1 ENS Live Breaking News

నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపండి..

నాటుసారా త‌యారీపై ఉక్కుపాదం మోపాల‌ని, పాత నేర‌గాళ్ల‌పై నిశిత నిఘా ఉంచాల‌ని.. పదేపదే నేరాల‌కు పాల్ప‌డుతున్న‌వారిపై పీడీ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. నాటుసారా, అక్ర‌మ మ‌ద్యం నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై గురువారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్.. పోలీస్‌, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ఫారెస్ట్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ పోలీస్‌, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ఫారెస్ట్ అధికారుల‌తో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటుచేసి దాడుల‌ను ముమ్మ‌రం చేయాల‌ని, జిల్లాలో సారా ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని ఆదేశించారు. సారా త‌యారీ స్థావరాల‌ను గుర్తించి, ధ్వంసం చేయాల‌న్నారు. అట‌వీ ప్రాంతాలు, లంక‌లు, జిల్లా స‌రిహ‌ద్దులు త‌దిత‌ర ప్రాంతాల్లో నిఘా పెంచాల‌ని, అవ‌స‌ర‌మైతే సారా త‌యారీ స్థావ‌రాల‌ను గుర్తించేందుకు అత్యాధునిక డ్రోన్ ప‌రిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. కీలక ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అక్ర‌మ మ‌ద్యం ర‌వాణాను నిర్మూలించాల‌ని ఆదేశించారు. స‌ముద్రం, న‌దుల ద్వారా కూడా అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా అయ్యే అవ‌కాశ‌మున్నందున ఆ దిశ‌గా కూడా దృష్టిసారించాల‌ని, యానాం, తెలంగాణా స‌రిహ‌ద్దుల‌పైనా నిఘా ఉంచాల‌ని స్ప‌ష్టం చేశారు. దేవీ న‌వ‌రాత్రుల నేప‌థ్యంలో సారా త‌యారీ, ర‌వాణా కార్య‌క‌లాపాలు పెరిగే అవ‌కాశ‌మున్నందున ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో వాటిని అడ్డుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయల పరిధిలోని మహిళా పోలీసులు, కార్యదర్శుల ద్వారా కాపు సారా తయారి, విక్రయాలపై సమాచారాన్ని సేకరించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.   స‌మావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ,  కాకినాడ అద‌న‌పు ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అద‌న‌పు ఎస్‌పీ కె.ల‌తామాధురి; డీఎఫ్‌వో ఐకేవీ రాజు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ ఎస్‌.ల‌క్ష్మీకాంత్‌  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-07 14:22:08

బోధవ్యాధి నియంత్రకు డిఇసి మాత్రలు తప్పనిసరి..

బోద‌వ్యాధి నిర్మూలించేందుకు ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా, డిఇసి మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి కోరారు.  స్థానిక డిఎంఅండ్‌హెచ్ఓ కార్యాల‌యం వ‌ద్ద‌, ఫైలేరియా నివార‌ణ మాత్ర‌లను మ్రింగించే కార్య‌క్ర‌మాన్ని గురువారం లాంఛ‌నంగా ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా డిఎంఅండ్‌హెచ్ఓ ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ,  జిల్లాలో బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్ర‌తీఏటా డిఇసి మాత్ర‌ల ఉచిత‌ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఒకేసారి జిల్లాలోని అంద‌రికీ మాత్ర‌ల‌ను పంపిణీ చేసి, మ్రింగించ‌డం ద్వారా, ఈ వ్యాధి రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. జిల్లాలో కొన్ని చోట్ల ఫైలేరియా వ్యాధి ఉంద‌ని, వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌తో పాటు, శ‌స్త్ర‌చికిత్స‌లు కూడా చేస్తున్నామ‌ని చెప్పారు.  వ్యాధి వ‌చ్చిన త‌రువాత బాధ ప‌డేకంటే, ఇది రాకుండా ముంద‌స్తుగా డిఇసి మాత్ర‌ల‌ను తీసుకోవడం మేల‌ని సూచించారు.   జాతీయ కీట‌క నివార‌ణా కార్య‌క్ర‌మం (ఎన్‌విబిడిసిపి) డిప్యుటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రామ‌నాధం మాట్లాడుతూ, రెండు సంవ‌త్స‌రాల లోపు వాళ్లు, గ‌ర్భిణిలు, కేన్స‌ర్‌, అల్స‌ర్‌, కిడ్నీ త‌దిత‌ర దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తులు మాత్రం ఈ మందులు వాడ‌కూడ‌ద‌ని చెప్పారు. 2-5 ఏళ్లు మ‌ద్య‌వ‌య‌సు వారు ఒక డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్‌, 6-14 మ‌ధ్య వ‌య‌సువారు రెండు డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు, 15 ఏళ్లు పైబ‌డిన‌వారు 3 డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు.  

