1 ENS Live Breaking News

ప్రభుత్వం ద్రుష్టికి జిసిసి ఉద్యోగుల సమస్యలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జిసిసి)లో పనిచేసే సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని చైర్మన్ డా.శోభా స్వాతిరాణి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని తేనె ప్యాకింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిసిసి ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి తనవంతు క్రుషి చేస్తానని చెప్పారు. జిసిసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని జిసిసికి చెందిన అన్ని తయారీ యూనిట్లలోనూ పర్యటించి అక్కడి తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తేనెయూనిట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Chittoor

2021-08-31 11:03:37

తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఆదిభట్ల..

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు  తెలుగు ప్రజలంతా గర్వించే కళాకారుడని, ఆయన మన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు తెలిపారు.  భాషా సాంస్కృతిక శాఖ అద్వర్యం లో మంగళ వారం సంగీత నృత్య కళాశాలలో ఆదిభట్ల జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన జేసీ కళాశాల  వద్ద నున్న ఆదిభట్ల , ఘంటశాల చిత్ర పటాలకు  పూల మాలలు వేసి  నివాళులర్పించారు.  అనంతరం జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ హరికథ అనే కళను సమాజానికి పరిచయం చేసి, అభివృద్ధికి తోడ్పడిన గొప్ప వ్యక్తి  ఆది భట్ల యని  పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళల్లో ప్రస్తుతం హరికథ ఒకటని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ కు ప్రాధాన్యత నిస్తూ అధికారిక కార్యక్రమాల్లో హరికథ కు అవకాశం కల్పిస్తూ కళా కారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. ఎందరో కళాకారులను అందించిన   సంగీత కళాశాల కు వై.ఎస్.ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను అందించడం గర్వాంగా ఉందన్నారు.  హరికధకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కాపీలేశ్వరం లో శిక్షణా కళాశాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-31 09:36:40

కార్గో రవాణాతో రూ.285.60 కోట్ల ఆదాయం..

సముద్ర మార్గ రవాణా, వ్యాపార వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందిస్తుందని  రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం  వీజేఎఫ్ డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను, కార్గో డిమాంద్ను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పోర్టుల ప్రగతి పై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం, భవనపాడు, కాకినాడ సెజ్, రామయపట్నం పోర్టుల ప్రగతికి కార్యాచరణ జరుగుతోందన్నారు. నిజాంపట్నం ఫేజ్-2, మచిలీపట్నం ఫేజ్-2, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లును రూ.1221 కోట్లతో నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా బుదగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమాడక (విశాఖ), బియ్యపు తిప్ప (వెస్ట్ గోదావరి, ఓడరేవు (ప్రకాశంజిల్లా)లలో ఫిషింగ్ హార్బర్లు ప్రగతిని ప్రణాళికలను తయారు చేయ్యడం జరిగిందన్నారు. గతంలో మారిటైంశాఖ తీవ్రనిర్లక్ష్యానికి గురయిందని, కుంటుపడిన ప్రగతికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ స్వస్తి పలికి అన్ని విధాల ఈ శాఖను బలోపేతం'చేస్తుందన్నారు. ఈ శాఖలలో ఖాళీలను కూడా భర్తీ చేస్తూ సమద్రమార్గ రవాణా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది కాకినాడ పోర్టు, రామాయపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టుల కార్గో రవాణా ద్వారా రూ.285.60 కోట్లు రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభించిందన్నారు. ఈ ఏడాది జూన్ మాసం వరకు రూ. 70.57 కోట్ల రూపాయలు వరకు ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది వరకు పిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధి దశలో కార్యకలాపాలు ముందుకు సాగుతున్నాయన్నారు.

 జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని అర్జిస్తున్న విశాఖపట్నంలో మారిటైం బోర్డు సేవలను మరింత విస్తృతపరిచి పోర్టుల ప్రగతికి అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల వారి సహాయసహకారాలను తీసుకుంటూ పోర్టు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి పరుస్తామని ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండదన్నారు. ప్రతిష్టాత్మకమైన మారిటైం బోర్డు చైర్మన్ గా తనను నియమించిన రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉత్తరాంధ్ర నాయకులు విజయసాయిరెడ్డి, వై.సి.పి. రాష్ట్ర నాయకులకు కాయల వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడూ జర్నలిస్ట్ లుకు అండగా ఉంటామని. తన వంతు సహకారము అందిస్తామన్నారు.. కార్య క్రమంలో ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు,కార్యదర్శి ఎస్.. దుర్గారావు లు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు సంక్షేమం కోసము  తమ పాలక వర్గం పూర్తి స్థాయిలో పని చేస్తుంది అన్నారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.. నార్ల భవన్ అధునీకరణతో పాటు అంతర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తామన్నారు.. తొలుత విజేఎఫ్ కార్యవర్గ సభ్యులు కాయల వెంకట రెడ్డి ను ఘనముగా సత్కరించారు. ఉపాద్యక్షుడు అర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమం లోజాయింట్ సెక్రటరీ దాడి రవి కుమార్, కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Daba Gardens

