1 ENS Live Breaking News

రైతుల కోటాప్రకారం ఎరువులు సరఫరా చేయాలి..

రైతుల అవ‌స‌రాల మేర‌కు జిల్లా అధికారులు నివేదించిన‌ కోటా ప్ర‌కారం ఎరువులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని, త్వ‌రిత‌గ‌తిన స‌ర‌కు తెప్పించాల‌ని వివిధ కంపెనీల ప్ర‌తినిధుల‌ను జేసీ కిశోర్ కుమార్ కోరారు. ఇండెంట్ ప్ర‌కారం కంపెనీలు ఎరువుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల‌ ఇబ్బందులు త‌లెత్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఎరువుల స‌మ‌స్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించి కంపెనీల ప్ర‌తినిధులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జిల్లాలో ఖ‌రీఫ్ మొద‌లైన క్ర‌మంలో ఎరువుల అందుబాటు, స‌ర‌ఫ‌రా, నిల్వ‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించేందుకు గాను సోమ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో జేసీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా ఎరువులు అంద‌జేయాల్సిన బాధ్య‌త ఇటు అధికారులు, అటు కంపెనీల ప్ర‌తినిధుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. జిల్లాలోని తాజా ప‌రిస్థితిని యాజ‌మాన్యాల దృష్టికి తీసుకెళ్లి అవ‌స‌రమైన మేర‌కు యూరియా, డీఏపీ ఎరువుల‌ను త్వ‌రిత‌గ‌తిన ర‌ప్పించాల‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల రెండో వారం లోపు 2550 ట‌న్నుల యూరియా, 1000 ట‌న్నుల డీఏపీ రానుంద‌ని కంపెనీల ప్ర‌తినిధులు చెప్పారు. అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో స్పందించి ఎరువులు తెప్పించాల్సిన బాధ్య‌త ప్ర‌తీ కంపెనీపైనా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా జేసీ పేర్కొన్నారు. నిర్ణీత స‌మ‌యంలో ఎరువుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌ని కంపెనీల యాజ‌మాన్యాల‌కు లేఖ‌లు రాయాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను జేసీ ఆదేశించారు.

హోల్ సేలర్స్‌, డీల‌ర్లు ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ప్ర‌భుత్వం సూచించిన ధ‌ర‌ల‌కే ఎరువుల‌ను విక్ర‌యించాల‌ని ఆదేశించారు. వ్యాపారులు వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించినా.. నిబంధ‌న‌లు అతిక్రమించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జేసీ హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఆశాదేవి, డీడీ ఆనంద‌రావు, వివిధ ఎరువుల కంపెనీల‌ ప్ర‌తినిధులు ఇత‌ర అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-09-06 13:44:53

వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ద్రుష్టిపెట్టాలి..

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలోని వాట‌ర్ ప్లాంట్ల నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా)జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. వాట‌ర్‌ ప్లాంట్లకు అనుమ‌తులు, నిర్వ‌హ‌ణ‌తో ముడిప‌డి ఉన్న వివిధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెసి వెంక‌ట‌రావు మాట్లాడుతూ, జిల్లాలో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించే వాట‌ర్ ప్లాంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం జిల్లా మొత్తంమీద 8 వాట‌ర్ ప్లాంట్ల‌కు మాత్ర‌మే ప్ర‌భుత్వ ప‌రంగా అన్నిర‌కాల అనుమ‌తులూ ఉన్నాయ‌ని చెప్పారు. అనుమ‌తులు లేని 24 ప్లాంట్ల‌ను మూసివేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. అయితే జిల్లా అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్లాంట్లు ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌క‌లా అనుమ‌తుల‌ను తెచ్చుకొనేందుకు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని సంబంధిత శాఖ‌ల‌కు సూచించారు. ఈ నెల 8న వాట‌ర్ ప్లాంట్ య‌జ‌మానుల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, వారికి అవ‌స‌ర‌మైన‌ మార్గ‌ద‌ర్శ‌కాలను, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను, ధ‌ర‌ఖాస్తు చేసే విధానాన్ని వివ‌రించాల‌ని జెసి ఆదేశించారు.   ఈ స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-06 13:43:09

ఉపకారవేతనముల కోసం ధరఖాస్తుల ఆహ్వానం..

