1 ENS Live Breaking News

గౌతు లచ్చన్న పై తపాలా కవర్ విడుదల..

స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న పై తపాలా కవర్ విడుదల చేశారు. శ్రీకాకుళంలో బాపూజీ కలామందిర్ లో తపాలా శాఖ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సయుక్తంగా తపాలా కవర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్  తపాలా కవర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ లచ్చన్న మహోన్నత వ్యక్తి అన్నారు. కొన్ని పరిస్థితుల రీత్యా కొంత మందికి అనుకున్న పేరు ప్రఖ్యాతులు రాకపోవచ్చు అన్నారు. లచ్చన్న గురుతుల్యులు, త్యాగ శీలి అన్నారు. రంగాను శ్రీకాకుళం జిల్లా నుండి పోటీ చేయించుట తన పదవిని త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉందని ఆయన వివరించారు. పోస్టల్ స్టాంప్ విడుదల వలన దేశ విదేశాల్లో గౌరవం లభిస్తుందని తద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పేర్కొన్నారు. లచ్చన్న పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నారని, లచ్చన్నకు సర్దార్ బిరుదు రావడం జిల్లాకు గౌరవం దక్కిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లచ్చన్న అన్నారు. ప్రజా జీవితంలో కుంచితత్వంతో ఉండరాదని సూచించారు. లచ్చన్న చిన్న రాజకీయ నాయకులు కాదని కృష్ణ దాస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లచ్చన్న విగ్రహాలు ఎక్కువగా ఉండడం ఆయన సేవల విలువ తెలుస్తోందని చెప్పారు. లచ్చన్న పోరాట యోధుడు, ఆదర్శవంతమైన నాయకుడు అన్నారు.

పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు లచ్చన్నను ఆదర్శంగా తీసుకున్నారు. మన చరిత్ర, సంస్కృతిని, సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం అజాది కా అమృత్ మహోత్సవం పెట్టడం జరిగిందన్నారు. యువత అవగాహనకు ఇది దోహదం చేస్తుందన్నారు. లచ్చన్న విలువలు అపారమని, యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన యోధుడు అని పేర్కొన్నారు. చరిత్రను గుర్తిస్తే అది మనలను రక్షిస్తుందని ఆయన చెప్పారు. రైతుల కోసం మహాపోరాటం చేశారని ఆయన తెలిపారు. శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ చరిత్రలో కనుమరుగైన నాయకులను వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. బడుగు వర్గాలు, అక్షరాస్యత తదితర అంశాలపై పోరాడి వ్యక్తి లచ్చన్న అన్నారు. పోస్ట్ మాస్టర్ జనరల్ డా.ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అజాది కా అమృత్ మహోత్సవం, స్టాంపుల సేకరణలో భాగంగా తపాలా కవర్ విడుదల చేస్తున్నామన్నారు. స్వాతంత్ర యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయుటకు ఎంతో ఉయోగపడుతుందని చెప్పారు. రవి అస్తమించని బ్రిటీష్ దేశాన్ని స్వాతంత్ర సమర యోధులు గడ గడలాడించారని ఆయన పేర్కొన్నారు. బడుగు వర్గాల కోసం గౌతు లచ్చన్న ఎంతో పాటుపడ్డారని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలకు, వారసత్వానికి నిలయమని ఆయన వివరించారు. శ్రీముఖలింగం, శ్రీకూర్మం, తెలినీలాపురం వంటి చారిత్రక ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

పోస్టల్ సూపరింటెండెంట్ కె.కాంతారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని తపాలా కవర్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. లచ్చన్న కార్యదక్షతకు వచ్చిన బిరుదు సర్దార్ అని చెప్పారు. పోస్టల్ స్టాంప్ దేశ విదేశాలకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, శాసన సభ్యులు కింజరాపు అచ్చన్నాయుడు, డా.బెందాళం అశోక్, మాజీ శాసన సభాపతి కే.ప్రతిభా భారతి, గౌతు లచ్చన్న కుమారులు గౌతు శ్యామ సుందర శివాజీ, మాజీ శాసన సభ్యులు కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీ దేవి, కూన రవి కుమార్, గ్రంధాలయ మాజీ అధ్యక్షులు పిరికట్ల విఠల్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు చౌదరి బాబ్జీ, పి.శివ నాగేశ్వర రావు, గౌతు లచ్చన్న కుటుంబ సభ్యులు, పోస్టల్ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-13 09:20:25

తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు..

