1 ENS Live Breaking News

మెటర్నటీ లీవు మంజూరుచేయండి..

మెటర్నిటీ లీవులు అమలు చేయాలని కోరుతూ కేజిహెచ్ కోవిడ్‌`19 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్‌ & అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జెఎసి కార్యదర్శి పి.మణి మీడియాతో మాట్లాడారు. కెజిహెచ్‌లో కోవిడ్‌ కాలంలో గత ఏడాది139 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు జిఓ.నెం.241 ద్వారా తమను ప్రభుత్వం నియమించిందన్నారు.  నియామక పత్రాల్లో మెటర్నిటీ లీవులు, సెలవులు వర్తిస్తాయని స్పష్టంచేసిందన్నారు. అయితే ఇటీవల వీరి  కాంట్రాక్ట్‌ ముగియడం, కోవిడ్‌ నేపధ్యంలో మరో 6నెలలు కాంట్రాక్ట్‌ను పొడిగించిన తరుణంలో తమకు మెటర్నిటీ లీవులు, ఇతర శెలవులు, అమలు కావని కెజిహెచ్‌ సూపరిన్‌టెండెంట్‌ చెప్పారని వారో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌లో పని చేసిన వారికి 6నెలల మెటర్నిటీ లీవులు ఇవ్వాలని స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలున్నా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెటర్నటీ శెలవులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి ప్రధాన కార్యదర్శి పి.మణి, కాంట్రాక్ట్‌ స్టాప్‌ చెల్లాయమ్మ, చంద్రకళ, మానస, మాధురి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
  

Visakhapatnam

2021-09-03 10:21:14

జిడిపి వృద్థికి ఎంఎస్ఎంఇలు దోహదం..

రాష్ట్ర జిడిపి వృద్థికి ఎంఎస్ంఇలు దోహదపడతాయని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారం పేర్కొన్నారు.  శుక్రవారం ఎంఎస్ఎంఇ, హేండ్లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్ లకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్సెంటివ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం సహకారం అవసరమన్నారు.  ముఖ్యమంత్రి పెద్దమనసుతో ఎంఎస్ఎంఇలకు ఇప్పటి వరకు 2086.42 కోట్లు ప్రోత్సాకాలు ఇచ్చినట్లు చెప్పారు.  22, మే 2020 నెలలో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 450.27 కోట్లు, 29 జూన్, 2020లో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 453.64 కోట్లు,  29, జూన్, 2020న  ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు 58.51 కోట్లు, 3, సెప్టెంబరు 2021న ఎంఎస్ఎంఇలకు  440 కోట్లు, 3, సెప్టెంబరు 2021న టెక్స్ టైల్స్ / స్పిన్నింగ్ మిల్స్ కు 684 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు.  పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చట్టం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.  చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పటికే తమ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యురాలు వి. కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-03 10:13:44

లైంగిక వేధింపులెదురైతే ఫిర్యాదు చేయండి..

మహిళా ఉద్యోగిణిలు, సిబ్బంది పనిచే చోట లైంగిక వేధింపులకు గురైతే కచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) దృష్టికి తీసుకురావాలని న్యాయవాది సామాజిక వేత్త రహీమున్నీసాబేగమ్ కోరారు. విశాఖలో శుక్రవారం  కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో జరిగిన  ప్రత్యేక సమావేశంలో ఆమె ఎథిక్స్ /పోష్ కమిటీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా  పలు కీలక అంశాలపై చర్చించారు. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట ఏవిధంగా ఉండాలో, ఉండకూడదో కూడా అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు ఎవరూ అభద్రతా భావంతో ఉందొద్ధని చట్టం,న్యాయం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా మహిళా ఉద్యోగులకు అండగా ఉండే పలు అంశాలను కూడా అక్కడి ఉద్యోగినులకు తెలియజేశారు. ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్) పైనా చర్చించి మహిళల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు.

Visakhapatnam

2021-09-03 10:06:40

50,693.90 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దం..

తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలాల్లాల్లో 50,693.90 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దంగా ఉన్నాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం ఈమేరకు కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు ఎరువులును సమ్రుద్ధిగా మంజూరు చేసిందన్నారు. వీటిని అన్ని మండలాలకు సరఫరా చేసినట్టు ఆయన వివరించారు. రైతులు వినియోగాన్ని బట్టీ గ్రామసచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు. రైతులకు నకిలీ ఎరువుల వినియోగించకుండా ప్రభుత్వమే నాణ్యమైన ఎరువులను సిద్దం చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ఎరువలన్నీ అగ్రిల్యాబ్ ద్వారా టెస్టింగ్ లో నాణ్యత పరిశీలించి వచ్చివేనని  జాయింట్ డైరెక్టర్ వివరించారు.

Kakinada

2021-09-03 09:37:54

15నుంచి ఆగ్రిమార్కెటింగ్ లో ఈ-పర్మిట్లు..

తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబరు 15 నుంచి వ్యవసాయాధారిత వ్యాపారాలకు సంబంధించి ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వ్యాపారస్తులను సాధారణ పద్దతిలో అనుమతులు మంజూరు చేసేవారమని, ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా పర్మిట్లు మంజూరు చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. తద్వారా వ్యాపారస్తులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని 22 మార్కెట్ కమిటీలకు సమాచారం అందించినట్టు ఏడి  ఆ ప్రకటనలో తెలియజేశారు.

Kakinada

2021-09-03 09:36:54

తాశీల్దార్‌పై దాడి చేసిన‌వారిపై చ‌ర్య‌లు..

విజ‌య‌న‌గ‌రంజిల్లా  మ‌క్కువ తాశీల్దార్ వీర‌భ‌ద్ర‌రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్ప‌డిన వ్యక్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి తెలిపారు. విధులు నిర్వ‌ర్తిస్తున్న మ‌క్కువ‌ తాశీల్దార్‌, ఆర్ఐ, విలేజ్ స‌ర్వేయ‌ర్‌, మ‌హిళా పోలీసుపై కొంద‌రు వ్య‌క్తులు రెండు రోజుల క్రితం దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌పై, క‌లెక్ట‌ర్ స్పందించారు. వారిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసి, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని,  ఇలాంటి సంఘ‌ట‌న పున‌రావృతం కాకుండా చూడాల‌ని, జిల్లా ఎస్‌పిని కోరిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాగా మ‌క్కువ తాశీల్దార్ డి.వీర‌భ‌ద్ర‌రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బందిపై జ‌రిగిన దాడిని, జిల్లా రెవెన్యూ అసోసియేష‌న్ తీవ్రంగా ఖండించింది. తాశీల్దార్‌, ఇత‌ర ఉద్యోగుల‌కు, రెవెన్యూ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు టి.గోవింద‌, గొట్టాపు శ్రీ‌రామ్మూర్తి, కోశాధికారి ర‌మ‌ణ‌రాజు త‌మ సంఘీభావాన్ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే జిల్లాలోని తాశీల్దార్లు అంద‌రూ, రెవెన్యూ ఉద్యోగులంతా క‌లిసి మ‌క్కువ వెళ్లి వారికి అండ‌గా నిలిచేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్‌పిల‌ను కోరిన‌ట్లు వారు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Vizianagaram

2021-09-03 09:15:13

బధిర అభ్యర్థులకు APVCC టచ్ ఫోన్లు..

