1 ENS Live Breaking News

ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్..

శ్రీకాకుళం జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఫ్రీడం రన్ ఘనంగా జరిగింది. శనివారం ఉదయం అరసవిల్లి కూడలి నుండి ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంను పోలీస్ పోలీసు పిర్యాదుల అధారిటీ సభ్యులు పి. రజనీకాంతరావు ప్రారంభించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంతరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల జరుపుకుంటున్న సందర్భంగా మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావులు అసువులు బాసి స్వాతంత్రాన్ని సాధించి స్వేచ్ఛ జీవితాలను ప్రజలు గడుపుటకు కారకులయ్యారని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగం కావాలని ఆయన చెప్పారు. అభివృద్ధి పై అవగాహన పెంచుకుని మహోన్నత దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.  నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయ అధికారి జి.మహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 744 జిల్లాల్లో అమృత మహోత్సవం ర్యాలీలు నిర్వహించుటకు అనుమతించటం జరిగిందని, అందులో శ్రీకాకుళం జిల్లా ఒకటని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.వి.ఎస్.వి జమదగ్ని, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రామారావు, నెహ్రూ యువ కేంద్ర పరిపాలన అధికారి డి. శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థలు, యువత పాల్గొన్నారు.

Srikakulam

2021-09-11 10:18:26

జీవితంలో ఎదగాలంటే లక్ష్యం కావాలి..

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఒక ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకొని,అందుకోసం చిత్త శిద్ధి తో ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. తల్లి దండ్రులతో పాటు గురువులను  గౌరవించాలని,   అప్పుడే మన విజయాలకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. శనివారం సెంచురియన్ యూనివర్సిటీని కలెక్టర్ సందర్శించారు.  విద్యార్థులనుద్దేశించి  ముందుగా ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ముగ్ధులైన  విద్యార్థులు   అనేక  ప్రశ్నలను సంధించారు. విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మాట్లాడుతూ కెరీర్ గురించి, జీవితం లో ఎలా ఎదగాలి,  ఎలా మెలగాలనే అంశాలను  సున్నితంగా వివరించారు.   ముఖా ముఖి లో  విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  పలు ప్రశ్నలకు స్పందిస్తూ సివిల్ సర్వీస్ ఉద్యోగం లో  అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని, వాటిని అధిగమించి కష్టపడితే అంతకు మించిన గుర్తింపు, గౌరవం తో పాటు  వృత్తి పరమైన సంతృప్తి  ఉంటుందని వివరించారు.  వత్తిడిని ఎదుర్కోవడానికి పిల్లలు తల్లి దండ్రులతో దృఢమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలని, ఎంత  బాధ నైనా వారితో పంచుకుంటే తగ్గిపోతుందని హితవు పలికారు.  సోషల్ మీడియా లో అనవసర విషయాల పై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోకూడదని అన్నారు. ముఖ్యంగా  శారీరకంగా, మానసికంగా  దృడంగా ఉండాలని, ప్రతి అంశాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలని అన్నారు. దివ్యాంగుల  కోసం ఒక వృత్తి  కోర్స్ ను  నిర్వహించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని కలెక్టర్ కోరారు. కోవిడ్ వాక్సినేషన్ అందరికి వేయించాలి, ప్రత్యేకంగా కోవిడ్ నిబంధనల పై అవగాహన కలిగించాలని అన్నారు.    యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.జి.ఎస్.ఎన్. రాజు  యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న కోర్స్ ల పై, ప్లేస్మెంట్స్, ఇతర పరిశ్రమలు, సంస్థల తో  అనుసంధానం తదితర  వివరాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఆచార్యులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్   డా.శాంతమ్మ  గారి చేతుల మీదుగా కలెక్టర్ ను సన్మానించి  జ్ఞాపిక ను అందజేశారు.  ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ గోపినాధ్, డీన్లు  డా. రమణా రావు, డా.ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-11 10:17:28

రణమా.. రాజీనా మీరే నిర్ణయించు కోండి!

