1 ENS Live Breaking News

17.3 ఎకరాల్లో జీవ వైద్యపార్కు నిర్మాణం..

జీవ వైవిధ్యాన్ని (బ‌యో డైవ‌ర్సిటీ) ప‌రిర‌క్షించ‌డంలో భాగంగా జిల్లాలో ఆదిక‌వి న‌న్న‌య విశ్వ‌విద్యాల‌యంలో బ‌యోడైవ‌ర్సిటీ పార్కు ఏర్పాటుకు ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ‌లో క‌లెక్ట‌రేట్‌లో ఏపీ స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు స‌భ్య కార్య‌ద‌ర్శి డా. న‌ళినీ మోహ‌న్‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్.. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, డీఎఫ్‌వో (టెరిటోరియ‌ల్‌) ఐకేవీ రాజు, డీఎఫ్‌వో (సోష‌ల్ ఫారెస్ట్రీ) ఆర్‌.శ్రీనివాస్ త‌దిత‌రుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 7.13 ఎక‌రాల్లో ఏర్పాటుచేయ‌నున్న బ‌యోడైవ‌ర్సిటీ పార్కుకు సంబంధించి భూమి, ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి, నిర్మాణాలు, ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం, టెండ‌ర్ ప్ర‌క్రియ‌, బ‌య‌ట నుంచి ర‌హ‌దారులు, అంత‌ర్గ‌త జీవ వ‌న‌రుల పార్కులు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బ‌యోడైవ‌ర్సిటీ పార్కులో సీతాకోక చిలుక, ఔష‌ధ‌, ఆక్వాటిక్‌, ఫైక‌స్, ఆరోమాటిక్‌, గృహ వైద్య త‌దిత‌ర గార్డెన్ల‌తో పాటు ఫుడ్‌కోర్టు, ఇంట‌ర్‌ప్రెటేష‌న్, యోగా/మెడిటేష‌న్ సెంట‌ర్‌, కిడ్స్ జోన్ వంటివి కూడా ఏర్పాటు కానున్నందున అట‌వీ, రెవెన్యూ, వ‌ర్సిటీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ ప్రాజెక్టు విజ‌య‌వంతంగా ప్రారంభమ‌య్యేందుకు కృషిచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఏపీ స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు అధికారుల మార్గ‌నిర్దేశం, స‌హ‌కారంతో ద‌శ‌ల వారీగా ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. ఇప్ప‌టికే జిల్లాస్థాయి ప్ర‌త్యేక బృందం భూ త‌నిఖీలు నిర్వ‌హించినందున తర్వాత చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై దృష్టిసారించాల‌ని సూచించారు. అదే విధంగా జిల్లాలో జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ‌కు జీవ వైవిధ్య నిర్వ‌హ‌ణ క‌మిటీ (బీఎంసీ)ల ద్వారా స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందించి, అమ‌లుచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. జంతువులు, ప‌క్షులు, ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం త‌దిత‌రాల‌కు సంబంధించిన నిపుణుల‌ను కూడా క‌మిటీల్లో చేర్చుతున్న‌ట్లు తెలిపారు. 

ఏపీ స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు స‌భ్య కార్య‌ద‌ర్శి డా. న‌ళినీ మోహ‌న్ మాట్లాడుతూ ప్రజలు జీవ వైవిధ్యం ఆవ‌శ్య‌క‌త‌పై అవగాహన పెంపొందించుకోవ‌డం ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేయడం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని పేర్కొన్నారు. వివిధ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, స‌హ‌కారం; జీవ వైవిధ్య కార్యాచ‌ర‌ణ అమ‌లుకు గ్రామ‌, మండ‌ల స్థాయి క‌మిటీల స‌హ‌కారం, ప్ర‌జా భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. జిల్లాలోని ఆదిక‌వి న‌న్న‌య విశ్వ‌విద్యాల‌యంలో బ‌యోడైవ‌ర్సిటీ పార్కు.. ప్ర‌జ‌ల్లో జీవ‌వైవిధ్యంపై అవ‌గాహ‌న  పెంపొందించేందుకు, విద్యార్థులు ప‌రిశోధ‌న‌లు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వివ‌రించారు. జీవ‌వైవిధ్య చ‌ట్టం-2002 అమ‌లుకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు కొత్త న‌మూనాలో ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఈ క్ర‌మంలోనే బ‌యోడైవ‌ర్సిటీ ప్రాజెక్టుల‌ను చేప‌డుతున్న‌ట్లు న‌ళినీ మోహ‌న్ తెలిపారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, ఆదిక‌వి న‌న్న‌య యూనివ‌ర్సిటీ డీన్ (సీడీసీ) ప్రొఫెస‌ర్ ఎన్‌.క‌మ‌ల‌కుమారి; కాకినాడ రూర‌ల్ ఎంపీడీవో, త‌హ‌సీల్దార్ పి.నారాయ‌ణ‌మూర్తి, వి.ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-08 12:50:07

వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలి..