మైనారిటీ విధ్యార్ధులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ ఉపకార వేతనముల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  జిల్లా కలక్టరు ఎ.సూర్యకుమారి ప్రకటనలో తెలిపారు. భారత మైనారిటీ మంత్రిత్వ శాఖ,  దేశం లోని మైనారిటీ కులములకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్ఖులు, బౌద్దులు, పార్సీలు, జైన్లు చెందిన  విద్యార్ధులకు 2021 - 22 విద్యా సంవత్సరములో ‘జాతీయ ఉపకార వేతన పధకం’ద్వారా ఉపకార వేతనాలు అందించుటకు ధరఖాస్తులను తే.23.08.2021ది నుండి ప్రీ మెట్రిక్,  తే.15.11.2021ది లోగా, పోస్ట్ మెట్రిక్  మెరిట్  కం మీన్  30.11.2021ది లోగా  ఆన్ లైన్ ద్వారా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.  కావున విజయనగరం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు వృత్తి విద్యా, సాంకేతిక విద్యా సంస్థలు  https://nsp.gov.in లో ఆన్ లైన్ ద్వారా ముందుగా e-KYC రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని, తదుపరి ఆయా విద్యా సంస్థల లో చదువుకొంటున్న మైనారిటీలకు చెందిన విద్యార్ధులు సదరు పోర్టల్ National Scholarship Portal www.scholarshipsgov.in.in ద్వారా ఆన్ లైన్ లో పెట్టిన ధరఖాస్తులను పరిశీలించి ఆమోదించడం జరుగుతుందన్నారు.  
మైనారిటీ విద్యార్దులకు మూడు విదములుగా ఉపకార వేతనములు మంజూరుకు భారత ప్రభుత్వం(మైనారిటీ మంత్రిత్వ శాఖ) నిర్ణయించినారని, ప్రీమెట్రిక్ ఉపకార వేతనములు, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనములు, మెరిట్ కం మీన్ ద్వారా మైనారిటీల విద్యార్ధులు (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్ఖులు, బౌద్దులు, పార్సీలు, జైన్లు) ఉపకార వేతనం పొందుటకు అర్హులని అన్నారు.

Vizianagaram

2021-09-06 06:18:04

తూ.గో.జిలో 303 విఏహెచ్ఏ పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లా 303 గ్రామ పశుసంవర్ధ సహాయకుల(వీఏహెచ్ఏ) పోస్టులు భర్తీకాలేదని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. ఈమేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకి 987 పశుసంవర్ధ సహాయకుల పోస్టులు మంజూరు చేయగా అందులో కేవలం 684 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. అర్హులైన వారు లేకపోవడం వలన మిగిలిన పోస్టులు భర్తీకాలేదన్నారు. వచ్చే నోటిఫికేషన్ లో ఈ పోస్టులు భర్తీచేసే అవకాశం వుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వీరంతా వారికి కేటాయించిన ప్రదేశాల్లో పాడి రైతులకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

కాకినాడ

2021-09-06 06:12:21

తూ.గో.జి.కి లక్షా 10వేల కోవిడ్ డోసులు..

తూర్పుగోదావరి జిల్లా లక్షా 10వేకోవిడ్ టీకాలు ప్రభుత్వం కేటాయించందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఆదివారం కాకినాడ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 90వేల కోవీషీల్డ్ టీకాలు, 20వేలు కోవాగ్జిక్ టీకాలు మంజూరు చేసిందన్నారు. వీటిని జిల్లాలోని 64 మండలాలకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలోని శాస్వత కోవిడ్ వేక్సినేషన్ కేంద్రాలతోపాటు, జిల్లావ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా సోమవారం కోవిడ్ వేక్సినేషన్ జరుగుతుందన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని కోవిడ్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతీఒక్కరూ కోవిడ్ వేక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని ఆ ప్రకటనలో కోరారు.

Kakinada

2021-09-05 15:29:21

జాతీయ పద్మశాలీ సంఘంలో కొప్పలకు చోటు..

విశాఖకు చెందిన కొప్పల రామ్ కుమార్ నుఅఖిల భారత పద్మశాలి సంఘంలో యువజన విభాగానికి జాతీయ వైస్-చైర్మన్ గా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు సుంకర్వర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొప్పల రామ్ కుమార్ ప్రస్తుతం బీజేపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారు. రాజీకియాలలో క్రియ శీలంగా వుంటూనే చేనేత సామాజిక వర్గం సమస్యల పట్ల, పద్మశాలియుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తున్నారు. "పద్మశాలి ఆత్మీయ సేవ సంగం" పేరిట దిగువ తరగతి పద్మశాలియుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించటం, వారికి నిరంతరం అందుబాటులో వుండటం, వారితో మమేకం కావడం వల్ల వారికి కుల బాంధవుడుగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన అఖిల భారత పద్మశాలి సంఘం లో కీలక పదవిని కట్టబెట్టం పట్ల చేనేత వర్గీయులంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా  రామ్ కుమార్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టిన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఇకపై మరింత శ్రమించి చేనేత సామాజిక వర్గ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. 