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద గ‌ల ఫిల్ట‌ర్ హౌస్‌ను ప‌రిశీలించారు. తిరుమ‌ల‌లోని వివిధ డ్యాంల నుండి వ‌చ్చే నీటిని ఏవిధంగా శుద్ధి చేస్తున్నారు, పంపింగ్ సిస్ట‌మ్ గురించి అధికారులు ఈవోకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తి గంట‌కోసారి శుద్ధి చేసిన నీటిని ప్రయోగశాలలో ప‌రీక్షించి స‌ర‌ఫ‌రా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఫిల్ట‌ర్ హౌస్ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, నిరుప‌యోగంగా ఉన్న ఇంజినీరింగ్ ప‌రిక‌రాల‌ను తొల‌గించి ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌న్నారు. అనంత‌రం ఎఎన్‌సి, బాలాజి బ‌స్టాండ్‌, ఎస్ఎమ్‌సి ప్రాంతాల్లోని రోడ్లు, కాటేజిల వ‌ద్ద పారిశుద్ధ్య ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఎస్ఎమ్ సి, లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న స‌బ్ వేల‌ను, ముల్ల‌గుంట, శంఖుమిట్ట విశ్రాంతి భ‌వ‌న‌ము వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.  అదేవిధంగా భ‌క్తుల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేలా, ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా రోడ్ల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. ముల్ల‌గుంట కారు పార్కింగ్ ప్రాంత‌లో ఉన్న బ్యారికేడ్లు, కాంక్రీట్ వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శంఖుమిట్ట, శేషాద్రి న‌గ‌ర్, ఎఎమ్‌సి ప్రాంతాల్లో భ‌క్తులు న‌డ‌వ‌డానికి వీలుగా కాళీగా ఉన్న ప్రాంతాల్లో టైల్స్ ఏర్పాటు చేయాల‌న్నారు. శంఖుమిట్ట నామాల పార్కు క్రింద ఉన్న ఖాళీ ప్రాంతంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించి మ‌రింత అహ్లాద‌క‌రంగా తీర్చిదిద్ధాల‌ని డిఎప్‌వో  శ్రీ‌నివాసులు రెడ్డిని ఆదేశించారు. తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల్లో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు, అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ల‌ను ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో  గోపినాధ్ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో  బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు  భాస్క‌ర్‌,  లోక‌నాధం, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీ‌దేవి, ఇఇ  శ్రీ‌హ‌ర్ష‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-13 06:39:14

అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ హెల్త్ స్కీమ్ లో నమోదుకావాలి..

విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ పొందిన విలేఖరులు అందరూ హెల్త్ స్కీమ్ లో చేరాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున పిలుపునిచ్చారు.  మంగళవారం తన ఛాంబర్లో జరిగిన జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్రిడేషన్ పొందిన ప్రతి ఒక్క జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించి కార్డు పొందవలసిందిగా వారికి అవగాహన కలిగించాలని సమాచార శాఖ డిడి వి. మణి రామ్ ను  ఆదేశించారు. సమావేశంలో మరో 223 మంది పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.  వీరిలో వివిధ దిన పత్రికల కు చెందిన 135 మంది ఎలక్ట్రానిక్ మీడియా 52 మంది వెటరన్ జర్నలిస్టులు 15 మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు 12 మందికి అక్రిడేషన్ లో మంజూరు చేయగా, జీఎస్టీ లేని దిన పత్రికలు వార మాస పత్రికలు వారికి తొమ్మిది తాత్కాలిక అక్రిడేషన్ లు మంజూరు చేయడం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో సమాచార శాఖ ఉపసంచాలకులు వి మణిరామ్, ఏసిటిఓ శ్వేత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎల్లాజీ రావు గృహ నిర్మాణ శాఖ ఏఈ జోగారావు డివిజినల్ పిఆర్ఓ సాయిబాబా ఏపీఆర్వో రాములు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-12 16:10:07

భారతీయ యోగాను విశ్వవ్యాప్తం చేయాలి..

