1 ENS Live Breaking News

అప్పలాయగుంట ఆలయ అభివృద్ధికి చర్యలు..

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ,  అప్పలాయగుంట ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కల్యాణ కట్ట లో భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పిస్తున్నారని చెప్పారు. ఆదివారం నుంచి ఈ కల్యాణ కట్టలో  సిబ్బందిని రెట్టింపు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయంలో తగినంతమంది అర్చకులను కూడా నియమిస్తామన్నారు.  శనివారం రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందువల్ల స్వామివారి దర్శనం కోసం ఎండలో నిలబడాల్సి వస్తోందని భక్తులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన శ్రీ సుబ్బారెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి  శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బు చికిత్స  ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.  12వ తేదీ తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును,  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు.  ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి  బసవ రాజ్ బొమ్మై పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందు  సుబ్బారెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

Prasanna Venkateswara Temple

2021-10-09 11:52:38

ఘోషా ఆసుపత్రిని మరింత అభివ్రుద్ధి చేస్తాం..

విశాఖ నగరంలోవున్న విక్టోరియా (ఘోషా) ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టరు ఏ.మల్లికార్జున తెలిపారు.  శనివారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి చికిత్స కొరకు వచ్చినవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వుండాలన్నారు.  ఆసుపత్రిలో చేరిన వారికి స్వంత ఇంటిలో వున్న భావన కలగాలని, చికిత్స అనంతరం ఆనందంగా తిరిగి వెళ్లేలా వైద్య సేవలు అదించాలన్నారు.  నాడునేడు పనుల కింద రూ.100 కోట్లతో చేపట్టిన  నూతన భవనం పూర్తయితే అదనంగా 280 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.  రూ.80 కోట్లు భవన నిర్మాణానికి, రూ.20 కోట్లు పరికరాలకు కేటాయించినట్లు వెల్లడించారు.  ఓపి వేగవంతం చేసేందుకు మరొక కంప్యూటర్, డేటా ఎంట్రీఆపరేటరు, అవసరమని, రేడియాలజిస్ట్,   అంబులెన్స్ డ్రైవరు కూడా మంజూరు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి కోరగా నియామకాలకు అనుమతించారు. రూ.34 లక్షలతో  పరికరాలు కొనుగోలుకు కూడా ఆమోదించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ ఆసుపత్రిలో వార్డులను, వివిధ విభాగాలను పరిశీలించారు.  ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా వున్నాయి, చికిత్స, మందులు సక్రమంగా ఇస్తున్నారా, పరిశుభ్రతల గూర్చి రోగులను అడగారు. సేవలు బాగున్నాయని, ప్రతిరోజూ బెడ్ షీట్స్ మార్చుతున్నారన వారు తెలిపారు.  సరఫరా చేస్తున్న ఆహారం పట్ల కూడా రోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. లేబర్ రూమ్, ఐ.సి.యు. రూమ్స్, లాబొరేటరి, పోస్ట్ నాటల్ వార్డు లను పరిశీలించారు.  సమావేశంలో ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, అనదపు డియంఅండ్ హెచ్ వో  డాక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండింట్ డి.హేమలతాదేవి, డి.సి.హెచ్. ప్రకాశరావు, ఏ.పి.ఎమ్.ఐ.సి. ఈ.ఈ. నాయుడు, ఆసుపత్రి ఓ.ఎస్.  విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-09 11:29:27

కాకినాడ స్మార్ట్ సిటీకి మరింత గుర్తింపు తీసుకువస్తా..

కాకినాడ స్మార్ట్ సిటీకి మరింత గుర్తింపు వచ్చే విధంగా క్రుషి చేసి జిల్లా కీర్తిని రాష్ట్రంలోనే ముందువరసలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌ అల్లి రాజాబాబు యాదవ్ అన్నారు. శనివారం కాకినాడ కార్పోరేషన్ ఆయన నూతనంగా కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,  కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమక్షంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మార్గనిర్దేశకత్వంలో కాకినాడ నగర అభివృద్ధికి పాటుప‌డుతూ రాష్ట్రం, దేశంలో కాకినాడ స్మార్ట్ సిటీకి మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు పాటు పడతానన్నారు. అనంతరం ఉద్యోగులు మర్యాదపూర్వకంగా చైర్మన్ కలిసి పుష్పగుచ్చాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-09 10:57:45

దుర్గమ్మ భక్తులకు లోటు లేకుండా ప్రసాదాలు..