వ‌ర్షాలు ప‌డుతున్న దృష్ట్యా గ్రామాల్లో కాలానుగుణ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా సిబ్బంది, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. జ్వ‌రాల‌కు సంబంధించి స‌మాచారం అందితే వెంట‌నే ఆయా గ్రామాల్లో ఆరోగ్య త‌నిఖీలు చేప‌ట్టి వ్యాప్తి చెంద‌కుండా నిరోధించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. చీపురుప‌ల్లి మండ‌లంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు బుధ‌వారం అల‌జంగి, రామ‌లింగాపురం గ్రామ స‌చివాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, జ్వ‌రాల ప‌రిస్థితి, వ్యాధుల ప‌రిస్థితిపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల‌తో మాట్లాడి ప‌రిస్థితులు తెలుసుకున్నారు. అల‌జంగిలో వివిధ సంక్షేమ ప‌థ‌కాల నోటిఫికేష‌న్లు, ఆయా ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం, వాటిని పొందేందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు సంబంధిత స‌మాచారం స‌చివాల‌య నోటీసు బోర్డులో ప్ర‌ద‌ర్శించిందీ లేనిదీ జె.సి. త‌నిఖీ చేశారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల ప‌రిష్కారం ఏవిధంగా చేస్తున్న‌దీ ఆరా తీశారు. రేష‌న్ కార్డులు, ఇళ్ల ప‌ట్టాలు మంజురు వంటివి నిర్ణీత గ‌డువులోగా మంజూరు చేస్తున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు.

Vizianagaram

2021-09-08 11:19:41

దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలి..

దివ్యాంగులు తమ అవసరాలు, పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు వీలుగా సంబంధిత ప్రాంతాలలో రాంప్, టాయ్లెట్ లు, వాహనాల పార్కింగ్ తదితర పనులను చేపట్టే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "సుగమ్య భారత్ అభియాన్ ఆక్సెస్ ఇండియా కాంపైన్ ప్రోగ్రామ్" ను జిల్లాలో వేగవంతం చేయాలని జిల్లా కలక్టర్ డా ఏ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్కీం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజభిలిటీస్ ఆక్ట్-2016"(SIPDA)కార్యక్రమానికి సంబంధించి జీ వీ ఎం సి,   ఏ పీ ఈ డబ్ల్యూ ఐ డి సి, ఏ పీ ఎస్ ఆర్ టీ సి, ఆర్ & బి, ఏ పీ ఎం ఎస్ ఐ డీ సి మొదలైన ఐదు శాఖలు 38 రకాల పనులను నిర్వర్తిస్తున్నాయని,వాటికి సంబంధించి రూ 1436.33 లక్షలు మంజూరు అయ్యాయన్నారు.   జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నరాజు మాట్లాడుతూ తమ పరిధిలో 7 పనులు మంజూరు కాగా వాటిలో 6 పనులు పూర్తి చేయడం జరిగిందని,మిగిలిన ఒకటి 80% అయ్యిందని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీఈ డబ్ల్యు ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం జగ్గారావు మాట్లాడుతూ తమకు కేటాయించిన పది పనులలో ఒకటి మాత్రమే పూర్తయిందని ,మిగిలిన కొన్నిి  టెండర్ ప్రక్రియ లోనూ వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసి డెప్యూటీ ఇంజనీర్ పీవీ నరసింహారావు మాట్లాడుతూ తమకు కేటాయించిన ఆరు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.  ఆర్ & బీ  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ సుధాకర్ మాట్లాడుతూ తమకు కేటాయించిన పది పనులు టెండర్ ప్రక్రియలోను ,వివిధ దశలలోను ఉన్నాయన్నారు. ఏ పీ ఎం ఎస్ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఎ నాయుడు మాట్లాడితూ అయిదు పనులకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ మొత్తం 38 పనులకు గాను 7 పనులను మాత్రమే పూర్తిచేయడం చాలా అలసత్వం గా ఉందన్నారు.  వెంటనే టెండర్ ప్రక్రియను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని, నాణ్యమైన మెటీరియల్ నుఉపయోగించి  పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో పనుల పురోగతి పై  మరలా సమీక్షిస్తానని అప్పటికి ప్రోగ్రెస్ కనబడాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, డిజేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ జి వి ఆర్ శర్మ పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-08 10:50:35

త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలి..