భారతీయ యోగ విద్యను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం ఏయూ పాలక మండి సమావేశ మందిరంలో ఏయూతో అష్టాంగ న్యూరో థెరఫి, ఆయుర్వేద అండ్‌ యోగా(ఏఎన్‌ఏవై) సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఏఎన్‌ఏవై నిర్వాహకులు చలసాని జుగేష్‌ చంద్ర గురునాథ్‌లు సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఏయూ సౌజన్యంతో ఏఎన్‌ఏవై సంస్థ ఆరు నెలల కాల వ్యవధితో డిప్లమో ఇన్‌ యోగా, యోగా సర్టిఫీకేట్‌ కోర్సులను నిర్వహించనున్నారు. ఒక్కో కోర్సులో 80 మందికి ప్రవేశం కల్పించనున్నారు. కోర్సుల నిర్వహణకు అవసరమైన సిలబస్‌, కోర్సు నిర్వహణను ఏయూ పర్యవేక్షిస్తుంది. యోగా విద్య, శిక్షణ, పరిశోధన రంగాలలో ఏయూతో ఏఎన్‌ఏవై సంస్థ పనిచేస్తుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించే దిశగా వర్సిటీ నిరంతరం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, యోగా కేంద్రం సంచాలకులు ఆచార్య ఓ.ఎస్‌.ఆర్‌యు భానుకుమార్‌, విభాగాధిపతి ఆచార్య కె.రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-12 15:37:18

జీవిఎంసీకి 672 చెత్త వాహనాలకు కేటాయింపు..

రాష్ట్ర ప్రభుత్వం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కి కేటాయించిన చెత్తను తరలించే వాహనాలు జివిఎంసి పరిధిలోని వార్డులకు కేటాయింపు జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. మంగళవారం బీచ్ రోడ్డులో డాక్టర్  వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన తో కలసి చెత్తను తరలించే కొత్త వాహనాలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పధకంలో భాగంగా 672 చెత్త తరలించే వాహనాలు నగరానికి కేటాయించారని తెలిపారు. అందులో భాగంగా మొదటి విడతగా జివిఎంసికి 292 వాహనాలు వచ్చాయని, మిగిలిన వాహనాలు త్వరలోనే వస్తాయని తెలిపారు. వీటిని అన్ని వార్డులకు కేటాయించడం జరిగిందని, నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించి విశాఖ నగరాన్ని స్వచ్ఛతా నగరంగా తీర్చిదిద్దుతామని, ఎప్పటికప్పుడు చెత్తను తరలించుతవలన ప్రజలను ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దగలమని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసన సభ్యులు ఆదీప్ రాజ్, అనకాపల్లి శాసన సభ్యులు జి. అమర్ నాద్, వై.సి.పి. నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె. రాజు, విఎంఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, డిప్యుటీ మేయర్లు జియ్యని శ్రీధర్, కె. సతీష్, కార్పొరేటర్లు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, జోనల్ కమిషనర్లు బి. రాము, శివ ప్రసాద్, బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ లు డాక్టరు రమణ మూర్తి, డాక్టరు కిషోర్, తదితర రాజకీయ నాయకులు మరియు జివిఎంసి అధికారులు  పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-10-12 14:04:07

ఈ క్రాప్, ఈకేవైసీ సత్వరమే పూర్తిచేయాలి..

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ప్ర‌ధాన ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాలుగా కూడా సేవలందించ‌నున్న‌నేప‌థ్యంలో మొత్తం ప్ర‌క్రియ‌పై క్షేత్ర‌స్థాయి అధికారులు అవగాహ‌న పెంపొందించుకోవాల‌ని జాయింట్ కలెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జ.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి జేసీ (ఆర్‌) జి.ల‌క్ష్మీశ‌.. జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు పురోగ‌తిపై చ‌ర్చించ‌డంతో పాటు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు మార్గ‌నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌తలో భాగంగా ఈ-క్రాప్ బుకింగ్ వెరిఫికేష‌న్‌, ఈ-కేవైసీ ప్ర‌క్రియను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని ఆదేశించారు. కేవ‌లం ధాన్యం కొనుగోలుకే కాకుండా వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌కు కూడా ఈ-క్రాప్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణకు సంబంధించి జ‌రుగుతున్న ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నాణ్య‌తా త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు. డ్రోన్ స‌ర్వేకు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌ను పూర్తిచేయాల‌న్నారు. ద‌శ‌ల వారీగా జిల్లా మొత్తం స‌మ‌గ్ర భూ స‌ర్వే జ‌ర‌గ‌నున్నందున అందుకు అధికారులు స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్నారు. ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక స్పంద‌న ద్వారా అందుతున్న అర్జీల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జేసీ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌.. సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌  గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో అమ‌ల‌వుతున్న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలుపై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదే విధంగా స‌చివాల‌యాల సిబ్బంది బ‌యోమెట్రిక్ హాజ‌రుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని ఆదేశించారు. మండల స్థాయిలో జరుగుతున్న ఆసరా కార్యక్రమాలు విజయవంతం చేయడంతోపాటు చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు కార్య‌క్ర‌మానికి సంబంధించి క్ల‌స్ట‌ర్ మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని భార్గ‌వ్‌తేజ ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ జీ.వీరేశ్వరప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎస్వో పి. ప్రసాదరావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-10-12 14:00:14

అక్రమ మద్యం నిర్మూళన పటిష్టంగా జరగాలి..

