1 ENS Live Breaking News

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ మంత్రికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి కుంటుంబం అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-09-04 06:05:31

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..

నవరత్నాలు - పేదలందరికి ఇళ్లు గృహ నిర్మాణాలకు సంబందించిన పనులను   నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం  కలెక్టర్ కార్యాలయం నుండి గృహ నిర్మాణ పనుల పై వారాంతపు సమావేశాన్ని  వీడియో కాన్పరెన్స్ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కాబట్టి  ఆరు నెలల్లో  అన్ని లే అవుట్ లలో గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.   పనుల అభివృద్ది పై రానున్న నాలుగు రోజులలో ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే  క్లీయర్ చేయాలన్నారు.  తేడాలు ఏమైనా జరిగితే సంబందిత అధికారులు, సిబ్బంది పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎం.పి.డి.ఓ, డ్వామా, రెవెన్యూ, ఆర్ డబ్ల్యు ఎస్, ఇ.పి.డి.సి.ఎల్. శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దిష్ట సమయంలో పనులను వేగవంతం చేయాలన్నారు.  గృహ నిర్మాణ పనులకు సంబందించి ప్రతి వారం 10 శాతం ప్రోగ్రస్ కనపడాలన్నారు. గ్రౌండింగ్ చేసిన ప్రతి లేఅవుట్ లకు జియో ట్యాగింగ్ తప్పని సరి అని, ఈ నెల 5వ తేదిలోగా పూర్తి చేయాలన్నారు. ఇసుక సమస్య ఉంటే సంబందిత ఆర్ డి ఓ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో  హౌసింగ్ జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, హౌసింగ్ పి.డి శ్రీనివాసరావు, డ్వామా పి.డి సందీప్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇ రవికుమార్,  జి.వి.ఎం .సి, ఎ .పి.ఇ.పి.డి.సి.ఎల్, మెప్మా, హౌసింగ్ అధికారులు హాజరైయారు.

Visakhapatnam

2021-09-03 16:58:51

పారిశ్రామిక రంగానికీ అధిక ప్రాధాన్యత..

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్దికి అత్యదిక ప్రాధాన్యత కల్పిస్తున్నదని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  శుక్రవారం ఎం.ఎస్.ఎం.ఇ మరియు టైక్స్ టైల్ పరిశ్రమలకు ప్రోత్సాహలను అందిస్తున్న ముఖ్యమంత్రి వీడియో కాన్పరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపద్యంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు  నష్టపోతున్న తరుణంలో   మూత పడకూడదు అన్న లక్ష్యంతో  రీస్టార్ట్   ప్రోగ్రామ్  కింది ప్రోత్సాహకాలను అందించడం గొప్ప విషయమన్నారు. పరిశ్రమల యాజమాన్యమే కాకుండా అందులో పని చేస్తున్న కార్మికులు కూడా ఇబ్బంది పడకుండా ప్రాణవాయువులాగ   ఆదుకున్నారని, రాష్ట్రం లో  ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఇచ్చిన మాట ను నెరవేరుస్తున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  చిత్త శుద్దితో, అంకిత భావంతో పని చేస్తున్నారని ఆయన  మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఉండడం ఇక్కడ ప్రజల అదృష్టమన్నారు.  ఎస్.సి, ఎస్.టి., బి.సి మహిళలు  ఔత్సాహిక  పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి  ప్రోత్సహకాలు అందిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ఎం .ఎస్ .ఎం .ఇ పరిశ్రమల యూనిట్లకు సంబందించి  మొత్తం రూ.21,70,00,000/- ప్రోత్సాహకాలను లబ్దిదారులకు  అందించడం జరుగుతున్నదన్నారు. 
విశాఖపట్నం, అగనంపూడికి చెందిన  ఎం .ఎస్ .ఎం .ఇ లబ్దిదారులు జి.చిన్నబాబు రాష్ట్ర ముఖ్యమంత్రితో  మాట్లాడుతూ  తాను  1995 నుండి 2012 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ లేబర్ గా పని చేసానని, 2013లో దళిత ఇంజనీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాదులో  నిర్వహించిన  ఇగ్నేట్  లో శిక్షణ తీసుకున్నానన్నారు. 2016లో సింగిల్ విండో ఆన్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోగా 1129 చదరపు మీటర్ల స్థలాన్ని ఇచ్చారని దానిలో  న్యూమాటిక్ టెక్నాలజిస్  పరిశ్రమను 35 లక్షలతో  నిర్వహించుకుంటున్నానని  అన్నారు. మూడు సంవత్సరాల నుండి విజయవంతంగా పని జరుగుతున్నదని    ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రూ 12,15,165 ప్రోత్సాహకాన్ని  అందిస్తున్నారని  తన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.    మా అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి  చదువుతున్నాడని నాడు – నేడు పథకంలో జగనన్న విద్యా కానుక వచ్చిందని   మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని, చిన్నబాబు ఆనందాన్ని వ్యక్తపరిచారు.   
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు,  శాసన సభ్యులు గొల్లబాబురావు, కరణం దర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, డి .ఐ.సి జనరల్ మేనేజర్ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-09-03 16:57:39