Visakhapatnam

2021-09-05 11:16:10

ఏయూలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఏయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద నున్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహాలకు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి పూలమాల వేసి వివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ దార్శినికతతో పనిచేసారని, విశ్వవిద్యాలయం అభ్యున్నతికి పూర్తిస్తాయిలో పనిచేసారని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలను విశ్వవిద్యాలయం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందన్నారు. 
కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు, పేరి శ్రీనివాస్‌, పి.రాజేంద్ర కర్మార్కర్‌, ఎస్‌.సుమిత్ర, కె.విశ్వేశ్వర రావు, వై.రాజేంద్ర ప్రసాద్‌, పాల కమండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్‌ డీన్‌ ఆచార్య టి.షారోన్‌ రాజు, ఎన్‌.ఏ.డి పాల్‌, డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం, పేటేటి ప్రేమానందం, సిఎస్‌ఓ మహ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-05 09:32:15

హైకోర్టు న్యాయమూర్తికి ఘనస్వాగం..

ఒక్క రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లాకు విచ్చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ బ‌ట్టు దేవానంద్‌కి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స్థానిక జ‌డ్పీ అతిథి గృహానికి చేరుకున్న ఆయ‌న‌కి జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గుత్త‌ల గోపి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ఎస్పీ దీపికా ఎం పాటిల్‌లు పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి సాద‌రంగా స్వాగతం ప‌లికారు. పోలీసులు గౌర‌వం వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న‌ అతిథి గృహంలోకి చేరుకొని కాసేపు న్యాయ అధికారులు, జిల్లా అధికారుల‌తో మాట్లాడారు. కొద్దిసేపు విశ్రాంతి అనంత‌రం జ్యుడీషియ‌ల్ అధికారుల స‌మావేశంలో పాల్గొనేందుకు జిల్లా కోర్టుకు వెళ్లిపోయారు. అద‌న‌పు జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి శిరీషా, జాయింట్ క‌లెక్ట‌ర్లు జి.సి. కిశోర్ కుమార్, జె. వెంక‌ట‌రావు, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, ఆర్డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, విజ‌య‌న‌గ‌రం త‌హ‌శీల్దార్ ప్ర‌భాక‌ర్‌, న్యాయ అధికారులు, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, న్యాయ‌వాదులు త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉన్నారు.

Vizianagaram

2021-09-05 09:23:09

పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు పెట్టుకోవద్దు..

ప్రభుత్వం పంపిణీ చేసే పోర్టిఫైడ్ బియ్యంపై ప్లాస్టిక్ బియ్యం అనే అపోహను వీడాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని మీడియాతో ఆయన ఆదివారం జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. పోషకాలు నేరుగా బియ్యంతో కలిపి అందించాలనే ఉద్దేశ్యంతో బియ్యానికే పోషకాలను కలిపి అంస్తున్నదన్నారు. ఆ బియ్యాన్ని కడిగే టపుడు ముందు తేలిపోతాయని, ఆ సమయంలో చాలా మంది వీటిని ప్లాస్టిక్ బియ్యంగా అనుకొని పాడేస్తున్నారని అన్నారు. అలాకాకుండా రెండు మూడు సార్లు కడిగితే బియ్యం సాధారణంగా ఉంటాయన్నారు. ప్రజలు అపోహలు వీడి ఎంతో విలువైన పోషకాలున్న పోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాలని, ఈ విషయంలో ప్రజలు చైతన్యం అయ్యేలా మీడియా సహకరించాలని జెసి కోరారు.

Kakinada

2021-09-05 08:13:09

థర్డ్ వేవ్ ఎదర్కోవడానికి పక్కాగా ఏర్పాట్లు..

కోవిడ్ మూడో దశకు సంబంధించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి వుందన్న అంచనాల నేపథ్యంలో  జీజీహెచ్ లో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పీడియాట్రిక్ వార్డు, చైల్డ్ కేర్ యూనిట్లలో ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన ఆక్సిజన్ పడకలు, చిన్న పిల్లలకు వినియోగించే వెంటిలేటర్స్, సాధారణ పడకలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ థర్డ్ వేవ్ సన్నద్ధతలో భాగంగా జీజీహెచ్ లో గైనిక్, పీడియాట్రిక్ ,చైల్డ్ కేర్ యూనిట్, జీఐసీయు, నూతన పీడియాట్రిక్ ట్రయాజ్, నిర్మాణంలో ఉన్న ఎంసియు వార్డులలో  ఏర్పాట్లను ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల తల్లులతో కలెక్టర్ మాట్లాడి, ఆస్పత్రులలో పిల్లలకు అందుతున్న వైద్యసేవలను  అడిగి తెలుసుకున్నారు.
    ఈ సందర్శనలో కలెక్టర్ వెంట కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఆర్ మహాలక్ష్మి, ఆర్.ఎమ్.వో డా.గిరిధర్, ఇతర వైద్య అధికారులు, పాల్గొన్నారు.