శరన్నవరాత్రులకు వచ్చే భక్తులకు ప్రసాదాలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ అన్నారు. బుద్దావారి గుడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ పాక శాలను శనివారం ఇవో డి. భ్రమరాంబ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను సిద్దం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు లక్ష 50 వేల లడ్డూ ప్రసాదాలు తయారీ చేసి భక్తులకు విక్రయిస్తున్నామన్నారు.
నవరాత్రుల్లో 10 రోజులపాటు 15 లక్షల 50 వేల లడ్డూలు భక్తులకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. లడ్డూ నాణ్యత, తూకంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తయారీ కేంద్రంలోని అన్ని విభాగాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నామన్నారు. నవరాత్రులకు వచ్చే భక్తులకు 11 లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో ఆరు కనకదుర్గనగర్ , విఎంసి,పున్నమిఘాట్, స్టేట్‌గెస్ట్‌హౌస్, రైల్వే స్టేషన్, ఓంకార్ మలుపు వద్ద ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచామని ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు. తయారీ కేంద్రం తనిఖీలో దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ సాగర్‌బాబు, అసిస్టెంట్ డిఇవో రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.

Vijayawada

2021-10-09 10:21:32

రాష్ట్రప్రజలపై దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలి..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు శనివారం ఇంద్రకీలాద్రిపై జగన్మాతగా శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకుంటున్నట్లు రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీగాయత్రిదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని శనివారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ ఎటువంటి శుభకార్యమైన లోకమాత గాయత్రిదేవి ఉపాసనతోనే ప్రారంభిస్తారన్నారు. గాయత్రిమంత్రం సర్వ శుబాలను కల్గిస్తుందన్నారు. అటువంటి మహన్మితమైన గాయత్రిదేవిని భక్తులు దర్శించుకుంటే పుణ్యఫలాలు వారికి లభిస్తాయన్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు కూడా 30 నుండి 40 నిమిషాల్లో అమ్మవారి దర్శనం కలుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా రోజుకు 10 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నామన్నారు. అయితే ఆన్‌లైన్‌లో టిక్కట్లు తీసుకోలేక నేరుగా దర్శనానికి వచ్చిన వారికి కూడా దుర్గమ్మ దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం, సోమవారం మూలా నక్షత్రం రోజులలో వచ్చే భక్తుల రద్దిని దుష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్నప్రసాదవితరణ సక్రమంగా జరుగుతుందన్నారు. ప్రతి రోజు సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని లోటుపాట్లను సరిదిద్దుతున్నామన్నారు. ఇందుకు మీడియా కూడా సహకరిస్తుందని ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Vijayawada

2021-10-09 09:34:34

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యునిగా యం.ఎన్‌.శ‌శిధ‌ర్‌..

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా యం.ఎన్‌.శ‌శిధ‌ర్ శ‌నివారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి  యం.ఎన్‌.శ‌శిధ‌ర్‌చే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు.  అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు.  ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు,  సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

Tirumala

2021-10-09 08:41:52

12న విశాఖలో జర్నలిస్టుల దసరా సంబురాలు..