2021-08-31 09:34:47

డిగ్రీ పరీక్షలు తక్షణమే వాయిదావేయాలి.

శ్రీకాకుళం జిల్లాలోని డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కన్వీనర్ పొన్నాడ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలో ఆయన విద్యార్ధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు 4 మరియ 6 సెమిస్టర్ పరీక్షలు  వచ్చేనెల రెండో తేదీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ వారు నిర్వహించబోతున్నారన్నారు. దీనివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.  అంబేద్కర్ యూనివర్సిటీ వైస్.ఛాన్సలర్, రిజిస్టర్ గారు పరీక్షల నిర్వహణను పునరాలోచన చేసి వాయిదా వేయాలని వారు కోరారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక్ష కంగా తరగతులు జరగలేదని, ఆన్లైన్లో  బోధన కేవలం రెండు నెలలోనే అరాకొర జరిపి పూర్తి చేశారన్నారు. దీనివల్ల విద్యార్థులకు సరిగా అవగాహనకు రాలేకపోయారన్నారు. ఫలితంగా పరీక్షలకు సమాయత్తం కాకపోవడం ఒక భాగమైతే, మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న డిగ్రీ విద్యార్థులకు అంతర్జాల సదుపాయం లేకపోవడం వల్ల అసలు వారికి ఆన్ లైన్ క్లాసులే జరగలేదన్నారు. ఈ కారణాలను ద్రుష్టిలో పెట్టుకొని డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి వారి భవిష్యత్తును కాపాడాలని ఏఐఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోరంగి గోపి నాయుడు ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు పరిడాల రాజశేఖర్,మెండి ప్రసాద్ కాదుర్లా శివ ,బెజ్జిపురం రాంబాబు,  విద్యార్థులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-31 09:29:17

దోబీ ఘాట్ ల జాబితా అందజేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో దోబీ ఘాట్ లు అవసరమైతే ఆ జాబితా అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్-3 ఆర్. శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు.  మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రజకుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  జిల్లాలో రజకులకు దోబీ ఘాట్ లు ఎక్కడైనా అవసరం అనుకుంటే ఆ జాబితాను అందజేస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.  ఏవైనా సమస్యలు ఉంటే బి.సి. కార్పొరేషన్ ఇడి దృష్టికి తీసుకురావాలన్నారు.  ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలనుకుంటే తెలియజేయాలని సూచించారు.  రజకులలో చదువుకొని కాళీగా ఉన్నట్లు తెలియజేస్తే స్కిల్ డెవలప్ మెంట్ లో ఉపాధి కల్పిస్తామని తెలిపారు.  పిల్లలను స్కూల్స్ లలో చేర్పించాలన్నా తెలియజేయాలని పేర్కొన్నారు.  వచ్చే సమావేశం నాటికి సమస్యలు ఏవైనా ఉంటే సమావేశం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.  షాపులకు 100 యూనిట్లు సబ్సిడీ ఇస్తున్నారని, గృహాలకు 100 యూనిట్లు సబ్సిడి ఇవ్వాలని సభ్యులు యేసుపాదం కోరారు.  జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాలు నిర్మించి కమ్యూనిటీకి అందజేసినట్లు బి.సి. కార్పొరేషన్ ఇడి రాజారావు చెప్పారు.  ప్రభుత్వ నిబంధనలు మేరకు మున్సిపాలిటీలు, పంచాయితీలలో షాపులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు.  రజకుల సమస్యలు తీర్చడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  మూడు నెలలకు ఒక సారి సమావేశం ఏర్పాటుచేయాలని, సమస్య ఏమైనా వస్తే అధికారులు స్పందించాలని కమిటీ సభ్యులు యేసుపాదం సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇడి రాజారావు మాట్లాడుతూ దోబీ ఘాట్ లు ఉన్న చెరువులు అక్రమణలు జరుగుతున్నాయని చెప్పారు.  కమ్యూనిటీ పై దౌర్జన్యాలు జరిగినా అలాంటి వివరాలు అందజేయాలని జెసి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి రవి కుమార్, కమిటీ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు పిరిడి రాణి, మబగాపు రాజు, బొమ్మాళి చిన్నవాడు, డి. సూర్యనారాయణ, బొమ్మాళి వాహిణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-31 09:20:29

నులిపురుగుల నివారణతో ఆరోగ్యం..

