1 ENS Live Breaking News

తూ.గో. లోనే టస్సార్ పట్టు అత్యధిక సాగు..

తూర్పు గోదావరి జిల్లాలో 1200 ఎస్టీ కుటుంబాలతో టస్సార్ పట్టు సాగు జరుగుతోందని ఉద్యనావనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టస్సార్ పట్టుసాగు, ఎగుమతులు ఉన్నాయన్నారు. పట్టుతయారీకి సంబంధించిన రైతులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం ఈరకం పట్టుపై రైతులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని సాగుచేయడానికి ముందుకి వస్తున్నారన్నారు. గతంలో హార్టికల్చర్ కు వనరులు, సిబ్బంది తక్కువగా ఉండేవారని, ప్రస్తుతం గ్రామసచివాలయాలు ఏర్పాటైన తరువాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. వాణిజ్యపంటలను మరింత ప్రోత్సహించేందుకు ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Kakinada

2021-09-02 06:46:43

వైఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువున్నారు..

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 29వార్డ్ జగదాంబ జంక్షన్ వైస్సార్ విగ్రహం వద్ద స్వర్గీయ వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనతరం. వికలాంగులకు వీల్ చైర్స్, పేద మహిళలకుచీరలు పంపిణీ చేశారు.  29వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు అద్యక్షన ఈ కార్యక్రమంలో స్టేట్ నాగవంశం డైరెక్టర్ కనకాల ఈశ్వర్, స్టేట్ యూత్ సెక్రటరీ మాన్యాల శ్రీనివాస్, స్టీట్ యూత్ సెక్రటరి కోరాడ సురేష్ స్టేట్ బిసిసెల్ సెక్రటరి బెవర మహేష్ స్టేట్ ప్రచార కమిటీ సెక్రెరరీ అడపా శివ, పీతల తేజ,  గండి అప్పల రాజు దుక్క గోపి అరుగుల రాజు, ఊటగెడ్డ సంతోష్, తుపాకుల రమేష్, సారిపల్లి రమణేశ్వర్ సారిపల్లి శ్రీనివాస్, మైలిపిల్లి శివ కృష్ణ ఎల్లాజీ కనకాల రాజు నీలాపు శ్రీను, వురికీటీ పండు, కిరణ్, ఆఫ్టికల్ రవి గొలగని శివ, మహిళ సీనియర్ నాయుకురాలు అరుణశ్రీ,, మాణిక్యం, శ్రీనివాసు, కంచబొయిన ఎర్రజీ,  సింగం పల్లి తాతారావు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-09-02 04:30:27

తూ.గో:లో 69 అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఖాళీ..

తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయశాఖలో 69 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీలు భర్తీకాలేదని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్వీరమణ తెలియజేశారు. బుధవారం కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లోని 749 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టుల వివరాలను ఇటీవలే ప్రభుత్వానికి ఖాళీల జాబితా గ్రామసచివాలయాల వారీగా నివేదించామన్నారు. ప్రస్తుతం వీరంతా జిల్లా వ్యాప్తంగా సేవలందిస్తున్నారన్నారు. వచ్చే నోటీఫికేషన్ లో మిగిలి పోయిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉండవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధిక సంఖ్యలో సిబ్బంది నియామకంతో రైతులకు సకాలంలో సేవలు అందుతున్నాయని జాయింట్ డైరెక్టర్ వివరించారు.

Kakinada

2021-09-02 04:25:13

జిల్లాలో కొత్తగా 16 రైతుభజార్లు మంజూరు..

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 16 రైతుబజార్లు మంజూరు అయ్యాయని మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 18 రైతు బజార్లుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెడితే 16 మంజూరు చేసినట్టు చేసినట్టు చెప్పారు. అందులో కాకినాడ అర్భనల్-2, కాకినాడ రూరల్-2, రామచంద్రాపురం-1, రాజమండ్రి-2, రాజానగరం-4, ఏలేశ్వరం-1, జగ్గంపేట-1, రంపచోడవరం-1, చింతూరులో-1 చొప్పున ఉన్నాయన్నారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. రైతు బజార్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు అన్ని రకాలక కూరగాయలు ఒకేచోట లభించడానికి ఆస్కారం వుంటుందని ఆయన తెలియజేశారు.