Kakinada

2021-09-04 16:24:03

పీసీఎన్డీటీ యాక్టు తప్పక అమలుచేయండి..

గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలనకు నిర్థేశించిన పరీక్షలను లింగ నిర్థారణ కొరకు దుర్విని యోగం కాకుండా ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా, రహస్య డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో ఆడ శిశువుల పట్ల వివక్షను తొలగించేందుకు ఏర్పాటు చేసిన గర్భధారణక పూర్వ, గర్భస్థ పిండ పరీక్షల దుర్వినియోగ నివారణ (  పిసి, పిఎన్డిటి) చట్టం అమలుపై  జిల్లా స్థాయి ఆధారిటీ, అడ్వయిజరీ కమీటీ సమావేశం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు, 4వ అడిషనల్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు లతో కలిసి  వైద్య అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం పటిష్ట అమలుకు చేపట్టవలసిన చర్యలపై విస్తృతంగా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ శిశువుల పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్య వంటి అమానుష ధోరణుల వల్ల సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో సంతులనం లేకుంటే విపరీతమైన పరిణామాలకు దారితీస్తుందని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను కోరారు.  గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన కొరకు ఆధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వైద్య పరీక్షల ప్రక్రియ పుట్టబోయేది మగ లేక ఆడ అనే లింగ నిర్థారణకు దుర్వినియోగం చేయడం నేరమని, జిల్లాలో అటుంవంటి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన తీవ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  గర్భస్థ పిండ పరీక్షలు నిర్వహణ నిర్వహించే స్కానింగ్ సెంటర్లకు జిల్లా స్థాయి అధారిటీ అనుమతి తప్పని సరిగా ఉండాలని, అలాగే ప్రభుత్వం నిర్థేశించిన నియమావళిని ఈ సెంటర్లు ఖచ్చితంగా పాటించాలన్నారు.  స్కానింగ్ పరీక్షలు పిండ లింగ నిర్థారణ వెల్లడికి దుర్వినియోగం కాకుకండా జిల్లాలో రిజిష్టర్ అయిన 276 స్కానింగ్ సెంటర్ల పై డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ సెంటర్ల కార్యకలాపాలను రహస్య ఆపరేషన్లతో గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.   డెకాయ్ ఆపరేషన్లలో గర్బస్థ లింగ నిర్థారణ వెల్లడిక పాల్పడిన కేసులను నిరూపణ చేసిన బృందానికి 50 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందించడంతో బాటు, రాష్ట్ర స్థాయి ప్రశంసా పురస్కారాలకు ప్రతిపాదిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు.  జిల్లాలో గడచిన ఏడాది కాలంలో జరిగిన ప్రసవాలలో మగ, ఆడ శిశువుల గణాంకాలను విశ్లేషించి, లింగ అసమతౌల్యం గమనించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.  పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం గురించి, స్కానింగ్ పరీక్షలను దుర్వినియోగం చేసే వారి సమాచారం అందించేందుకు జిల్లా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు 1800-425-3365 గురించి ప్రజలకు విస్తృత ప్రచారం ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.  జిల్లాలో కృత్రిమ గర్భదారణలు నిర్వహిస్తున్న ఐవిఎఫ్ సెంటర్ల కార్యకలాపాలపై కూడా ప్రత్యక నిఘా ఉంచాలని ఆదేశించారు.  జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐవిఎఫ్ ఫెసిలిటీల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని కోరారు.  జిల్లాలో రిజిష్టరైన సెంటర్ల రెన్యూవళ్లు, రిజిస్ట్రేషన్ కొరకు క్రొత్తగా అందిన ధరఖాస్తులపై చట్టపరమైన నిర్థేశాలను ఏవిధంగా అమలు చేస్తున్నదీ సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఆమోదిస్తామని, పూర్తి సమాచారం, రికార్డులు, ఫోటోలతో తదుపరి సమావేశానికి రావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై నిర్వహించే రహస్య ఆపరేషన్లు మరింత ఫ్రోఫెషనల్ శైలిలో నిర్వహించాల్సి ఉందని, ఇందుకు పోలీస్ యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు  డెకాయి ఆపరేషన్లలో మహిళా పోలీస్ సిబ్బంది సేవలను వినియోగిస్తామని ఆయన తెలిపారు.  
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.సింహాచలం, డిఎంహెచ్ఓ కె.గౌరీశ్వరరావు, డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, జిజిహెచ్ రేడియాలజిస్ట్ డా.అనూరాధ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వై.పద్మలత్, ఎస్.అప్పలనాయుడు, కె.వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓలు పాల్గొన్నారు. 