శ్రీకాకుళం జిల్లాలో చాలాకాలం నుండి పెండింగు లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు చక్క ని వేదిక లోక్ అదాలత్ అని, కావున కక్షిదారులు లోక్ అదా లత్ ను సద్వినియోగం చేసుకో వాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సమయం లేదు మిత్రమా! రణమా ... శరణమా.. అని ఓ కవి చెప్పారని, అదేవిధంగా ఇక్కడ కూడ సమయం లేదు మిత్రమా.. రణమా లేదా రాజీ నా అని కక్షిదారులు నిర్ణయిం చుకోవలసిన సమయం ఆసన్న మైందని ప్రధాన న్యాయమూర్తి పోల్చిచెప్పారు. తమ కేసుల విషయమై గొడవలు పడి,ధనాన్ని, సమయాన్ని వృదాచేసుకునే బదులుగా కక్షిదారులు రాజీతో తక్షణమే కేసులను పరిష్కరించు కోవచ్చని చెప్పారు. తమ కేసుల కొరకు ఇతర కోర్టులను ఆశ్రయించడం వలన ఒకరికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందని అన్నారు. కాని లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్నందున ఇరువైపులా విజేతలు అవుతారని వివరించారు. ఇతర కోర్టులలో గెలుపొందిన కేసుల్లో కక్షిదారులు ఇతర కోర్టు లను ఆశ్రయించవచ్చని,కాని లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పే తుది తీర్పు అయినందున, ఇతర కోర్టులను ఆశ్రయించా ల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. జిల్లాలో 23 వేల వరకు కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అన్నారు. రాష్ట్ర ఉన్నత  న్యాయస్థానం పిలుపు మేరకు ప్రతీ రెండు మాసాలకు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని, కక్షిదారు లకు ఇదొక మంచి అవకాశం అని వివరించారు. గత లోక్ అదాలత్ ద్వారా జిల్లావ్యా ప్తంగా 2 వేల కేసుల వరకు పరిష్కరించడం జరిగిందని, ప్రస్తుతం ఈ అదాలత్ ద్వారా సుమారు 14 వందల వరకు కక్షిదారులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ కేసులన్ని పరిష్కరించనున్నట్లు తెలి పారు. లోక్ అదాలత్ ను ఆశ్రయించే కక్షిదారులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదని, దీనివలన ధనము,సమయం ఆదా అవుతుందని చెప్పారు. జిల్లా ప్రధాన కేంద్రంలో 4 బెంచు లతో పాటు జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు పరిష్కారం కాని కేసుల విషయమై కక్షిదారులు పునరాలోచించి లోక్ అదాలత్ ను ఆశ్రయించి తమ కేసులను సత్వరమే పరిష్కరించు కోవా లని ఆయన కోరారు.  

అనంతరం ఆమదాలవలసకు చెందిన 4గురు కక్షిదారులకు 3 లక్షల 60 వేల రూపాయల అవార్డును  ప్రకటించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలి కోర్టు 3వ అదనపు జిల్లా న్యాయ మూర్తి పి.అన్నపూర్ణ, 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి. వెంకటేశ్వర్లు, శాస్వత లోక్ అదాలత్ ( పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ ) చైర్మన్ ఏ.గాయత్రి దేవి, సీనియర్ సివిల్ జడ్జి మరి యు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.అనురాధ, టౌన్ డి.ఎస్.పి ఎం.మహీంద్ర, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, ప్రత్యేక సంచార కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.సౌమ్య జోసఫిన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్ఠు రమేష్, కార్యదర్శి కృష్ణప్రసాద్, న్యాయవాదులు పి.మల్లిబాబు, డా.జి.ఇందిరాప్రసాద్, శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు పి.చం ద్రపతిరావు, ఇతర న్యాయ మూర్తులు,న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-11 10:16:29

అనుబంధాలతో ఆత్మహత్యల నియంత్రణ..

కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు పెంచుకోవడం, ఒకరికొకరు ఆత్మీయతను పంచుకోవడం ద్వారా, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సూచించారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జూమ్ వెబ్‌నార్లో, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి కుటుంబ వ్యవస్థలో, తల్లితండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లలు, యువత తాము ఒంటరి తనానినికి లోనై, ఒత్తిడికి గురి అయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పిల్లల్లో, యువతీయువకుల్లో ఒంటరితనాన్ని పారద్రోలే చర్యలు చేపట్టాలని అన్నారు. పిల్లల మనసును చదువుతో పాటు, ఆటలు, వ్యాయామం, కళలు తదితర అంశాలపై  మల్లింపజేయాలని సూచించారు. అహ్లాదకరమైన కుటుంబ వాతావరణన్ని కల్పించాలని  కోరారు. నేటి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా మారాలని, మానసికంగా ప్రశాంతంగా,  అలజడి లేకుండా ఉన్నపుడు మాత్రమే ఒత్తిడిని అధిగమించవచ్చును కలెక్టర్ స్పష్టం చేశారు. అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్(ఆసరా) జె. వెంకటరావు మాట్లాడుతూ,  ఉద్యోగ రీత్యా అందరికి పని ఒత్తిడి ఉన్నపటీకి, దానికీ కుటుంబానికి సమన్యాయం చేసుకోవాలని సూచించారు.  ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవడం తోబాటు,  మనం చేసే పనిని ఇష్టంగా చేయడం వలన పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.  జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, జిల్లా యువజన సమన్వయాధికారి  జి.విక్రమాదిత్య మాట్లాడారు.  ఆత్మహత్యల నివారణ మరియు యువ సంకల్ప బలం గురించి వివరించారు. వెబ్ నార్లో భాగంగా, ఆత్మహత్య నివారణ మరియు మానసిక సంసిద్దత అనే అంశాల పై, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ జాగరపు ప్రసంగించారు. ఆయుష్ వైద్యులు డాక్టర్ స్వప్న చైతన్య మాట్లాడుతూ,  యోగ చికిత్స ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించే విధానాలను వివరించారు. 

Vizianagaram

2021-09-10 11:51:08

గణపతిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్..

శ్రీ శ్రీ శ్రీ సిద్ధిబుద్ధి సహిత వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ శుక్రవారం దర్శించుకున్నారు. గణపతి నవరాత్రి లో భాగంగా స్థానిక పురుషోత్తంనగర్ లో గల  పంచాయతన దేవాలయంలో ఏర్పాటుచేసిన గణపతిని  కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పి జగన్మోహన్ రావు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ వనమోలి వెంకటరమణ శర్మ, రంపా వెంకటరమణ, రామ కృష్ణ, లక్ష్మీనారాయణ శర్మ కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తొలుత ఆలయ విశిష్టతను ధర్మకర్త కలెక్టర్ కు  వివరించారు. వినాయక చవితి పర్వదినాన గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.జగన్మోహన్ రావు,సి.వి.ఎన్. మూర్తి, పి.వి.ఆర్.ఎం.పట్నాయక్, పి.వైకుంఠరావు,పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-10 10:27:36

ఏకాంతంగా బాలాల‌య కార్యక్రమాలు..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాలు రెండో రోజైన శుక్రవారం ఏకాంతంగా జరిగాయి. ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం, సాయంత్రం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో  ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్  ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

Tirupati

2021-09-10 10:26:21

నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న గ్రామ సచివాలయాలు,  రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ ల్రైబరీలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి పనులను స్వయంగా పర్యవేక్షిస్తామని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కెలు, బిఎంసిలు, డి.ఎల్.బిలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణపు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, తహశీల్ధారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన నిర్మాణపు పనుల్లో  30 శాతం పురోగతి సాధించడం పట్ల అసహనం వ్యక్తం చేసారు.  మిగిలిన జిల్లాలతో పోలిస్తే జిల్లాలో పురోగతి అధ్వాన్వంగా ఉందని, అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసినప్పటికీ పనుల పురోగతి మాత్రం కనిపించడం లేదని, పనులు పూర్తిచేస్తే మరిన్ని నిధులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కాని అధికారుల నిర్లక్ష్యం వలన సుమారు రూ.100 కోట్ల నిధులు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి అధికారులకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాల్సి ఉండగా, ఇంతవరకు 20 నుండి 30 శాతం లక్ష్యాలను పూర్తిచేయడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.  ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సహకారంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తే తప్పా నెలాఖరు నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించలేరని హితవు పలికారు. నిర్ధేశించిన లక్ష్యాలపై అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి అనుకున్న సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న బిల్లులు సమర్పించడంలో కొంత పురోగతి కనిపించిందని, పనులు పూర్తిచేసి బిల్లులు పెండింగులో ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే సిమెంటు సరఫరా లేదని అధికారులు తెలిపారని, వాటిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న మండలాల్లో రెవిన్యూ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఇంజినీరింగ్ అధికారులు, తహశీల్ధారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-09 14:48:20

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు..

