1 ENS Live Breaking News

అపోహలు వీడికి కరోనా టీకా వేయించుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే వ్యాక్సినేషన్ చేపడుతోందని అపోహలు మాని అందరూ టీకా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ బంగారుపాలెం మండలం లోని రాగిమాను పెంట రహదారిలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల నిర్వహణ అత్యంత ప్రధాన మైనదని నిర్వహణ చేసే వారు జాగ్రత్తగా చెట్లను బ్రతికించే లా చూడాలని అన్నారు. అనంతరం రాగి మాను  పెంట గ్రామ సచివాలయంను తనిఖీ చేశారు. డిజిటల్ విధానంలో హాజరు పట్టికను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారి గురించి డిజిటల్ అసిస్టెంట్ ను అడిగి వివిధ పథకాలకు సంబంధించి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారని అడిగారు. వాలంటీర్లను వ్యాక్సినేషన్ ప్రక్రియ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల, బీమా కు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారని అడిగారు. వాక్సినేషన్ కార్యక్రమం గురించి ఉన్న అపోహలను పోగొట్టాలని నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేటట్లు చూడాలని ,అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండగలరని ఆ విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కలసి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ కేంద్రాలను పరిశీలించి వేగవంతంగా పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎగువ రాగిమాను పెంట మణికంఠ  అనే రైతు డ్రైలాండ్ హార్టికల్చర్ పథకం కింద సాగు చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల లో నగదు బదిలీకి సంబంధించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని, ఉద్యాన పంటలు పెంపు ద్వారా నగదు ఎంత వస్తుంది అని వివరాలు రైతులకు పూర్తిగా తెలియజెప్పాలని అన్నారు. ఎగువ రాగి మాను పెంట లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గా నిర్మాణ సామాగ్రి లభ్యం కావడం లేదని పలువురు ధరలను పెంచి అమ్ముతున్నారని కలెక్టర్ కు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపిడిఓ,తహసీల్దార్ లు ధరల నియంత్రణ చేయాలని అన్నారు.
 అనంతరం నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా kiosk యంత్రం పనితీరు గురించి ఎటువంటి విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఆర్డర్ చేయడం జరిగిందని అదే విధంగా మొదటి వారంలో రైతు సలహా మండలి సమావేశం నిర్వహిస్తున్న రాలేదా అని సిబ్బందిని అడిగారు. గ్రామంలో ఎక్కువగా మెట్ట పంట మీద ఆధారపడి ఉన్నారని 40 ఎకరాలు వరి వేస్తున్నారని వారిని కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నామని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. గ్రామంలో మొత్తం రైతు భరోసా కింద 10 68 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది వందల మంది రైతులకు సంబంధించి 1300 ఎకరాల లోఈ- క్రాప్ బుకింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రైతు భరోసా కేంద్రం ద్వారా వేరుశనగ కందులు ఇవ్వడం జరిగిందని మొత్తం 600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని వివరించారు.
    బంగారుపాలెం మండలం లోని పాలేరు గ్రామానికి సంబంధించిన గృహానిర్మాణాలకు సంబంధించిన లేఅవుట్ ను కలెక్టర్ పరిశీలించారు.చాలా వరకు ఇల్లు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని లబ్ధిదారులు కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా చూడాలని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సజావుగా నిర్మించుకొనేలా చూడాలని అందుకు  సహకరించాలని అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, హౌసింగ్ పిడి పద్మనాభం, పంచాయతీరాజ్ డిఇ రాఘవరెడ్డి, తహసిల్దార్ సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమ లతో పాటు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Bangarupalem

2021-09-02 09:26:17

సంప్ర‌దాయ యుద్ద‌విద్య‌లకు ప్రోత్సాహం..