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ విశాఖ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల12న దసరా సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్భన్‌ యూనిట్‌ అధ్యక్షులు పి.నారాయణ్‌లు తెలిపారు. ఈ మేరకు శనివారం వైశాఖిజల ఉద్యానవనంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 12వ తేది మంగళవారం ఉదయం అల్పాహరంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం దసరా ఉత్సవాలను ప్రతిబింబించే రీతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా కవితాగోష్టి, సంగీత విభావరి నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం లక్కీడీప్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. తదుపరి అతిథుల ప్రసంగాలు, పలువురి కళాకారులకు సత్కారాలు, విందు భోజనం,మిఠాయిల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కావున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు పండగులు, వనభోజన మహోత్సవ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ ఆర్గనైజేంగ్‌ సెక్రటరీ డి.రవికుమార్‌,బ్రాడ్‌కాస్ట్‌ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌,  సంఘం సీనియర్‌ ప్రతినిధులు చింతా ప్రభాకర్‌రావు,పాత్రుడు, కె.మురళీకృష్ణ, కామన్న, పి.నగేష్‌బాబు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-09 08:37:10

ప్రతీకుటుంబం దిశ యాప్ డౌన్ లోడ్ చేయాలి..

విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో దిశ యాప్  డౌన్ లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్  డా. ఎ.మల్లిఖార్జున జిల్లా అధికారులను ఆదేశించారు.  శుక్రవారం  కలెక్టర్ కార్యాలయం నుండి పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులతో కలసి  మండల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన  దిశా చట్టం తప్పని సరిగా అమలు జరగాలని స్పష్టం చేసారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 70 లక్షల మంది డౌన్ లోడ్ చేసారని, కోటి మంది లక్ష్యంగా పెట్టారని, ఈ చట్టం వలన కలిగే ప్రయోజనం పై విస్తృత ప్రచారం  చేయడం తో  పాటు  ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత దానిని ఏ విధంగా ఉపయోగించాలన్నది కూడా అవగాహన కలిగించాలన్నారు.   ఎం .పి.డి.ఓ, ఎం .ఆర్.ఓ, పోలీసు తదితర అధికారులు ఒక టీమ్ లాగ ఏర్పడి వారంలో ఒక రోజు  దిశా చట్టం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. దిశా యాప్ లో చాలా ఫీచర్స్ ఉంటాయని, ఈ యాప్ ఉంటే మన ప్రక్కన పోలీసు ఎస్కార్టు ఉన్నట్లు భావించే విదంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు   ఎస్.ఓ.ఎస్ బటన్ నొక్కిన పది నిమిషాల లోపున పోలీస్  సహాయ సిబ్బంది వస్తారన్నారు.     గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి ఆ కుటుంబ సభ్యుల  ఆండ్రాయిడ్ ఫోన్ లో దిశా యాప్ డౌన్ లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రోజుకు వాలంటీర్ పరిధిలో గల సుమారు 50 ఇళ్లకు సర్వే చేయడంతో పాటు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయాలన్నారు. ఆయా ప్రాంతంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి టెస్ట్ కాల్ చేసి ప్రాక్టికల్ గా వారికి చూపించడం ద్వారా వారికి నమ్మకం కలుగుతుందన్నారు. నెలలో మూడవ శుక్రవారం మరియు శనివారం సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల తో కలసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం  వారి సమస్యలను తెలుసుకోవడం తో పాటు దిశా చట్టం దాని వలన కలిగే ఉపయోగం పై కూడా  అవగాహన కలిగించాలన్నారు.  రెండు వారాల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో  నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించాలన్నారు.  చదువు రాని వారు కూడా  మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే  ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందని దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందించడం జరుగుతుందన్నారు. 
రూరల్ ఎస్.పి బి.కృష్ణారావు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్న దన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నదని  ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే  విదంగా  అవగాహన కలిగించాలన్నారు.  ఎస్.ఓ. ఎస్ బటన్ ఆన్ చేయడం ద్వారా 10 నుండి 20 నిమిషాల లోపల పోలీసు  ఎస్కార్టు వచ్చి తక్షణ సహాయ సహకారాలను అందిస్తారన్నారు ప్రతి ఒక్కరూ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవల్సిందిగా సూచించారు. 
నాటు సారా,చీప్ లిక్కర్ లతో పాటు  బెల్టు షాపులను లేకుండా   మధ్య నిషేదిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని, దానిని పక్కాగా  అమలు జరపాల్సిన భాద్యత అధికారులదని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు.  సచివాలయ సిబ్బంది, ఎస్.ఇ.బి సమన్వయంతో వాటికి సంబందించిన సమాచారం అందిన వెంటనే తనిఖీలను చేపట్టాలన్నారు.  ఎస్.హెచ్.ఓ మరియు మండల స్థాయి అధికారి సంబంధిత వ్యక్తులపై బైండ్ఓవర్ చేయడం  పిడి చట్టం కింద చర్యలు చేపట్టి ఆర్.ఆర్ యాక్ట్  ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ ఎస్.పి బి.కృష్ణారావు మాట్లాడుతూ   మారుమూల ప్రాంతాలు మరియు ఏజేన్సీ ప్రాంతాలలో నాటు సారా తయారి ఎక్కువగా జరుగుతున్నట్లు దృష్టికి వస్తున్నదన్నారు.  ఎస్.ఇ.బి, లోకల్ పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ, సిబ్బంది కలిసి ఎప్పటి కప్పుడు దాడులు నిర్వహించి సంబందిత వ్యక్తులపై ఫైన్ వేసి కఠిన చర్యలకు చేపట్టాలన్నారు.   
 ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్న   గంజాయి సాగు  నివారణకు  సంబందించి ఫారెస్ట్,రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో  కో – ఆర్డినేట్ చేసుకొని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఐటిడిఎ పిఓ ఆర్ గోపాల కృష్ణను  ఆదేశించారు. బినామీలను,  రవాణా చేస్తున్న వాహనాల   యజమానులను గుర్తించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ చేయాలన్నారు. ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు ఆయా గ్రామాలలో సందర్శించి  ఆ ప్రాంత ప్రజలను ఉద్యాన పంటలు వేసే విధంగా  అవగాహన కల్పించాలన్నారు 
ఎస్.పి.మాట్లాడుతూ గంజాయి సాగు మరియు రవాణా విషయంలో విశాఖ  జిల్లా పేరు ప్రచారంలో ఉందని, ఆ ఇమేజ్ ను తగ్గించడానికి  సంబందిత శాఖల అధికారులు  విశేష కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, రుణాలను  వారికి అందించి  ఉద్యానపంటలు వేసే విధంగా ప్రోత్సాహించాలన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం . వేణుగోపాల రెడ్డి,  పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-10-08 16:49:10

కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..

కూర‌గాయ‌లు, నిత్య‌వస‌ర స‌రుకుల ధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ఎవ‌రైనా అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. వివిధ శాఖ‌ల అధికారులు, రైతుబ‌జార్ ఎస్టేట్ ఆఫీస‌ర్లు, కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌రాల హోల్‌సేల్‌ వ‌ర్త‌కుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ మాట్లాడుతూ, గ‌త 15 రోజుల‌తో పోలిస్తే ప్ర‌స్తుతం ఉల్లి, ట‌మాటా, కూర‌గాయల ధ‌ర‌లు పెర‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. గ‌తేడాదితో పోలిస్తే, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు బాగానే ఉన్నాయ‌ని, భారీ వ‌ర్షాలు, తుఫాన్లు కార‌ణంగా ఇటీవ‌లే కూర‌గాయ‌ల ధ‌ర‌లు మాత్రం పెరిగాయ‌ని అధికారులు చెప్పారు.  ఇత‌ర జిల్లాల ధ‌ర‌ల‌తో పోల్చి చూశారు. ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని, వీటిని అదుపు  చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ద‌స‌రా, పైడిత‌ల్లి అమ్మ‌వారి పండగల‌ను దృష్టిలో పెట్టుకొని, త‌గిన స్టాకు పెట్టుకోవాల‌ని, ధ‌ర‌లు పెర‌గ‌కుండా చూడాల‌ని వ‌ర్త‌కుల‌ను కోరారు. రైతుబ‌జార్ల‌లో ఏరోజుకారోజు ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల‌ని ఎస్టేట్ ఆఫీస‌ర్లను ఆదేశించారు.   కోవిడ్ స‌మ‌యంలో జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపార‌స్తులు, మాన‌వ‌తా దృక్ఫ‌థంతో త‌మవంతు స‌హ‌కారాన్ని అందించార‌ని, త‌గిన స్టాకును అందుబాటులో ఉంచ‌డంతోపాటు, ధ‌ర‌లు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని అభినందించారు.  రైతు బ‌జార్ల‌లో, షాపుల‌వ‌ద్దా కోవిడ్ నిబంధ‌న‌లను పాటించేలా చూడాల‌ని కోరారు. మాస్కు లేనిదే వినియోగ‌దారుల‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. శానిటైజ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాల‌ని జెసి కిశోర్ సూచించారు.   ఈ స‌మావేశంలో జిల్లా స‌ర‌ఫ‌రా అధికారి ఎ.పాపారావు, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్‌, ఉద్యాన‌శాఖ ఎడి ల‌క్ష్మి, రైతుబ‌జార్ ఎస్టేట్ అధికారులు స‌తీష్‌, ఉమామ‌హేశ్వ‌ర‌రావు, అప్ప‌ల‌నాయుడు, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, నిత్యావ‌స‌రాల‌ హోల్‌సేల్ వ‌ర్త‌కులు, కూర‌గాయ‌ల వ‌ర్త‌క సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-08 16:14:10

బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లో చేపలవేట నిషేధం.. ఫిషరీష్ డిడి నిర్మలాకుమారి..

తీరప్రాంత మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్రతీర ప్రాంతంలో అక్టోబరు 4 నుంచి 25వ తేదీ వరకూ చేపల వేటకు వెళ్లకుండా నిషేధించినట్టు మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. విజయనగరంలో  శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.  బంగ్లాదేశ్ ప్రభుత్వం తల్లి హిల్సా(పులస) చేపల సంరక్షణ కోసం మదర్ హిల్సా ప్రొటెక్షన్ క్యాంపైన్ 21 రోజులపాటు నిర్వహిస్తున్నదన్నారు. ఆ సమయంలో అక్కడ చేపల వేట, అమ్మకం, రవాణా అన్ని కార్యకాలపాల పైని నిషేధం విధించిందని తెలియజేశారు. ఆ సమయంలో  మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ మత్స్యశాఖ నుంచి హెచ్చరికలు జారీచేశామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బంగ్లాదేశ్ సముద్రజాల్లో ప్రవేశించినా, వేట చేపట్టినా అక్కడి నేవి, కోస్ట్ గార్డ్ దళాలు అరెస్టులు చేసి బోట్లను సీజ్ చేయడంతోపాటు, పెనాల్టీలు కూడా విధిస్తారన్నాని హెచ్చరించారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి ఆ ప్రదేశాల్లో చేపల వేటకు వెళ్లకూడదని  ఆమె సూచించారు.

Vizianagaram

2021-10-08 14:20:28

దిశయాప్ తో మహిళల దశను మార్చవచ్చు..