            జోన‌ల్ మ‌లేరియా అధికారి డాక్ట‌ర్ తిరుప‌తిరావు మాట్లాడుతూ, డిఇసి మాత్ర‌ల‌ను  ఆహారం తీసుకున్న త‌రువాత ఈ మాత్ర‌మే మింగాల‌ని సూచించారు. ఎవ‌రికైనా కొద్దిగా జ్వ‌రం, వాంతులు వ‌చ్చేన‌ట్టు అనిపించినా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. జిల్లాలో ఈ విడ‌త‌ 23,42,048 మందికి డిఇసి, ఆల్బెండ‌జోల్‌ మాత్ర‌ల‌ను  పంపిణీ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. దీనికోసం ఆశా, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, వ‌లంటీర్లు, ఎఎన్ఎంతో 9,472  బృందాల‌ను ఏర్పాటు చేసి, వారికి శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు తెలిపారు. అలాగే ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు 948 మంది ఆరోగ్య‌సిబ్బందిని సూప‌ర్‌వైజ‌ర్లుగా నియ‌మించిన‌ట్లు  తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎల్‌.రామ్మోహ‌న్‌, డిఐఓ డాక్ట‌ర్ నారాయ‌ణ‌, జిల్లా మ‌లేరియా అధికారి ఎం.తుల‌సి,  మ‌లేరియా క‌న్స‌ల్టెంట్ రామ‌చంద్రుడు, అర్బ‌న్ ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-07 09:41:20

విశాఖ జిల్లాలోనూ మొబైల్ వేక్సిన్ వాహనసేవలు..

విశాఖ జిల్లాలో అందుబాటులోకి వచ్చిన మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు (టీకా ఎక్స్ ప్రెస్ లు) సేవలను  సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వాహనాలను (టీకా ఎక్స్ ప్రెస్ లు) ను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ కేర్ ఇండియా సహకారంతో  జిల్లాకు 3 టీకా ఎక్స్ ప్రెస్ వాహనాలు  అందుబాటులోకి వచ్చాయని, పాడేరు, చింతపల్లి, అరకు ప్రధాన  స్థావరాలుగా ఈ వాహనాలు పని చేస్తాయని తెలిపారు.  ఈ వాహనాల ద్వారా  జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, హైరిస్క్ ప్రాంతాలలో  వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున  అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు  మొదటి డోసు, రెండవ డోసు తీసుకోలేని వారితో  పాటు 18 సంవత్సరాలు దాటిన వారందరికి  కోవిడ్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు.  వ్యాక్సినేషన్ తక్కువగా అయిన ప్రాంతాలలో మొభైల్ వ్యాక్సనేషన్  ద్వారా ముమ్మరంగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారి డా. ఎస్.జీవనరాణి, మాస్ మీడియా అధికారి  జయ ప్రసాద్, రత్నకుమారి,  కేర్ ఇండియా ప్రతినిధి  సుబ్రమణ్యం, గణాంక అధికారి రామచంద్రరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-10-07 09:18:11

ఏపీలో వైద్యరంగం మరింత బలోపేతం..

ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగాన్ని బలోపేతంచేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలోని ఛాతి ఆసుపత్రిలో,  పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి  ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల చెస్ట్ ఆసుపత్రిలో ఉన్న 300 బెడ్స్ కు గానూ 100 బెడ్స్ కు ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ప్రెషర్ స్వింగ్ అడ్సోప్షన్ (PSA plant) విధానంలో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేకుండా.. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. కేంద్రం 80 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల భాగస్వామ్యంతో మొత్తంగా.. 130 కోట్ల రూపాయలతో 1000 LPM సామర్థ్యం తో ఈ ప్లాంట్ నిర్మితమైందని అన్నారు. ఆధునాతనమైన ఈ ప్లాంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వైద్యం కోసం విశాఖపై ఆధారపడి ఉన్నాయని.. ఈ అవసరాలు గుర్తించే నగరంలోని ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుతం అభివృద్ధి చేస్తోందని అన్నారు. మొదటి వేవ్ లో  ఆక్సిజన్ సిలిండర్ల అవసరం అంతగా లేకపోయినా.. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో మరణాలు ఎక్కువగా సంభవించడం బాధాకరమని అన్నారు. థర్డ్ వేవ్ రాకూడదనే కోరుకుందామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులకు పూర్తి సన్నద్దంగా ఉందని అన్నారు. ప్రజలంతా  కరోనా నిబంధనలు పాటించాలని.. పండుగల సమయం కావడంతో ఎటువంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, వీఎం ఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, వైద్య శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ( ఐ పి ఎస్.ఎమ్ ఐ డి సి) ,  పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-10-07 07:13:13

టిటిడి ట్రస్టుబోర్డు సభ్యుడిగా జె.రామేశ్వ‌రరావు ..

తిరుమలతిరుపతి దేవస్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా  జె.రామేశ్వ‌ర రావు గురువారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి జె.రామేశ్వ‌ర రావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు,  సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-07 04:28:36

విమానాశ్రయ పర్యావరణం స్వచ్చతకు చర్యలు..

విమానాశ్రయ పర్యావరణం, పరిసరాలు  పరిశుభ్రంగా  వుండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఏ.మల్లికార్టున అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో నిర్వహించిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ డేగ, విమానాశ్రయం, పోర్టు, జివియంసి, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.   విమానాశ్రయం చుట్టుప్రక్కల పరిశుభ్రంగా వుంచాలని, మాంస దుకాణాలు తొలగించాలని, పారిశుధ్యపనులు చేపట్టాలని జివియంసి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా తగిన నిర్మాణాలు, పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు చూసుకోవాలన్నారు.  విమానాశ్రయం లోనికి పందులు, కుక్కలు మొదలైనవి చొరబడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.   ఈ సమావేశంలో  విమానాశ్రయ డైరక్టర్ కె.శ్రీనివాసరావు, ఎజియం స్టాలన్ కుమార్, ఐఎన్ఎస్ డేగ అధికారి శశాంక్ గుప్తా, ఆర్డీవో కె.పెంచలకిషోర్, జివియంసి వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, ఈ.ఈ. రత్నరాజు, ఇరిగేషన్ ఎస్.ఈ. కె.ఎస్.కుమార్, పోర్టుట్రస్ట్ ఎస్.ఈ. జి.వి.ఎస్.నారాయణ, హెచ్ పి సి ఎల్ అధికారి కమలేష్ సాహు తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-10-06 17:11:52

బ్రహ్మోత్సవాల పై ట్రీనీ ఐఏఎస్ లకు శిక్షణ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై  శిక్షణ కోసం ట్రైనీ ఐఏఎస్ లు బుధవారం తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసేదాకా వారు తిరుమలలో ఉండి అవగాహన కల్పించుకుంటారు. ఇందులోభాగంగా,  తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన వ్యవహారాలు, ఆలయాల నిర్వహణపై టిటిడి పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జేఈవో సదా భార్గవి ట్రైనీ ఐఏఎస్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ తో పాటు టీటీడీ లోని అన్ని విభాగాల పరిపాలన గురించి ఆమె తెలియజేశారు.  డిప్యూటీ ఈవోలు  దామోదరం రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

Tirumala

2021-10-06 14:26:58

ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలి..

