1 ENS Live Breaking News

కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలి..

దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, అయితే వాటిని తక్షణమే తిరిగి పునరుద్దరించాలని కోరుతున్నామని ఏపీ వర్కింగ్‌ .జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు డిమాండ్‌ చేశారు. సోమవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలను వీరు వెల్లడించారు. కేంద్రం రద్దు చేసిన నాలుగు కార్మిక చట్టాల పునరుద్దరణ కోసం జాతీయ స్ధాయిలో అనేక ప్రాంతాల ప్రెస్‌క్లబ్‌లతో కలసి కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదిక రాగానే ఆయా చట్టాలకు సంబంధించి స్ఫష్టత రాకపోతే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం న్యాయ పోరాటం చేసే అంశాన్ని తమ యూనియన్‌లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నందున దాని కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సానుకూలంగా  ప్రకటన వెలువడుతుందని తాము భావిస్తున్నామన్నారు. అక్రిడేషన్లుకు సంబంధించి దశల వారీగా జారీ చేస్తున్నారని, చిన్న పత్రికలకు, కేబుల్‌టీవీలకు సైతం అక్రిడేషన్లు జారీ అవుతున్నాయని,ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో, రాష్ట్రంలో మీడియా కమిషన్‌లు ఏర్పాటు చేస్తే జర్నలిస్టులకు సంబంధించిన విధివిధానాల ప్రకారం అందరూ ఒకే రీతిన పనిచేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. దీంతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్‌ మీడియాకు సంబంధించి కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేర మార్గదర్శకాలు జారీ చేయాలని వీరు కోరారు. కేంద్రం విధివిధానాల బట్టి రాష్ట్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్‌,బ్రాడ్‌కాస్ట్‌ యూనియన్లును మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ రెండు యూనియన్లుకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా గుర్తింపు లభించిందని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి తమ పరిధి మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఆయా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ అర్భన్‌ యూనిట్‌ అధ్యక్షుడు పి. నారాయణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు జాతీయ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23న రాష్ట్రస్ధాయి సమావేశం జరగనుందని, అందులో పలు అంశాలను చర్చించేందుకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ జాతీయ సభ్యుడు జి.శ్రీనివాసరావు, అర్భన్‌ యూనిట్‌ కార్యదర్శి అనురాధ, బ్రాడ్‌కాస్ట్‌ సంఘం ప్రతినిధులు రామకృష్ణ, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-12-20 12:21:49

ఈవీఎంల భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు-జిల్లా క‌లెక్ట‌ర్

తూర్పుగోదావరి జిల్లాలో ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హరికిరణ్ ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ హరికిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వివ‌రించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్ రత్నబాబు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, కొల్లాబత్తుల అప్పారావు (టీడీపీ), రావూరి వెంకటేశ్వరరావు (వైసీపీ), చెక్క రమేష్ బాబు (భాజపా), సుబ్బారపు అప్పారావు (బీఎస్పీ), కె.పోతురాజు (కాంగ్రెస్), కాకినాడ పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, క‌లెక్ట‌రేట్, పట్టణ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు ఎం.జ‌గ‌న్నాథం, జె.రమేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-18 07:52:32

నాన్న రోజూ గుడ్డు బువ్వ తింటున్నావా..

విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఒక్కసారిగా తల్లిగా మారిపోరియారు.. చిన్నపిల్లలను ఆలించి, లాలించి కబుర్లు చెప్పారు..ఏ నాన్న రోజూ గుడ్డు బువ్వ తింటున్నావా..బాగా ఆటలు ఆడుకుంటున్నావా వారితో మమేకం అయిపోయి సరదాగా గడిపారు. వచ్చింది జిల్లాకి కలెక్టర్ అని తెలియని ఆ చిన్నారులు ముద్దు మాటలతో కలెక్టర్ కి సమాధానాలు చెప్పారు..ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని కొత్తవలస  మండలం  వియ్యంపేట, తుమ్మకపల్లి అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం  కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో చోటు చేసుకుంది. కలెక్టర్ అంగన్వాడీల తనిఖీల సందర్భంగా శుక్రవారం ఆకస్మిక పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా గ్రామాల్లోని అంగన్వాడీలను పరిశీలించి అక్కడి ఆయాలతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన  పౌష్టికాహారాన్ని  అందించడం తో పాటు బరువు, ఎత్తులు కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.   చేశారు. పిల్లల హాజరు పట్టిక పరిశీలించారు. వియ్యంపేట లో 10 మంది పిల్లలకు గాను 9 మంది హాజరయ్యారు.   పిల్లలతో పాటలు , రైమ్స్ పాడించారు. వారి పేర్లను. అడిగి వారితో సరదాగా ముచ్చటించారు. వారి వయసు, ఎత్తు, బరువు నమోదుల రిజిస్టర్ తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేసారు. అక్కడే ఉన్న ప్రాధమిక పాఠశాలను తనిఖీ చేసి, తరగతి గదిలో  పిల్లలతో     మాట్లాడించారు.  అనంతరం తుమ్మకపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువు ను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించి , బరువును తూచి  చూసారు. బాలుని బరువు  రిజిస్టర్ లో నమోదు చేసిన దానికి,   తేడా  ఉండడం తో సంబంధిత అంగన్వాడీ కార్యకర్త పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో సుమారు 10 కేజీ ల బరువు పెరుగుతాడా అంటూ నిలదీశారు. అంత తేడా వచ్చిందంటే సరిగ్గా  చూడడం లేదని , ఛార్జ్ మెమో జారీ చేయాలని  అక్కడే ఉన్న పి.డి రాజేశ్వరి కి ఆదేశించారు.  26 మంది నమోదు కాగా 13 మంది పిల్లలు మాత్రమే హాజరు కావడం పట్ల కారణాలను అడిగారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రావాలంటే సిబ్బంది బాధ్యతగా పని చేయాలని సూచించారు. అక్కడే ఉన్న  ఫోర్టిఫైడ్ బియ్యం బస్తా ను చూస్తూ ఈ బియ్యం పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఈ బియ్యం లో నున్న పెద్ద గింజల్లో  మినరల్స్, బి కాంప్లెక్స్ కలిసి ఉంటాయని, అన్నం ఉడికించేట ప్పుడు పిండి పదార్ధాలు ఉండడం వలన కొంచం మెత్త బడుతుందని, అదే బలవర్ధకమని కలెక్టర్ వివరించారు.  దీని పై మీకు పూర్తి గా అవగాహన ఉంటే ప్రజలకు చెప్పగలరని, ముందుగా మీరంతా తెలుసుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. ఎన్. గోపమ్మ, సీడీపీఓ , సూపర్వైసర్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-12-17 16:48:01

మెగా జాబ్ మేళాతో గిరి యువతలో ‘పరివర్తన’..

తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మన్యంలోని గిరిజన యువతకు పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించే వినూత్న కార్యక్రమం చేపట్టారు.దానికోసం జిల్లాలోని చింతూరులో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు. ముఖ్యంగా గంజాయి, నాటు సారా రవాణతో యువత పెడత్రోవపట్టకుండా గిరియువతకు ఉపాది, ఉద్యోగాలు  చూపడం ద్వారా వారిలో పరివర్తన పెంచాలనే ఎస్పీ ఆకాంక్షించారు. అందులోభాగంగానే పలు ప్రైవేలు కంపెనీల ప్రతినిధులతోనూ, ఐటీడీఏల పీఓలతోనూ ప్రత్యేకంగా చర్చించి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం చింతూరు జిల్లా పరిషత్ హైస్కూలు వేదికగా శుక్రవారం జరగనుంది. గిరియువత భవిష్యత్తు కొండలకు, ముక్కూ మహం తెలియని అక్రమ వ్యాపారులు వారిచ్చే కొద్దో గొప్పో డబ్బులకు లోనుకాకుండా వారిలో పరివర్తన తీసుకువచ్చి మార్పుచేసేందుకు జిల్లాపోలీస్ శాఖ ఈ జాబ్ మేళాతో ఒక అడ్డుకట్టన వేయనుంది.రేపు జరిగే ఈ మెగా జాబ్ మేళాలో వందలాది మంది యువతకు ఉపాది, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Kakinada

