1 ENS Live Breaking News

థర్డ్ వేవ్ ఎదర్కోవడానికి పక్కాగా ఏర్పాట్లు..

కోవిడ్ మూడో దశకు సంబంధించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి వుందన్న అంచనాల నేపథ్యంలో  జీజీహెచ్ లో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పీడియాట్రిక్ వార్డు, చైల్డ్ కేర్ యూనిట్లలో ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన ఆక్సిజన్ పడకలు, చిన్న పిల్లలకు వినియోగించే వెంటిలేటర్స్, సాధారణ పడకలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ థర్డ్ వేవ్ సన్నద్ధతలో భాగంగా జీజీహెచ్ లో గైనిక్, పీడియాట్రిక్ ,చైల్డ్ కేర్ యూనిట్, జీఐసీయు, నూతన పీడియాట్రిక్ ట్రయాజ్, నిర్మాణంలో ఉన్న ఎంసియు వార్డులలో  ఏర్పాట్లను ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల తల్లులతో కలెక్టర్ మాట్లాడి, ఆస్పత్రులలో పిల్లలకు అందుతున్న వైద్యసేవలను  అడిగి తెలుసుకున్నారు.
    ఈ సందర్శనలో కలెక్టర్ వెంట కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఆర్ మహాలక్ష్మి, ఆర్.ఎమ్.వో డా.గిరిధర్, ఇతర వైద్య అధికారులు, పాల్గొన్నారు.

Kakinada

2021-09-04 16:24:03

పీసీఎన్డీటీ యాక్టు తప్పక అమలుచేయండి..

గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలనకు నిర్థేశించిన పరీక్షలను లింగ నిర్థారణ కొరకు దుర్విని యోగం కాకుండా ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా, రహస్య డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో ఆడ శిశువుల పట్ల వివక్షను తొలగించేందుకు ఏర్పాటు చేసిన గర్భధారణక పూర్వ, గర్భస్థ పిండ పరీక్షల దుర్వినియోగ నివారణ (  పిసి, పిఎన్డిటి) చట్టం అమలుపై  జిల్లా స్థాయి ఆధారిటీ, అడ్వయిజరీ కమీటీ సమావేశం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు, 4వ అడిషనల్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు లతో కలిసి  వైద్య అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం పటిష్ట అమలుకు చేపట్టవలసిన చర్యలపై విస్తృతంగా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ శిశువుల పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్య వంటి అమానుష ధోరణుల వల్ల సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో సంతులనం లేకుంటే విపరీతమైన పరిణామాలకు దారితీస్తుందని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను కోరారు.  గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన కొరకు ఆధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వైద్య పరీక్షల ప్రక్రియ పుట్టబోయేది మగ లేక ఆడ అనే లింగ నిర్థారణకు దుర్వినియోగం చేయడం నేరమని, జిల్లాలో అటుంవంటి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన తీవ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  గర్భస్థ పిండ పరీక్షలు నిర్వహణ నిర్వహించే స్కానింగ్ సెంటర్లకు జిల్లా స్థాయి అధారిటీ అనుమతి తప్పని సరిగా ఉండాలని, అలాగే ప్రభుత్వం నిర్థేశించిన నియమావళిని ఈ సెంటర్లు ఖచ్చితంగా పాటించాలన్నారు.  స్కానింగ్ పరీక్షలు పిండ లింగ నిర్థారణ వెల్లడికి దుర్వినియోగం కాకుకండా జిల్లాలో రిజిష్టర్ అయిన 276 స్కానింగ్ సెంటర్ల పై డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ సెంటర్ల కార్యకలాపాలను రహస్య ఆపరేషన్లతో గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.   డెకాయ్ ఆపరేషన్లలో గర్బస్థ లింగ నిర్థారణ వెల్లడిక పాల్పడిన కేసులను నిరూపణ చేసిన బృందానికి 50 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందించడంతో బాటు, రాష్ట్ర స్థాయి ప్రశంసా పురస్కారాలకు ప్రతిపాదిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు.  జిల్లాలో గడచిన ఏడాది కాలంలో జరిగిన ప్రసవాలలో మగ, ఆడ శిశువుల గణాంకాలను విశ్లేషించి, లింగ అసమతౌల్యం గమనించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.  పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం గురించి, స్కానింగ్ పరీక్షలను దుర్వినియోగం చేసే వారి సమాచారం అందించేందుకు జిల్లా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు 1800-425-3365 గురించి ప్రజలకు విస్తృత ప్రచారం ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.  జిల్లాలో కృత్రిమ గర్భదారణలు నిర్వహిస్తున్న ఐవిఎఫ్ సెంటర్ల కార్యకలాపాలపై కూడా ప్రత్యక నిఘా ఉంచాలని ఆదేశించారు.  జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐవిఎఫ్ ఫెసిలిటీల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని కోరారు.  జిల్లాలో రిజిష్టరైన సెంటర్ల రెన్యూవళ్లు, రిజిస్ట్రేషన్ కొరకు క్రొత్తగా అందిన ధరఖాస్తులపై చట్టపరమైన నిర్థేశాలను ఏవిధంగా అమలు చేస్తున్నదీ సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఆమోదిస్తామని, పూర్తి సమాచారం, రికార్డులు, ఫోటోలతో తదుపరి సమావేశానికి రావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై నిర్వహించే రహస్య ఆపరేషన్లు మరింత ఫ్రోఫెషనల్ శైలిలో నిర్వహించాల్సి ఉందని, ఇందుకు పోలీస్ యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు  డెకాయి ఆపరేషన్లలో మహిళా పోలీస్ సిబ్బంది సేవలను వినియోగిస్తామని ఆయన తెలిపారు.  
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.సింహాచలం, డిఎంహెచ్ఓ కె.గౌరీశ్వరరావు, డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, జిజిహెచ్ రేడియాలజిస్ట్ డా.అనూరాధ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వై.పద్మలత్, ఎస్.అప్పలనాయుడు, కె.వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓలు పాల్గొన్నారు. 