విశాఖ జిల్లాలో ఎస్.సి, ఎస్.టి కేసులకు సంబందించి పెండింగ్  లేకుండా పరిశీలించి  వెంటనే  పరిష్కారం  చేయాలని  జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ మరియు మానటరింగ్ కమిటి చైర్మెన్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  బుధవారం  స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  డి.వి.ఎం .సి., ఎస్.సి., ఎస్.టి ఎట్రాసిటి  కేసులపై సమావేశాన్ని నిర్వహించారు. 
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో కులదృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా  పరిశీలించి పెండింగ్ లేకుండా  జారీ చేయాలని ఆదేశించారు. సుదీర్ఝంగా  అపరిష్కృతం కాని కేసులకు సంబందించి  తదుపరి నిర్వహించే సమావేశం లోపల పరిష్కారం చేయాలని  వాటికి సంబందించి ఎటువంటి చర్యలు చేపట్టినది తగు నివేదికను అందజేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  ఎస్.సి., ఎస్.టి ఎట్రాసిటి కేసులకు సంబందించి భాదితులకు సత్వర న్యాయం  చేసే ఉద్దేశ్యంతో    ఆదేశాలు జారీ చేసారన్నారు. భాదిత కేసులకు  పరిహారాన్నిత్వరితగతిన  అందజేయాలన్నారు.  అక్టోబరు నాలుగవ శనివారం డివిజన్  స్థాయి  విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటి సమావేశాన్ని  నిర్వహించి సంబందిత ప్రజా ప్రతినిధులను  ఆహ్వనించాలన్నారు.  జిల్లా కలెక్టర్ స్థాయిలో తాము కూడా పర్యటిస్తామన్నారు. 
అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బి.సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం  పాటు పడుతున్నారని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సబ్ డివిజన్ స్థాయి ఎస్.సి., ఎస్.టి మోనటరింగ్ సమావేశాలను ఏర్పాటు చేసినపుడు ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి నెల ‘సివిల్ రైట్స్ డే’ న దళిత గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను  తెలుసుకొని పరిష్కరించాలన్నారు. 
పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2013 నుండి నేటి వరకు పెండింగ్ లో ఉన్న ఎస్.సి., ఎస్.టి  ఎట్రాసిటి కేసులను నిర్దిష్టమైన కాల వ్యవధిలో పరిష్కరించాల్సిందిగా కోరారు.  అదే విదంగా ప్రభుత్వం అందజెస్తున్న జగనన్నతోడు , చేయూత పథకాలకు భగత ఉపతెగ గిరిజన సామాజిక వర్గంలో లేకపోవడం చేత  వారు ఆర్ధిక సహాయాన్ని అందుకోలేక పోతున్నారని, తగు న్యాయం చేయాల్సిందిగా  కలెక్టర్ కు సూచించారు. 
డి.వి.ఎం.సి కమిటి సభ్యులు పి.మల్లేశ్వరరావు, జోసఫ్ మాట్లాడుతూ  ఎస్.సి కార్పోరేషన్ కు సంబందించి నిర్వహిస్తున్న  షాపింగ్ కాంప్లెక్స్ లో 40 సంవత్సరాలు నుండి ఒక్కరికే తక్కువ అద్దేకు  ఇచ్చారని, ఎస్.సి లబ్దిదారులకు చెందిన షాపులను వేరే కులాల వారు అద్దెకు నడుపుతున్నారని, తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు. ఎస్.సి., ఎస్.టి బాధితులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎటువంటి స్పందన లేకుండా కేసులను కట్టడం లేదని కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని తెలిపారు. పెందుర్తి మండలం నరవలో హౌసింగ్ స్కీమ్ కు సంబందించి స్థలాలను   అగ్ర కులాస్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ లను కట్టుకొన్నారని తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు.  
సాంఘీక సంక్షేమ శాఖ జెడి  రమణమూర్తి మాట్లాడుతూ  జిల్లాలో  (UI) అండర్ ఇన్విస్టి గేషన్ కేసులు  పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో మొత్తం 219 కేసులు  పెండింగ్ కాగా 50 కేసులు పరిష్కారమైయాయని మిగలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు.  PT కేసులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 718 పెండింగ్ కాగా  ఒకటి మాత్రమే పరిష్కారమైనదని మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు. UI కేసులు   146, PT కేసులు 549 పట్టణ సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్నాయన్నారు.  అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు , చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో UI  కేసులు 78,  PT కేసులు 209 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  2011 సంవత్సరం నుండి నేటి వరకు లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలించి సత్వర పరిష్కారం చేయాలన్నారు. 
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు  జి.మాధవి, ఎస్.పి బి.కృష్ణారావు,  జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల రెడ్డి, అరుణ్ బాబు, పి.ఓ ఐ.టి.డి.ఎ., గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అబిషేక్, విశాఖపట్నం, నర్సీపట్నం ఆర్ డి ఓ లు పెంచల కిశోర్, ఆర్.గోవిందరావు, జిల్లా మరియు  పోలీస్ అధికారులు హాజరైయ్యారు. 