విజయనగరంలో ఇంటింటికీ ఔష‌ద మొక్క‌లు..

స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న అజాదీ కా అమృత్ ఉత్స‌వాల్లో భాగంగా, ఇంటింటికీ ఔష‌ద మొక్క‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నేష‌న‌ల్ మెడిసిన‌ల్ ప్లాంట్స్ బోర్డు(ఎన్ఎంపిబి) నిర్వ‌హిస్తోంది. ఆయుష్ ఆప్‌కి ద్వార్ పేరుతో నిర్వ‌హిస్తున్న‌ ఈ కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్లో, జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌మ్ము పాఠ‌శాల‌కు ఔష‌ద మొక్క‌ల‌ను క‌లెక్ట‌ర్‌ పంపిణీ చేశారు. ఆయుష్ ఆప్ కి ద్వార్ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలోని బ‌లిజిపేట‌, బొబ్బిలి, గ‌రుగుబిల్లి, జిఎల్ పురం, కొమ‌రాడ‌, మ‌క్కువ‌, మెర‌క‌ముడిదాం, పార్వ‌తీపురం, సీతాన‌గ‌రం, తెర్లాం త‌దిత‌ర 10 మండ‌లాల‌ను ఎంపిక చేసి, ఈ మండ‌లాల్లో ఔష‌ద మొక్క‌ల న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఉసిరి, వేప‌, తుల‌సి, ఇన్సులిన్, మ‌ల్టీవిట‌మిన్ త‌దిత‌ర సుమారు 150 ర‌కాల ఔష‌ద మొక్క‌ల‌ను ఈ న‌ర్స‌రీల్లో పెంచి, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయ‌నున్నారు.

            ఈ కార్య‌క్ర‌మంలో ప్రోగ్రామ్ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ అట‌వీశాఖాధికారి ఎస్‌.జాన‌కిరావు, రాష్ట్ర జీవ వైవిద్య అవార్డు గ్ర‌హీత‌, జ‌మ్ము ప్రాధ‌మిక‌ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు ఎం.రామ్మోహ‌నరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-03 16:55:18

సైనిక పాఠ‌శాల‌లో నేడు స్వ‌ర్ణ విజ‌య వ‌ర్ష్..