స్త్రీ, పురుష బేధం లేకుండా ప్రతి ఒక్కరూ దిశా యాప్ డౌన్లోడ్ చేసు కోవడం ద్వారా మహిళల పై దాడులు సంఖ్యను తగ్గించ వచ్చని జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి దాడుల  నిరోధ చట్టం జాతీయ స్థాయి లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో దిశా యాప్ ఉందని అన్నారు.  కలెక్టరేట్ ఆడిటోరియం లో శుక్రవారం ఎస్.సి, ఎస్.టి  దాడుల నిరోధ చట్టం  పై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.  ఎస్.సి, ఎస్.టి ల పై జరిగిన దాడులకు సంబంధించిన కేస్ లను సమీక్షిస్తూ మహిళల పై దాడులు జరిగేటప్పుడు వెంటనే నిరోధించడానికి దిశా యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల పూస పాటిరేగ మండలం చౌడువాడ లో ఒక అమ్మాయి పై జరిగిన దాడిని దిశా ద్వారానే వెంటనే ఆపగలిగామని ఉదహరించారు. ఈ కేస్ పట్ల పోలీస్ , ఇతర అధికారులు వెంటనే స్పందించి బాధితురాలును రక్షించినందుకు మొత్తం బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ చౌడువాడ  బాధితురాల పట్ల ఏ విధంగా వ్యవరించింది, రక్షించింది వివరించారు.   దిశా యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని కలెక్టర్ పోలీస్ అధికార్లకు సూచించారు. 
ఎజెండా  వివరాలను  వెల్లడిస్తూ ఈ త్రై మాసికం లో ఎస్.సి, ఎస్.టి ల పై 39 కేస్ లు నమో దైనాయని,  అందులో 9 కేస్ లు రెఫర్ అయ్యాయని, 30 కేస్ కు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయని సోషల్ వెల్ఫేర్ డి డి తెలిపారు. గతం లో నమోదైన 54 కేస్ లకు గాను 81.85 లక్షల పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు.  కలెక్టర్ స్పందిస్తూ కేస్ ల సత్వర పరిష్కారానికి కావలసిన కుల ధ్రువ పత్రాలు, లీగల్ ఒపినిఒన్స్ ను త్వరగా ఇవ్వాలని డి.ఆర్.ఓ కు, ఎపిపి  సూచించారు. ఈ చట్టం పై సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని,  చట్టం లో ఏ ఏ అంశాలు ఉంటాయో తెలిస్తే సభ్యులు స్పష్టముగా ప్రశ్నిస్తారని అన్నారు. ప్రతి నెల 30 న అన్ని మండలాల్లో పౌర హక్కుల పై సమావేశం నిర్వహించాలని, మండల స్థాయి మినిట్స్ తో  జిల్లా స్థాయి సమావేశానికి హాజరవ్వాలని అన్నారు. ఆ మేరకు తఃసిల్దార్లకు సర్కులర్ ఇవ్వాలని డి.ఆర్.ఓ కు సూచించారు.  ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు. జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-08 08:15:02

లంబసింగి సిగలో చారిత్రిక మణిపూస..

ప్రకృతి సహజ సిద్ధమైన రమణీయ అందాలతో అలరారుతున్న ఆంధ్రా కాశ్మీరం లంబసింగిలో అరుదైన విశేషాలతో అందమైన ఉద్యానవనం మధ్యన రూపుదిద్దుకోనున్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.విశాఖజిల్లా, చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో సుస్థిరమైన స్థానం ఉంది. రక్షిత అడవుల పేరుతో పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి-నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునేవారు. అయితే గిరిజనులకు సరైన కూలీ కూడా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు పాల్పడేవారు.ఈ నేపథ్యంలోనే బ్రిటీష్ పాలకుల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగబడ్డారు. గాం గంటం దొర, గాం మల్లుదొరలతో కలిసి బ్రిటీష్ పాలకులపై ఇక్కడి నుంచే తిరుగుబాటును లేవనెత్తి బ్రిటీష్ అధికారులను తరిమికొట్టారు. ఈ చారిత్రిక ప్రాశస్థ్యం కలిగి ఉన్న కారణంగానే గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి తాజంగి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు.

4 జోన్లుగా ప్రదర్శనలు:
గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్ టీఎం) ఆధ్వర్యంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను 22 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మ్యూజియం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో రూ. 20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం, రూ.15 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో మ్యూజియం నిర్మాణాలకు రూ. 13 కోట్లను వినియోగించనున్నారు. ఈ మ్యూజియంకు సంబంధించిన ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గంటందొర, మల్లు దొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో అధునాతనంగా డిజైన్ చేసారు. యాంపి థియేటర్ తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియో విధానాలను రూ.5 కోట్లతో సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సాంప్రదాయకమైన గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో మ్యూజియం పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దనున్నారు. మరో రూ.6 కోట్ల వ్యయంతో పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక ఆధునికమైన రెస్టారెంట్ ను, రిసార్ట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంలో ఏ,బీ,సీ,డి అనే నాలుగు జోన్లుగా వివిధ అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జోన్-ఏ లో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు పూర్వం ఉన్న గిరిజనుల పరిస్థితులు, అప్పటి గిరిజనుల జీవన విధానం, వారికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-బి లో గిరిజనుల జీవితాల్లోకి బ్రిటీష్ పాలకు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష జంతు జాలాలను కళ్లకు కడుతూ  డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటు చేస్తారు. జోన్-సీ లో బ్రిటీష్ పాలకుల అరాచకాలపై గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-డీ లో స్వాతంత్ర్యానంతరం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలను గురించి తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. అక్టోబర్ 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఈ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

