెనరేట్ అవుతుందని,  అప్పుడే చెల్లింపులకు అవకాశం ఉంటుందని, ముందుగా క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేసి డేటా వెరిఫై చేయాలని సూచించారు. ఓ.టి.ఎస్ పై ముద్రించిన కరపత్రాలను వాలంటీర్ ల ద్వారా గ్రామాల్లో అందరికి అందేలా చూడాలని అన్నారు. ఓ.టి.ఎస్ చెల్లింపు చేసిన  వారి వివరాలను పత్రికల ద్వారా ప్రచారం జరగాలన్నారు.  గడువు లోగా లక్ష్యాలను  పూర్తి చేయడానికి ప్రత్యేకధికారులు పూర్తి గా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ టీమ్ కాన్ఫరెన్స్ లో జె.సి రెవిన్యూ డా. కిషోర్ కుమార్,  హౌసింగ్ పి.డి కూర్మినాయుడు, హౌసింగ్ సహాయ ఇంజినీర్లు , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-15 09:18:52

బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ రవీంద్రనాధ్ బాబు..

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో సోమవారం జరుగుతున్న నగరపాలక సంస్థ ఉపఎన్నికల బందోబస్తును జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు స్వయంగా పరిశీలించారు. కాకినాడలోని 3, 9, 16, 30 డివిజన్ల కార్పోరేటర్ల ఎన్నికల వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. ఏ డివిజన్ లో అయినా ఎన్నికల నియామవళిని ఎవరు ఉల్లంఘించినా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బందోబస్తు అధికారులకు సూచించారు. ప్రశాంత వాతవారణంలో ఎన్నికలు పూర్తిచేయడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన విధంగా భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొనాలని ఎస్పీ ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-15 09:17:02

ఎస్పీ ఆఫీస్ కి ఐటీసీ 2 జనరేటర్లు వితరణ..

తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఐటిసీ సంస్థ రెండు పవర్ జనరేటర్లు వితరణ చేసిందని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్ర నాధ్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఐటీసీ సంస్థ ప్రతినిధులు ఫణిభూషన్, రవికాంత్ లు వీటిని జిల్లా కార్యాలయంలో అందజేశారని చెప్పిన ఆయన వీటిని కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అందజేశారన్నారు. అత్యవసర సమయంలో ఈ పవర్ జనరేటర్లు జిల్లా కార్యాలయానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ ఈ సందర్భంగా వివరించారు. జనరేటర్లు అందించిన సంస్థ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరణం కుమార్ , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-15 08:57:13

శివనామ స్మరణతో మార్మోగిన కాకినాడ నగరం..

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ స్మార్ట్ సిటి శివనామ స్మరణతో మార్మోగిపోయింది. కార్తీకమాసం రెండవ సోమవారం అందునా ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శివలయాల్లో పూజలు నిర్వహించారు. భానుగుడి దగ్గర్లోని శివాలయంలో నందీశ్వరుడిని దర్శించుకొని శివుని అనుగ్రహం కోసం పూజలు చేపట్టారు. భోళా శంకరుడిని ప్రశన్నం చేసుకోవడానికి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. సూర్యోదయ సమయంలో సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివుడికి దీపోత్సవం నిర్వహించారు. క్షీరాభిషేకాలు చేసి హారతులు పట్టారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం రోజున శివునికి అభిషేకాలు చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని శివాలయ ప్రధాన పూజరి శ్రీనివాస శర్మ చెప్పారు. ఉదయం పూజలు చేసింది మొదలు సాయంత్రం వరకూ ఈరోజు భక్తులు ఉపవాసాలు ఉండి మళ్లీ సాయంత్రం శివునికి పూజలు చేస్తే ఉపవాస ఫలితం వుంటుందని పేర్కొన్నారు. తెల్లవారు జామున ఐదుగంటల నుంచే నగరంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. 