Visakhapatnam

2021-10-06 12:37:52

తరాలు గుర్తుంచుకునేలా వ్యవసాయరంగం అభివ్రుద్ధి..

త‌ర‌త‌రాలు గుర్తుంచుకునేలా రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప‌టిష్ట వ్య‌వ‌స్థ నిర్మాణం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని క్యాంపు కార్యాల‌యంలో మంత్రి క‌న్న‌బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక వ‌స‌తుల అభివృద్ధి జ‌రుగుతోంద‌ని, రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్‌, వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా వంటి ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అమ‌లుచేస్తోంద‌ని తెలిపారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏదైనా విప‌త్తు వ‌ల్ల పంట న‌ష్టం జ‌రిగితే అదే సీజ‌న్‌లో ప‌రిహారం చెల్లిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ముందే చెప్పిన ప్ర‌కారం పెట్టుబ‌డి సాయం ద‌గ్గ‌రి నుంచి పంట న‌ష్ట ప‌రిహారం వ‌ర‌కు ప్ర‌ణాళిక ప్ర‌కారం వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చుతున్న‌ట్లు వివ‌రించారు. వ్య‌వసాయ విద్యుత్ కనెక్ష‌న్ల‌కు మీట‌ర్లు బిగించ‌డం వ‌ల్ల ఒక్క రూపాయి కూడా రైతుపై భారం ప‌డ‌ద‌ని.. పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ ఉండాల‌నే ఉద్దేశంతో మీట‌ర్ల బిగింపు జ‌రుగుతుంద‌న్నారు. 96 శాతం మంది రైతులు దీనిపై సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు. బ‌కాయిలు లేకుండా విద్యుత్ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు జ‌రిపేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఏ పంట‌కు ఎంత మ‌ద్ద‌తు ధ‌ర అనే స‌మాచారాన్ని రైతు భ‌రోసా కేంద్రాల్లో ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు. 2020-21లో రాష్ట్రంలో రైతుల నుంచి రూ.15,487 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన‌ట్లు చెప్పారు. గ‌తంలో మాదిరి బీమా ప్రీమియం చెల్లించ‌న‌వ‌స‌రం లేకుండా.. ఈ-క్రాప్ బుకింగ్ చేస్తే చాలు.. పంట బీమా అందుతుంద‌న్నారు. 2019-20, 2020-21 రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నేరుగా రైతుల‌కు మొత్తం రూ.3,716 కోట్ల మేర బీమా చెల్లింపులు చేసిన‌ట్లు తెలిపారు. రూ.15 వేల కోట్ల‌తో గ్రామాల్లో మ‌ల్టీ ప‌ర్ప‌స్ ఫెసిలిటీ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని.. ఇందులో భాగంగా గ్రామీణ గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, కోల్డ్‌రూంలు,  గ్రేడింగ్ యూనిట్లు త‌దిత‌రాలు ఏర్పాటుకానున్నాయ‌ని వివ‌రించారు. వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాల ఉత్ప‌త్తుల‌కు విలువ జోడింపు ల‌క్ష్యంతో ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్కటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు దాదాపు రూ.3000 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ అడ్వ‌యిజ‌రీ బోర్డుల‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌తి నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా రాష్ట్ర స్థాయి నుంచి ఆర్‌బీకే స్థాయి వ‌ర‌కు స‌మావేశాలు నిర్వ‌హించి రైతుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటూ వాటి ఆధారంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోందంటే రైతుల సంక్షేమంపై ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధి ఏమిటో తెలుస్తోంద‌న్నారు. వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ కింద రెండేళ్ల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.17,030 కోట్ల 23 ల‌క్ష‌లు నేరుగా అందించ‌డం జ‌రిగింద‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డా ఎరువుల కొర‌త లేద‌ని, ప్ర‌స్తుతం ఏడు ల‌క్ష‌ల 38 వేల ట‌న్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. ఆర్‌బీకేల ద్వారా ఎరువుల స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ట్లు మంత్రి క‌న్న‌బాబు తెలిపారు.