బధిర అభ్యర్థులకు ఎపివిసిసి ద్వారా టచ్ ఫోన్లు ఉచితంగా సరఫరా చేయబడునని విభిన్న ప్రతిభావంతుల శాఖ హాయ సంచాలకులు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  జిల్లాలో గల 18 సంవత్సరములు నిండి 40 సంవత్సరములు లోపు ఉన్న 10వ తరగతి మరియు ఆపై తరగతులు చదువుకున్న చదువుచున్న బధిర అభ్యర్థులకు APVCC ద్వారా టచ్ ఫోన్ ఉచితముగా సరఫరా చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.   దృవ పత్రములు ఆన్ లైన్ లో apdascac.ap.gov.in అనే వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోనవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసిన వారు సదరం (వైద్యదృవ పత్రము 40 శాతము ఆపై బడి ఉండవలెను), ఆధార్ కార్డు,  తెల్ల రేషన్ కార్డు, Sign language Certificate (ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఆడియోలజిస్ట్ ద్వారా), 10వ తరగతి మరియు ఆ పై తరగతులు చదువుకున్న సర్టిఫికేట్లు జతచేయవలసినదిగా ఆ ప్రకటనలో వివరించారు.  అప్లోడ్ చేసిన తదుపరి ఆన్ లైన్ రశీదుతో పాటు ఆన్ లైన్ లో చేసిన దరఖాస్తును జత చేసి సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, శ్రీకాకుళం కార్యాలయంనకు (Hard Copy)పోస్టు ద్వారా గానీ, కార్యాలయ పని వేళల్లో అందజేయవలసినదిగా తెలిపారు.  జిల్లాలో గల అర్హులైన బధిరులు అభ్యర్థులు ఈ అవకాశము సద్వినియోగము చేసుకోవలసిందిగా ఆ ప్రకటనలో కోరారు. కార్యాలయము Mail Address addwskim@gamil.com పంపవలసినదిగా పూర్తి వివరములకు సహాయ సంచాలకులు వారి కార్యాలయము పోన్ నెం. 08942 240519 కు సంప్రదించవలసినదిగా ఆ ప్రకటనలో తెలిపారు.

Srikakulam

2021-09-02 12:24:03

కూరగాయల దాత‌ల సేవ‌లు అభినంద‌నీయం..

టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగానికి దాత‌లు ప్ర‌తి సంవ‌త్స‌రం కోట్లాది రూపాయ‌ల విలువ చేసే కూర‌గాయ‌ల‌ను విరాళంగా అందిస్తున్నార‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌శంసించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం కూర‌గాయ‌ల దాత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ కూర‌గాయ‌ల దాత‌లు అందించే కూర‌గాయ‌ల‌తో ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. 2004 నుండి ఎటువంటి అంతరాయం లేకుండా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ప్రతి నెలా లక్షల రూపాయల విలువైన కూరగాయలు విరాళంగా ఇస్తున్నార‌న్నారు. గో ఆధారిత సహజ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టి, రసాయన రహిత కూరగాయలను పండించాల‌ని దాత‌ల‌ను కోరారు. శ్రీ‌వారి భ‌క్తుక‌లకు ఉదయం మరియు సాయంత్రం వేర్వేరు మెనూలతో రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలని టిటిడి నిర్ణయించింద‌న్నారు. టిటిడి అన్నప్రసాదం విభాగం కోరిన మెనూ ప్రకారం కూరగాయలను సరఫరా చేయాలని కూరగాయల దాతలను ఆయన కోరారు. ప్ర‌తి రోజు కూరలు, సాంబార్ మరియు రసం తయారు చేయడానికి మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో రోజుకు 90 యూనిట్లు అవుతుంద‌ని, ఇందులో ఉద‌యం 56 యూనిట్లు, రాత్రి భోజనంలో 34 యూనిట్‌లతో (ఒక యూనిట్ 250 మంది యాత్రికులకు అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించ‌డానికి సమానం) తయారు చేయబడుతున్నాయ‌న్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అన్నప్రాదం విభాగంలోని ఒక్కో యూనిట్‌కు 48 కిలోల కూరగాయలు అవసరం అవుతాయ‌ని తెలిపారు.

       కూరగాయల దాతలు కూడా గత ఒకటిన్నర దశాబ్దాలుగా టిటిడి అన్నప్రసాదం కార్యకలాపాల్లో భాగమైనందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టిటిడి అవసరానికి అనుగుణంగా కూరగాయలను సరఫరా చేయడానికి దాత‌లు వెంటనే అంగీకరించారు. ఈ సంద‌ర్భంగా దేశీయ‌ గో ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి సేంద్రియ సాగుపై తాము ఖచ్చితంగా దృష్టి పెడతామని వారు హామీ ఇచ్చారు. అద‌న‌పు ఈవో కోరినట్లుగా దర్శన సమయంలో ప్రతి రోజు 500 అరటి పండ్లను శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు అందించడానికి వారు అంగీకరించారు. తిరుమల శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సంవత్సరానికి ఒకసారి కూరగాయల దాతలను సన్మానించ‌డం ఆన‌వాయితీ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సమావేశానికి హాజరైన 14 మంది కూరగాయల దాతలకు అదనపు ఈవో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఈవో  కూరగాయల దాతల‌ను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో సన్మానించారు. ఈ స‌మావేశంలో అన్నప్రసాదం డెప్యూటీ ఈవో   హరీంద్రనాథ్, కేటరింగ్ ఆఫీసర్  జిఎల్ఎన్‌ శాస్త్రి, ఏఈవో  గోపీనాథ్, కూరగాయల దాతలు పాల్గొన్నారు.