కోరుకొండ సైనిక పాఠ‌శాల‌లో స్వ‌ర్ణిమ్ విజ‌య్ వ‌ర్ష్ వేడుక‌లను శనివారం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. 1971 యుద్దంలో భార‌తదేశం పాకిస్తాన్‌పై ఘ‌న‌విజ‌యం సాధించి 50 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా, స్వ‌ర్ణోత్స‌వాల‌ను మ‌న దేశం ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. ఈ వేడుక‌లను 2020 డిసెంబ‌రు 16న మ‌న ప్ర‌భుత్వం ప్రారంభించి, ఈ ఏడాది డిసెంబ‌రు 16 వ‌ర‌కు నిర్వ‌హించ‌నుంది. ఈ అపూర్వ విజ‌యానికి చిహ్న‌మైన విక్ట‌రీ టార్చ్ జిల్లాకు విచ్చేయ‌నుంది. 1971 యుద్దంలో అసువులు బాసిన అమ‌ర‌ వీరుల గ్రామాల‌ను పునీతం చేస్తూ, తిరిగి డిసెంబ‌రు 16 నాటికి ఈ టార్చ్‌ ఢిల్లీ చేరుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాకు విచ్చేయుచున్న‌ ఈ విజ‌య కాగ‌డాకు, ఉద‌యం 8.30 గంట‌ల‌కు సైనిక పాఠ‌శాల ప్రిన్సిపాల్ అరుణ్ ఎం కుల‌క‌ర్ణి ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు యుద్ద‌వీరులు, యుద్ద‌వీరుల‌ను కోల్పోయిన వీర‌నారులు, ప్ర‌భుత్వ అధికారులు, పాఠ‌శాల పూర్వ విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొంటారు.

Vizianagaram

2021-09-03 16:53:55

జిల్లాలో ఇసుక కొరతరాకుండా చూడాలి..

ఇసుక కొరత రానివ్వకుండా కొత్త ఓపెన్ రీచ్ ల గుర్తింపు పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ జిల్లాలో ఇసుక లభ్యత, ఇతర అంశాలపై మైన్స్, రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్ డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న 31 ఇసుక ఓపెన్ రీచ్ లను 2021, నవంబర్ 30 నాటికి పర్యావరణ అనుమతులు గడువు పూర్తవుతున్నందున కొత్త  రీచ్ ల గుర్తింపు పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. కొత్త రీచ్ గుర్తింపునకు సంబంధించి మైన్స్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు  చేయాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 31 ఓపెన్ రీచ్ లలో ఇసుక ఉన్నప్పటికీ వరదల కారణంగా ప్రస్తుతానికి ప్రజలు, ప్రభుత్వ నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను జిల్లాలో ఉన్న వివిధ స్టాక్ యార్డుల నుంచే ఇసుక  సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. బేథమేట్రీక్ సర్వే ద్వారా 91లక్షల 56వేల 621 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు ఇసుక కొరత రానివ్వకుండా మంగళవారం, శుక్రవారం రెండు రోజులపాటు ఇసుక సరఫరా చేయాలని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
      ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, కాకినాడ, అమలాపురం ఆర్డీవోలు ఎజీ చిన్ని కృష్ణ,వసంతరాయుడు, డీపీవో ఎస్ వి నాగేశ్వరనాయక్, ఇంచార్జ్ మైన్స్ డీడీ ఈ. నరసింహారెడ్డి,ఏడీ  రాజమహేంద్రవరం డివిఆర్.కుమార్ , ధవలేశ్వరం ఈఈ జి.శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రామ్మోహన్ నాయుడు, ఇంచార్జి ఆర్టీవో జివివికే. రాజు, గ్రౌండ్ వాటర్,ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, జేపీ పవర్ వెంచర్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-03 16:51:58

రైతులకు ప్రయోజాలు చేకూర్చాలి..

రైతుల ప్ర‌యోజ‌నాలు ల‌క్ష్యంగా సాగునీటి వ‌న‌రుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి వాటి అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ ఇరిగేష‌న్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం రాత్రి క‌లెక్ట‌రేట్‌లో ఇరిగేష‌న్‌, డ్రెయిన్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశతో క‌లిసి జ‌ల‌వ‌న‌రుల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌జ‌లు, రైతులకు ఉప‌యోగ‌ప‌డేలా డెల్టా కాలువ‌ల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఆధునికీర‌ణ‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో ఇరిగేష‌న్ ఎస్ఈ బి.రాంబాబు, డిప్యూటీ ఎస్ఈ ఐవీ స‌త్య‌నారాయ‌ణ; తూర్పు, సెంట్ర‌ల్ డెల్టాల ఇరిగేష‌న్, డ్రెయిన్ ఇంజ‌నీరింగ్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-03 16:50:40