తూర్పుగోదావరిజిల్లాలో అక్రమ మద్యం నిర్మూలనకు పోలీస్, అటవీ, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖల అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జేసీ లక్ష్మీ శ.. పోలీస్, అటవీ, ఎక్సైజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల అధికారులతో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ  మాట్లాడుతూ అక్రమ మద్యం, నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ద్వారా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకు ఎక్సైజ్, అటవీ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ ఆదేశించారు. అక్రమ మద్యం, నాటు సారా తయారీ వంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. అటవీ, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసీ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈ వీసీలో కాకినాడ అడిషనల్ ఎస్పీ కె.కుమార్, డీఫ్ వో ఐకెవి రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ ఎస్.లక్ష్మీకాంత్, డీఆర్డీఎ పీడీ కె.శ్రీరమణి సీపీవో పి.త్రినాథ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2021-10-12 13:55:25

జ‌ల జీవ‌న్ మిష‌న్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద చేప‌ట్టిన ప‌నుల‌న్నీ పూర్తిచేసి సి.పి.డ‌బ్ల్యు.ప‌థ‌కాల ద్వారా పూర్తి స్థాయిలో గ్రామాల‌కు తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా అధికారుల‌ను ఆదేశించారు. ప‌నులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని కొళాయిల ద్వారా అందించాల‌న్నారు. జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఇంజ‌నీర్ల‌తో తాగునీటి స‌ర‌ఫ‌రా, ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ తదిత‌ర అంశాల‌పై జెడ్పీ ఛైర్మ‌న్ మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. ర‌క్షిత తాగునీటి సౌక‌ర్యంలేని బోర్లు లేని గ్రామాలు, మారుమూల గిరిజ‌న గ్రామాలు, కొండ‌శిఖ‌ర గ్రామాల‌కు సంబంధించి జెడ్పీ నిధుల‌తో తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించేందుకు వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని సూచించారు. భోగాపురం మండ‌లంలో తీర‌గ్రామాల్లో ర‌క్షిత త్రాగునీటి స‌ర‌ఫ‌రా అవ‌స‌ర‌మైన గ్రామాల‌ను గుర్తించి ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌న్నారు. గులాబ్ తుఫాను కార‌ణంగా దెబ్బ‌తిన్న ర‌క్షిత నీటి ప‌థ‌కాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు పూర్తిచేసి విద్యుత్ శాఖ స‌హ‌కారంతో ఆయా ప‌థ‌కాల‌ను పూర్తిస్థాయిలో పున‌రుద్ద‌రించాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో జిల్లా ప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఎస్‌.ఇ. శివానంద కుమార్‌, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఇ.ఇ., డి.ఇ., ఏ.ఇ.లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-12 13:46:20

మహిళా సాధికారతే సీఎం ప్రధాన లక్ష్యం..

రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళా సంక్షమానికి నిరంతరం కృషి చేస్తున్నారని  ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. మంగళవారం జియ్యమ్మ వలస మండలంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎం.పి.పి బొంగు సురేష్ అధ్యక్షత వహించారు.  కార్యక్రమంలో మండలంలో జీవనోపాధికి,  హౌసింగ్ బ్యాంక్ లింకేజిద్వారా  323 మంది మహిళలకు కోటి ముప్పది ఐదు లక్షలు రూపాయల విలువ గల చెక్కును, వై.ఎస్.ఆర్.ఆసరా రెండవ విడత క్రింద 1091 సంఘాలలో గల 12266 మంది సభ్యులకు 5.83 కోట్లు రూపాయలు చెక్కులను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ప్రోజెక్ట్ అధికారి స్వయం సహాయక సంఘాలు మహిళలకు అందజేశారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతు మహిళా సాధికారతే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నాలుగు విడతలుగా వై.ఎస్.ఆర్.ఆసరా అందజేయడం జరుగుతుందని మాటిచ్చిన ముఖ్యమంత్రి మొదటి విడతగా 630 కోట్లు మీ వ్యక్తిగత ఖాతాలు కమచేయడం జరిగింది. నేడు రెండవ విడతగా సుమారు 600 కోట్లు మీ ఖాతాలలో జమచేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట తప్పక అమలు చేస్తూ మహిళలకు అండగా నిలిచిన ముఖ్య మంత్రి అన్నారు.