క‌త్తిసాము, క‌ర్ర‌సాము లాంటి యుద్ద‌విద్య‌ల‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎంతో ప్ర‌సిద్ది అని, వాటిని ప్రోత్స‌హించడం ద్వారా భావిత‌రాల‌కు అందించేందుకు కృషి చేస్తామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. వీటిని సాధ‌న చేసేందుకు విజ‌య‌న‌గ‌రంలో  ఒక శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా, విజ‌య‌న‌గ‌రంలో ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ధ‌ర్మ‌పురి మంచినీటి కోనేరువ‌ద్ద మొక్క‌లు నాటి, చెరువు సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

         ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఏ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలన్నా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. మొక్క‌ల‌ను వేయ‌డ‌మే కాకుండా, వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను ప్ర‌జ‌లు తీసుకోవాల‌ని సూచించారు.  ప‌రిశుభ్ర‌త‌ను సాధించేందుకు  త్వ‌ర‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా ఒక భారీ కార్య‌క్రమాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్రారంభించ‌నున్నార‌ని తెలిపారు. ధ‌ర్మ‌పురి ప్రాంత ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డానికి రూ.2కోట్ల‌తో త్రాగునీటి ప‌థ‌కాన్ని నిర్మించ‌నున్న‌ట్లు వెళ్ల‌డించారు. గ్రామంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామ‌ని, దానికి ప్ర‌జ‌ల‌నుంచి సంపూర్ణ స‌హ‌కారం కావాల‌ని కోరారు. దీనికోసం ఒక క‌మిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు రావాల‌ని సూచించారు. క‌త్తిసాము, క‌ర్ర‌సాము లాంటి యుద్ద‌విద్య‌ల‌ అభివృద్ది కేంద్రాన్ని వీలైనంత త్వ‌ర‌లో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

            ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, అధికారం చేప‌ట్టిన కొద్ది కాలంలోనే, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌ల్లో తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరుతెచ్చుకున్నార‌ని కొనియాడారు. దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టి, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, ప‌రిష్క‌రించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త మ‌న సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి ద‌క్కింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తీఒక్క‌రూ పున‌రంకితం కావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

            క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, నాయ‌కులు ఇచ్చిన పిలుపున‌కు స్పందించి, మంచినీటి కోనేటిని అభివృద్ది చేసుకొనేందుకు ముందుకు వ‌చ్చిన ధ‌ర్మ‌పురి గ్రామ‌స్తుల‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అంత‌టా మొక్క‌ల‌ను నాటడ‌మే కాకుండా, భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచేందుకు ఇంకుడు గుంత‌ల‌ను నిర్మించాల‌ని సూచించారు. ధ‌ర్మ‌పురి గ్రామంలో శ‌త‌శాతం వేక్సినేష‌న్ పూర్తికావాల‌ని, బాల‌బాలిక‌లంద‌రినీ త‌ప్ప‌నిస‌రిగా బ‌డికి పంపించాల‌ని, గ‌ర్భిణుల‌కు ఇవ్వాల్సిన పోష‌కాల‌ను పూర్తిగా అందించాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు.

            ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, విజ‌య‌న‌గ‌రంలో గ‌త రెండు నెల‌లుగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ఒక య‌జ్ఞంలా చేస్తున్నామ‌ని అన్నారు. కేవ‌లం మొక్క‌ల‌ను నాటి వ‌దిలేయ‌కుండా, వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను స్థానికుల‌కే అప్ప‌గించ‌డం ద్వారా, వాటి పోష‌ణ‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లో అపార్ట్‌మెంట్ ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నామ‌ని, ప్ర‌తీ అపార్టుమెంట్‌లో విరివిగా మొక్క‌ల‌ను నాట‌నున్నామ‌ని తెలిపారు.  వైఎస్ఆర్ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని, నియోజ‌క‌వ‌ర్గంలో ఒకేరోజు సుమారు 15వేల మొక్క‌ల‌ను నాటుతున్నామ‌ని చెప్పారు. త‌న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో వైఎస్ఆర్ ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయంగా నిలిచార‌ని, ఆయ‌న కుమారుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరు తెచ్చుకున్నార‌ని ఎంఎల్ఏ కొనియాడారు.