అన్నవరం శ్రీశ్రీశ్రీ సత్యదేవుని దేవస్థానంలో స్వామివారి హుండీల ద్వారా ఒక కోటి 95 లక్షల 39వేల 657 రూపాయాలు ఆదాయం వచ్చిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. గురువారం దేవస్థానంలో స్వామివారి పరకామణి లెక్కింపు జరింగింది. అందులో భక్తుల నుంచి నగదుతో పాటు 90 గ్రాముల బంగారం, 15 వెండి వచ్చిందని మీడియాకి తెలియజేశారు. కోవిడ్  నిబంధనలు అనుసరిస్తూ హుండీల ఆదాయం లెక్కింపు చేసినట్టు ఈఓ తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన పీఆర్వో కొండలరావు,  అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అన్నవరం

2021-09-09 14:37:48

ఖాతాదారులకు మంచి సేవలు అందించాలి..

ఖాతాదారులకు మంచి సేవలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ పదవ వార్షికోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఖాతాదారులకు మంచి సేవలు అందించడం వలన బ్యాంకుల పట్ల నమ్మకం పెరుగుతుందని, వాటి సేవలు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అన్నారు. బ్యాంకులతో ప్రతి వ్యక్తికి సంబంధం ఉంటుందని ఆయన పేర్కొంటూ ఇంటికి సంబంధించిన ప్రణాళికలు, పొదుపు, వ్యయాలతో బ్యాంకు ఖాతాలు ముడిపడి ఉంటాయని అన్నారు. సామాన్యునికి బ్యాంకులతో బలమైన బంధం ఉంటుందని, సమాజంలో  నిరక్షరాస్యత తదితర కారణాల వలన వినియోగదారులు ఎక్కువగా ప్రత్యక్షంగా బ్యాంకు సేవలు వినియోగించుకుంటా రని ఆయన చెప్పారు. బ్యాంకు సిబ్బంది  ప్రజా సంబంధాలు ఉండాలని, సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. భారతీయ స్టేట్ బ్యాంకు రీజనల్ మేనేజర్ తపోదన్ దేహారీ మాట్లాడుతూ బ్యాంకు శాఖలు వినియోగదారులకు మంచి సేవలను అందించుటకు ఎప్పుడు కృషి చేస్తున్నామన్నారు. డిజిటల్ బాగా అందుతున్నాయని ఆయన వివరించారు. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ డబ్ల్యు. కిరణ్ బాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఎస్.బి.ఐ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ క్లబ్ లో ఉందన్నారు. ఖాతాదారుల పూర్తి సహాయ సహకారాలు వలన ఇది సాధ్యం అయిందని చెప్పారు. శాఖలో అతి తక్కువ సమయంలో ఖాతాదారులకు సేవలు అందించడం లక్ష్యంగా పని జరుగుతోందన్నారు. విశ్రాంత తహశీల్దార్ డి.పి. దేవ్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ శాఖ సొంత శాఖగా పరిగనిస్తున్నామని అన్నారు. ఖాతాదారులకు హాకర్స్ నుండి భద్రత ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి చిన్నారావు మాట్లాడుతూ బ్యాంకు సేవలు బాగున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ కేక్ ను కట్ చేసారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎల్.రమేష్, బ్యాంకు అధికారులు పి.ఎస్.కామేశ్వర రావు, పుష్ప, ఇతర సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-09 11:20:03