అనంతపురం నగరంలో పెండింగులో ఉన్న  రోడ్లు పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని  మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని టీటీడీ కల్యాణ మండపం రైల్వే గేటు నుంచి తపోవనం సర్కిల్ వరకు 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న  బీటీ రోడ్ పనులను  మేయర్ బుధవారం పరిశీలించారు. పనులలో జాప్యం వల్ల నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు గతుకులమయంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు మేయర్ దృష్టికి  తీసుకువచ్చారు. దీనితో ఈ ఈ రామ్మోహన్ రెడ్డితో కలసి మేయర్ వసీం పనులను పరిశీలించారు.టీటీడీ కల్యాణ మండపం రైల్వే గేటు నుంచి తపోవనం సర్కిల్ వరకు గుంతలు ఎక్కువగా ఉన్నందున పటిష్టంగా రోడ్ పనులు చేపట్టాలని,అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయాలని అధికారులకు మేయర్ సూచించారు. అంతేకాకుండా వర్షాల వల్ల నగరంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శేఖర్ బాబు, శ్రీనివాసులు  , అనిల్ కుమార్ రెడ్డి,  నాయకులు రామచంద్ర , డి ఈ నరసింహులు, కాంట్రాక్టర్ రఘునాథ్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-08 10:39:37

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి..

ప్ర‌భుత్వం వివిధ వ‌ర్గాల వారికోసం ఉద్దేశించి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆయా వ‌ర్గాలకు చెందిన అర్హులైన వారికి స‌క్ర‌మంగా, స‌త్వ‌రం అందించేందుకు స‌చివాల‌య ఉద్యోగులు కృషిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ అన్నారు. స‌చివాల‌యాల ద్వారా గ్రామీణ‌ ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లందించి ఉద్యోగులు వారి అభిమానం పొందాల‌న్నారు. డెంకాడ‌, భోగాపురం మండ‌లాల్లో జాయింట్ క‌లెక్ట‌ర్ డా.మ‌హేష్ కుమార్ బుధ‌వారం ప‌ర్య‌టించి ప‌లు గ్రామ స‌చివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. డెంకాడ మండ‌లం శింగ‌వ‌రం, డెంకాడ మండ‌ల కేంద్రం, భోగాపురంలో గ్రామ స‌చివాల‌యాల‌ను జె.సి త‌నిఖీ చేశారు. స‌చివాల‌యంలో రికార్డులు, రిజిష్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యానికి వ‌చ్చే విన‌తుల ప‌రిష్కారం ఏవిధంగా చేస్తున్న‌దీ ఆరా తీశారు. ప్ర‌జ‌ల నుంచి వివిధ సేవ‌ల నిమిత్తం వ‌చ్చే విన‌తుల‌ను జాప్యం లేకుండా త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. ఆధార్ న‌మోదుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ల‌బ్దిదారుల‌కు స‌క్ర‌మంగా అందిస్తున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. అర్హులైన వారికే ప‌థ‌కాలు అందించాల‌ని స్ప‌ష్టంచేశారు. స‌చివాల‌య సిబ్బంది ప‌నివేళ‌ల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటూ గ్రామ‌స్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. గ్రామ స్థాయిలో ప‌రిష్కారం సాధ్యం కాన‌ట్ల‌యితే వారు ఏ కార్యాల‌యానికి వెళ్తే ప‌రిష్కారం జ‌రుగుతుందో ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాల‌న్నారు.

Denkada

2021-09-08 09:27:29

మట్టి వినాయక విగ్రహాలనే వినియోగిద్దాం..