Kakinada

2021-09-04 16:03:47

సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక సౌరభం..

సింహాచలం  శ్రీవరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాల గుబాళింపు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అభిప్రాయపడ్డారు. శనివారం స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  వ్రతాలు, పూజలకు ఏర్పాటుచేసిన కొత్త మండపం, కళ్యాణ మండపం ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని ప్రశంసల జల్లు కురిపించారు.  కొత్త మండపాన్ని లక్ష్మీనారాయణ వ్రతం , ఇతర సేవలకోసం ఉపయోగించడం అద్భుతంగా ఉందన్నారు.  " ఆధ్యాత్మికతతో నిండిన ఈ పవిత్ర ఆలయ దర్శనంతో నా జన్మ ధన్యమైన భావన కలుగుతోంది" అంటూ జస్టిస్ శేషసాయి విజిటర్స్ బుక్ లో రాశారు. దేవస్థానం సమీపంలోకి వచ్చినవెంటనే ఆధ్యాత్మిక , సాంస్కృతిక సౌరభాలు గుభాళిస్తున్నాయన్నారు.  ఇంతకు ముందుకూడా దేవస్థానానికి వచ్చి స్వామిని దర్శించుకున్నానని జస్టిస్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ  ఆలయంలో జరుగుతున్న, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు ఈఓ ఎంవీ సూర్యకళ దగ్గరుండి వివరించారు. కార్యక్రమంలో ఆలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-09-04 11:25:34

జెసి(అభివ్రుద్ధి) రాజకుమారికి బదిలీ..