2021-12-16 12:55:23

గృహ‌నిర్మాణాలు వేగవంతం చేయండి..కలెక్టర్

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో  గృహ‌నిర్మాణ ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం  బిల్లుల‌ను విడుద‌ల చేసింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో సుమారు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు ల‌బ్దిదారుల ఖాతాల్లో  రూ.50కోట్లు వ‌ర‌కు జ‌మ అయ్యింద‌ని తెలిపారు. మిగిలిన బిల్లులు కూడా రెండుమూడు రోజుల్లో ద‌శ‌ల‌వారీగా జ‌మ అవుతాయ‌ని తెలిపారు. జ‌గ‌న‌న్న కాల‌నీల ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక‌ను, త‌క్కువ ధ‌ర‌కు సిమ్మెంటు, స్టీలును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు సుమారు రూ.96ల‌క్ష‌ల విలువైన సిమెంటు, స్టీలును అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు. సిమ్మెంటు బ‌స్తా రూ.242 చొప్పున, ప్ర‌తీ ఇంటికి 90 బ‌స్తాల‌ను, ట‌న్ను ధ‌ర రూ.56,000 చొప్పున ఇంటికి 470 కిలోల ఐర‌న్ రాడ్లు (8 మి.మీ, 10 మి.మీ, 12 మి.మీ) స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌తీ ఇంటికి 20 మెట్రిక్ ట‌న్నుల ఇసుక‌ను ఉచితంగా అందిస్తున్నామ‌న్నారు. ల‌బ్దిదారులు పెద‌తాడివాడ‌, కొత్త‌వ‌ల‌స‌, బొబ్బిలి స్టాక్ పాయింట్ల‌నుంచి ఇసుక‌ను తీసుకొనే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని, త్వ‌ర‌గా త‌మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

Vizianagaram

2021-12-16 07:07:44

ఓటిఎస్ క్రింద రూ.10 కోట్లు వసూలు.. జిల్లా కలెక్టర్

జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  9,600 మంది వినియోగించుకున్నార‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి తెలిపారు. ఈ ప‌థ‌కం క్రింద సుమారు రూ.10కోట్లు వ‌సూల‌య్యింద‌ని అన్నారు. వీరంద‌రికి రెండు రోజుల్లో రిజిష్ట్రేష‌న్లు పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కంపై టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ప్ర‌తీ ల‌బ్దిదారుడికి రిజిష్ట్రేష‌న్ చేసేందుకు మూడు సెట్ల రిజిష్ట్రేష‌న్ ప‌త్రాలు వ‌స్తాయ‌ని, ఇలా ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాకు 2,800 సెట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు. జిల్లాలో ఇంత‌వ‌ర‌కు 130 రిజిష్ట్రేష‌న్లు జ‌రిగాయ‌ని, మిగిలిన‌వారికి కూడా రెండు రోజుల్లో రిజిష్ట్రేష‌న్ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మూడు సెట్ల‌లో ఒక‌టి ల‌బ్దిదారునికి ఇస్తార‌ని, ఒక‌టి స‌చివాల‌యంలో, మ‌రొక‌టి స‌బ్ రిజిష్ట్రార్ వ‌ద్దా ఉంటుంద‌ని తెలిపారు. తాశీల్దార్ విక్ర‌య‌దారునిగా, ల‌బ్దిదారుడు కొనుగోలుదారుడిగా ఈ రిజిష్ట్రేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.


2000-2004 సంవ‌త్స‌రాల మ‌ధ్య అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఒన్‌టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కాన్ని వినియోగించుకున్న‌వారికి, ప్ర‌స్తుతం కేవ‌లం రూ.10కే రిజిష్ట్రేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. అప్ప‌ట్లో డ‌బ్బు చెల్లించిన‌వారికి, నో డ్యూస్ స‌ర్టిఫికేట్‌ను మాత్ర‌మే అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు.  అటువంటి వారికి కూడా ఇప్పుడు రిజిష్ట్రేష‌న్ల‌ను జ‌ర‌పాల‌ని ఆదేశించారు. దీనికోసం ల‌బ్దిదారులు త‌మ పాసుపుస్త‌కం లేదా నో డ్యూస్ స‌ర్టిఫికేట్ల‌ను తీసుకురావాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్) మ‌యూర్ అశోక్‌, హౌసింగ్ పిడి కూర్మినాయుడు, జిల్లా రిజిష్ట్రార్‌, తాశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-12-16 07:04:44

కాకినాడ జిజిహెచ్ కు ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ యూనిట్..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలోని కాకినాడ జిజిహెచ్ కు అధునాతన ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ యూనిట్ రాబోతుంది. ఈ మేరకు సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆరోగ్యశాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒకప్పుడు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ యూనిట్లు కాకినాడ జిజిహెచ్ కు మంజూరు కావడంతో నిరుపేద రోగులకు కార్పోరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందే అవకాశాలున్నాయి. ఎంఆర్ఐ యూనిట్ కాకినాడకు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

Kakinada

2021-12-13 17:16:47

"సంపూర్ణ గృహ హక్కు" రిజిస్ట్రేషన్లు వేగం పెంచాలి..