Kakinada

2021-09-02 03:49:49

సాగరమాల అభ్యంతరాలపై విచారణ..

సాగ‌ర‌మాల ప్రాజెక్టు ప‌రిధిలో 40.39 కి.మీ. ర‌హ‌దారికి సంబంధించి దాదాపు 597 ఎక‌రాల భూసేక‌ర‌ణ‌పై 3ఏ నోటిఫికేష‌న్ ప్ర‌కారం అందిన అభ్యంత‌రాల పిటిష‌న్ల‌పై జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), కాంపిటెంట్ అథారిటీ ఫ‌ర్ ల్యాండ్ అక్వ‌జిష‌న్ (కాలా) డా. జి.ల‌క్ష్మీశ వ్య‌క్తిగ‌త విచార‌ణ జ‌రిపారు. బుధ‌వారం యు.కొత్త‌ప‌ల్లి మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ఈ విచార‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నార్థం చేప‌డుతున్న సాగ‌ర‌మాల ప్రాజెక్టు భూసేక‌ర‌ణ‌పై కాకినాడ రూర‌ల్‌, యు.కొత్త‌పల్లి మండ‌లాల‌కు చెందిన వారినుంచి 65 పిటిష‌న్లు రాగా ప్ర‌తి పిటిష‌న్‌దారునితో జాయింట్ క‌లెక్ట‌ర్ నిశితంగా మాట్లాడి, విచార‌ణ జ‌రిపారు. వారు వ్య‌క్తం చేసిన వివిధ అంశాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. చ‌ట్ట ప్ర‌కారం త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు. ముందుగా నోటీసులు జారీచేసి చ‌ట్ట ప్ర‌కారం ఈ వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టారు. ఈ ర‌హ‌దారి కాకినాడ రూర‌ల్‌, యు.కొత్త‌ప‌ల్లి, తొండంగి, శంక‌వ‌రం మండ‌లాల ప‌రిధిలోని 21 గ్రామాల గుండా వెళ్తుంది. ఈ విచార‌ణ కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌; యు.కొత్త‌ప‌ల్లి, తొండంగి త‌హ‌సీల్దార్లు శివ‌కుమార్‌, రాజు; నేష‌న‌ల్ హైవేస్ ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజర‌య్యారు.

East Godavari

2021-09-01 15:56:14

ఒకటవ తేదీనే పూర్తిగా పెన్షన్లు ఇస్తున్నాం..

గుంటూరు జిల్లాలో ప్రతీ నెల 1వ తేదిన 99% శాతం పెన్షన్లు  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కే.వి.పి కాలనీ 74 వ వార్డు సచివాలయం కి చెందిన షేక్ బాజీ అనే దివ్యంగునికి ఇంటికి చేరుకొని ట్రై సైకిల్ మరియు పెన్షన్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పందించి దివ్యాంగుడైన షేక్ బాజీకి జిల్లా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ  ద్వారా ట్రై సైకిల్ తో రూ.3వేల పెన్షన్  ను అందించినట్లు  జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంకా ఎవరైనా అర్హత కలిగిన దివ్యాంగులు ఉంటే సమాచారం అందిస్తే, వారికి సాయం చేస్తామన్నారు. దివ్యాంగుల కోటాలో ప్రతీనెల బాజికి పెన్షన్ అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలో ప్రతీ నెల 1వ తేదిన పెన్షన్లను  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ  నేరుగా వారి ఇళ్ళకు వెళ్ళి సచివాలయ వాలంటీర్లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలు కోరుకున్న విధంగా  అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ శ్రీనివాసరావు, ఆర్.డి.ఒ భాస్కర్ రెడ్డి, సాంఘీక సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ మధు సూదనరావు, తూర్పు మండల తహాశీల్ధార్ శ్రీకాంత్, వెల్ఫేర్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-09-01 15:51:12

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..