            మంత్రి, ఇత‌ర అతిధుల‌కు క‌ర్ర‌సాము, ఇత‌ర సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో, ధ‌ర్మ‌పురి గ్రామ‌స్తులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.   ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, రాష్ట్ర గిరిజ‌న కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ శోభా స్వాతిరాణి, ఛీఫ్‌ క‌న్జ‌ర్వేజట‌ర్ పి.రామ్మోహ‌న‌రావు, డిఎఫ్ఓ స‌చిన్ గుప్త‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు,  కార్పొరేట‌ర్ పి.గ‌ణ‌ప‌తిరావు, స్థానిక నాయ‌కులు అప్పారావు మాష్టారు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, ఎంఇ కిల్లాన దిలీప్ త‌దిత‌ర‌ మున్సిప‌ల్ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 09:08:47

నాడు-నేడులో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మ‌న‌బ‌డి నాడు - నేడు ప‌నుల విష‌యంలో అధికారులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని జేసీ మ‌హేశ్ కుమార్ పేర్కొన్నారు. నాడు-నేడు ప‌నుల‌ను వ్య‌క్తిగ‌త ప‌నులుగా భావించి, అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని సూచించారు. మ‌న‌బ‌డి నాడు-నేడు రెండో ద‌శ ప్ర‌క్రియ‌పై ఇంజ‌నీరింగ్ అధికారులకు, మండ‌ల రిసోర్స్ ప‌ర్స‌న్స్‌కు క‌లెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వ‌హించిన ఒక్క‌ రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. పాఠ‌శాల అభివృద్ధికి నిజంగా అవ‌స‌ర‌మైన ప‌నుల‌నే గుర్తించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. ప్ర‌భుత్వ ధ‌నం స‌ద్వినియోగం అయ్యేలా ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. నాడు-నేడు తొలి ద‌శలో జ‌రిగిన‌ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని రెండో ద‌శ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని పేర్కొన్నారు. క్షేత్ర‌స్థాయిలో పాఠ‌శాల‌ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. మండ‌ల రిసోర్స్ ప‌ర్స‌న్లు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి రెండో ద‌శ నాడు-నేడు ప‌నుల్లో ఆశాజ‌న‌క ఫ‌లితాల‌ను సాధించాల‌ని జేసీ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో స‌మ‌గ్ర శిక్షా అభియాన్ ఏపీసీ కీర్తి, ఈఈ రవిశేఖ‌ర్‌, ఏపీడ‌బ్ల్యూఐడీసీ ఈఈ శామ్యూల్, ఏపీవో గోపీ, మండ‌ల రిసోర్స్ ప‌ర్స‌న్లు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 09:07:02

ప్రతీ ఉద్యోగి రెండు మొక్కలు నాటాలి..

ప్రభుత్వ ఉద్యోగులందరూ ఖచ్చితంగా రెండు మొక్కలు నాటి, వాటి సంరక్షణ కూడా వారే చూసుకోవాలని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో గురువారం నిర్వ‌హించిన‌ చేసిన ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా వివిధ ర‌కాల మొక్క‌ల‌ను నాటారు. ప్ర‌తీరోజూ నీరు పోసి, వాటిని జాగ్ర‌త్త‌గా సంర‌క్షించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఇత‌ర అధికారులు, క‌లెక్ట‌రేట్ సిబ్బందీ పాల్గొన్నారు. 

Vizianagaram

2021-09-02 08:49:55

కోవిడ్ వేక్సినేషన్ శతశాతం పూర్తికావాలి..