   మహిళ ద్వారా కుటుంభానికి మంచి జరుగుతుందని గుర్తించిన ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని మహిళల పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసరా సొమ్ముతో పిల్లల చదువులకు, జీవనోపాధి అభివృధికి వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివద్ధి చెందాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలతో ఆర్థికంగా వారి కుటుంబాలు ఎలా అభివృధి చెందాయో సభ్యులు వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళల ఆర్థికాభివృదికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన  ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రితో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలతో అభిషేకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో   వై.ఎస్.ఆర్ క్రాంతి పథం ఎ.పి.డి సత్యం నాయుడు, ఎం.పి.డి.ఓ, విజయ లక్ష్మి, తహసిల్దార్ శ్రీరామూర్తి, జెడ్.పి.టి.సి ముడడ్ల శశికళ, సర్పంచ్ రాములు, వైఎస్.ఆర్.సి.పి.నాయకులు, మండలంలో మహిళా సంఘాల సభ్యులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది,  అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Jiyyammavalasa

2021-10-12 13:44:53

అద్దె బకాయిలు తక్షణమే చెల్లించండి..

ప్రకాశం జిల్లాలోని ఎస్సీ కార్పోరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ లలో వ్యాపారాలు చేస్తున్నవారంతా తక్షణమే అద్దె బకాయిలు చెల్లించి రసీదులు పొందాలని యస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మార్కాపురం కోర్టు సెంటర్ లో ఉన్న యస్సీకార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాణిజ్య సముదాయాలను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. ఇక్కడి సముదాయంలో 11 షాపులుండగా రూ.7 లక్షలు అద్దె బకాయిలు కావాల్సి వుందన్నారు. 1984లో కార్పోరేషన్ ద్వారా నిర్మించిన షాపులకు రూ.50  అద్దె నిమిత్తం ఒకొక్క షాపుకు నిర్ణయించగా 1998లో రూ.500 కు పెంచారన్నారు. అయినా గత 22 సంవత్సరాలుగా అద్దె విషయంలో ఎటువంటి మార్పుచేయలేదని పేర్కొన్నారు. అయితే వాణిజ్య సముదాయం కట్టి 37 సంవత్సరాలు దాటడం వలన భవన మరామత్తులు చేయవల్సి ఉన్నదని అన్నారు. నిరుపేద యస్సీల జీవనబృతి నిమిత్తం ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసారు. అద్దె బకాయిలు కట్టి రసీదు పొందాలని సూచించారు. అంగీకరించిన వ్యాపారులు వారం పది రోజులలో బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈడి  వెంట యస్సీ కార్పోరేషన్ సిబ్బంది ఉసురుపాటి శ్రీను, తేళ్ళ విజయ్, వ్యాపారులు ఐజాక్, చింతగుంట్ల విజయమ్మా తదితరులు ఉన్నారు.

ప్రకాశం

2021-10-12 09:53:21

ప్రోత్సాహంతోనే ప్రతిభకు మెరుగులు..

సమాజములో  ఏ రంగంలోనైనా ప్రోత్సాహాంతోనే  ప్రతిభకు మెరుగులు దిద్దడానికి ఆస్కారం వుంటుందని ఏ.పి. రాష్ట్ర 'మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీతమ్మధార వి.జె.ఎఫ్. వినోద వేదికలో మంగళవారం జరిగిన "3 రోజులు మోహిని యాట్టం సదస్సు ముగింపు, కళాజీవా పురస్కారం లు- 2021 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకతకు, సమైక్యతకు ప్రతీక మన విశాఖ నగరమని అన్నారు. గాయత్రి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాండ్రే గుల రామ్ కుమార్ మాట్లాడుతూ బాలల్లో కళానైపుణ్యానికి ఇటు వంటి సదస్సులు అవసరమని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంస్థ ను ఆయన అభినందించారు.సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక  ఆహ్వానితులు . వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఎంతో మంది 'అంతర్జాతీయ స్థాయి ఖాతిని పొందిన కళాకారులు విశాఖలో ఉన్నారన్నారు. కొరియోగ్రఫీలో వైవిధ్యం ఉండడంతో ఎటువంటి కళాభిమానులనైనా ఇట్టే ఆకట్టుకోగలరన్నారు. చిత్ర కళలో జాతీయ పురస్కారాలు అందుకుంటున్న సి. సంధ్యా శంకర పట్నాయక్, సినీ కొరియోగ్రఫర్, మోహినియాట్టం శిక్షకురాలు వినిత వర్గీషే (కేరళ) లను "కళాజివా పురస్కారం-2021 " తో కాయల ఘనంగా సత్కరించారు. కొరియోగ్రఫర్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో బ్రహ్మకుమారి రామేశ్వరి, వీ జే ఎఫ్. కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, ఎ.పి.డిప్లొమో ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. మహేశ్వర రెడ్డి , కె.వి.ఆర్. మిత్ర మండలి ప్రతినిధి కె. సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Seethammadara

