1 ENS Live Breaking News

కాళహస్తిలో జిసిసి ఉత్పత్తులను వినియోగించాలి..

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ దేవస్థానాల్లో జిసిసి ఉత్పత్తులను వినియోగించడానికి ఈఓలు ముందుకి రావాలని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జిసిసి)  చైర్మన్ డా.శోభా స్వాతిరాణి కోరారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఆమె కుటుంబ సమేతంగా  సందర్శించి అక్కడ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో పెద్దిరాజుని కలిసి జిసిసి ఉత్పత్తులైన పసుపు , కుంకుమ , తేనే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేవాలయంలో స్వామివారికి  జిసిసి ఉత్పత్తులు వాడటం ద్వారా గిరిజన రైతులకు ప్రోత్సాహం లభించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అభివ్రుద్ధి చెందుతాయన్నారు. ఉత్పత్తులను వినియోగించడానికి సహకరించవలసింది ఈఓను కోరారు. అంతేకాకుండా దేవస్థానంలో జిసిసి స్టాల్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా షాపును కేటాయించాలని కూడా ఆమె కోరారు. జిసిసి చైర్మన్ అభ్యర్ధనపై ఈఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Srikalahasti

2021-09-01 10:29:10

తూ.గో.జి.లో రూ.70.93 కోట్ల వసూలు లక్ష్యం..

తూర్పుగోదావరిజిల్లాలో 22 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రూ.25.97 కోట్ల రూపాలు పన్నులు వసూలు చేసినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 22 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ద్వారా రూ.70.93 కోట్ల వసూలు లక్ష్యంగా ఇప్పటి వరకూ 25.97 కోట్లు వసూలు చేయగలిగామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కాస్త అధికంగా శ్రమిస్తున్నట్టు చెప్పిన ఆయన కరోనా నేపథ్యంలో వసూళ్లు కాస్త తక్కువగా జరిగినట్టు  వివరించారు. కాగా ప్రస్తుతం జిల్లాలో 15 రైతుబజార్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఏడి వివరించారు. 

Kakinada

2021-09-01 08:19:37

జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు..

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు , ఎస్.దుర్గారావులు తెలిపారు . ఈ మేరకు బుధవారం దాబాగార్డెన్స్  వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లల్లో ప్రతిభాపాటవాలు వెలికి తీసేందుకు  ప్రతి ఏటా క్రమంతప్పకుండా ఎల్.కె.జి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. ఎంసెట్లో కూడా ఒకరిని ఎంపిక చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. స్టేట్ , సీబీఎస్ఇ  కేటగిరీల కింద  ఉపకార వేతనాలు పంపిణి చెయ్యడం జరుగుతుందని, కావున ఉపకార వేతనాల కోసం ఫోరం సభ్యులు తమ దరఖాస్తులో వివరాలు పొందు పరిచి , రెండు ఫోటోలు , మార్కులు (గ్రేడ్ తో) జాబితాను డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ పనివేళల్లో అందజేయాలని వీరు కోరారు. త్వరలో ఆంధ్రా యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామన్నారు. ఇతర వివరాలు కోసం ఉపకార వేతనాలు కమిటీ ఛైర్మన్ గంట్ల శ్రీను బాబు ఫోన్ నెంబర్ 800800 4763 లో సంప్రదించవచ్చు నన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి కో-చైర్మన్ లుగా నానాజీ. దాడి రవి కుమార్, పిఎన్ మూర్తి , కార్య వర్గ సభ్యులు వ్యవ హరిస్తారన్నారు.

జర్నలిజంలో వేర్వేరు రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన పలువురు జర్నలిస్టులకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డులను అందజేయనున్నట్లు అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్ తెలిపారు . ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా , ఫోటో జర్నలిస్టులు , వీడియో జర్నలిస్టులుతో పాటు రెండేళ్లుగా వెబ్ చానల్స్ జర్నలిస్టులకు అవార్డులు , ఎంపికలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు . ప్రతిష్టాత్మకమైన కపిలగోపాలరావు , మసూన మాష్టారు . అవార్డులుతో పాటు పలు కేటగిరిల కింద అతిధులు చేతులు మీదుగా నగదు బహుమతితో పాటు ఘనంగా సత్కరించి అవార్డులను అందజేస్తామన్నారు . ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు . ప్రతీ ఏటా ప్రతిభ చూపిన జర్నలిస్టులను గుర్తించాలన్నది వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లక్ష్యమని వివరించారు . ఇప్పటి వరకు అనేక మంది జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించిన ఘనత పోరంకే దక్కుతుందన్నారు.

Visakhapatnam

2021-09-01 07:56:40

బి.కృష్ణారావు సేవలు ప్రశంసనీయం..