ప్రభుత్వ శాఖలకు ప్రజా ప్రతినిధులు నుంచి వివిధ అంశాలపై వస్తున్న అర్జీలను సత్వరమే సక్రమంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అదికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రభుత్వ శాఖలకు ప్రజా ప్రతినిధులు నుంచి వస్తున్న అర్జీల పరిష్కారం పై, గత నెలలో జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తీసుకున్న చర్యల నివేదికపై   అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా మంత్రులు, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందించిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు సూచనలు అందించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు అందించిన అర్జీలకు  అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత రాష్ట్ర శాఖలకు అర్జీలు పంపించి అవి పరిష్కారించేలా జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్టును సంబంధిత ప్రజా ప్రతినిధులకు లిఖిత పూర్వకంగా అందించాలన్నారు. శాఖలలో జరుగుతున్న అవినీతిపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలపై వెంటనే విచారణ జరిపించాలని, ప్రాధమిక అధారాలు ఉంటే పోలీస్ కేసులు నమోదు చేయటంతో పాటు, విచారణ కోసం విజిలెన్స్ శాఖకు సిఫార్సు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి అందుతున్న అర్జీలను సంబంధిత శాఖలకు అందించేందుకు, అర్జీలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేయాలన్నారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి తీసుకున్న చర్యలపై బుధవారం సాయంత్రం నాటికి సంబంధిత శాఖలు నివేదికలు అందించాలన్నారు.
సమావేశంలో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-09-01 15:48:37

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్..

రాష్ట్ర ముఖ్య  ఎన్నికల  అధికారి ఆదేశాల  మేరకు మాసాంత తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను మరియు  ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వ్యవసాయ మార్కెట్  యార్డు లో వీవీపాట్స్ ను భద్రపరచిన  గోడౌన్ ను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ బుధవారం తనిఖీ చేసారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో కలసి గోడౌన్ల తాళాలకు వేసిన  సీళ్ళును పరిశీలించారు. ఇవియం, వీవీపాట్స్ ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్ల నోడల్ ఆఫీసర్ వి.శైలజ, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య,  గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు తూర్పు మండల తహశీల్దారు శ్రీకాంత్, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, సీపీఐ పార్టీ తరుపున కె.ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరుపున అడవి ఆంజనేయులు, ఎ.ఐ.ఎం.ఐ.ఎం పార్టీ నాయకులు షేక్. బాజిత్ భాషా   రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-09-01 15:45:43

యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి..