కోవిడ్‌ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. స్థానిక ధ‌ర్మ‌పురిలోని 36వ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. క‌లెక్ట‌ర్ ముందుగా హాజ‌రు ప‌ట్టిక‌, ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. ఆ స‌చివాల‌య ప‌రిధిలో కోవిడ్ వేక్సినేష‌న్‌, గ‌ర్భిణుల‌కు ప్ర‌త్యేకంగా వేక్సినేష‌న్‌, వారికి అంద‌జేస్తున్న పోష‌కాహారం వివ‌రాలు, పెన్ష‌న్ల పంపిణీ, మాతృవంద‌న త‌దిత‌ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లు తీరును ప‌రిశీలించారు. వాటిపై స‌చివాల‌య సిబ్బందిని వివ‌రాలు అడిగారు. కుల‌, జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఎన్ని రోజుల్లో జారీ చేస్తున్న‌దీ తెలుసుకున్నారు. రైస్ కార్డుల్లో చేర్పులు, మార్పుల‌పై ఆరా తీశారు. అగ్రిగోల్డు బాధితుల‌కు ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారం వివ‌రాల‌ను అడిగారు. వార్డులో శానిటేష‌న్ వివ‌రాలు, డెంగ్యూ, మ‌లేరియా త‌దిత‌ర వ్యాధుల స్థితిగ‌తుల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా సచివాల‌య సిబ్బందిని ఉద్దేశించి క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తీఒక్క‌రికీ వేక్సిన్ వేయాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని కలెక్ట‌ర్ కోరారు. ఈ త‌నిఖీలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 08:44:57

డా.వైఎస్సార్ ఆశయాలు సాధించాలి..

డా.వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల సాధ‌న‌కు పున‌రంకితం కావాల‌ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. దివంగ‌తులు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా, గురువారం వైఎస్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి, ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప‌రిపాల దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని కొనియాడారు. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ‌, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ లాంటి ప‌థ‌కాలు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా మారాయ‌న్నారు.  వ్య‌వ‌సాయం అంటే వైఎస్ఆర్ కు ప్రాణ‌మ‌ని, రైతుల సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని అన్నారు. ఏ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టినా, ఎంతో దూర‌దృష్టితో ఆలోచించి, అత్య‌ధిక‌శాతం మందికి మేలు చేకూర్చేలా, వాటిని అమ‌లు చేసి, వైఎస్ఆర్‌ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌ని అన్నారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్ర‌జ‌ల‌కు ఒక భ‌రోసా అని అన్నారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, తండ్రిని మించిన త‌న‌యుడిగా కొద్దికాలంలోనే పేరు తెచ్చుకున్నార‌ని అన్నారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి, న‌వ‌ర‌త్నాల ద్వారా ల‌క్ష‌లాది మంది పేద‌ల‌కు ఆయ‌న ల‌బ్ది చేకూర్చార‌ని, క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు ఆర్థికంగా అండ‌గా నిలిచార‌ని కొనియాడారు.  సంక్షేమ‌ము, అభివృద్ది రెండూ, మ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి రెండు క‌ళ్లు అని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, జిసిసి ఛైర్ పర్స‌న్ శోభా స్వాతిరాణి, ప‌లువురు అధికారులు, కార్పొరేట‌ర్లు, నాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-02 08:43:00

తూ.గో. లోనే టస్సార్ పట్టు అత్యధిక సాగు..

తూర్పు గోదావరి జిల్లాలో 1200 ఎస్టీ కుటుంబాలతో టస్సార్ పట్టు సాగు జరుగుతోందని ఉద్యనావనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టస్సార్ పట్టుసాగు, ఎగుమతులు ఉన్నాయన్నారు. పట్టుతయారీకి సంబంధించిన రైతులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం ఈరకం పట్టుపై రైతులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని సాగుచేయడానికి ముందుకి వస్తున్నారన్నారు. గతంలో హార్టికల్చర్ కు వనరులు, సిబ్బంది తక్కువగా ఉండేవారని, ప్రస్తుతం గ్రామసచివాలయాలు ఏర్పాటైన తరువాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. వాణిజ్యపంటలను మరింత ప్రోత్సహించేందుకు ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Kakinada

2021-09-02 06:46:43

వైఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువున్నారు..