క్రీడాకారుల వివరాలు అందజేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారుల వివరాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయానికి అందజేయాలని ఆ సంస్థ జిల్లా ముఖ్య క్రీడా శిక్షణాధికారి బి.శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు 2020-21 మరియు 2021-22 సం.లలో దారిద్ర్యరేఖకు దిగువన ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారు మరియు అర్హత పొందిన క్రీడాకారులు తమ వివరాలను వీలైనంత త్వరగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, సెట్ శ్రీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, శ్రీకాకుళం వారికి అందజేయాలని కోరారు. ఇతర వివరాల కొరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయ పనివేళల్లో 98660 98642 లేదా 92488 07249 మొబైల్ నెంబర్లకు సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2021-09-03 16:46:05

5న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు..

డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకొని సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ఆహ్వాన సంఘం కార్యదర్శి జి.పగడాలమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఆదివారం ఉదయం 10గం.లకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్,   రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, పాడిపారిశ్రామిభివృద్ధి శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు. వీరితో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు తదితరులు హాజరవుతారని ఆమె  ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Srikakulam

2021-09-03 16:45:13

అధిక ఫీజులు వసూలుచేస్తే కఠిన చర్యలు..

ప్రభుత్వం నిర్ధేశించిన  ధరలకంటే  అధిక ధరలు వసూలుచేస్తే సంబంధిత ఆసుపత్రులు మరియు ల్యాబరేటరీల రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.చంద్రనాయక్  హెచ్చరించారుఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు.  కోవిడ్  పరీక్షల  కొరకు  వచ్చిన  రోగులనుండి  ప్రైవేటు  ఆసుపత్రులు, ల్యాబరేటరీలు కోవిడ్  పేరుతో  అధికమొత్తంలోరుసుములు  వసూలు చేస్తున్నట్లు  జిల్లాయంత్రాంగం దృష్టికి  వచ్చిందన్నారు. కోవిడ్   పరీక్షలకు  సంబంధించి  రేపిడ్  యాంటీజెన్  పరీక్షకు  రూ. 230/-లు,ఆర్.టి.పి.సి.ఆర్.పరీక్షకు రూ.499/-లు, హెచ్.ఆర్.సి.టి  పరీక్షకు రూ.3,000/-లు  మాత్రమే  వసూలు చేయాలని చెప్పారు. లేనిఎడల అట్టి  ప్రైవేటు ఆసుపత్రులు  మరియు  ల్యాబరేటరీలు  యాజమాన్యంపై  క్రమశిక్షణ చర్యలు  తీసుకోబడునని మరియు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆయా ఆసుపత్రులు, ల్యాబరేటరీల రిజిస్ట్రేషన్లు తక్షణమే రద్దు చేయబడునని  హెచ్చరించారు. అలాగే ఎపిడిమిక్ డిసిజేసేస్ యాక్ట్ అనుసరించి కోవిడ్ నిబంధనల ప్రకారం అట్టి యాజమాన్యాల నుండి జిల్లా కలెక్టర్ వారు నిర్ధేశించిన అపరాధ రుసుములను వసూలు చేయబడునని  ఆయన  ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2021-09-03 16:44:22

డిగ్రీ రెండు మాద్యమాలు కొనసాగించాలి..

ప్రభుత్వ  డిగ్రీకళాశాల లో తెలుగు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా కొనసాగించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ డిగ్రీ కళాశాల ఆర్జెడి సిహెచ్. కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ ,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగుమీడియం విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారని ఆర్జేడీకి వివరించారు. ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకొని రెండు మాద్యమాల్లో ఈ కార్యక్రమంలో ఎ, టి రాజా ఎస్ఎఫ్ఐ నగర నాయకులు మణికంఠ సాయి లోవ తల్లి, సత్య, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-03 16:42:13

ఈనెల7కి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తికావాలి..