శరీరంలో నులిపురుగులను నివారించుకోవడం ద్వారా ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం స్థానిక హడ్కో కాలనీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబులేసు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులిపురుగుల సంక్రమించి ఉన్న చిన్నారుల నుండి ఇతరులకు వ్యాపిస్తుందని అన్నారు. నులి పురుగుల వల్ల రక్తహీనత సంభవిస్తుందని, పోషకాహారం తీసుకున్నప్పటికీ ఉపయోగకరంగా ఉండదని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని తద్వారా నులి పురుగులు నివారణ జరిగి తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన పనులు చేసుకోవడానికి, చదువుకోవడానికి తగిన శక్తి,  మానసిక పెరుగుదల ఉంటుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క చిన్నారి విధిగా ఆల్బెండజోల్ మాత్రలు సూచించిన మేరకు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బిం, రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం సమన్వయ అధికారి మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కే.అప్పారావు, వైద్య శాఖ అధికారి కృష్ణమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్యాధికారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-31 09:14:51

తిరుమలలో ద‌శ‌ల‌వారీగా విద్యుత్ వాహ‌నాలు ..

తిరుమ‌ల‌లో వాహ‌నాల కాలుష్యాన్ని త‌గ్గించ‌డం ద్వారా ప‌విత్ర‌త‌ను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ సిటీగా మారుస్తామ‌ని, ఇందుకోసం ద‌శ‌ల‌వారీగా పూర్తిగా విద్యుత్ వాహ‌నాల‌ను వినియోగిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. రాంభగీచా విశ్రాంతి గృహాల వ‌ద్ద సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డితో క‌లిసి 35 విద్యుత్ కార్ల‌ను ఛైర్మ‌న్ ప్రారంభించారు. ముందుగా విద్యుత్ కార్ల‌కు అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.  ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమ‌ల‌లో ద‌శ‌లవారీగా డీజిల్ వాహ‌నాల స్థానంలో పూర్తిగా విద్యుత్ వాహ‌నాలు ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ణాళికలు రూపొందించామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో టిటిడి అధికారిక విధుల కోసం వినియోగించేందుకు 35 విద్యుత్ కార్ల‌ను(టాటా నెక్సాన్‌) ప్రారంభించిన‌ట్టు చెప్పారు. ఈ విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన క‌న్వ‌ర్జ‌న్స్ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(సిఇఎస్‌ఎల్‌) నుండి తీసుకున్నామ‌న్నారు. రెండో ద‌శ‌లో మ‌రో 6 నెల‌ల లోపు 32 విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌న్నారు. ఇందులో 20 టిటిడి ఉచిత బ‌స్సులు కాగా, మ‌రో 12 బ‌స్సుల‌ను ఆర్‌టిసి న‌డుపుతుందన్నారు. ఆర్‌టిసి న‌డిపే ఈ 12 బ‌స్సులు శ్రీ‌వారి పాదాలు - ఆకాశ‌గంగ - పాప‌వినాశ‌నం మార్గంలో న‌డుస్తాయ‌ని తెలిపారు. టిటిడి విజ్ఞ‌ప్తి మేర‌కు మ‌రో 6 నెల‌ల వ్య‌వ‌ధిలోపు ఎపిఎస్ఆర్‌టిసి కూడా తిరుమ‌ల - తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ముందుకొచ్చింద‌న్నారు. తిరుమ‌ల‌లో, ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే ట్యాక్సీ / మ్యాక్సీ య‌జ‌మానులు, టిటిడి ఉద్యోగులు, స్థానికులు, దుకాణ‌దారులు కూడా త‌మ వాహ‌నాల‌ను విద్యుత్ వాహ‌నాలుగా మార్చుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