Tirupati

2021-09-02 12:17:54

పారాయ‌ణంతో మార్మోగిన స‌ప్త‌గిరులు..

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని ప్ర‌థ‌మ‌, ద్వితీయ సర్గల‌లో ఉన్న మొత్తం 143 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో స‌ప్త‌గిరులు మార్మోగాయి. బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ చిన్న పిల్ల‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని ప్ర‌భుత్వాలు, వైద్య సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వ‌ర్గ‌లవారు సుఖ‌శాతంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సర్గల్లోని మొత్తం 143 శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మ‌రి నివార‌ణ మంత్ర పారాయ‌ణం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌న్నారు. దీనిని పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం, సుఖం, శాంతి, విద్యా, ఐశ్వర్యం సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.

            ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు పర్యవేక్షణలో డా.కోగంటి రామానుజాచార్యులు, శ్రీ ఇంద్ర‌కంటి స‌త్య కిషోర్ పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.   ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం   " రామరామ జ‌య రాజ రామ్‌.. రామ‌రామ జ‌య సీతా రామ్  ", అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో,   "  శ్రీ హ‌నుమాన్ జ‌య హ‌నుమాన్ జ‌య జ‌య క‌పివ‌ర బ‌హుబ‌ల‌వాన్  " అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

              ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  మోహ‌నరంగాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి పాల శేషాద్రి పాల్గొన్నారు.

Thirumalgiri

2021-09-02 11:19:45

అపోహలు వీడికి కరోనా టీకా వేయించుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే వ్యాక్సినేషన్ చేపడుతోందని అపోహలు మాని అందరూ టీకా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ బంగారుపాలెం మండలం లోని రాగిమాను పెంట రహదారిలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల నిర్వహణ అత్యంత ప్రధాన మైనదని నిర్వహణ చేసే వారు జాగ్రత్తగా చెట్లను బ్రతికించే లా చూడాలని అన్నారు. అనంతరం రాగి మాను  పెంట గ్రామ సచివాలయంను తనిఖీ చేశారు. డిజిటల్ విధానంలో హాజరు పట్టికను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారి గురించి డిజిటల్ అసిస్టెంట్ ను అడిగి వివిధ పథకాలకు సంబంధించి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారని అడిగారు. వాలంటీర్లను వ్యాక్సినేషన్ ప్రక్రియ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల, బీమా కు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారని అడిగారు. వాక్సినేషన్ కార్యక్రమం గురించి ఉన్న అపోహలను పోగొట్టాలని నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేటట్లు చూడాలని ,అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండగలరని ఆ విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కలసి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ కేంద్రాలను పరిశీలించి వేగవంతంగా పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎగువ రాగిమాను పెంట మణికంఠ  అనే రైతు డ్రైలాండ్ హార్టికల్చర్ పథకం కింద సాగు చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల లో నగదు బదిలీకి సంబంధించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని, ఉద్యాన పంటలు పెంపు ద్వారా నగదు ఎంత వస్తుంది అని వివరాలు రైతులకు పూర్తిగా తెలియజెప్పాలని అన్నారు. ఎగువ రాగి మాను పెంట లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గా నిర్మాణ సామాగ్రి లభ్యం కావడం లేదని పలువురు ధరలను పెంచి అమ్ముతున్నారని కలెక్టర్ కు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపిడిఓ,తహసీల్దార్ లు ధరల నియంత్రణ చేయాలని అన్నారు.
 అనంతరం నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా kiosk యంత్రం పనితీరు గురించి ఎటువంటి విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఆర్డర్ చేయడం జరిగిందని అదే విధంగా మొదటి వారంలో రైతు సలహా మండలి సమావేశం నిర్వహిస్తున్న రాలేదా అని సిబ్బందిని అడిగారు. గ్రామంలో ఎక్కువగా మెట్ట పంట మీద ఆధారపడి ఉన్నారని 40 ఎకరాలు వరి వేస్తున్నారని వారిని కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నామని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. గ్రామంలో మొత్తం రైతు భరోసా కింద 10 68 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది వందల మంది రైతులకు సంబంధించి 1300 ఎకరాల లోఈ- క్రాప్ బుకింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రైతు భరోసా కేంద్రం ద్వారా వేరుశనగ కందులు ఇవ్వడం జరిగిందని మొత్తం 600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని వివరించారు.
    బంగారుపాలెం మండలం లోని పాలేరు గ్రామానికి సంబంధించిన గృహానిర్మాణాలకు సంబంధించిన లేఅవుట్ ను కలెక్టర్ పరిశీలించారు.చాలా వరకు ఇల్లు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని లబ్ధిదారులు కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా చూడాలని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సజావుగా నిర్మించుకొనేలా చూడాలని అందుకు  సహకరించాలని అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, హౌసింగ్ పిడి పద్మనాభం, పంచాయతీరాజ్ డిఇ రాఘవరెడ్డి, తహసిల్దార్ సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమ లతో పాటు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Bangarupalem