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఓ అన్న‌గా ఆలోచించి.. బాధ్య‌త‌తో స్వేచ్ఛ వంటి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రికి అంద‌రు విద్యార్థినుల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా మ‌హ‌ళ‌ల అభివృద్ధికి ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు, అభివృద్ధికి రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న కార్య‌క్ర‌మాలు, పథ‌కాలు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ఉన్నాయ‌న్నారు. మ‌హిళా సాధికార‌త క‌మిటీ త‌ర‌ఫున ఇటీవ‌ల 12 రాష్ట్రాల నుంచి దాదాపు 16 మంది ఎంపీలు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించార‌ని.. దిశ బిల్లు గురించి తెలుసుకొని, అదే విధంగా రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను చూసి ఆశ్చ‌ర్యపోయార‌ని తెలిపారు. తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను మెచ్చుకున్నార‌ని ఎంపీ గీత వెల్ల‌డించారు.

Kakinada

2021-10-06 11:56:59

సింహాద్రి అప్పన్నకు గంట్ల ప్రత్యేక పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారిని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు, దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు. బుధవారం ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం ద్రుష్టికి జర్నలిస్టుల ప్రధాన సమస్యలు తీసుకెళ్లినట్టు చెప్పారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు వచ్చేలా క్రుషి చేస్తున్నట్టు శ్రీనుబాబు వివరించారు.

Simhachalam

2021-10-06 05:24:52

పెండింగు బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలి..

శ్రీకాకుళం  జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలని, నెల రోజుల తదుపరి బిల్లులు పెండింగులో ఉంటే ఉపేక్షించేది లేదని  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత గృహ నిర్మాణాల జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన పెండింగు బిల్లులపై దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణపు పనులకు సంబంధించిన బిల్లులు వారంలోగా వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఇసుక, సిమెంటు, ఐరన్ సరఫరాపై ప్రతి లబ్ధిదారునికి వివరాలు తెలియజేయాలని, నిధులు లేవనే నెపంతో పనుల్లో జాప్యం జరగరాదని జె.సి స్పష్టం చేసారు. ప్రతి ఏ.ఇ.ఇ కూడా వారి  పరిధిలోని గ్రామ సచివాలయాలను తప్పనిసరిగా పర్యటించాలని, ప్రతి రోజూ 5 నుండి 10 మంది లబ్ధిదారులతో మాట్లాడి వారి గృహ నిర్మాణపు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.  గృహాలు మంజూరైన స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు బ్యాంకుల నుండి రుణాలు పొంది వాటిని పూర్తిచేసుకునే విధంగా విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సిమెంటు సరఫరా ఎక్కువగా ఉన్నచోట పనులు వేగవంతం చేయాలని, ఇసుక కొరత సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు జె.సి వివరించారు. 