2023 మార్చి నాటికి పూర్తి చేస్తాం: పుష్ప శ్రీవాణి
ప్రస్తుతం ఉన్న గిరిజన మ్యూజియంల కంటే భిన్నంగా, అత్యాధునికమైన సాంకేతిక విధానాలతో సర్వ సౌకర్యాలతో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను నిర్మించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొరలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించే అంశాలు ఈ మ్యూజియంను సందర్శించే పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. 22 నెలల కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నామని 2023 మార్చి నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు.

Lambasingi

2021-10-07 16:05:28

జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకులే కీలకం..

ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పథకాలను అందజేయడంలో బ్యాంకులు ముఖ్య భూమికను పోషించాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంవత్సరిక రుణ ప్రణాళిక (Annual Credit Plan) అమలు పై జరిగిన సమీక్షా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, ఉపాధి, పారిశ్రామిక, డ్వాక్రా, పశుసంవర్ధక, మత్స్య, వాణిజ్య రంగాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.  వివిధ రంగాలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు బ్యాంకుల తోడ్పాటు గురించి ఆయన సమీక్షించారు. బ్యాంకింగ్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో గ్రామ స్థాయి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆసరా’ పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నారని బ్యాంకులు వీరికి ఇతోధికంగా సహకరించాలన్నారు.  జిల్లాలో నాబార్డ్ చేపడుతున్న కార్యక్రమాలను గూర్చిన కరదీపికను విడుదలచేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి పి.డి. డి.ఆర్.డి.ఎ. విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు,  పశుసంవర్ధక జెడి రామకృష్ణ ఉద్యానవన శాఖ డిడి గోపీనాథ్, పరిశ్రమల శాఖ డి.ఎం. రామలింగరాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్ ప్రసాద్ వివిధ బ్యాంకుల   అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-07 14:50:16

రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట..