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు కల్పించే రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  డా. ఏ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని అన్ని మండలాల, తాహసిల్దార్ లు, ఎంపీడీవోలు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ లతో ఈ విషయమై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంపూర్ణ గృహ హక్కు పట్టాలను కలిగి ఉన్నట్లయితే చేకూరే లాభాలను లబ్ధిదారులకు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన   అవకాశం వినియోగించుకో 
వాలన్నారు.  రిజిస్ట్రేషన్ చేసే  విధివిధానాలను గూర్చి జిల్లా రిజిస్ట్రార్ అధికారులకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొనగా కలెక్టర్ కార్యాలయం నుండి జెసి  ఎం.వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ జెసి కల్పనా కుమారి, గృహ నిర్మాణ శాఖ పి డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రంగయ్య, జడ్పీ సీఈఓ నాగార్జునసాగర్, వివిధ మండలాల గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-13 11:51:24

సైనిక కుటుంబాల సంక్షేమానికి విరాళాలు అందించండి..

దేశ రక్షణలో అమరులైన, క్షతగాత్రులైన సైనిక మరియు మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాలని పౌరులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ విజ్ఞప్తి చేసారు. సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా మంగళవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ తమ తొలి విరాళాన్ని అందించి సాయుధ దళాల పతాక దినోత్స వేడుకలను లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కొరకు అహర్నిషలు శ్రమించి ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. దానికొరకు పతాక నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా ప్రజలను, పారిశ్రామిక, వ్యాపారవేత్తలను కోరారు. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లుగా సైనిక కుటుంబాల సంక్షేమానికి విరాళాలు అందలేదని, ఈ ఏడాదిలో అందరూ విరివిగా విరాళాలు అందించి సైనిక కుటుంబాల సంక్షేమానికి కృషిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పతాక నిధికి విరాళాలు అందించేవారు డైరెక్టరు, సైనిక సంక్షేమ శాఖ, విజయవాడ వారి అకౌంట్ నెం.33881128795కు నేరుగా జమ చేయాలని లేదా జిల్లా సైనిక సంక్షేమాధికారి, శ్రీకాకుళం పేరున చెక్కు డ్రాఫ్టును తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, పెద్ద రెల్లి వీధి, శ్రీకాకుళం వారికి పంపవలసినదిగా కోరారు.  పతాక నిధికి మీరు అందిచే విరాళాలకు  ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుందని తెలిపారు. అనంతరం స్థానిక పెద్ద రెల్లి వీధిలోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయములో పతాక దినోత్సవ వేడుకలను జిల్లా సైనిక సంక్షేమాధికారి జి. సత్యానందం ప్రారంబించారు. ఈ కార్యక్రమములో మాజీ సైనిక సంఘం సభ్యులు, గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, సుబేధర్ సూర్యనారాయణ, హవల్దార్ రవికుమార్ మరియు యన్.సి.సి. ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆదినాయణ మరియు జిల్లా సైనిక సంక్షేమ కార్యలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-12-07 07:43:45

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి కి గంట్ల పూజలు..

ఆధ్యాత్మిక భక్తిభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సింహాచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం  శ్రీనుబాబు మార్గశిరమాస ఏర్పాట్లును పరిశీలించి ఆలయ సిబ్బందిని ప్రసంశించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్న నేపథ్యంలో ఆలయ వర్గాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. తొలి గురువారం సందర్భంగా పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు సేవలందించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Visakhapatnam

2021-12-06 17:00:19

వైభవంగా అయ్యప్పస్వామి అంబలం పూజ..

కార్తీక మాసం మొదలుకొని 45 రోజులపాటు అయ్యప్పలు ఎన్నో నియమాలతో స్వామీ దీక్ష పూర్తిచేస్తారని ఆ సమయంలో ఒక్కసారైనా అయ్యప్పలు అంబలం పూజనిర్వహించుకొని స్వామి కటాక్షాలు పొందుతారని సింహాచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం అన్నారు. ఎంతో దీక్షతో ఎన్నో నియమాలతో విశాఖలోని కంచరపాలెం ధర్మానగర్‌ ప్రాంతంలో మళ్ల కిరణ్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలం పూజలో గంట్ల శ్రీనుబాబు పాల్గొని అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల ధారణలో అయ్యప్పమాలకు విశేష గౌరవం వున్నదన్నారు. అలాంటి స్వాముల సమూహంలో జరుగుతున్న అంబలం పూజలో పాల్గొనడం ఆ అయ్యప్ప కరుణగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అప్పలనాయుడు, సత్తిబాబు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-06 16:58:41

డా.బీ.ఆర్.అంబేద్కర్‌కు గంట్ల ఘన నివాళి..

భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సేవలను జాతి ఎప్పుడూ మరిచి పోదని,  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం డా.బీఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా డాబాగార్డెన్స్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లిర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, అంబేత్కర్ రచించిన భారత రాజ్యంగం  బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకం అయ్యిందన్నారు. భారత దేశానికి అంబేద్కర్‌ అందించిన సేవలు మరపు రానివని అన్నారు. అంభేత్కర్ ఆశయాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని గంట్లశ్రీనుబాబు సూచించారు.

Visakhapatnam

2021-12-06 16:57:21

11 మందికి కారుణ్య నియామకాల్లో పోస్టింగ్లు..

విశాఖజిల్లాలో వివిధ శాఖలలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలక్టర్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు.  సోమవారం కలెక్టరు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నియామక ఉత్తర్వులను సంబంధిత అభ్యర్ధులకు అందజేశారు.  వీరిలో 5గురికి గ్రామ రెవెన్యూ అధికారులు (వి.ఆర్.ఓ)లుగా మరో 6 గురికి వివిధ శాఖలకు కేటాయించారు. కలెక్టరు కార్యాలయం, సమాచార శాఖ డి.డి. కార్యాలయం,  నర్సీపట్నం ఆర్.డి.వో. కార్యాలయం,  పబ్లిక్ హెల్త్, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు ఒక్కొక్కరిని ఆఫీస్ సబార్డినేట్ లను కేటాయించారు.                   

Visakhapatnam

2021-12-06 12:41:47

సేంద్రియ రైతులకు జీవీఎంసీ నుంచి అన్ని విధాల సహకారం..

విశాఖ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు మహా విశాఖ నగర పాలక సంస్థ నుంచి ఏ రకమైన సహాయం చేయాలో ఆలోచించి కార్యాచరణతో ముందుకు వస్తానని నగర పాలక సంస్థ  కమిషనర్ లక్ష్మీ షా హామీ ఇచ్చారు. ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న స్థానిక రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి  వారి మార్కెటింగ్ మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆర్గానిక్ మేళా ను సందర్శించిన ఆయన అరగంట సేపు అన్ని  షాపులను సందర్శించి  ఏ ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు. 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కండువా కప్పి ఆయనకు స్వాగతం పలికారు. మేళాలో ఉత్తమ స్టాల్ గా ఎంపికైన సెంట్రల్ జైలు దుకాణం  సిబ్బందికి ఆయన జ్ఞాపికను అందజేశారు. ఇంత పెద్ద ఎత్తున వైవిధ్యభరితమైన ఉత్పత్తులతో సేంద్రీయ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మేళా కమిటీ  కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి , జే వీ రత్నం, కన్వీనర్ జలగం కుమారస్వామి, జి ఎస్ ఎన్  రాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-05 15:45:46

సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వండి..

సాయుధ‌ దళాల పతాక నిధికి ప్ర‌జ‌లంతా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీన సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా,  మన జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు క‌లెక్ట‌ర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాలను దేశం ఎన్న‌డూ విస్మ‌రించ‌జాల‌ద‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.  పాకిస్తాన్, చైనా  యుద్ద సమయాలలోను, కార్గిల్ పోరాటంలో, ముంబాయి తాజ్ హోటల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను మన సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు, జాతి యావత్తు గర్విస్తోంద‌ని తెలిపారు. ఎంతో మంది సైనిక సహోదరులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించార‌ని, వారికి మనమందరం ఎంతగానో ఋణపడి ఉన్నామని పేర్కొన్నారు. ఆ సాహసోపేత వీర జవాన్ల‌కు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు, సాయుద దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
         ఈ ప‌ర్వ‌దినం సందర్భంగా పతాక నిధికి విరివిగా విరాళాలను అందించాల‌ని, జిల్లాలోని పౌరులకు, వ్యాపారస్తుల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కు విజ్జప్తి చేశారు. విరాళాలను జిల్లా సైనిక సంక్షేమ అధికారి, విజయనగరం వారి పేరుమీద‌, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబరు 52065221666, IFSC CODE; SBIN0020931, MICR NO.535002017 నందు గాని డైరెక్టర్, సైనిక వెల్ఫేర్, విజయవాడ పేరున చెక్కు / డ్రాఫ్ట్ తీసి జిల్లా సైనిక సంక్షేమ  కార్యాలయం, విజయనగరం వారికి పంపించాల‌ని సూచించారు.  సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా ఈనెల 7వ తేదీన‌, యన్‌.సి.సి. విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వచ్చి విరాళాలు సేకరిస్తార‌ని, వారికి  విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమానికి త‌మవంతుగా స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరారు.  పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్నురాయితీ లభిస్తుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Vizianagaram

2021-12-05 13:46:37