Kakinada

2021-09-04 16:03:47

సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక సౌరభం..

సింహాచలం  శ్రీవరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాల గుబాళింపు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అభిప్రాయపడ్డారు. శనివారం స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  వ్రతాలు, పూజలకు ఏర్పాటుచేసిన కొత్త మండపం, కళ్యాణ మండపం ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని ప్రశంసల జల్లు కురిపించారు.  కొత్త మండపాన్ని లక్ష్మీనారాయణ వ్రతం , ఇతర సేవలకోసం ఉపయోగించడం అద్భుతంగా ఉందన్నారు.  " ఆధ్యాత్మికతతో నిండిన ఈ పవిత్ర ఆలయ దర్శనంతో నా జన్మ ధన్యమైన భావన కలుగుతోంది" అంటూ జస్టిస్ శేషసాయి విజిటర్స్ బుక్ లో రాశారు. దేవస్థానం సమీపంలోకి వచ్చినవెంటనే ఆధ్యాత్మిక , సాంస్కృతిక సౌరభాలు గుభాళిస్తున్నాయన్నారు.  ఇంతకు ముందుకూడా దేవస్థానానికి వచ్చి స్వామిని దర్శించుకున్నానని జస్టిస్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ  ఆలయంలో జరుగుతున్న, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు ఈఓ ఎంవీ సూర్యకళ దగ్గరుండి వివరించారు. కార్యక్రమంలో ఆలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-09-04 11:25:34

జెసి(అభివ్రుద్ధి) రాజకుమారికి బదిలీ..

తూర్పుగోదావరిజిల్లా జాయింట్ కలెక్టర్(అభివ్రుద్ధి)జె.రాజకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. ఈమెను గుంటూరుజిల్లా జాయింట్ కలెక్టర్(గ్రామ, వార్డు సచివాలయశాఖ)కు బదిలీ చేశారు.రాజకుమారికి తూర్పుగోదావరి జిల్లాలో ఎనలేని అనుభంధం వుంది. డేరింగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిగా జిల్లాలో పేరుతెచ్చుకున్నారు. ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు ఈమె దగ్గరుండి చేయించారు. కరోనా సమయంలో జెసి చేసిన సేవలను జిల్లావాసులు నేటికీ గుర్తుంచుకుంటారు. జిల్లాలో తనదైన ముద్రవేసుకున్నారు.

Kakinada

2021-09-04 11:13:33

పౌష్టికాహారాన్నిఅవగాహన పెంచుకోవాలి..

ప్రభుత్వం గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారంపై అవగాహన పెంచుకొని దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. అన్నారు. శనివారం విశాఖలోని ఆరిలోవ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం వలన పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారని సూచించారు. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు ఐసిడిఎస్ కేంద్రం నుంచి అందించే విలువైన సూచనలు సలహాలను పాటించాలని కోరారు. ఆర్డేజీ చిన్మయిదేవి, అంగన్వాడీ శ్యామలాదేవి, కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు పాల్గొన్నారు.

Arilova

2021-09-04 09:11:12

స్టేడియం పనులు వేగవంతం చేయాలి..

శ్రీకాకుళంస్టేడియం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ డిఎస్ డిఓను ఆదేశించారు. పాత్రునివలసలో 33 ఎకరాలలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ స్టేడియం, శాంతినగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను శనివారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రన్నింగ్ ట్రాక్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.  కావలసిన పరకరాలు ఏర్పాటు చేయాలన్నారు.  శాంతినగర్ కాలనీలో స్కేటింగ్, టెన్నీస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ పనులను నిర్మాణానికి కేటాయించిన స్థలంను ఆయన పరిశీలించారు.  బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ షిప్ సాధించిన వారిని ఆయన అభినందించారు.  జిల్లా స్థాయిలో సివిల్ సర్వీసెస్ క్రీడలను ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆయన బ్యాట్మింటన్ ఆడారు.  ఈ పర్యటనలో జెసి-3 ఆర్ శ్రీరాములునాయుడు, ఆర్డిఓ ఐ. కిషోర్, డిఎస్ డిఓ శ్రీనివాసరావు, తహసిల్థార్ వెంకటరావు, పాత్రునివలస సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-04 07:31:29