తూర్పుగోదావరిజిల్లా జాయింట్ కలెక్టర్(అభివ్రుద్ధి)జె.రాజకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. ఈమెను గుంటూరుజిల్లా జాయింట్ కలెక్టర్(గ్రామ, వార్డు సచివాలయశాఖ)కు బదిలీ చేశారు.రాజకుమారికి తూర్పుగోదావరి జిల్లాలో ఎనలేని అనుభంధం వుంది. డేరింగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిగా జిల్లాలో పేరుతెచ్చుకున్నారు. ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు ఈమె దగ్గరుండి చేయించారు. కరోనా సమయంలో జెసి చేసిన సేవలను జిల్లావాసులు నేటికీ గుర్తుంచుకుంటారు. జిల్లాలో తనదైన ముద్రవేసుకున్నారు.

Kakinada

2021-09-04 11:13:33

పౌష్టికాహారాన్నిఅవగాహన పెంచుకోవాలి..

ప్రభుత్వం గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారంపై అవగాహన పెంచుకొని దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. అన్నారు. శనివారం విశాఖలోని ఆరిలోవ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం వలన పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారని సూచించారు. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు ఐసిడిఎస్ కేంద్రం నుంచి అందించే విలువైన సూచనలు సలహాలను పాటించాలని కోరారు. ఆర్డేజీ చిన్మయిదేవి, అంగన్వాడీ శ్యామలాదేవి, కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు పాల్గొన్నారు.

Arilova

2021-09-04 09:11:12

స్టేడియం పనులు వేగవంతం చేయాలి..

శ్రీకాకుళంస్టేడియం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ డిఎస్ డిఓను ఆదేశించారు. పాత్రునివలసలో 33 ఎకరాలలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ స్టేడియం, శాంతినగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను శనివారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రన్నింగ్ ట్రాక్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.  కావలసిన పరకరాలు ఏర్పాటు చేయాలన్నారు.  శాంతినగర్ కాలనీలో స్కేటింగ్, టెన్నీస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ పనులను నిర్మాణానికి కేటాయించిన స్థలంను ఆయన పరిశీలించారు.  బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ షిప్ సాధించిన వారిని ఆయన అభినందించారు.  జిల్లా స్థాయిలో సివిల్ సర్వీసెస్ క్రీడలను ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆయన బ్యాట్మింటన్ ఆడారు.  ఈ పర్యటనలో జెసి-3 ఆర్ శ్రీరాములునాయుడు, ఆర్డిఓ ఐ. కిషోర్, డిఎస్ డిఓ శ్రీనివాసరావు, తహసిల్థార్ వెంకటరావు, పాత్రునివలస సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-04 07:31:29

తునిలో 1.50కోట్లతో అగ్రీ ఇన్ఫ్రా కాంప్లెక్స్..

తూర్పుగోదావరిజిల్లా తునిలో రూ.150 కోట్లతో అగ్రికల్చర్  ఇన్ఫ్రా ఫండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్టు మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. శనివారం ఈ మేరకు కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయాధారిత వ్యాపారాల నిమిత్తం ఈ కాంప్లెక్స్ ఉపయోగపడేలా ప్రభుత్వానికి నివేదించామన్నారు. తునిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్నందు ఇక్కడే దీనిని నిర్మించాలని భావించామన్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి వుందని ఏడీ పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ మంజూరైతే రైతులకు చాలా ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు.

Kakinada

2021-09-04 06:40:40

గోకవరంలో అత్యధిక వర్షపాతం నమోదు..

తూర్పుగోదావరి జిల్లాలో శనివారం అత్యధిక వర్షపాతం గోకవరం 84.2మిల్లీ మీటర్లు నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.  అత్యల్పంగా గంగవరం 0.4 మిల్లీమీటర్లు కాగా, జిల్లావ్యాప్తంగా వర్షపాతం 560 మిల్లీమీటర్లు నమోదు అయినట్టు ఆపేర్కొన్న అధికారులు  జిల్లాలో యావరేజిన ఏడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోని 64 మండాల్లో కలిపి 8.8 మిల్లీమీటర్లు నమోదు అయినట్టు ఆ ప్రకటనలో తెలియజేశారు.

Kakinada

2021-09-04 06:23:12

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ మంత్రికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి కుంటుంబం అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-09-04 06:05:31

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..