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 7 నాటికి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సర్వే ఎడి ప్రభాకరరావు ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న భూ రక్షణ, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పై పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులుతో కలసి శుక్రవారం  సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఒఎల్ఆర్ పక్కాగా ఉంటే సమస్యలు ఉండవని చెప్పారు. ఏ రోజు ఎన్ని గ్రామాల్లో పనులు జరుగుచున్నవో ఆ వివరాలు రాసుకోవాలన్నారు. పిఒఎల్ఆర్ ప్రగతి పై వారానికి రెండుసార్లు సమావేశం జరగాలని ఆదేశించారు. డిజిటల్ పంచాయతీల పనులు ఎంత వరకు వచ్చింది డిపిఓ రవి కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని  కలెక్టర్  ఏడి సర్వేను ఆదేశించారు.  రీ సర్వే 3 ఫైలట్ గ్రామాల్లో డ్రోన్ తో సర్వే పూర్తి అయినదని, సెప్టెంబర్ 7 నాటికి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తి చేయాలన్నారు. సమస్యలు ఉంటే 30 రోజుల్లో(అప్పీలు చేసుకోవాలి) పరిష్కారంచేసి సమస్య అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. డ్రోన్ సర్వే పూర్తి అయిన భూ యజమానులైన రైతులకు నోటీసులు జారీ చేసి వారి సమక్షంలోనే పిఒఎల్ఆర్ ప్రకారం సర్వే చేసి లోపాలుంటే సరి చేయాలని ఆదేశించారు. ఎల్పిఎం జనరేషన్ చేసి సరిచేయాలని, అప్పటికి ఎక్సటెంట్ సరిపోకపోతే డివిజన్ పరిధిలో అప్పీలు చేసుకోవాలని, అప్పటికి సంతృప్తి చెందకపోతే జిల్లా స్థాయిలో అప్పీలు చేసుకొని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పారు. అనంతరం రెవిన్యూ ప్రకారం పాసు పుస్తకాలు జారీ చేయబడునని వివరించారు. ఈ సమావేశంలో భూ సర్వే శాఖ సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్, ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, డిపిఓ రవి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-03 12:51:18

25 MSMEలకు 3.4 కోట్ల రూపాయలు జమ..

ఔత్సాహిక  పారిశ్రామిక వేత్తలు  పరిశ్రమల స్థాపనకు  ముందుకువచ్చి పరిశ్రమలను స్థాపించాలని  జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి పిలుపునిచ్చారు.   శుక్రవారం  తాడేపల్లి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  సూక్ష్మ, చిన్న మధ్య  తరహ పరిశ్రమలకు 2 వ విడత  రాయితీ ని  రాష్ట్ర వ్యాప్తంగా వారి ఖాతాల్లో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి  జమ చేసారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి కలెక్టర్ తో పాటు శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్ది దారులకు మెగా చెక్కును అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా లో 2 వ విడత క్రింద 25 ఎం.ఎస్.ఎం.ఈ  లకు  3.4 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.  ఈ అర్ధిక సహాయాన్ని పరిశ్రమల అభివృద్ధికి వినియోగించుకోవాలని అన్నారు.  వచ్చే  సోమవారం పరిశ్రమల అభివృద్ధి పై సమావేశం నిర్వహిస్తున్నామని, ఔత్సాహికులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.  
ఈ కార్యక్రమం లో వరల్డ్  విజన్ సంస్థ , సెట్విజ్  ఆధ్వర్యం లో నవరత్నాల పై ముద్రించిన నవరత్న మాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కరోనా లో కూడా సహాయం :  నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ 
పరిశ్రమల  స్థాపనకు ముందుకు వచ్చే యువతీ యువకులకు  ప్రస్తుత ప్రభుత్వం  అనేక అవకాశాలను అందిస్తూ ప్రోత్సహిస్తుందని  నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన  మీడియా తో మాట్లాడుతూ  రాష్ట్రం లో అన్ని జిల్లాల కంటే విజయనగరం లో తక్కువ పరిశ్రమలు ఉన్నాయని,  ప్రభుత్వం పరిశ్రమలకు అందించే రాయితీల పై ప్రచారం ఎక్కువగా జరగాలని అన్నారు. ఎస్.సి. ఎస్.టి. బి.సి.,మైనారిటీ , మహిళల, విద్యార్ధుల  సంక్షేమానికి   పధకాలను, రాయితీలను అందించడానికి ప్రభుత్వం ఒక క్యాలెండర్ ను రూపొందించి,  ప్రకటించిన తేదీల కు అనుగుణంగా క్రమం తప్ప కుండా అందిస్తూ  కరోనా కాలం లో ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.  ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్  జే. వెంకట రావు,  పరిశ్రమల జనరల్ మేనేజర్ జి.ఎం. శ్రీధర్ , ఎ.డి సీతారాం , ఐ.పి.ఓ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-09-03 11:09:45