విశాఖ సమాచార శాఖలో  బి.కృష్ణారావు ఆడియో విజువల్ సూపర్వైజర్ ప్రశంసనీయమైన సేవలు అందించారని ఉపసంచాలకులు వి.మణిరామ్ పేర్కొన్నారు. డి.డి. కార్యాలయం  ఆడియో విజువల్ సూపర్వైజర్ గా పనిచేసిన కృష్ణారావు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కృష్ణారావు సౌమ్యుడు, కార్యశీలి అని కొనియాడారు. 1984లో సర్వీసులో చేరి పబ్లిసిటీ అసిస్టెంట్, ఏవీఎస్ గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పని చేశారు.  అందరితో కలుపుగోలుగా ఉంటూ విధినిర్వహణలో జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల నుండి అభినందనలు అందుకున్నారని చెప్పారు.  ఈ సందర్భంగా సమాచార శాఖ సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు కృష్ణారావును ఘనంగా సన్మానించారు. సమాచార శాఖ అధికారులు, సిబ్బంది కృష్ణారావు మరుపురాని సేవలను తలచుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పౌరసంబంధాల అధికారులు డి. సాయిబాబా కే.సుమిత్రా దేవి, లైబ్రేరియన్ ఝాన్సీరత్నాబాయి, ఎస్.ఏ. వి.శ్రీనివాసరావు, ఏపీఆర్ఓ ఎం. కిషోర్ కుమార్, ఫోటోగ్రాఫర్లు కే.వెంకటరావు ఎస్.మోహన్ బాబు, కార్యాలయ సిబ్బంది  ప్రతిభా భారతి, ఇందిరాదేవి, కృష్ణ, ఖాదర్, అలీమ్, సత్య, నాయడు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-31 15:09:25

స్పెషల్ డ్రైవ్ లో1.20లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంగ‌ళ‌వారం చేప‌ట్టిన కోవిడ్ ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంత‌మైంది. జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలో చేప‌ట్టిన ఈ స్పెష‌ల్ డ్రైవ్‌కు మంచి స్పంద‌న ల‌భించింది.  జిల్లాలోని అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా చేప‌ట్టిన ఈ డ్రైవ్ ద్వారా సాయంత్రం 7.00 గంట‌ల వ‌ర‌కు 47 వేల మందికి పైగా మంగ‌ళ‌వారం ఒక్క రోజులో వ్యాక్సినేష‌న్ వేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ‌త శ‌నివారం నుంచి మంగ‌ళ‌వారం వ‌ర‌కు నిర్వ‌హించిన మూడు రోజుల కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్ లో 1.20 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు.  కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్ పై జిల్లా యంత్రాంగం వ‌లంటీర్ల ద్వారా విస్తృత ప్ర‌చారం చేయ‌డంతో మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచే కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల వ‌ద్ద‌కు 18 నుంచి 45 ఏళ్ల లోపు వ‌య‌స్సు వారు, 45 ఏళ్ల‌కు పైబ‌డిన వ‌య‌స్సు క‌లిగిన వారు వ్యాక్సిన్ కేంద్రాల‌కు చేరుకున్నారు. వి.ఆర్‌.ఓ., వి.ఏ.ఓ., ఏ.ఎన్‌.ఎం., ఆశ కార్య‌క‌ర్త‌లు ఒక బృందంగా ఏర్ప‌డి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేష‌న్ చేయించుకోవల‌సిన వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాల్సిన వారి జాబితా సిద్దం చేశారు. గ్రామ స‌చివాల‌య వ‌లంటీర్లు వ్యాక్సిన్ తీసుకోవల‌సిన వారి ఇళ్ల‌కు వెళ్లి టీకా కేంద్రాల‌కు తీసుకువ‌చ్చారు. టీకా కేంద్రాల వ‌ద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఏర్పాట్లు చేయ‌డంతో వ్యాక్సిన్ ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌య్యింది. గ‌త శ‌ని, ఆదివారాల్లో నిర్వ‌హించిన డ్రైవ్‌లో 69,661 మందికి వ్యాక్సిన్ వేయ‌గా మంగ‌ళ‌వారం 47 వేల మందికి వ్యాక్సిన్ వేశారు.

జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ప్ర‌తి గంట‌కు వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య‌ను గ‌మ‌నిస్తూ మండ‌ల స్థాయి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి త‌క్కువ‌గా న‌మోదైన మండ‌లాల‌ను మరింత వేగ‌వంతం చేసేలా ప్రోత్స‌హించారు. జిల్లాలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ‌య‌సు వారికి, 45 ఏళ్ల పైబ‌డిన వారికి క‌ల‌సి మొత్తం 6.41 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి వున్న‌ట్టు జిల్లా యంత్రాంగం గుర్తించ‌గా ఇందులో 17శాతం ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లిగామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Vizianagaram

2021-08-31 14:41:39

శ్రీ ప్రసన్నవెంకటేశుని ప‌విత్రోత్స‌వాలు..