నవరత్నాలు - పేదలందరికి ఇళ్లు గృహ నిర్మాణాలకు సంబందించిన పనులను   నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం  కలెక్టర్ కార్యాలయం నుండి గృహ నిర్మాణ పనుల పై వారాంతపు సమావేశాన్ని  వీడియో కాన్పరెన్స్ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కాబట్టి  ఆరు నెలల్లో  అన్ని లే అవుట్ లలో గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.   పనుల అభివృద్ది పై రానున్న నాలుగు రోజులలో ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే  క్లీయర్ చేయాలన్నారు.  తేడాలు ఏమైనా జరిగితే సంబందిత అధికారులు, సిబ్బంది పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎం.పి.డి.ఓ, డ్వామా, రెవెన్యూ, ఆర్ డబ్ల్యు ఎస్, ఇ.పి.డి.సి.ఎల్. శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దిష్ట సమయంలో పనులను వేగవంతం చేయాలన్నారు.  గృహ నిర్మాణ పనులకు సంబందించి ప్రతి వారం 10 శాతం ప్రోగ్రస్ కనపడాలన్నారు. గ్రౌండింగ్ చేసిన ప్రతి లేఅవుట్ లకు జియో ట్యాగింగ్ తప్పని సరి అని, ఈ నెల 5వ తేదిలోగా పూర్తి చేయాలన్నారు. ఇసుక సమస్య ఉంటే సంబందిత ఆర్ డి ఓ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో  హౌసింగ్ జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, హౌసింగ్ పి.డి శ్రీనివాసరావు, డ్వామా పి.డి సందీప్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇ రవికుమార్,  జి.వి.ఎం .సి, ఎ .పి.ఇ.పి.డి.సి.ఎల్, మెప్మా, హౌసింగ్ అధికారులు హాజరైయారు.

Visakhapatnam

2021-09-03 16:58:51

పారిశ్రామిక రంగానికీ అధిక ప్రాధాన్యత..

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్దికి అత్యదిక ప్రాధాన్యత కల్పిస్తున్నదని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  శుక్రవారం ఎం.ఎస్.ఎం.ఇ మరియు టైక్స్ టైల్ పరిశ్రమలకు ప్రోత్సాహలను అందిస్తున్న ముఖ్యమంత్రి వీడియో కాన్పరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపద్యంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు  నష్టపోతున్న తరుణంలో   మూత పడకూడదు అన్న లక్ష్యంతో  రీస్టార్ట్   ప్రోగ్రామ్  కింది ప్రోత్సాహకాలను అందించడం గొప్ప విషయమన్నారు. పరిశ్రమల యాజమాన్యమే కాకుండా అందులో పని చేస్తున్న కార్మికులు కూడా ఇబ్బంది పడకుండా ప్రాణవాయువులాగ   ఆదుకున్నారని, రాష్ట్రం లో  ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఇచ్చిన మాట ను నెరవేరుస్తున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  చిత్త శుద్దితో, అంకిత భావంతో పని చేస్తున్నారని ఆయన  మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఉండడం ఇక్కడ ప్రజల అదృష్టమన్నారు.  ఎస్.సి, ఎస్.టి., బి.సి మహిళలు  ఔత్సాహిక  పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి  ప్రోత్సహకాలు అందిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ఎం .ఎస్ .ఎం .ఇ పరిశ్రమల యూనిట్లకు సంబందించి  మొత్తం రూ.21,70,00,000/- ప్రోత్సాహకాలను లబ్దిదారులకు  అందించడం జరుగుతున్నదన్నారు. 
విశాఖపట్నం, అగనంపూడికి చెందిన  ఎం .ఎస్ .ఎం .ఇ లబ్దిదారులు జి.చిన్నబాబు రాష్ట్ర ముఖ్యమంత్రితో  మాట్లాడుతూ  తాను  1995 నుండి 2012 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ లేబర్ గా పని చేసానని, 2013లో దళిత ఇంజనీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాదులో  నిర్వహించిన  ఇగ్నేట్  లో శిక్షణ తీసుకున్నానన్నారు. 2016లో సింగిల్ విండో ఆన్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోగా 1129 చదరపు మీటర్ల స్థలాన్ని ఇచ్చారని దానిలో  న్యూమాటిక్ టెక్నాలజిస్  పరిశ్రమను 35 లక్షలతో  నిర్వహించుకుంటున్నానని  అన్నారు. మూడు సంవత్సరాల నుండి విజయవంతంగా పని జరుగుతున్నదని    ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రూ 12,15,165 ప్రోత్సాహకాన్ని  అందిస్తున్నారని  తన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.    మా అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి  చదువుతున్నాడని నాడు – నేడు పథకంలో జగనన్న విద్యా కానుక వచ్చిందని   మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని, చిన్నబాబు ఆనందాన్ని వ్యక్తపరిచారు.   
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు,  శాసన సభ్యులు గొల్లబాబురావు, కరణం దర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, డి .ఐ.సి జనరల్ మేనేజర్ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-09-03 16:57:39