మ‌రిన్ని పుర‌స్కారాలు గెలుచుకోవాలి..కలెక్టర్

ప్ర‌తిభ‌ను మెరుగుప‌ర్చుకొని, మ‌రిన్ని అవార్డుల‌ను సాధించి జిల్లాకు గొప్ప‌పేరు తేవాల‌ని, ఇన్‌స్పైర్ అవార్డు గ్ర‌హీత ర‌మేష్‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి అభినందించారు. జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్ అవార్డును గెలుచుకున్న‌, గంట్యాడ మండ‌లం బుడ‌త‌నాప‌ల్లి పాఠ‌శాల 9వ త‌ర‌గ‌తి విద్యార్థి బొబ్బిలి ర‌మేష్‌, ఉపాధ్యాయులు గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అవార్డు గ్ర‌హీత‌ ర‌మేష్‌కు క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, త‌న సంత‌కంతో కూడిన‌ పుస్త‌కాన్ని బ‌హూక‌రించారు. అత‌ని కుటుంబ నేప‌థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అవార్డు సాధించిన అంశాల‌పై ప్ర‌శ్నించారు. స్వ‌చ్ఛ‌భార‌త్ నిర్మాణంలో గ‌ణిత స‌హ‌కారం అన్న త‌న ప్రాజెక్టుకు అవార్డు వ‌చ్చింద‌ని ర‌మేష్ తెలిపారు. త‌క్కువ విస్తీర్ణంలో, త‌క్కువ ఖ‌ర్చుతో మ‌రుగుదొడ్డి ట్యాంకును మ‌రియు మ‌రుగుదొడ్ల‌ను నిర్మించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలిపారు.  దీనివ‌ల్ల ప్ర‌భుత్వం ఇచ్చిన డ‌బ్బుతోనే ప్ర‌తీ ఇంటికీ మ‌రుగుదొడ్డి నిర్మించుకోవ‌చ్చని ఆయ‌న క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.  బాగా చ‌దువుకోవాల‌ని, మ‌రిన్ని అవార్డుల‌ను సాధించాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు. సాధ‌న ద్వారా అన్ని అంశాల‌పైనా బాగా ప‌ట్టు సాధించవ‌చ్చ‌ని సూచించారు. జిల్లాకు జాతీయ స్థాయి అవార్డును తీసుకురావ‌డం అభినంద‌నీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌శంసించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.ల‌క్ష్మ‌ణరావు, రాజీవ్ విద్యామిష‌న్‌ ఏపిసి డి.కీర్తి, ప్రాజెక్టుకు గైడ్స్‌గా వ్య‌వ‌హ‌రించిన లెక్క‌ల టీచ‌ర్లు ఆర్‌.స‌త్యారావు, కె.భాస్క‌ర‌రావు, జిల్లా సైన్సు అధికారి బ‌ల్లా శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-09 10:32:14

ఒంటిమిట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు..

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా  సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌,  మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన  చేప‌ట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపడతారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్  రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Ontimitta

2021-09-09 10:28:14

లబ్దిదారుల జాబితాలు నోటీసు బోర్డులో పెట్టాలి..

ప్రజలకు అందించే సేవలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా లను తప్పనిసరిగా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం కె.వి పల్లి మండలం లోని గ్యారంపల్లి  గ్రామ  సచివాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయము ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించకపోవడం పట్ల  అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలు మార్గదర్శకాలు గురించి కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామంలో 2596 మంది జనాభా ఉన్నారు అని ఇందులో 45 సంవత్సరాలు నిండిన వారు 652 మంది ఉండగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అందరికీ పూర్తి అయిందని 18 సంవత్సరాల పైబడిన వారు నాలుగు వందల ముప్పై మందిని గుర్తించాలని కలెక్టర్ కు తెలిపారు. గ్రామములు మొత్తం పదకొండు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని 530 ఎకరాలలో వేరుశెనగ , 535 ఎకరాలలో వరి పంట, టమోటా మామిడి పంటలు వేయడం జరిగిందని ఇందుకు సంబంధించి ఈ క్రాఫ్ బుకింగ్ కార్యక్రమం పూర్తి అయిందని ఈ కేవైసీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భూ ఆక్రమణలు గురించి శ్రద్ధగా చూడాలని, రికార్డులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉండాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అధిక దిగుబడి పొందేందుకు వేరుశెనగలో పొలంబడి కార్యక్రమంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. గ్యారం పల్లి నుంచి శెట్టి వారి పల్లి వరకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం ను పరిశీలించారు. ఉద్యానవన పంటల కింద     వెంకటరమణా రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మామిడి పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తోంది అనే వివరాలు గురించి ప్రశ్నించారు . ఈ సందర్భంగా ఆయన మూడు ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ సహాయం అందుతుందని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో జయప్రకాశ్ అని రైతు సాగుచేస్తున్న టమోటా పరిశీలించారు. మల్చింగ్ వేయడం ద్వారా కలుపు నివారించడం వలన రైతులు అదనపు ఆదాయం వస్తుందని కూలీల ఖర్చును లేకుండా చేసుకోగలగు తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టమోటా మార్కెట్ ను ఏ విధంగా చేసుకుంటున్నారని మంచి ధరలు లభించాలంటే ఈ పద్దతిని పాటిస్తే బాగుంటుంది అని కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ తాసిల్దారు నాగ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