2021-09-02 09:26:17

సంప్ర‌దాయ యుద్ద‌విద్య‌లకు ప్రోత్సాహం..

క‌త్తిసాము, క‌ర్ర‌సాము లాంటి యుద్ద‌విద్య‌ల‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎంతో ప్ర‌సిద్ది అని, వాటిని ప్రోత్స‌హించడం ద్వారా భావిత‌రాల‌కు అందించేందుకు కృషి చేస్తామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. వీటిని సాధ‌న చేసేందుకు విజ‌య‌న‌గ‌రంలో  ఒక శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా, విజ‌య‌న‌గ‌రంలో ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ధ‌ర్మ‌పురి మంచినీటి కోనేరువ‌ద్ద మొక్క‌లు నాటి, చెరువు సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

         ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఏ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలన్నా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. మొక్క‌ల‌ను వేయ‌డ‌మే కాకుండా, వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను ప్ర‌జ‌లు తీసుకోవాల‌ని సూచించారు.  ప‌రిశుభ్ర‌త‌ను సాధించేందుకు  త్వ‌ర‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా ఒక భారీ కార్య‌క్రమాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్రారంభించ‌నున్నార‌ని తెలిపారు. ధ‌ర్మ‌పురి ప్రాంత ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డానికి రూ.2కోట్ల‌తో త్రాగునీటి ప‌థ‌కాన్ని నిర్మించ‌నున్న‌ట్లు వెళ్ల‌డించారు. గ్రామంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామ‌ని, దానికి ప్ర‌జ‌ల‌నుంచి సంపూర్ణ స‌హ‌కారం కావాల‌ని కోరారు. దీనికోసం ఒక క‌మిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు రావాల‌ని సూచించారు. క‌త్తిసాము, క‌ర్ర‌సాము లాంటి యుద్ద‌విద్య‌ల‌ అభివృద్ది కేంద్రాన్ని వీలైనంత త్వ‌ర‌లో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

            ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, అధికారం చేప‌ట్టిన కొద్ది కాలంలోనే, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌ల్లో తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరుతెచ్చుకున్నార‌ని కొనియాడారు. దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టి, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, ప‌రిష్క‌రించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త మ‌న సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి ద‌క్కింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తీఒక్క‌రూ పున‌రంకితం కావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

            క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, నాయ‌కులు ఇచ్చిన పిలుపున‌కు స్పందించి, మంచినీటి కోనేటిని అభివృద్ది చేసుకొనేందుకు ముందుకు వ‌చ్చిన ధ‌ర్మ‌పురి గ్రామ‌స్తుల‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అంత‌టా మొక్క‌ల‌ను నాటడ‌మే కాకుండా, భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచేందుకు ఇంకుడు గుంత‌ల‌ను నిర్మించాల‌ని సూచించారు. ధ‌ర్మ‌పురి గ్రామంలో శ‌త‌శాతం వేక్సినేష‌న్ పూర్తికావాల‌ని, బాల‌బాలిక‌లంద‌రినీ త‌ప్ప‌నిస‌రిగా బ‌డికి పంపించాల‌ని, గ‌ర్భిణుల‌కు ఇవ్వాల్సిన పోష‌కాల‌ను పూర్తిగా అందించాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు.

            ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, విజ‌య‌న‌గ‌రంలో గ‌త రెండు నెల‌లుగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ఒక య‌జ్ఞంలా చేస్తున్నామ‌ని అన్నారు. కేవ‌లం మొక్క‌ల‌ను నాటి వ‌దిలేయ‌కుండా, వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను స్థానికుల‌కే అప్ప‌గించ‌డం ద్వారా, వాటి పోష‌ణ‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లో అపార్ట్‌మెంట్ ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నామ‌ని, ప్ర‌తీ అపార్టుమెంట్‌లో విరివిగా మొక్క‌ల‌ను నాట‌నున్నామ‌ని తెలిపారు.  వైఎస్ఆర్ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని, నియోజ‌క‌వ‌ర్గంలో ఒకేరోజు సుమారు 15వేల మొక్క‌ల‌ను నాటుతున్నామ‌ని చెప్పారు. త‌న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో వైఎస్ఆర్ ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయంగా నిలిచార‌ని, ఆయ‌న కుమారుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరు తెచ్చుకున్నార‌ని ఎంఎల్ఏ కొనియాడారు.

            మంత్రి, ఇత‌ర అతిధుల‌కు క‌ర్ర‌సాము, ఇత‌ర సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో, ధ‌ర్మ‌పురి గ్రామ‌స్తులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.   ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, రాష్ట్ర గిరిజ‌న కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ శోభా స్వాతిరాణి, ఛీఫ్‌ క‌న్జ‌ర్వేజట‌ర్ పి.రామ్మోహ‌న‌రావు, డిఎఫ్ఓ స‌చిన్ గుప్త‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు,  కార్పొరేట‌ర్ పి.గ‌ణ‌ప‌తిరావు, స్థానిక నాయ‌కులు అప్పారావు మాష్టారు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, ఎంఇ కిల్లాన దిలీప్ త‌దిత‌ర‌ మున్సిప‌ల్ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 09:08:47

నాడు-నేడులో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మ‌న‌బ‌డి నాడు - నేడు ప‌నుల విష‌యంలో అధికారులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని జేసీ మ‌హేశ్ కుమార్ పేర్కొన్నారు. నాడు-నేడు ప‌నుల‌ను వ్య‌క్తిగ‌త ప‌నులుగా భావించి, అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని సూచించారు. మ‌న‌బ‌డి నాడు-నేడు రెండో ద‌శ ప్ర‌క్రియ‌పై ఇంజ‌నీరింగ్ అధికారులకు, మండ‌ల రిసోర్స్ ప‌ర్స‌న్స్‌కు క‌లెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వ‌హించిన ఒక్క‌ రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. పాఠ‌శాల అభివృద్ధికి నిజంగా అవ‌స‌ర‌మైన ప‌నుల‌నే గుర్తించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. ప్ర‌భుత్వ ధ‌నం స‌ద్వినియోగం అయ్యేలా ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. నాడు-నేడు తొలి ద‌శలో జ‌రిగిన‌ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని రెండో ద‌శ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని పేర్కొన్నారు. క్షేత్ర‌స్థాయిలో పాఠ‌శాల‌ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. మండ‌ల రిసోర్స్ ప‌ర్స‌న్లు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి రెండో ద‌శ నాడు-నేడు ప‌నుల్లో ఆశాజ‌న‌క ఫ‌లితాల‌ను సాధించాల‌ని జేసీ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో స‌మ‌గ్ర శిక్షా అభియాన్ ఏపీసీ కీర్తి, ఈఈ రవిశేఖ‌ర్‌, ఏపీడ‌బ్ల్యూఐడీసీ ఈఈ శామ్యూల్, ఏపీవో గోపీ, మండ‌ల రిసోర్స్ ప‌ర్స‌న్లు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 09:07:02

ప్రతీ ఉద్యోగి రెండు మొక్కలు నాటాలి..