యువత సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల టిటిడిసిలో ఐ ఎస్ ఎం ఓ శిక్షణా కేంద్రం, సోలార్ సిస్టమ్ ను  ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బుధ వారం ప్రారంభించారు.  సిడాక్ సంస్థ సౌజన్యంతో యువతకు శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే పలాస, సోంపేట, రాజాం తదితర ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అత్యధిక మానవ వనరులు కలిగిన దేశం భారత దేశం అన్నారు. మానవ వనరులను చక్కగా వినియోగించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. పార్లమెంటు నియోకవర్గం స్థాయిలో నైపణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిడాక్ సౌజన్యంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. డిఆర్డిఎ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయం, విద్యా, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవతంగా పనిచేస్తోందని, నిరుద్యోగాన్ని నివారించుటకు దోహదం చేస్తుందని చెప్పారు.  యువతలో నైపుణ్యం ఉంటే ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించారు. నరసన్నపేట లో నైపుణ్య అభివృద్ధి సంస్థ మంజూరు అయిందని,  బుడితిలో త్వరలో శిక్షణ ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ముఖ్య మంత్రి ఆశయం అన్నారు. దిశ, పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే  ఉద్యోగాలు, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు తదితర ఎన్నో నూతన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన అన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలకు అందించామని, అమ్మ ఒడి తదితర కార్య్రమాలను అమలు చేస్తూ పేదలకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్య మంత్రి జగన్ మీకు అండగా ఉన్నారని ఆయన చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలోనే ఎచ్చెర్ల ఉండాలని ముఖ్య మంత్రిని కోరామని, ఆ మేరకు ఆయన అంగీరించారని తెలిపారు. శాసన సభ్యులు గొర్లే కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధి కావాలన్నారు. అన్ని పరిశ్రమలతో సమావేశం నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంప్యూటర్ శిక్షణ పొందాలన్నారు. సిడాక్ ద్వారా శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధి కల్పన, ఎంటర్ ప్రైజ్ ప్రారంభానికి అవకాశముందన్నారు. చక్కటిశిక్షణ పొంది మంచి ఉపాధి పొందాలని, ఎంటర్ప్రెన్యూయర్ గా మారి పలువురికి ఉపాధి కల్పించాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ బి. శాంతి శ్రీ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేసారు. ఉప ముఖ్యమంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిపిఎం సి.హెచ్. రామ్మోహన్, డిపిఎంలు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-01 15:20:11

కాళహస్తిలో జిసిసి ఉత్పత్తులను వినియోగించాలి..

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ దేవస్థానాల్లో జిసిసి ఉత్పత్తులను వినియోగించడానికి ఈఓలు ముందుకి రావాలని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జిసిసి)  చైర్మన్ డా.శోభా స్వాతిరాణి కోరారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఆమె కుటుంబ సమేతంగా  సందర్శించి అక్కడ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో పెద్దిరాజుని కలిసి జిసిసి ఉత్పత్తులైన పసుపు , కుంకుమ , తేనే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేవాలయంలో స్వామివారికి  జిసిసి ఉత్పత్తులు వాడటం ద్వారా గిరిజన రైతులకు ప్రోత్సాహం లభించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అభివ్రుద్ధి చెందుతాయన్నారు. ఉత్పత్తులను వినియోగించడానికి సహకరించవలసింది ఈఓను కోరారు. అంతేకాకుండా దేవస్థానంలో జిసిసి స్టాల్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా షాపును కేటాయించాలని కూడా ఆమె కోరారు. జిసిసి చైర్మన్ అభ్యర్ధనపై ఈఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Srikalahasti

2021-09-01 10:29:10

తూ.గో.జి.లో రూ.70.93 కోట్ల వసూలు లక్ష్యం..

తూర్పుగోదావరిజిల్లాలో 22 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రూ.25.97 కోట్ల రూపాలు పన్నులు వసూలు చేసినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 22 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ద్వారా రూ.70.93 కోట్ల వసూలు లక్ష్యంగా ఇప్పటి వరకూ 25.97 కోట్లు వసూలు చేయగలిగామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కాస్త అధికంగా శ్రమిస్తున్నట్టు చెప్పిన ఆయన కరోనా నేపథ్యంలో వసూళ్లు కాస్త తక్కువగా జరిగినట్టు  వివరించారు. కాగా ప్రస్తుతం జిల్లాలో 15 రైతుబజార్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఏడి వివరించారు. 

Kakinada

2021-09-01 08:19:37

జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు..