మట్టి వినాయక విగ్రహాలతోనే వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎల్  రమేష్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు.బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో జై భారత్ ముద్రించిన పండగ పూట పాపం చేయడం ఎందుకు? గోడ పత్రికను ఆయన  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికర విష రసాయనాల రంగులు వినియోగించిన విగ్రహాలను వాడి పర్యావరణాన్ని పాడుచేయవద్దని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మట్టి విగ్రహాలనే వినియోగించాలని పిలుపునిచ్చిన సంగతి విదితమేనని అన్నారు. దైవం మెచ్చే రీతిలో, పుడమితల్లికి నచ్చే రీతిలో భక్తి పారవశ్యంతో గణేశుని అర్చిద్దామని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రజలతోనే పూజిద్దామని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో చెరువులు, నదులు కాలుష్యం నుండి రక్షింపబడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ సభ్యులు జి.వి నాగభూషణరావు ,కళ్యాణ చక్రవర్తి,రామారావు,రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-08 09:23:19

జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ..

వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ సభ్యులందరికీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు బుదవారం తెలిపారు. ఈ మేరకు వీరు మాట్లాడుతూ గురువారం  ఉదయం 10 గంటల నుంచి సీతమ్మ దార విజేఎఫ్ వినోద వేదిక,నార్లవెంకటేశ్వరరావు భవన ప్రాంగణంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జర్నలిస్ట్ లుకు వినాయక విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకం, వివిధ రకాల పూలమొక్కలు అందజేస్తామన్నారు.
పర్యావరణానికి పెద్ద పీట వేస్తూనే నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.. క్లబ్ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వినాయక విగ్రహాలు తదితర సామాగ్రి స్వీకరించవలసిందిగా కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే జర్నలిస్టులు కూడా అన్ని పండుగలు నిర్వహించుకోవాలని, అందరు కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఉండాలన్నదే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం పాలకవర్గం లక్ష్యమన్నారు.  సీనియర్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ దియేటర్ సౌజన్యం తో ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-08 07:47:23

విద్య మానవ జీవితాలనే మార్చేస్తుంది..

జీవితంలో మార్పును తీసుకొని రాగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందని.. పేద ప్రజలు చీకటిలో చదవకుండా వారు మంచి వాతా వరణంలో చదివేలా రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం డి.ఆర్.డి ఏ సమావేశ మందిరంలో నాడు – నేడు రెండవ విడత చేపట్టనున్న కార్యక్రమాలకు సంబందించి శిక్షణా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంబించారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 1533 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, 95 శాతం పాఠశాలల స్థితి గతులు మార్చి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం జరిగిందని, మిగతా పాఠశాలల్లో చిన్న చిన్న మార్పులు కూడా చేస్తున్నారని పాఠశాలలకు వెళ్లినప్పుడు విధ్యార్ధుల తల్లి దండ్రులు, విధ్యార్ధులు, ఉపాద్యాయులు కూడా పాఠశాలల్లో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఇరిగేషన్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి పారుదల సర్వ శిక్ష అభియాన్ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు రెండవ విడతలో 1671 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మనం చేస్తున్న ఈ కార్యక్రమం నిండు మనసుతో విధ్యార్ధుల భాయిషత్తు కోసం చేయాలని, రాష్ట్ర భవిష్యతే దేశ భవిష్యత్ అని ఈ రెండింటిని ముందుకు తీసుకో పొగలిగినది విధ్యార్ధుల భవిష్యత్ కోసం మనం కృషి చేస్తున్న విషయం మరువ కూడదన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని అనుకోవడం సహజమని రాష్ట్ర ప్రభుత్వం అందరి భావిషత్ కోసం మార్పులు తీసుకొని రావాలని భావించిందన్నారు. 
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీర బ్రహ్మo మాట్లాడుతూ చదువు ఎటు వారినైనా ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని అటువంటి ఉజ్వల భవిష్యత్ కల్పించే పాఠశాలల రూపు రేఖలు మార్చే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావించి పనులు చేయించాలని ప్రధానంగా పాఠశాలలు 12 అంశాలను ప్రాధాన్యతగా భావించాలని ఇందులో మరుగు దొడ్లు ఏర్పాటు అందుకు నీటి సరఫరా, ఆర్.ఓ సిస్టమ్ ద్వారా మంచి నీటి సరఫరా, చిన్న లేదా పెద్ద రిపేర్లు, విధ్యుత్ సౌకర్యం తో పాటు ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు ఏర్పాట్లు, విధ్యార్ధులకు, ఉపాద్యాయులకు ఫర్నిచర్, గోడలకు అందమైన పెయింటింగ్, గ్రీన్ చాక్ బోర్డు, ఇంగ్లీషు ల్యాబ్, వంట గది, కాంపౌండ్ వాల్స్, అదనపు గదుల నిర్మాణం, పాఠశాలలకు అనుబందంగా ఉన్న అంగన్ వాడి కేంద్రాల రిపేర్లు, నాణ్యతగా చేయాలని అన్నారు. ఎస్.ఎస్.ఎ.ఎ.పి.సి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గతంలో మొదట 1517 పాఠశాలలను ఇవ్వడం జరిగిందని కొన్ని మార్పుల అనంతరం 1533 పాఠశాలలను ఇచ్చారని దాదాపుగా అన్ని పాఠశాలల రూపు రేఖలు మార్చామని రానున్న కాలం లో రెండవ విడత 1671 పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు అనుమతి ఇచ్చారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం తరువాత మండల స్థాయిలో జరిగే శిక్షణ అందరూ సంబందిత మండల అధికారులు పాల్గొనాలని ఎ.పి.సి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మo, ఎస్.ఎస్.ఎ.ఎ.పి.సి వెంకట రమణ రెడ్డి, ఆర్.డబ్ల్యూ.ఎస్.ఈ విజయ్ కుమార్, డి.ఈ.ఓ పురుషోత్తంలతో పాటు వివిధ శాఖల ఇంజినీర్లు పాల్గొన్నారు. 