ప్రభుత్వ ఉద్యోగులందరూ ఖచ్చితంగా రెండు మొక్కలు నాటి, వాటి సంరక్షణ కూడా వారే చూసుకోవాలని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో గురువారం నిర్వ‌హించిన‌ చేసిన ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా వివిధ ర‌కాల మొక్క‌ల‌ను నాటారు. ప్ర‌తీరోజూ నీరు పోసి, వాటిని జాగ్ర‌త్త‌గా సంర‌క్షించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఇత‌ర అధికారులు, క‌లెక్ట‌రేట్ సిబ్బందీ పాల్గొన్నారు. 

Vizianagaram

2021-09-02 08:49:55

కోవిడ్ వేక్సినేషన్ శతశాతం పూర్తికావాలి..

కోవిడ్‌ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. స్థానిక ధ‌ర్మ‌పురిలోని 36వ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. క‌లెక్ట‌ర్ ముందుగా హాజ‌రు ప‌ట్టిక‌, ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. ఆ స‌చివాల‌య ప‌రిధిలో కోవిడ్ వేక్సినేష‌న్‌, గ‌ర్భిణుల‌కు ప్ర‌త్యేకంగా వేక్సినేష‌న్‌, వారికి అంద‌జేస్తున్న పోష‌కాహారం వివ‌రాలు, పెన్ష‌న్ల పంపిణీ, మాతృవంద‌న త‌దిత‌ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లు తీరును ప‌రిశీలించారు. వాటిపై స‌చివాల‌య సిబ్బందిని వివ‌రాలు అడిగారు. కుల‌, జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఎన్ని రోజుల్లో జారీ చేస్తున్న‌దీ తెలుసుకున్నారు. రైస్ కార్డుల్లో చేర్పులు, మార్పుల‌పై ఆరా తీశారు. అగ్రిగోల్డు బాధితుల‌కు ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారం వివ‌రాల‌ను అడిగారు. వార్డులో శానిటేష‌న్ వివ‌రాలు, డెంగ్యూ, మ‌లేరియా త‌దిత‌ర వ్యాధుల స్థితిగ‌తుల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా సచివాల‌య సిబ్బందిని ఉద్దేశించి క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తీఒక్క‌రికీ వేక్సిన్ వేయాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని కలెక్ట‌ర్ కోరారు. ఈ త‌నిఖీలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 08:44:57

డా.వైఎస్సార్ ఆశయాలు సాధించాలి..

డా.వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల సాధ‌న‌కు పున‌రంకితం కావాల‌ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. దివంగ‌తులు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా, గురువారం వైఎస్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి, ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప‌రిపాల దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని కొనియాడారు. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ‌, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ లాంటి ప‌థ‌కాలు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా మారాయ‌న్నారు.  వ్య‌వ‌సాయం అంటే వైఎస్ఆర్ కు ప్రాణ‌మ‌ని, రైతుల సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని అన్నారు. ఏ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టినా, ఎంతో దూర‌దృష్టితో ఆలోచించి, అత్య‌ధిక‌శాతం మందికి మేలు చేకూర్చేలా, వాటిని అమ‌లు చేసి, వైఎస్ఆర్‌ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌ని అన్నారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్ర‌జ‌ల‌కు ఒక భ‌రోసా అని అన్నారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, తండ్రిని మించిన త‌న‌యుడిగా కొద్దికాలంలోనే పేరు తెచ్చుకున్నార‌ని అన్నారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి, న‌వ‌ర‌త్నాల ద్వారా ల‌క్ష‌లాది మంది పేద‌ల‌కు ఆయ‌న ల‌బ్ది చేకూర్చార‌ని, క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు ఆర్థికంగా అండ‌గా నిలిచార‌ని కొనియాడారు.  సంక్షేమ‌ము, అభివృద్ది రెండూ, మ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి రెండు క‌ళ్లు అని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, జిసిసి ఛైర్ పర్స‌న్ శోభా స్వాతిరాణి, ప‌లువురు అధికారులు, కార్పొరేట‌ర్లు, నాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 08:43:00