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు , ఎస్.దుర్గారావులు తెలిపారు . ఈ మేరకు బుధవారం దాబాగార్డెన్స్  వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లల్లో ప్రతిభాపాటవాలు వెలికి తీసేందుకు  ప్రతి ఏటా క్రమంతప్పకుండా ఎల్.కె.జి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. ఎంసెట్లో కూడా ఒకరిని ఎంపిక చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. స్టేట్ , సీబీఎస్ఇ  కేటగిరీల కింద  ఉపకార వేతనాలు పంపిణి చెయ్యడం జరుగుతుందని, కావున ఉపకార వేతనాల కోసం ఫోరం సభ్యులు తమ దరఖాస్తులో వివరాలు పొందు పరిచి , రెండు ఫోటోలు , మార్కులు (గ్రేడ్ తో) జాబితాను డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ పనివేళల్లో అందజేయాలని వీరు కోరారు. త్వరలో ఆంధ్రా యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామన్నారు. ఇతర వివరాలు కోసం ఉపకార వేతనాలు కమిటీ ఛైర్మన్ గంట్ల శ్రీను బాబు ఫోన్ నెంబర్ 800800 4763 లో సంప్రదించవచ్చు నన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి కో-చైర్మన్ లుగా నానాజీ. దాడి రవి కుమార్, పిఎన్ మూర్తి , కార్య వర్గ సభ్యులు వ్యవ హరిస్తారన్నారు.

జర్నలిజంలో వేర్వేరు రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన పలువురు జర్నలిస్టులకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డులను అందజేయనున్నట్లు అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్ తెలిపారు . ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా , ఫోటో జర్నలిస్టులు , వీడియో జర్నలిస్టులుతో పాటు రెండేళ్లుగా వెబ్ చానల్స్ జర్నలిస్టులకు అవార్డులు , ఎంపికలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు . ప్రతిష్టాత్మకమైన కపిలగోపాలరావు , మసూన మాష్టారు . అవార్డులుతో పాటు పలు కేటగిరిల కింద అతిధులు చేతులు మీదుగా నగదు బహుమతితో పాటు ఘనంగా సత్కరించి అవార్డులను అందజేస్తామన్నారు . ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు . ప్రతీ ఏటా ప్రతిభ చూపిన జర్నలిస్టులను గుర్తించాలన్నది వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లక్ష్యమని వివరించారు . ఇప్పటి వరకు అనేక మంది జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించిన ఘనత పోరంకే దక్కుతుందన్నారు.

Visakhapatnam

2021-09-01 07:56:40

బి.కృష్ణారావు సేవలు ప్రశంసనీయం..

విశాఖ సమాచార శాఖలో  బి.కృష్ణారావు ఆడియో విజువల్ సూపర్వైజర్ ప్రశంసనీయమైన సేవలు అందించారని ఉపసంచాలకులు వి.మణిరామ్ పేర్కొన్నారు. డి.డి. కార్యాలయం  ఆడియో విజువల్ సూపర్వైజర్ గా పనిచేసిన కృష్ణారావు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కృష్ణారావు సౌమ్యుడు, కార్యశీలి అని కొనియాడారు. 1984లో సర్వీసులో చేరి పబ్లిసిటీ అసిస్టెంట్, ఏవీఎస్ గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పని చేశారు.  అందరితో కలుపుగోలుగా ఉంటూ విధినిర్వహణలో జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల నుండి అభినందనలు అందుకున్నారని చెప్పారు.  ఈ సందర్భంగా సమాచార శాఖ సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు కృష్ణారావును ఘనంగా సన్మానించారు. సమాచార శాఖ అధికారులు, సిబ్బంది కృష్ణారావు మరుపురాని సేవలను తలచుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పౌరసంబంధాల అధికారులు డి. సాయిబాబా కే.సుమిత్రా దేవి, లైబ్రేరియన్ ఝాన్సీరత్నాబాయి, ఎస్.ఏ. వి.శ్రీనివాసరావు, ఏపీఆర్ఓ ఎం. కిషోర్ కుమార్, ఫోటోగ్రాఫర్లు కే.వెంకటరావు ఎస్.మోహన్ బాబు, కార్యాలయ సిబ్బంది  ప్రతిభా భారతి, ఇందిరాదేవి, కృష్ణ, ఖాదర్, అలీమ్, సత్య, నాయడు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-31 15:09:25