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 29వార్డ్ జగదాంబ జంక్షన్ వైస్సార్ విగ్రహం వద్ద స్వర్గీయ వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనతరం. వికలాంగులకు వీల్ చైర్స్, పేద మహిళలకుచీరలు పంపిణీ చేశారు.  29వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు అద్యక్షన ఈ కార్యక్రమంలో స్టేట్ నాగవంశం డైరెక్టర్ కనకాల ఈశ్వర్, స్టేట్ యూత్ సెక్రటరీ మాన్యాల శ్రీనివాస్, స్టీట్ యూత్ సెక్రటరి కోరాడ సురేష్ స్టేట్ బిసిసెల్ సెక్రటరి బెవర మహేష్ స్టేట్ ప్రచార కమిటీ సెక్రెరరీ అడపా శివ, పీతల తేజ,  గండి అప్పల రాజు దుక్క గోపి అరుగుల రాజు, ఊటగెడ్డ సంతోష్, తుపాకుల రమేష్, సారిపల్లి రమణేశ్వర్ సారిపల్లి శ్రీనివాస్, మైలిపిల్లి శివ కృష్ణ ఎల్లాజీ కనకాల రాజు నీలాపు శ్రీను, వురికీటీ పండు, కిరణ్, ఆఫ్టికల్ రవి గొలగని శివ, మహిళ సీనియర్ నాయుకురాలు అరుణశ్రీ,, మాణిక్యం, శ్రీనివాసు, కంచబొయిన ఎర్రజీ,  సింగం పల్లి తాతారావు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-09-02 04:30:27

తూ.గో:లో 69 అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఖాళీ..

తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయశాఖలో 69 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీలు భర్తీకాలేదని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్వీరమణ తెలియజేశారు. బుధవారం కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లోని 749 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టుల వివరాలను ఇటీవలే ప్రభుత్వానికి ఖాళీల జాబితా గ్రామసచివాలయాల వారీగా నివేదించామన్నారు. ప్రస్తుతం వీరంతా జిల్లా వ్యాప్తంగా సేవలందిస్తున్నారన్నారు. వచ్చే నోటీఫికేషన్ లో మిగిలి పోయిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉండవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధిక సంఖ్యలో సిబ్బంది నియామకంతో రైతులకు సకాలంలో సేవలు అందుతున్నాయని జాయింట్ డైరెక్టర్ వివరించారు.

Kakinada

2021-09-02 04:25:13

జిల్లాలో కొత్తగా 16 రైతుభజార్లు మంజూరు..

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 16 రైతుబజార్లు మంజూరు అయ్యాయని మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 18 రైతు బజార్లుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెడితే 16 మంజూరు చేసినట్టు చేసినట్టు చెప్పారు. అందులో కాకినాడ అర్భనల్-2, కాకినాడ రూరల్-2, రామచంద్రాపురం-1, రాజమండ్రి-2, రాజానగరం-4, ఏలేశ్వరం-1, జగ్గంపేట-1, రంపచోడవరం-1, చింతూరులో-1 చొప్పున ఉన్నాయన్నారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. రైతు బజార్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు అన్ని రకాలక కూరగాయలు ఒకేచోట లభించడానికి ఆస్కారం వుంటుందని ఆయన తెలియజేశారు.

Kakinada

2021-09-02 03:49:49

సాగరమాల అభ్యంతరాలపై విచారణ..