విజయనగరంలో ఇంటింటికీ ఔష‌ద మొక్క‌లు..

స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న అజాదీ కా అమృత్ ఉత్స‌వాల్లో భాగంగా, ఇంటింటికీ ఔష‌ద మొక్క‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నేష‌న‌ల్ మెడిసిన‌ల్ ప్లాంట్స్ బోర్డు(ఎన్ఎంపిబి) నిర్వ‌హిస్తోంది. ఆయుష్ ఆప్‌కి ద్వార్ పేరుతో నిర్వ‌హిస్తున్న‌ ఈ కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్లో, జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌మ్ము పాఠ‌శాల‌కు ఔష‌ద మొక్క‌ల‌ను క‌లెక్ట‌ర్‌ పంపిణీ చేశారు. ఆయుష్ ఆప్ కి ద్వార్ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలోని బ‌లిజిపేట‌, బొబ్బిలి, గ‌రుగుబిల్లి, జిఎల్ పురం, కొమ‌రాడ‌, మ‌క్కువ‌, మెర‌క‌ముడిదాం, పార్వ‌తీపురం, సీతాన‌గ‌రం, తెర్లాం త‌దిత‌ర 10 మండ‌లాల‌ను ఎంపిక చేసి, ఈ మండ‌లాల్లో ఔష‌ద మొక్క‌ల న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఉసిరి, వేప‌, తుల‌సి, ఇన్సులిన్, మ‌ల్టీవిట‌మిన్ త‌దిత‌ర సుమారు 150 ర‌కాల ఔష‌ద మొక్క‌ల‌ను ఈ న‌ర్స‌రీల్లో పెంచి, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయ‌నున్నారు.

            ఈ కార్య‌క్ర‌మంలో ప్రోగ్రామ్ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ అట‌వీశాఖాధికారి ఎస్‌.జాన‌కిరావు, రాష్ట్ర జీవ వైవిద్య అవార్డు గ్ర‌హీత‌, జ‌మ్ము ప్రాధ‌మిక‌ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు ఎం.రామ్మోహ‌నరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-03 16:55:18

సైనిక పాఠ‌శాల‌లో నేడు స్వ‌ర్ణ విజ‌య వ‌ర్ష్..