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ   వారి అభివృద్దికై  ఆర్ధిక చేయూత నందిస్తూ మహిళలను అన్ని రంగాలలో    అగ్రస్థానం లో నిలబెడుతున్నదని  రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక వి.ఎం.ఆర్.డి.ఎ., చిల్డ్రన్ ఎరినాలో  రెండవ విడత  వై.ఎస్.ఆర్. ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఒంగోలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి రెండవ విడత  వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించగా  జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని నామినేటెడ్, డైరక్టర్ తదితర పోస్టులను మహిళలకే కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తన పాదయాత్రలో  ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా పాటిస్తూ  మహిళలకు  ఆర్ధిక చేయూత నందించి వారు  స్వయం శక్తితో  నిలబడే విదంగా  కృషి చేస్తున్నారన్నారు.  గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో  ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి  తాను ఇచ్చిన మాట ప్రకారం  మొదటి విడత వై.ఎస్.ఆర్ ఆసరా  పథకాన్ని  అమలు చేసారన్నారు. దేశంలో ఎక్కడా లేని  విదంగా  అత్యదిక టెస్టులు, వ్యాక్సినేషన్ వేసిన ఘనత మన రాష్ట్రానిదే అన్నారు.  ఎవరి రికమండేషన్ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి  కులమతాలు, పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా నూటికి నూరు శాతం అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో  23 రకాల పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయన్నారు. ఈ పథకాలు ద్వారా ప్రతి కుటుంబం సంవత్సరానికి  50 వేల నుండి లక్ష రూపాయల వరకు లబ్ది పొందుతున్నారన్నారు.  దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ కేలండరును అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని కొనియాడారు. ఆడపిల్ల సంరక్షణకై  దిశ చట్టాన్ని  పెట్టి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  జగనన్న విద్యాకానుక  కిట్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో  అందిస్తున్నారన్నారు. 
జిల్లా కలెక్టర్  డా.ఎ.మల్లిఖార్టున మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నారన్నారు.   రెండవ విడత  వై.ఎస్.ఆర్ ఆసరా క్రింద 63,991 ఎస్.హెచ్.జి గ్రూపులకు  రూ.470 కోట్లు  వారి ఖాతాలలో నేరుగా జమ అవుతున్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా చెక్కును  రాష్ట్ర మంత్రితో కలిసి అందజెసారు.  నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ  జి.వి.ఎం.సి పరిధిలో సుమారు 22వేల పొదుపు సంఘాలు సుమారు   రూ 156 కోట్ల  ఆర్దిక లబ్ది పొందుతున్నారన్నారు.  స్వయం సహాయక సభ్యులు తరుపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలను తెలియజేసికుంటున్నామన్నారు.  
విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి  అమలు చేస్తున్న నవరత్నాలులో భాగంగా  అన్ని వర్గాల మహిళలు, వృద్దులకు  పలు  సంక్షేమ పథకాలను  అందిస్తూ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండే విదంగా పరిపాలిస్తున్నారని, ఆయన పరిపాలనలో తాను భాగస్వామ్యం అవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ  మహిళా సంఘాలకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని  మన ప్రియతమ ముఖ్యమంత్రి మహిళలు అప్పులు బారిన పడకుండా  వారిని లక్షాదికారులుగా చేసేందుకు  స్వయం శక్తితో ఉపాధి కల్పిస్తున్నారని  ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, అధీప్ రాజు, కార్పోరేటర్లు, పలు కార్పోరేషన్ల చైర్మన్ లు, అధిక సంఖ్యలో ఎస్.హెచ్.జి. గ్రూపు సభ్యులు హాజరైయారు.  

Visakhapatnam

2021-10-07 14:49:02

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి..

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం కోరారు. గురు వారం ఆమదాలవలస మార్కెట్ యార్డ్ లో వైయస్సార్ ఆసరా రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వైయస్సార్ ఆసరా రెండో విడత మొత్తాన్ని  డ్వాక్రా మహిళల గ్రూపు సభ్యుల అకౌంట్లో నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేయటానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుండి వచ్చిన అద్భుతమైన పథకం ఆసరా అన్నారు. ఈ పథకం గూర్చి గత ఎన్నికల్లో అక్క చెల్లెమ్మలకు  వాగ్దానం చేశారని ఆయన తెలిపారు. పాద యాత్ర లో అగ్రిగోల్డ్ లో నష్టపోయామని జగన్ ను కలిసి బాధలు తెలియజేసిన అక్క, చెల్లమ్మ లకు ప్రభుత్వం అధికారంలోకి వస్తే  మీ నష్టపరిహారాన్ని చెల్లిస్తానని ఆనాడే వాగ్దానం చేశారని చెప్పారు. డ్వాక్రా సంఘాల చెల్లెమ్మలకు, అగ్రిగోల్డ్ బాధితులకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న మహోన్నతమైన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వాగ్దానం ఇస్తే దానిని నెరవేర్చుతారని ఆయన చెప్పారు. ఆనాడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈనాడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక స్వావలంబన తో అభివృద్ధి చెందాలని స్పీకర్ తమ్మినేని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జెడ్ పి టి సి బెండి గోవిందరావు, బూర్జ ఎంపీపీ కర్ణేన దీప, జెడ్ పి టి సి బెజ్జిపూరపు రామారావు, బుడుమూరు సూర్యారావు, పొందూరు జడ్పిటిసి లోలుగు కాంతారావు, బొడ్డేపల్లి రమేష్ కుమార్, జె జే మోహన్ రావు,  మెప్మ పి డి ఎమ్. కిరణ్ కుమార్, తాహసిల్దార్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, ఆమదాలవలస ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Amadalavalasa

2021-10-07 14:24:25