సాగ‌ర‌మాల ప్రాజెక్టు ప‌రిధిలో 40.39 కి.మీ. ర‌హ‌దారికి సంబంధించి దాదాపు 597 ఎక‌రాల భూసేక‌ర‌ణ‌పై 3ఏ నోటిఫికేష‌న్ ప్ర‌కారం అందిన అభ్యంత‌రాల పిటిష‌న్ల‌పై జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), కాంపిటెంట్ అథారిటీ ఫ‌ర్ ల్యాండ్ అక్వ‌జిష‌న్ (కాలా) డా. జి.ల‌క్ష్మీశ వ్య‌క్తిగ‌త విచార‌ణ జ‌రిపారు. బుధ‌వారం యు.కొత్త‌ప‌ల్లి మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ఈ విచార‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నార్థం చేప‌డుతున్న సాగ‌ర‌మాల ప్రాజెక్టు భూసేక‌ర‌ణ‌పై కాకినాడ రూర‌ల్‌, యు.కొత్త‌పల్లి మండ‌లాల‌కు చెందిన వారినుంచి 65 పిటిష‌న్లు రాగా ప్ర‌తి పిటిష‌న్‌దారునితో జాయింట్ క‌లెక్ట‌ర్ నిశితంగా మాట్లాడి, విచార‌ణ జ‌రిపారు. వారు వ్య‌క్తం చేసిన వివిధ అంశాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. చ‌ట్ట ప్ర‌కారం త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు. ముందుగా నోటీసులు జారీచేసి చ‌ట్ట ప్ర‌కారం ఈ వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టారు. ఈ ర‌హ‌దారి కాకినాడ రూర‌ల్‌, యు.కొత్త‌ప‌ల్లి, తొండంగి, శంక‌వ‌రం మండ‌లాల ప‌రిధిలోని 21 గ్రామాల గుండా వెళ్తుంది. ఈ విచార‌ణ కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌; యు.కొత్త‌ప‌ల్లి, తొండంగి త‌హ‌సీల్దార్లు శివ‌కుమార్‌, రాజు; నేష‌న‌ల్ హైవేస్ ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజర‌య్యారు.

East Godavari

2021-09-01 15:56:14

ఒకటవ తేదీనే పూర్తిగా పెన్షన్లు ఇస్తున్నాం..

గుంటూరు జిల్లాలో ప్రతీ నెల 1వ తేదిన 99% శాతం పెన్షన్లు  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కే.వి.పి కాలనీ 74 వ వార్డు సచివాలయం కి చెందిన షేక్ బాజీ అనే దివ్యంగునికి ఇంటికి చేరుకొని ట్రై సైకిల్ మరియు పెన్షన్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పందించి దివ్యాంగుడైన షేక్ బాజీకి జిల్లా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ  ద్వారా ట్రై సైకిల్ తో రూ.3వేల పెన్షన్  ను అందించినట్లు  జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంకా ఎవరైనా అర్హత కలిగిన దివ్యాంగులు ఉంటే సమాచారం అందిస్తే, వారికి సాయం చేస్తామన్నారు. దివ్యాంగుల కోటాలో ప్రతీనెల బాజికి పెన్షన్ అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలో ప్రతీ నెల 1వ తేదిన పెన్షన్లను  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ  నేరుగా వారి ఇళ్ళకు వెళ్ళి సచివాలయ వాలంటీర్లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలు కోరుకున్న విధంగా  అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ శ్రీనివాసరావు, ఆర్.డి.ఒ భాస్కర్ రెడ్డి, సాంఘీక సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ మధు సూదనరావు, తూర్పు మండల తహాశీల్ధార్ శ్రీకాంత్, వెల్ఫేర్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-09-01 15:51:12

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..

ప్రభుత్వ శాఖలకు ప్రజా ప్రతినిధులు నుంచి వివిధ అంశాలపై వస్తున్న అర్జీలను సత్వరమే సక్రమంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అదికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రభుత్వ శాఖలకు ప్రజా ప్రతినిధులు నుంచి వస్తున్న అర్జీల పరిష్కారం పై, గత నెలలో జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తీసుకున్న చర్యల నివేదికపై   అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా మంత్రులు, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందించిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు సూచనలు అందించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు అందించిన అర్జీలకు  అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత రాష్ట్ర శాఖలకు అర్జీలు పంపించి అవి పరిష్కారించేలా జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్టును సంబంధిత ప్రజా ప్రతినిధులకు లిఖిత పూర్వకంగా అందించాలన్నారు. శాఖలలో జరుగుతున్న అవినీతిపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలపై వెంటనే విచారణ జరిపించాలని, ప్రాధమిక అధారాలు ఉంటే పోలీస్ కేసులు నమోదు చేయటంతో పాటు, విచారణ కోసం విజిలెన్స్ శాఖకు సిఫార్సు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి అందుతున్న అర్జీలను సంబంధిత శాఖలకు అందించేందుకు, అర్జీలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేయాలన్నారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి తీసుకున్న చర్యలపై బుధవారం సాయంత్రం నాటికి సంబంధిత శాఖలు నివేదికలు అందించాలన్నారు.
సమావేశంలో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-09-01 15:48:37

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్..