Chittoor

2021-09-08 07:34:08

అంబేద్కర్ నగర్ ను అన్నివిధాలా అభిరుద్ది చేస్తాం..

అనంతపురం అంబేద్కర్ నగర్ ను అన్ని విధాలా అభిరుద్దీ చేస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 21 వ డివిజన్ పరిధిలో  పారిశుద్ధ్య పనులను బుధవారం నగర మేయర్  నగరంలోని అంబేద్కర్ నగర్ లో డిప్యూటీ చైర్మన్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి, స్థానిక కార్పొరేటర్ సాకే చంద్రలేఖ తో కలసి పర్యటించారు. డివిజన్ లో పలుచోట్ల డ్రైనేజీలు లేఖ మురుగునీరు రోడ్డుపైకి వస్తున్న విషయాన్ని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.పేదలు అధికంగా నివసిస్తున్న అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేక దోమలు ప్రబలుతున్నాయని తద్వారా తరచూ స్థానికులు రోగాల బారిన పడుతున్నారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అంబేద్కర్ నగర్ అభిరుద్దీ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు కుల్లాయి స్వామి,ఏ ఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-08 06:19:24

అప్పన్నకు వైశ్యకార్పోరేషన్ చైర్మన్ పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రిఅప్పన్న) స్వామి వారిని బుధవారం రాష్ట్ర వైశ్య వెల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్  కుప్పం ప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవి, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, 32వ వార్డు (విశాఖ) కార్పొరేటర్ డా. కందుల నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వైశ్వ కార్పొరేషన్ ఛైర్మన్ కు స్థలపురాణాన్ని, ఈఓగా సూర్యకళ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవ వివరించారు. నరసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు, ఆలయం బయట సుందరీకరణను వివరించారు. నరసింహ అవతారాలు తెలిసేలా బోర్డులు పెట్టడం అందర్నీ ఆకట్టుకుంది.  దేవస్థానంలో ఈఓ సూర్యకళ చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను గరుడ మాధవి వివరించారు.  సింహాద్రి అప్పన్న ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని కుప్పం ప్రసాద్, డా.కందుల నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-08 05:55:13

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం(చిత్తూరు జిల్లా వారికి మాత్రమే) టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న కోరిక మేరకు సెప్టెంబరు 8 వ తేదీ బుధ  వారం  ఉదయం 6 గంటల నుండి రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అలిపిరి లోని భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.

Tirumala

2021-09-07 12:53:22

ప్రభుత్వ ప్రోత్సాహంతో జీవన ప్రమాణాలు పెంచుకోవాలి..