తక్కువ గృహ నిర్మాణాలు చేపట్టిన  మండలాల్లో ఏ.ఇ.ఇలు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతీ మండలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న గృహనిర్మాణాలను పరిశీలిస్తామని అన్నారు. గృహ లబ్ధిదారుల పేర్లు మరియు వారి సెల్ ఫోన్ నెంబర్లు సంబంధిత ఏ.ఇ.ఇల వద్ద అందుబాటులో ఉండాలని, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సరైన స్పందన లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే అప్ లోడ్ చేయాలని, నెల రోజుల తదుపరి పెండింగులో బిల్లులు ఉంటే ఉపేక్షించేది లేదని అన్నారు. గృహ నిర్మాణాల్లో సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. బిల్లులు చెల్లింపులు జరిగితే మరిన్ని నిధులు జిల్లాకు విడుదల అవుతాయని, దానివలన మరిన్ని గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం కలుగుతుందని జె.సి ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు ఎన్.గణపతి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.  

 

Srikakulam

2021-10-05 14:21:16

త్వరతగతిన కాలువల్లో పూడిక తీయండి..

అనంతపురం నగర పరిధిలోని కాలువల్లో పూడికతీత చేయకపోవడం వల్ల డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వస్తోందని వెంటనే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆదేశించారు. నగరంలోని 37 డివిజన్ లో మంగళవారం మేయర్  స్థానిక కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డితో కలసి పర్యటించారు. డివిజన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో మురుగునీరు రోడ్డుపైకి వస్తుండటంతో పాటు కాళీ స్థలాలలో ముళ్ల కంపలు పెరిగిపోయి పందులు వస్తుందటమే కాకుండా పారిశుద్ధ్య సమస్యతో దుర్గంధం వస్తోందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ కాలువల శుభ్రతను వెంటనే చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.అదే విధంగా కాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని శుభ్రం చేయించేలా చూడాలని సూచించారు. మేయర్ వెంట కార్యక్రమంలో ఈ ఈ రామ్మోహన్ రెడ్డి డి ఈ లు నరసింహులు, రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-10-05 14:18:12

సాంకేతికను రైతుల వద్దకు తీసుకువెళ్లాలి..

ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులు అందుకునేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవన, మత్స్యశాఖలకు సంబంధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. గులాబ్ తుఫాను పంట నష్టాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన పంట విస్తీర్ణం సాధారణ విస్తీర్ణం లో 86% ఉన్నందున రికన్సిల్ చేసుకోవాలని సూచించారు. ముందుగా ఈ క్రాప్ పూర్తయితేనే పంట నష్టం, బీమా, రైతు భరోసా మొదలైనవన్నీ రైతులు పొందగలరని చెప్పారు. ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు శిక్షణలు పెంచాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది పనితనం మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.
రైతులకు మేలు చేసే కొత్త వంగడాలను గూర్చి అవగాహన కల్పించి ఉద్యానవన పంటలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. పట్టు పరిశ్రమ గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గిరిజన రైతులకు లోతైన సంపూర్ణమైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. 
ఎక్కువగా క్షేత్ర పర్యటనలు చేయాలని పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మొదలైన వాటికి తెగులు రాకుండా ముందుగా వ్యాక్సినేషన్, అవసరమైన జాగ్రత్తల గూర్చి తెలియజేయాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. జిల్లాలో మత్స్య పరిశ్రమ గురించి సమీక్షిస్తూ కేజ్ కల్చర్ ను మరింత అభివృద్ధి చేయాలన్నారు హేచరీలలోఉత్ప్రేరకాలను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎమ్. వేణుగోపాల రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి, పశుసంవర్ధక శాఖ జె.డి. రామకృష్ణ, మత్స్య శాఖ జే.డీ. లక్ష్మణరావు ఉద్యానవన శాఖ డి.డి.  పట్టు పరిశ్రమ శాఖ జె.డి. తదితరులు పాల్గొన్నారు