రాష్ట్ర ముఖ్య  ఎన్నికల  అధికారి ఆదేశాల  మేరకు మాసాంత తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను మరియు  ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వ్యవసాయ మార్కెట్  యార్డు లో వీవీపాట్స్ ను భద్రపరచిన  గోడౌన్ ను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ బుధవారం తనిఖీ చేసారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో కలసి గోడౌన్ల తాళాలకు వేసిన  సీళ్ళును పరిశీలించారు. ఇవియం, వీవీపాట్స్ ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్ల నోడల్ ఆఫీసర్ వి.శైలజ, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య,  గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు తూర్పు మండల తహశీల్దారు శ్రీకాంత్, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, సీపీఐ పార్టీ తరుపున కె.ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరుపున అడవి ఆంజనేయులు, ఎ.ఐ.ఎం.ఐ.ఎం పార్టీ నాయకులు షేక్. బాజిత్ భాషా   రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-09-01 15:45:43

యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి..

యువత సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల టిటిడిసిలో ఐ ఎస్ ఎం ఓ శిక్షణా కేంద్రం, సోలార్ సిస్టమ్ ను  ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బుధ వారం ప్రారంభించారు.  సిడాక్ సంస్థ సౌజన్యంతో యువతకు శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే పలాస, సోంపేట, రాజాం తదితర ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అత్యధిక మానవ వనరులు కలిగిన దేశం భారత దేశం అన్నారు. మానవ వనరులను చక్కగా వినియోగించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. పార్లమెంటు నియోకవర్గం స్థాయిలో నైపణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిడాక్ సౌజన్యంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. డిఆర్డిఎ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయం, విద్యా, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవతంగా పనిచేస్తోందని, నిరుద్యోగాన్ని నివారించుటకు దోహదం చేస్తుందని చెప్పారు.  యువతలో నైపుణ్యం ఉంటే ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించారు. నరసన్నపేట లో నైపుణ్య అభివృద్ధి సంస్థ మంజూరు అయిందని,  బుడితిలో త్వరలో శిక్షణ ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ముఖ్య మంత్రి ఆశయం అన్నారు. దిశ, పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే  ఉద్యోగాలు, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు తదితర ఎన్నో నూతన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన అన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలకు అందించామని, అమ్మ ఒడి తదితర కార్య్రమాలను అమలు చేస్తూ పేదలకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్య మంత్రి జగన్ మీకు అండగా ఉన్నారని ఆయన చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలోనే ఎచ్చెర్ల ఉండాలని ముఖ్య మంత్రిని కోరామని, ఆ మేరకు ఆయన అంగీరించారని తెలిపారు. శాసన సభ్యులు గొర్లే కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధి కావాలన్నారు. అన్ని పరిశ్రమలతో సమావేశం నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంప్యూటర్ శిక్షణ పొందాలన్నారు. సిడాక్ ద్వారా శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధి కల్పన, ఎంటర్ ప్రైజ్ ప్రారంభానికి అవకాశముందన్నారు. చక్కటిశిక్షణ పొంది మంచి ఉపాధి పొందాలని, ఎంటర్ప్రెన్యూయర్ గా మారి పలువురికి ఉపాధి కల్పించాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ బి. శాంతి శ్రీ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేసారు. ఉప ముఖ్యమంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిపిఎం సి.హెచ్. రామ్మోహన్, డిపిఎంలు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-01 15:20:11