          కాగా, ఒక్కో విద్యుత్‌ వాహ‌నానికి నెల‌కు రూ.33,600/- చొప్పున 5 సంవ‌త్స‌రాల పాటు ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల త‌రువాత ఈ వాహ‌నాలు టిటిడి సొంత‌మ‌వుతాయి. ఈ వాహ‌నాల నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని 5 సంవ‌త్స‌రాల పాటు స‌ద‌రు సంస్థ భ‌రిస్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేసిన వాహ‌నం 250 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంది. ఒక వాహ‌నం పూర్తి ఛార్జింగ్ కోసం సాధార‌ణ AC విద్యుత్ ద్వారా అయితే 8 గంట‌లు, DC విద్యుత్ ద్వారా అయితే 90 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఒక వాహ‌నం పూర్తి ఛార్జింగ్ కోసం 30 యూనిట్ల విద్యుత్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ప్ర‌స్తుత ధ‌ర‌ల ప్ర‌కారం ఒక యూనిట్ విద్యుత్ ధ‌ర రూ.6.70/- కాగా, ఒక కిలోమీట‌రు దూరం ప్ర‌యాణించేందుకు 80 పైస‌లు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ట్రాన్స్‌పోర్టు జిఎం  శేషారెడ్డి, డిఐ  మోహ‌న్ ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-30 13:20:28

అగ‌రబ‌త్తుల త‌యారీని ప‌రిశీలించిన ఈవో..

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో సోమ‌వారం ఉద‌యం గోకులాష్ట‌మి గోపూజ అనంత‌రం ఈవో  డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అగ‌ర బ‌త్తుల త‌యారీ ప్లాంట్‌ను  ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూలతో తయారు చేసే ప‌రిమ‌ళ‌మైన అగర బత్తులు వారం, పది రోజుల్లో  భ‌క్తుల‌కు అందుబాటులోకి  తీసుకురానున్న‌ట్లు తెలిపారు. అగ‌ర బ‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్ల‌తో, పది ర‌కాల  బ్రాండ్ల‌తో త‌యారు చేసి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు వివ‌రించారు. స్వామివారికి వినియోగించిన పూలను వ్రుధాగా పడేయకుండా వాటిని వాడుకలోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు.

తిరుమల

2021-08-30 13:18:31

తెనాలిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటన..

గుంటూరు జిల్లాలో తెనాలి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్  మారుమూడి విక్టర్ ప్రసాద్ ను ప్రముఖ రచయిత స్టిఫెన్ డేవిడ్, జిల్లా జి.డి.సి.సి బ్యాంకు మాజీ ఛైర్ పర్సన్ కత్తెర క్రిస్టీనా మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం మద్యాహ్నం తెనాలి ఐతానగర్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి  హాజరైన రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్  మారుమూడి విక్టర్ ప్రసాద్ ను స్థానిక పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసి  మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్  దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ‘అందరి బంధువు ’ (జీవిత చరిత్ర), కాకతీయ యుగంధర్ ( భారత తొలి ప్రధాన మంత్రి ) ల పేరుతో స్టిఫెన్ డేవిడ్ రచించిన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా  గుంటూరు జిల్లా జి.డి.సి.సి బ్యాంకు మాజీ ఛైర్ పర్సన్ కత్తెర క్రిష్టీనా, స్థానిక నేతలు కలిసి రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను సత్కరించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక తెనాలి మున్సిపల్ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Tenali

2021-08-30 12:45:38

జిసిసి ఉత్పత్తులను టిటిడి ప్రోత్సహించాలి..

తిరుమల తిరుపతి దేవస్థానంలో గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతి రాణి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కోరారు.  తిరుమలలో సోమవారం ఆమె చైర్మన్ ను కలిశారు. గిరిజనులు తయారు చేసిన పసుపు. కుంకుమ, తేనె తో పాటు.మరికొన్ని ఉత్పత్తులు ఆయనకు అందజేశారు. టిటిడి జిసిసి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గిరిజనులకు మరింత ఉపాది కలుగుతుందన్నారు. అంతేకాకుండా నాణ్యమైన ఉత్పత్తులను టిటిడి లో వినియోగించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో పసుపు,కుంకుమ, చింతపండు పండించేట్లైతే టీటీడీ లో అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు.

Tirumala

2021-08-30 09:00:24

సెప్టెంబరు 2న ఉచిత మెగా వైద్య శిబిరం..