Kakinada

2021-11-15 07:54:13

గిరిజన యువత కోసం త్వరలోనే మెగా జాబ్ మేళా.. ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు

తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ఏఓబీ ప్రాంతంలోని గంజాయి సాగు, ఇతర వ్యవహారాల్లో చిక్కుకున్న గిరిజన యువతను సన్మార్గంలో పెట్టేందుకు త్వరలోనే మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు తెలియజేశారు. ఆదివారం కాకినాడలో తన కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. గంజాయి స్మగ్లర్లు ఇచ్చే కొద్దిపాటి డబ్బుకు ఆశపడే గిరిజన యువత ఈ అక్రమ రవాణాకు సహకరించి వారి జీవితాలను నాశం చేసుకుంటున్నారని అన్నారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలు ఆపైన ఏఓబీ ప్రాంతాల్లో వుండే గిరిజన యువత వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రయ పూర్తికాగానే త్వరలోనే జాబ్ మేళా నిర్వహించి గిరిజన యువతకు ఉపాది అవకాశాలు కల్పించనున్నట్టు ఎస్పీ వివరించారు. ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్ఐల తో మాదక ద్రవ్యాల మత్తు, వ్యాపారాలు వదిలిపెట్టే విధంగా యువతకు ప్రత్యేక కౌన్సిలింగ్ లు ఆయా స్టేషన్ ల ఎస్ఐ లద్వారా ఇప్పిస్తున్నామని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ఈ సందర్భంగా మీడియా కివివరించారు.

Kakinada

2021-11-14 17:15:28

సమాజానికి దిక్చూచి పాత్రికేయులే..

సమాజానికి దిశ నిర్దేశ చేసేది పాత్రికేయులేనని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారి కృషి ప్రశంసనీయమని విశాఖ మేయర్ గొలగాని హారి వెంకట కుమారి అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదివారం ఆంధ్రాయూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన మీడియా అవార్డుల ప్రధానోత్సవం, జర్నలిస్టుల పిల్లల ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరంతరం సమాజానికి సేవలందించే జర్నలిస్టులను ప్రతిభకు ప్రోత్సాహం పేరిట గౌరవించుకోవడం అభినందనీయమన్నారు. దీని వల్ల జర్నలిస్టుల్లో మరింత ఉత్సాహం పెరిగి బాధ్యతా యుతంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం తమ సభ్యుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్ పర్సన్ విజయ నిర్మల, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పి వి జి డి ప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తించి వారు తెలియజేయడం వల్ల అనేక సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కలుగజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇటీవలే ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించిన వీజెఎఫ్ ఆ తరువాత దీపావళి, ఇప్పుడు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట అవార్డులు ప్రధానం చేయడం, జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు. గౌరవ అతిధిగా హాజరైన మారిటైమ్ బోర్డ్ చైర్మన్, కాయల వెంకట రెడ్డి మాట్లాడుతూ,      నగరాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి వల్ల ప్రజలకు అనేక మంచి పనులు చేయగలుగుతున్నామన్నారు. జీవీఎంసీ పరంగా తాము చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు గుర్తు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడిపిస్తున్న పాత్రికేయుల సేవలను ఈ సందర్భంగా మేయర్ అభినందించారు. పోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అవార్డుల ప్రధానోత్సవం, ఉపకార వేతనాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అందరికి సమన్యాయం చేస్తున్నామన్నారు. సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్య, వైద్యంతో పాటు క్రీడలకు, పండుగల నిర్వహణ చేపడుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లక్ష్యమని త్వరలోనే నార్లభవన్ ఆధునీకరించి లిఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జి ఎస్ ఎన్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ అర్.నాగరాజుపట్నాయక్ అధ్వర్యంలో బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్, ధ్యక్షులు టి. నానాజీ, జాయింట్ సెక్రటరీ డాడి రవికుమార్, కోశాధికారి పి.ఎస్.మూర్తి, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


ఘనంగా మీడియా అవార్డుల ప్రధానోత్సవం..
కపిలగోపాలరావు అవార్డుతో పాటు వివిధ కేటగిరిల్లో విశేష ప్రతిభ కనబర్చిన 31 మంది పాత్రికేయులకు అతిధులు చేతులు మీదుగా ఘనంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అవార్డు గ్రహీతలు వారి కుటుంబ సభ్యులతో హాజరై అవార్డులను స్వీకరించారు. మీడియా అవార్డుల కమిటీ చైర్మన్ అర్. నాగరాజుపట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది.