మెటర్నటీ లీవు మంజూరుచేయండి..

మెటర్నిటీ లీవులు అమలు చేయాలని కోరుతూ కేజిహెచ్ కోవిడ్‌`19 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్‌ & అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జెఎసి కార్యదర్శి పి.మణి మీడియాతో మాట్లాడారు. కెజిహెచ్‌లో కోవిడ్‌ కాలంలో గత ఏడాది139 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు జిఓ.నెం.241 ద్వారా తమను ప్రభుత్వం నియమించిందన్నారు.  నియామక పత్రాల్లో మెటర్నిటీ లీవులు, సెలవులు వర్తిస్తాయని స్పష్టంచేసిందన్నారు. అయితే ఇటీవల వీరి  కాంట్రాక్ట్‌ ముగియడం, కోవిడ్‌ నేపధ్యంలో మరో 6నెలలు కాంట్రాక్ట్‌ను పొడిగించిన తరుణంలో తమకు మెటర్నిటీ లీవులు, ఇతర శెలవులు, అమలు కావని కెజిహెచ్‌ సూపరిన్‌టెండెంట్‌ చెప్పారని వారో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌లో పని చేసిన వారికి 6నెలల మెటర్నిటీ లీవులు ఇవ్వాలని స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలున్నా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెటర్నటీ శెలవులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి ప్రధాన కార్యదర్శి పి.మణి, కాంట్రాక్ట్‌ స్టాప్‌ చెల్లాయమ్మ, చంద్రకళ, మానస, మాధురి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
  

Visakhapatnam

2021-09-03 10:21:14

జిడిపి వృద్థికి ఎంఎస్ఎంఇలు దోహదం..

రాష్ట్ర జిడిపి వృద్థికి ఎంఎస్ంఇలు దోహదపడతాయని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారం పేర్కొన్నారు.  శుక్రవారం ఎంఎస్ఎంఇ, హేండ్లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్ లకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్సెంటివ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం సహకారం అవసరమన్నారు.  ముఖ్యమంత్రి పెద్దమనసుతో ఎంఎస్ఎంఇలకు ఇప్పటి వరకు 2086.42 కోట్లు ప్రోత్సాకాలు ఇచ్చినట్లు చెప్పారు.  22, మే 2020 నెలలో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 450.27 కోట్లు, 29 జూన్, 2020లో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 453.64 కోట్లు,  29, జూన్, 2020న  ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు 58.51 కోట్లు, 3, సెప్టెంబరు 2021న ఎంఎస్ఎంఇలకు  440 కోట్లు, 3, సెప్టెంబరు 2021న టెక్స్ టైల్స్ / స్పిన్నింగ్ మిల్స్ కు 684 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు.  పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చట్టం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.  చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పటికే తమ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యురాలు వి. కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-03 10:13:44