Visakhapatnam

2021-10-05 13:39:24

కిశోర బాలికల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం..

కిశోర బాలికల ఆరోగ్యము, పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్చ అనే కార్యక్రమాన్ని రూపొందిం చడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్. జనన్మోహన రెడ్డి తెలిపారు.  మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా ‘స్వేచ్చ’   కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్ నాప్కిన్లు నెలకు 10 చొప్పున సంవత్సరానికి 120 నాప్కిన్లు అందజేసే కార్యక్రమంలో జిల్లా పరిషత్ చంద్రంపాలెం, ఉన్నత పాఠశాల నుంచి  పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున, పార్లమెంటు  సభ్యురాలు గొడ్డేటి మాధవి,   ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి మీకు కావలసిన వాటిని అన్నింటిని అందజేస్తున్నారని, మీరు అందరూ బాగా చదువుకుని దేశ అభివృద్దికి  కృషి చేయాలన్నారు. మీ కోసం ‘దిశయాప్’ప్రవేశ పెట్టి బద్రతను కల్పించారన్నారు.  జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ‘స్వేచ్చ’కార్యక్రమం  ఈ రోజు లాంచింగ్ జరిగిందని,  అందరూ వినియోగించి ఆరోగ్యంగా ఉండాలన్నారు.  ప్రతి పాఠశాలకు ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఒక ‘స్వేచ్చ’నోడల్ అధికారిని నియమిస్తారని తెలిపారు. పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ ‘స్వేచ్చ’ఇది ఆడపిల్లలందరికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం అని, మన ముఖ్యమంత్రి ఈ సమస్యను అధిగమించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.  మనం తీసుకునే జాగ్రత్తలు మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.ఆర్.డి.ఎ ఛైర్ పర్సన్  అక్కరమాని విజయనిర్మల,  జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జల్లపల్లి సుభద్ర,  జిల్లా విద్యాశాఖాధికారి,  ప్రాజెక్టు అధికారి, (స్త్రీ శిశు సంక్షేమ శాఖ,) పలువురు విద్యార్ధినులు  పాల్గొన్నారు. 

Chandrampalem

2021-10-05 13:37:00

రైతుల‌ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి..

రైతుల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌పై, స‌మస్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావు అగ్రిక‌ల్చ‌ర్ అసిస్టెంట్ల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న పాచిపెంట-1, 2 రైతు భ‌రోసా కేంద్రాల‌ను, సాలూరు బీసీ కాల‌నీ, దేవ‌ర‌వీధిలోని రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై సిబ్బందిని ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా వివిధ‌ రికార్డుల‌ను ప‌రిశీలించారు. వ్య‌వ‌సాయ సంబంధిత స‌మ‌స్య‌ల‌పై రైతుల వ‌చ్చిన‌ప్పుడు వారితో విన‌యంగా మాట్లాడాల‌ని, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక చొరవ తీసుకోవాల‌ని సిబ్బందికి సూచించారు. విధుల నిర్వ‌హ‌ణ‌లో బాధ్య‌త‌గా మెల‌గాల‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌ల గురించి, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. ఆయ‌న వెంట స్థానిక అధికారులు, స‌చివాల‌య ఉద్యోగులు, ఇత‌ర సిబ్బంది ఉన్నారు.

జె.వెంకటాపురం

2021-10-05 13:06:36