ఉపకార  వేతనాలు పంపిణీ ..

జర్నలిస్టుల పిల్లలు విద్యలోనూ ఉన్నతంగా ఉన్నతంగా రాణించి అనేక మందికి ఆదర్శనీయంగా నిలిచారు. దీంతో ప్రతిఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి సుమారు 120 మందికి ఉపకార వేతనాలను అతిధులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఎల్.కె.జీ నుంచి బీటెక్ వరకు ఈ ఏడాది ఉపకార వేతనాలు అందజేశారు. ప్రతిభను గుర్తించాలన్నదే తమ లక్ష్యమని ఫోరం అధ్యక్షులు, స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

అలరించిన విదేశీయ సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమంలో ఈ ఏడాది విదేశీయ కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. శ్రీలంక నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అదే విధంగా మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఒడిషా కళాకారులు, స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశంసనీయంగా సాగాయి.

Andhra University

2021-11-14 13:18:04

ఉత్తరాంధ్రను వెక్కిరిస్తే చూస్తూ ఊరుకోం..

అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్రగా మిగిలిపోయిందని, ఈ యాత్ర లక్ష్యం మిగతా ప్రాంతాలవారిని వెక్కిరించటం, రెచ్చగొట్టడంలా మారిపోయిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులకు విత్తనాలు ఇన్పుట్ పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టేలు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాలమీద దండయాత్ర కాదా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంటే చంద్రబాబు మాత్రం తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నష్టం రాకూడదని ఈ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి యాత్ర కాస్త భ్రమరావతి యాత్రగా మారిపోయిందనీ, యాత్రకు న్యాయస్థానం టూ దేవస్థానం అని పేరుపెట్టారు కానీ  దౌరజన్యం టూ దౌర్జన్యం అనో.. మోసం టూ మోసం అనో పేరు పెడితే బాగుండేదని చెప్పారు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబే నని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని కృష్ణదాస్ స్పష్టం చేశారు.

Narasannapeta

2021-11-14 13:03:45

జిల్లాలో టిబి కేసులు గుర్తించాలి..

శ్రీకాకుళం జిల్లాలో టిబి కేసులను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. క్షయ నివారణ పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా సర్వే నిర్వహించి క్షయవ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించాలని స్పష్టం చేశారు. గుర్తించడం వలన అవసరమైన మందులు అందించుటకు చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. టిబి నివారణ అధికారి ఎన్.అనురాధ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి గుర్తించుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో 12 టిబి యూనిట్లు, 31 కఫ పరీక్ష కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. క్షయ వ్యాధి నివారణలో భాగస్వామ్యం అవుతున్న ఆశా కార్యకర్తలకు పారితోషికం కూడా అందించడం జరుగుతుందని అనురాధ తెలిపారు. సి బి నాట్ వాహనాల ద్వారా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. 35 వేల 752 మందికి స్క్రీన్ చేయగా 245 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అందులో ఏడు కేసులు గుర్తించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథరావు, అదనపు డిఎంహెచ్ చ్ఓ కె. రామమూర్తి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణ మోహన్, లీలా, అప్పారావు, జెమ్స్ ఆస్పత్రి ఆర్.ఎం. ఓ పి. తిరుపతిరావు, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎమ్. ప్రసాదరావు, క్షయ వ్యాధి నివారణ కమిటీ గౌరవ కార్యదర్శి మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-12 14:27:10