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని వచ్చేనెల 2వ తేదీన వైఎస్సార్సీపీ యువ నాయకులు డాక్టర్ దర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో  నరసన్నపేటలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణ మెడికల్ సెంటర్ (కేఎంసీ), జెమ్స్ సారథ్యంలో జరగనున్న ఈ వైఎస్సార్ మెగా వైద్య శిబిరంలో 46 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు నిర్వహించే రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాటకర్ విశిష్ట అతిథిగా ప్రారంభించనున్నారు. రోగులకు ఉచితంగా మందులను అందజేసి, వైద్య పరీక్షల్లో తీవ్రత గుర్తించిన రోగులకు జెమ్స్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తారు. వైద్య శిబిరం ఏర్పాట్లకు సంబంధించి స్వతహాగా వైద్యులైన యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యతో జెమ్స్ ప్రతినిధులు డాక్టర్ బాల మురళి, డాక్టర్ ప్రవీణ్ లు నరసన్నపేటలో సోమవారం ఉదయం సమావేశమై ఏర్పాట్లు చేశారు.

Srikakulam

2021-08-30 08:54:11

ఆత్మరక్షణకు దిశయాప్ రక్షణ కవచం..

ఆత్మరక్షణే ఆయుధమని, చట్టం ప్రతి మహిళకు రక్షణ కవచం వంటిదని వక్తలు అభిప్రాయపడ్డారు. శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ (సేవ), శ్రీప్రగతి మహిళా మండలి కుటుంబ సలహా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన " లైంగిక వేధింపులు-మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు సేవ అధ్యక్షురాలు పైడి రజని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఎస్ఐ ఎం.ప్రవల్లిక మాట్లాడుతూ, చదువుకొనే బాలికలు, వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు తరచూ వేధింపులకు గురవుతూనే ఉన్నారని, వీరంతా చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. వక్తగా హాజరైన ఏపిడబ్బ్యుజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, (ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్‌ మాట్లాడుతూ సమాజ ప్రగతిలో మహిళ కీలకపాత్ర పోషిస్తుందని, మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవభావంతో వ్యవహరించాలన్నారు. మహిళల కోనం ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవ అధ్యక్షురాలు పైడి రజని మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణకు కుంగ్‌పూ, కరాటే, కిక్‌ బాక్సింగ్‌లాంటి మార్ష‌ల్‌ ఆర్ట్స్‌ ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళల రక్షణ కోనం ఉన్న చట్టాలను ఆమె బాలికలకు వివరించారు. సచివాలయ ఉమెన్‌ ప్రాటెక్షన్‌ సెక్రటరీ షబానా బేగమ్‌ మాట్టాడుతూ దిశ చట్టంపై ప్రతి బాలికకు అవగాహన ఉన్నప్పుడు సమాజంలో మార్చు వన్తుందన్నారు. దిశ యాప్‌, మహిళా చట్టాల గురించి వక్తలు వివరించారు. అనంతరం ఎస్‌ఐ ప్రవల్లిక, పైడి రజని, షబానా బేగమ్‌లను కిక్‌ బాక్సింగ్‌, కంగ్‌పూ, కరాటే విద్యార్థినులను సత్కరించారు. తొలుత కుంగ్‌పూ, కిక్‌బాక్సింగ్‌ క్రీడాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు పైడి గోపాలరావు, కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.విజయకుమార్‌, కార్యదర్శి వై.హేమంత్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి డి.హరీష్‌, (ట్రెజరర్‌ వై.పవన్‌యాదవ్‌, సాయిబాబా చిల్డ్రన్‌ కరాటే స్కూల్‌ డైరెక్టర్‌ టి.శ్రీనివాసరావు, కుంగ్‌పూ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌.చంద్రరావు, కోచ్‌లు గాయత్రీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-30 08:46:36

తూర్పుగోదావరిలో అత్యధిక వర్షపాతం ఇక్కడే..

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా సఖినేటి పల్లిలో అత్యధికంగా 38.2 మిల్లీమీటర్లు వర్షపాతం, అత్యల్ఫంగా ఎటపాకలో 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని కాకినాడ కలెక్టర్ కార్యాలయం తెలియజేసింది. సోమవారం కాకినాడలో ఈ మేరకు మీడియాకి ప్రకటనల విడుదల చేసింది. జిల్లాలో 64 మండలాల పరిధిలో మొత్తం 147.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, ఏవరేజిన 2.3మిల్లీ మీటర్లు వర్షపాతంగా ఉందని అందులో పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగా కాకుండా  తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ వర్షం మాత్రమే నమోదు కావడం విశేషం.

Kakinada

2021-08-30 08:37:13

లోకానికి పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడే..