స్పెషల్ డ్రైవ్ లో1.20లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంగ‌ళ‌వారం చేప‌ట్టిన కోవిడ్ ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంత‌మైంది. జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలో చేప‌ట్టిన ఈ స్పెష‌ల్ డ్రైవ్‌కు మంచి స్పంద‌న ల‌భించింది.  జిల్లాలోని అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా చేప‌ట్టిన ఈ డ్రైవ్ ద్వారా సాయంత్రం 7.00 గంట‌ల వ‌ర‌కు 47 వేల మందికి పైగా మంగ‌ళ‌వారం ఒక్క రోజులో వ్యాక్సినేష‌న్ వేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ‌త శ‌నివారం నుంచి మంగ‌ళ‌వారం వ‌ర‌కు నిర్వ‌హించిన మూడు రోజుల కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్ లో 1.20 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు.  కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్ పై జిల్లా యంత్రాంగం వ‌లంటీర్ల ద్వారా విస్తృత ప్ర‌చారం చేయ‌డంతో మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచే కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల వ‌ద్ద‌కు 18 నుంచి 45 ఏళ్ల లోపు వ‌య‌స్సు వారు, 45 ఏళ్ల‌కు పైబ‌డిన వ‌య‌స్సు క‌లిగిన వారు వ్యాక్సిన్ కేంద్రాల‌కు చేరుకున్నారు. వి.ఆర్‌.ఓ., వి.ఏ.ఓ., ఏ.ఎన్‌.ఎం., ఆశ కార్య‌క‌ర్త‌లు ఒక బృందంగా ఏర్ప‌డి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేష‌న్ చేయించుకోవల‌సిన వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాల్సిన వారి జాబితా సిద్దం చేశారు. గ్రామ స‌చివాల‌య వ‌లంటీర్లు వ్యాక్సిన్ తీసుకోవల‌సిన వారి ఇళ్ల‌కు వెళ్లి టీకా కేంద్రాల‌కు తీసుకువ‌చ్చారు. టీకా కేంద్రాల వ‌ద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఏర్పాట్లు చేయ‌డంతో వ్యాక్సిన్ ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌య్యింది. గ‌త శ‌ని, ఆదివారాల్లో నిర్వ‌హించిన డ్రైవ్‌లో 69,661 మందికి వ్యాక్సిన్ వేయ‌గా మంగ‌ళ‌వారం 47 వేల మందికి వ్యాక్సిన్ వేశారు.

జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ప్ర‌తి గంట‌కు వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య‌ను గ‌మ‌నిస్తూ మండ‌ల స్థాయి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి త‌క్కువ‌గా న‌మోదైన మండ‌లాల‌ను మరింత వేగ‌వంతం చేసేలా ప్రోత్స‌హించారు. జిల్లాలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ‌య‌సు వారికి, 45 ఏళ్ల పైబ‌డిన వారికి క‌ల‌సి మొత్తం 6.41 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి వున్న‌ట్టు జిల్లా యంత్రాంగం గుర్తించ‌గా ఇందులో 17శాతం ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లిగామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Vizianagaram

2021-08-31 14:41:39

శ్రీ ప్రసన్నవెంకటేశుని ప‌విత్రోత్స‌వాలు..

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాలు సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు  శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 14న సాయంత్రం 5.30 గంటలకు భగ‌వ‌తారాధ‌న, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 15వ తేదీ ఉదయం 7 గంట‌లకు చ‌తుష్టార్చాన‌, ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సాయంత్రం 5 గంట‌ల‌కు భ‌గ‌వ‌తారాధ‌న‌, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 16వ తేదీ ఉదయం 7 గంటల నుండి పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ, సాయంత్రం 5  గంటల నుండి పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఉదయం 7 గంటల నుండి స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.  అనంతరం సాయంత్రం 5.30 గంటల నుండి స్వామి, అమ్మవార్లను ఆలయంలో తిరుచిపై ఊరేగింపు నిర్వహించనున్నారు.

కోసువారిపల్లె

2021-08-31 11:25:07