గ్యారంపల్లి

2021-09-09 10:27:02

ఒంటిమిట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు..

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా  సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌,  మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన  చేప‌ట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపడతారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్  రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Ontimitta

2021-09-09 09:09:06

నగరంలో వ్యాధులు ప్రభలకుండా చూడాలి..

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాపించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన మలేరియా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె 4వ జోన్ 33 వార్డు పరిధిలో బంగారుమెట్ట పరిసర ప్రాంతాలలో పర్యటించి, డోర్ నెం. 31-34-99 ఇంటిలో 11 సంవత్సరాల భరత్ అనే బాలునకు డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయినందున ఆ ఇంటికి వెళ్లి బాలుని యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చుట్టు ప్రక్కల 200 మీటర్ల వరకు స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయించాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలపాలని, వర్షాలు పడుతున్నందున ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డులలో మలేరియాపై అవగాహన కల్పించే తనిఖీ స్టిక్కర్లు ను సరిగా పంపిణీ చేయని కారణంగా, బయాలజిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా స్టిక్కర్లును ప్రతి ఇంటికి అతికించాలని, ప్రతివారం ప్రతి ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని సందర్శించినట్లు గోడపై స్టిక్కర్లు అంటించి, ఇంటి వారి వద్ద నుండి   సంతకం పెట్టించుకోవలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా సహించేదిలేదని మలేరియా సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం “డ్రై డే” గా పాటించాలని ప్రజలకు తెలుపమని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాల్గవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజనీరు చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస రాజ్, మలేరియా ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-08 15:45:07

అప్పన్నకు రూ.10 లక్షలు విరాళం ప్రకటన..

కోరమండల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్  తన కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి బుధవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఈఓ సూర్యకళ, ఏఈఓ ఆనంద్ కుమార్, అధికారులు స్వాగతం పలి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విజిటర్స్ బుక్ లో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాశారు. అంతేకాకుండా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10,00,000 (పది లక్షల రూపాయలు)  ఇస్తానని ఈఓకు అలగప్పన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అరుణ్ అలగప్పన్ కు ఈఓ వివరించారు. దేవస్థానం పరిసరాలను, పరిశుభ్రతను చూసి ఎంతోఆనందం వ్యక్తం చేశారు.  స్థల పురాణానాన్ని వివరించడంతోపాటు ఆలయం, కళ్యాణ మండపాన్ని కోరమండల్ టీంకు దగ్గరుండి చూపించారు. అనంతరం ఆలయంలో ఇటీవలే జరిగిన అభివృద్ధిని చూసి తెలుసుకొని మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఈఓను కోరారు.  వారం రోజుల్లో ప్రకటించిన చెక్ ఇస్తానని చెప్పారు. అంతేకాదు భవిష్యత్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతామని కూడా ఆయన చెప్పారు.  అరుణ్ అలగప్పన్ తోపాటు కోరమండల్ కంపెనీ ఎండీ సమీర్ గోయల్,  దినేష్ (జీఎం- ఆపరేషన్స్ ), శంకర్ సుబ్రమమ్యం, బిజినెస్ హెడ్, రంగ కుమార్ (సీనియర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్), జయశ్రీ శటగోపన్, సీఎఫ్ ఓ, కాలిదాస్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్కటింగ్ , రంగకుమార్ సీనియర్ జనరల్ మేనేజర్, సింహాద్రినాథుణ్ణి దర్శించుకున్నారు. అంతకు ముందు అర్చక స్వాములు ఆశీర్వాదం అందించగా, ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాని కంపెనీ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-08 15:39:43