కోరుకొండ సైనిక పాఠ‌శాల‌లో స్వ‌ర్ణిమ్ విజ‌య్ వ‌ర్ష్ వేడుక‌లను శనివారం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. 1971 యుద్దంలో భార‌తదేశం పాకిస్తాన్‌పై ఘ‌న‌విజ‌యం సాధించి 50 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా, స్వ‌ర్ణోత్స‌వాల‌ను మ‌న దేశం ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. ఈ వేడుక‌లను 2020 డిసెంబ‌రు 16న మ‌న ప్ర‌భుత్వం ప్రారంభించి, ఈ ఏడాది డిసెంబ‌రు 16 వ‌ర‌కు నిర్వ‌హించ‌నుంది. ఈ అపూర్వ విజ‌యానికి చిహ్న‌మైన విక్ట‌రీ టార్చ్ జిల్లాకు విచ్చేయ‌నుంది. 1971 యుద్దంలో అసువులు బాసిన అమ‌ర‌ వీరుల గ్రామాల‌ను పునీతం చేస్తూ, తిరిగి డిసెంబ‌రు 16 నాటికి ఈ టార్చ్‌ ఢిల్లీ చేరుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాకు విచ్చేయుచున్న‌ ఈ విజ‌య కాగ‌డాకు, ఉద‌యం 8.30 గంట‌ల‌కు సైనిక పాఠ‌శాల ప్రిన్సిపాల్ అరుణ్ ఎం కుల‌క‌ర్ణి ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు యుద్ద‌వీరులు, యుద్ద‌వీరుల‌ను కోల్పోయిన వీర‌నారులు, ప్ర‌భుత్వ అధికారులు, పాఠ‌శాల పూర్వ విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొంటారు.

Vizianagaram

2021-09-03 16:53:55

జిల్లాలో ఇసుక కొరతరాకుండా చూడాలి..

ఇసుక కొరత రానివ్వకుండా కొత్త ఓపెన్ రీచ్ ల గుర్తింపు పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ జిల్లాలో ఇసుక లభ్యత, ఇతర అంశాలపై మైన్స్, రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్ డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న 31 ఇసుక ఓపెన్ రీచ్ లను 2021, నవంబర్ 30 నాటికి పర్యావరణ అనుమతులు గడువు పూర్తవుతున్నందున కొత్త  రీచ్ ల గుర్తింపు పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. కొత్త రీచ్ గుర్తింపునకు సంబంధించి మైన్స్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు  చేయాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 31 ఓపెన్ రీచ్ లలో ఇసుక ఉన్నప్పటికీ వరదల కారణంగా ప్రస్తుతానికి ప్రజలు, ప్రభుత్వ నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను జిల్లాలో ఉన్న వివిధ స్టాక్ యార్డుల నుంచే ఇసుక  సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. బేథమేట్రీక్ సర్వే ద్వారా 91లక్షల 56వేల 621 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు ఇసుక కొరత రానివ్వకుండా మంగళవారం, శుక్రవారం రెండు రోజులపాటు ఇసుక సరఫరా చేయాలని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
      ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, కాకినాడ, అమలాపురం ఆర్డీవోలు ఎజీ చిన్ని కృష్ణ,వసంతరాయుడు, డీపీవో ఎస్ వి నాగేశ్వరనాయక్, ఇంచార్జ్ మైన్స్ డీడీ ఈ. నరసింహారెడ్డి,ఏడీ  రాజమహేంద్రవరం డివిఆర్.కుమార్ , ధవలేశ్వరం ఈఈ జి.శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రామ్మోహన్ నాయుడు, ఇంచార్జి ఆర్టీవో జివివికే. రాజు, గ్రౌండ్ వాటర్,ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, జేపీ పవర్ వెంచర్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-03 16:51:58

రైతులకు ప్రయోజాలు చేకూర్చాలి..

రైతుల ప్ర‌యోజ‌నాలు ల‌క్ష్యంగా సాగునీటి వ‌న‌రుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి వాటి అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ ఇరిగేష‌న్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం రాత్రి క‌లెక్ట‌రేట్‌లో ఇరిగేష‌న్‌, డ్రెయిన్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశతో క‌లిసి జ‌ల‌వ‌న‌రుల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌జ‌లు, రైతులకు ఉప‌యోగ‌ప‌డేలా డెల్టా కాలువ‌ల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఆధునికీర‌ణ‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో ఇరిగేష‌న్ ఎస్ఈ బి.రాంబాబు, డిప్యూటీ ఎస్ఈ ఐవీ స‌త్య‌నారాయ‌ణ; తూర్పు, సెంట్ర‌ల్ డెల్టాల ఇరిగేష‌న్, డ్రెయిన్ ఇంజ‌నీరింగ్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-03 16:50:40