2021-10-12 07:12:15

డయల్ యువర్ మేయర్ కు 36 ఫోన్ కాల్స్..

జివిఎంసి లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి 36 ఫోన్ కాల్స్ వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు.  ఒకటవ (భీమిలి) జోనుకు 03, రెండవ జోనుకు 03, మూడవ జోనుకు 04, నాలుగవ జోనుకు 03, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 13, ఏడవ (అనకాపల్లి) జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 03, యు.సి.డి. విభాగమునకు 01, మొత్తము 36 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.               

జివిఎంసీ

2021-10-11 15:03:32

బాల బాలికలు ఇద్దరూ సమానమే..

బాలబాలికలు ఇద్దరూ సమానమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.సి.చంద్రనాయక్ పేర్కొన్నారు.    సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుటుంబంలో బాలురు బాలికలు ఇద్దరూ సమానమే తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. సామాజిక వివక్ష కారణంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భ్రూణ హత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో పెద్ద ఎత్తున చైతన్యం అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాల బాలికల లో తండ్రి పాత్ర కీలకమని, గ్రామస్థాయిలో ముఖ్యంగా నిరక్షరాస్యులు అయినటువంటి తల్లిదండ్రులు, ప్రజల్లో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. భ్రూణ హత్యలు సమాజంలో మాయని మచ్చగా మిగులుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం బాగా ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో వెయ్యి మంది బాలురకు 953 మంది బాలికలు ఉన్నారనీ ఇంతటి వ్యత్యాసం సరికాదని అసమతౌల్య స్థితికి దారితీస్తుందని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఒక మహిళను ఎక్కువ మంది పెళ్లి చేసుకునే సాంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు. ఇటువంటి వ్యవస్థ ఆదర్శవంతమైన సమాజానికి మంచిది కాదని స్పష్టం చేశారు. మహిళల పురోగతి ఎక్కడ ఉంటుందో ఆ సమాజం అన్ని విధాల రాణిస్తుందని పేర్కొన్నారు. బ్రూణ హత్యలు నివారించి బాలికల నిష్పత్తి పెంచాలన్నారు. బ్రూణ హత్యలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ఇంటింటికీ వెళ్ళినప్పుడు బ్రూణ హత్యలు పై గర్భిణీలు, తల్లులకు వివరించాలని సూచించారు.  

అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాధరావు మాట్లాడుతూ బాలబాలికల మధ్య తీవ్రమైన వ్యత్యాసం వలన సామాజిక పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. డి.ఎస్.పి ఎం.మహేంద్రనాథ్ మాట్లాడుతూ బాలికల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. హత్యల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు నివారించాలని పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, భ్రూణ హత్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. బాలికలు, మహిళల పట్ల సమాజంలో వివిధ కోణాలలో దుష్కృత్యాలు జరుగుతున్నాయని అటువంటి సంస్కృతి నుండి బయట పడాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలను గూర్చి అవగాహన పొందాలని అవసరం అయినప్పుడు వాటిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగం హెడ్ డాక్టర్ వాణి మాట్లాడుతూ బాలికల జనంలో పురుషుల పాత్ర ప్రధానమని, ఈ విషయాన్ని సమాజానికి అవగాహన చెందే వరకు తెలియజేయాల్సిన అవసరం ఉందనీ చెప్పారు.  ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నాయుడు డి సి హెచ్ ఎస్ డాక్టర్ సూర్య రావు వైద్యులు వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2021-10-11 14:58:24

జీవిఎంసీ స్పందనకు 36 ఫిర్యాదులు..

జివిఎంసి లో సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో 36 ఫిర్యాదులు వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు.  ఇందులో రెండవ జోనుకు 04, మూడవ జోనుకు 08, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 07, ఆరవ జోనుకు 05, ఎనిమిదవ జోనుకు 07, మొత్తము 35 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.              

జివిఎంసీ

2021-10-11 14:55:46