మహా విశాఖ ఓల్డ్ సిటీలోని శ్రీ వివేకానంద వృద్ధుల, అనాధ ఆశ్రమం లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ భగవానుడు, అమ్మవార్లను  సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  వివిధ పూజలు అనంతరం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తొలి పూజలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు విశేష పూజాది కార్యక్రమాలు,భజనలతో పూర్తిచేశారు.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంస్థ సభ్యులు,వృద్ధులు,భక్తులు పాల్గొని శ్రీ కృష్ణ భగవానుడి సేవలో తరించారు. తొలుత ఆశ్రమం కు చెందిన గోమాతకు సభ్యులందరూ విశేష పూజలు జరిపారు. గోమాతను అందంగా అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, లోకానికి పరమాత్ముడు ఆ కృష్ణ భగవానుడు ఒక్కరే అన్నారు. సర్వ మానవాళిని రక్షించేది ఆయనే అని కృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు. సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ, ప్రతి ప్రతియేటా అన్ని పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధులూ,అనాధలకు  తమ ఇళ్ళకు దూరంగా ఉన్నామన్న భావన రాకుండా ఉండాలనే ఆయా పండుగలు జరుపుతామన్నారు. మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశేష సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. అందరు ఆరోగ్యం గా ఉండాలని  పలు పూజలు చేపడతామన్నారు. సంస్థ సభ్యులు తో పాటు బండారు గజపతి స్వామి,శీరం శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖసిటీ

2021-08-30 06:33:09

భావితరాలకు తెలుగుభాష ఔన్నత్యాన్ని తెలియజేయాలి..

తెలుగు భాష ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు తెలుగు భాషా పరిరక్షణకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆదివారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు ,తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా "తెలుగు భాష - ప్రయోగాలు - పరిశోధనలు" అనే అంశంపై వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ సదస్సులో కాకినాడ గ్రామీణం రమణయ్యపేట మంత్రి కన్నబాబు క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.     ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కొంతమంది పండితులు మాత్రమే మాట్లాడడానికి, చదవడానికి పరిమితమైన గ్రాంథిక భాషను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి  ఉద్యమాన్ని చేపట్టి  వ్యవహారిక భాష ద్వారా పామర జనులు సైతం చదవటం,మాట్లాడగలిగే విధంగా చేసిన గొప్ప మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని  అన్నారు. ఆ మహనీయుని పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం శుభపరిణామమన్నారు. తెలుగు భాషలో కాలక్రమేణా అనేక పరిణామాలకు లోను కావడంతో ఎన్నో ఇతర భాషల పదాలు తెలుగులో స్థిరపడ్డాయన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన వ్యవహారిక భాషా ఉద్యమ ఫలితంగా తాపీ ధర్మారావు లాంటి గొప్ప కవులు ఎందరో 1930 సంవత్సరం నుంచే వ్యవహారిక భాషలో తమ రచనలు చేయడం జరిగిందన్నారు. అమ్మలాంటి తెలుగు భాష అజరామమైనదని,తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో విధానాలు అమలు చేస్తున్నారన్నారు. నేటి ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా మారుతున్న తరుణంలో పేద విద్యార్థులు సైతం ఈ పోటీ ప్రపంచంలో నిలవాలనే  ఉద్దేశంతో తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషను ప్రాథమిక స్థాయి నుంచి బోధించేందుకు ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఒకే పాఠ్యాంశాన్ని తెలుగు,ఇంగ్లీష్ భాషలలో పక్కపక్కన ముద్రించిన  పాఠ్యపుస్తకాలు  అందిస్తున్న రాష్ట్రం మనదేనని, దీని ద్వారా పిల్లలు పాఠ్యాంశాన్ని అంశాన్ని సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు భాష మీద నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు పాటు పడే సంస్థలను,వ్యక్తులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కాళీపట్నం రామారావు మాస్టారు స్థాపించిన కళా నిలయానికి డా. వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును ఇటీవలే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగువాడిగా తన వంతు బాధ్యతగా తెలుగు భాష అభివృద్ధికి పరిరక్షణకు పాటుపడడం జరుగుతుందని మంత్రి తెలిపారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించడానికి అన్ని విశ్వవిద్యాలయాల వారు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకు సాగాలని మంత్రి  కన్నబాబు విశ్వవిద్యాలయ అధిపతులకు తెలిపారు.   ఈ వర్చువల్ సదస్సులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, తెలుగు, సంస్కృత అకాడమి అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-29 16:02:00