ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిల సంరక్షణార్ధం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశ యాప్ తూర్పుగోదావరి జిల్లా నలు చెరగులా దావానంలా వ్యాప్తి చెందుతూ మహిళల ‘దశ’ను మరుస్తోంది. జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సారధ్యంలో నోడల్ ఆఫీసర్, డిఎస్పీ మురళీ మోహన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులతో దిశ యాప్ ను జిల్లా అంతటా అత్యంత వేగంటా విస్తరింప చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 95లక్షల మంది ఈ దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలా పరిధిలో 10 లక్షల 62 వేల 494 మందికి పైగా దిశ యాప్ ని ఇనిస్టాల్ చేయించారు. దిశయాప్ ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అన్ని జిల్లాల దిశ నోడల్ ఆఫీసర్లు కూడా ఈ దిశ యాప్ వినియోగం, ఇనిస్టాలేషన్స్ పై ప్రత్యేకంగా మండల, డివజనల్ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి మరీ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దిశ ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో కూడా ఉంచారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించే కార్యక్రమాన్ని గ్రామసచివాలయ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీసులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మురళీ మోహన్ మాట్లాడుతూ, దిశ యాప్ ఒక్క మహిళలకే కాకుండా పురుషులు కూడా ఉపయోగించుకొని, ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చదువు రాని వారు కూడా మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందనే విషయాన్ని అన్ని వర్గాలతోపాటు గిరిజ గ్రామాల్లోని గిరిజనులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందుతుందనే భరోసా కల్పించడానికి వీలుపడుతందన్నారు. గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుండటం కూడా దిశయాప్ ప్రజల్లోకి త్వరగా వెళ్లడానికా ఆస్కారం ఏర్పడింది.
దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నది. ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే విదంగా అవగాహన కలిగించేలా ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తీసుకునేలా జిల్లా అధికారులు సైతం క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల దిశయాప్ ను పురుషులు సైతం తమ మొబైల్స్ లో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో ఉన్నవారికి సహాయం అందిచడానికి వీలుపడుతుందే జిల్లా పోలీసు సందేశాన్ని ప్రతీఒక్కరూ స్వీకరిస్తున్నారు. ఈ విషయంలో మీడియా ప్రత్యేక పాత్ర పోషించడం, దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి వెంటేనే తీసుకెళ్లడంలో తమవంతు బాధ్యతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, పత్రిక, ఆన్ లైన్ మీడియా కంటే, మొబైల్ న్యూస్ యాప్స్ ద్వారా సత్వరమే ప్రజలకు సమాచారం తెలుస్తున్నది. రాష్ట్రప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో చట్టంగా మారిస్తే మరిన్ని ఫలితాలు రావడానికి, ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్ని వేళల్లో ఉపయోగపడి.. ఒక రక్షణ కవచంలా మారివుంది. రానున్న రోజుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్ లోనూ దిశయాప్ ఒక అత్యవసర వనరుగా ఉపయోగపడి రాష్ట్రప్రభుత్వ ఆశయం, మహిళలకు 24 గంటలూ రక్షణ కల్పించేలా మరింత అభివ్రుద్ధి చెందాలని ఆశిద్దాం..!