ప్రభుత్వం రాయతీపై సరఫరా చేస్తున్న చేపపిల్లలను పెంపకం చేసి మత్స్యకారులు తమ యొక్క జీవన ప్రమాణాలును మరింతగా పెంపొందించుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపు నిచ్చారు. బుధవారం పార్వతీపురం మండలం, పెద బొండపల్లి గ్రామం, తామర చెరువులో సబ్సిడీపై సరఫరా చేసిన ఫింగర్ లింగ్ సైజు గల 50వేల చేపపిల్లలను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారితో కలిసి విడుదల చేసారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం, అభివ్రుద్ధికోసం వైఎస్. జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారి మాట్లాడుతూ, సుస్థిరమైన, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం 2020-21నుంచి  2024-25వరకు 5ఏళ్లలో అమలు పరిచేవిధంగా  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.  ఆక్వా రైతులుకు అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాగర మత్స్యకారులకు వేట నిషేద భ్రుతిని రూ. 4,000/-లు నుండి రూ. 10,000/-లు పెంచడంతో పాటు..  50 సంవత్సారాలు దాటిన మత్స్యకారులందరికి మత్స్యకార ఫించను అందజేయడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు ఎక్ష్ గ్రేషియాను రూ. 5.00 లక్షలు నుంచి రూ. 10.00లక్షలుకు పెంచడం, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అందజేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్ మరియు ఆక్వా కల్చర్ అనుమతులు సరళంగా, త్వరితగతిన పొందడం కోసం ఏర్పాటు చేసిన 3చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020,  ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్)(సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ది సంస్థ చట్టం 2020) లను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో స్థానిక మత్స్య ఉత్పత్తులపై వాడకం పెరగటం కోసం మత్స్యశాఖ చేస్తున్న కృషి వలన ఆక్వా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా మంచి గిట్టుబాటు ధర దొరకడం అభినందనీయమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేర్కొన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి. కిరణ్ కుమార్, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి టి. నాగమణి, జిల్లా స్వదేశీ మత్స్యకార సహకార సంఘ ఉపాధ్యక్షులు దాసరి లక్ష్మణ రావు, నర్సిపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు తిరుపతి, మత్స్యకార సహకార  సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Parvathipuram

2021-09-07 11:29:03

భూసేక‌ర‌ణ జిల్లాలో త్వరగా పూర్తిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల‌కోసం సేక‌రిస్తున్న  భూసేక‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. భూసేక‌ర‌ణ‌కు సంబంధించి, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేష‌న్‌, అట‌వీ, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని పెట్టుకొని భూసేక‌ర‌ణ పూర్తి చేయాల‌న్నారు. మూడో రైల్వేలైన్‌, తోట‌ప‌ల్లి, తార‌క‌రామ‌తీర్ధ‌సాగ‌ర్‌, ఆర్ ఓ బి, డంపింగ్ యార్డు, జాతీయ‌ ర‌హదారుల‌కు సేక‌రిస్తున్న భూముల‌కు సంబంధించి, ప్యాకేజీల‌వారీగా స‌మీక్షించారు. వాటి స్థితిని తెలుసుకున్నారు. ప‌నిలో నిర్లక్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే స‌హించేది లేద‌ని, యుద్ద‌ప్రాతిప‌దిక‌న భూసేక‌ర‌ణ ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు.ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, భూసేక‌ర‌ణ‌ స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-07 10:46:30

తూ.గో. 16 పశువైద్యుల పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లాలో 16 పశు వైద్యుల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా.ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 64 మండలాల పరిధిలో పశువైద్యలు లేని చోట ఉన్నవైద్యులకే అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. వారికి సహాయంగా గ్రామీణ పశువైద్య సహాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ఇపుడు పశువైద్యం పూర్తిస్థాయిలో మెరుగు పడిందని, మందులు కూడా కూడా లభ్యం అవుతున్నాయన్నారు. పాడి రైతులు తమ పశువుల కోసం ఏ విధమైన సహాయమైనా రైతుభరోసా కేంద్రాలు,  వెటర్నరీ డిస్పెన్సరీల ద్వారా పొందవచ్చునని ఆయన సూచించారు.

Kakinada

2021-09-07 05:48:22

ద్యానవన పంటలకు 40% ఈ-క్రాప్ బుకింగ్..

తూర్పుగోదావరిజిల్లాలో ఉద్యాన వన పంటలకు ఈ-క్రాపింగ్ ఇప్పటి వరకూ 40శాతం పూర్తయినట్టు డిప్యూటీ డైరెక్టర్ రమ్మోహన్ తెలియజేశారు. మంగళవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో ఉద్యానవన పంటలు 4లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామ సచివాలయాల పరిధిలోని గ్రామీణ ఉద్యాన సహాయకులు ఈ-క్రాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈనెలాఖరు నాటికి ఈ క్రాపింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయని డిడి వివరించారు.

Kakinada

2021-09-07 05:47:07