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాలు సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు  శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 14న సాయంత్రం 5.30 గంటలకు భగ‌వ‌తారాధ‌న, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 15వ తేదీ ఉదయం 7 గంట‌లకు చ‌తుష్టార్చాన‌, ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సాయంత్రం 5 గంట‌ల‌కు భ‌గ‌వ‌తారాధ‌న‌, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 16వ తేదీ ఉదయం 7 గంటల నుండి పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ, సాయంత్రం 5  గంటల నుండి పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఉదయం 7 గంటల నుండి స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.  అనంతరం సాయంత్రం 5.30 గంటల నుండి స్వామి, అమ్మవార్లను ఆలయంలో తిరుచిపై ఊరేగింపు నిర్వహించనున్నారు.

కోసువారిపల్లె

2021-08-31 11:25:07

ప్రభుత్వం ద్రుష్టికి జిసిసి ఉద్యోగుల సమస్యలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జిసిసి)లో పనిచేసే సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని చైర్మన్ డా.శోభా స్వాతిరాణి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని తేనె ప్యాకింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిసిసి ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి తనవంతు క్రుషి చేస్తానని చెప్పారు. జిసిసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని జిసిసికి చెందిన అన్ని తయారీ యూనిట్లలోనూ పర్యటించి అక్కడి తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తేనెయూనిట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Chittoor

2021-08-31 11:03:37

తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఆదిభట్ల..

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు  తెలుగు ప్రజలంతా గర్వించే కళాకారుడని, ఆయన మన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు తెలిపారు.  భాషా సాంస్కృతిక శాఖ అద్వర్యం లో మంగళ వారం సంగీత నృత్య కళాశాలలో ఆదిభట్ల జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన జేసీ కళాశాల  వద్ద నున్న ఆదిభట్ల , ఘంటశాల చిత్ర పటాలకు  పూల మాలలు వేసి  నివాళులర్పించారు.  అనంతరం జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ హరికథ అనే కళను సమాజానికి పరిచయం చేసి, అభివృద్ధికి తోడ్పడిన గొప్ప వ్యక్తి  ఆది భట్ల యని  పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళల్లో ప్రస్తుతం హరికథ ఒకటని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ కు ప్రాధాన్యత నిస్తూ అధికారిక కార్యక్రమాల్లో హరికథ కు అవకాశం కల్పిస్తూ కళా కారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. ఎందరో కళాకారులను అందించిన   సంగీత కళాశాల కు వై.ఎస్.ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను అందించడం గర్వాంగా ఉందన్నారు.  హరికధకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కాపీలేశ్వరం లో శిక్షణా కళాశాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-31 09:36:40

కార్గో రవాణాతో రూ.285.60 కోట్ల ఆదాయం..

సముద్ర మార్గ రవాణా, వ్యాపార వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందిస్తుందని  రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం  వీజేఎఫ్ డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను, కార్గో డిమాంద్ను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పోర్టుల ప్రగతి పై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం, భవనపాడు, కాకినాడ సెజ్, రామయపట్నం పోర్టుల ప్రగతికి కార్యాచరణ జరుగుతోందన్నారు. నిజాంపట్నం ఫేజ్-2, మచిలీపట్నం ఫేజ్-2, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లును రూ.1221 కోట్లతో నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా బుదగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమాడక (విశాఖ), బియ్యపు తిప్ప (వెస్ట్ గోదావరి, ఓడరేవు (ప్రకాశంజిల్లా)లలో ఫిషింగ్ హార్బర్లు ప్రగతిని ప్రణాళికలను తయారు చేయ్యడం జరిగిందన్నారు. గతంలో మారిటైంశాఖ తీవ్రనిర్లక్ష్యానికి గురయిందని, కుంటుపడిన ప్రగతికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ స్వస్తి పలికి అన్ని విధాల ఈ శాఖను బలోపేతం'చేస్తుందన్నారు. ఈ శాఖలలో ఖాళీలను కూడా భర్తీ చేస్తూ సమద్రమార్గ రవాణా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది కాకినాడ పోర్టు, రామాయపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టుల కార్గో రవాణా ద్వారా రూ.285.60 కోట్లు రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభించిందన్నారు. ఈ ఏడాది జూన్ మాసం వరకు రూ. 70.57 కోట్ల రూపాయలు వరకు ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది వరకు పిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధి దశలో కార్యకలాపాలు ముందుకు సాగుతున్నాయన్నారు.

 జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని అర్జిస్తున్న విశాఖపట్నంలో మారిటైం బోర్డు సేవలను మరింత విస్తృతపరిచి పోర్టుల ప్రగతికి అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల వారి సహాయసహకారాలను తీసుకుంటూ పోర్టు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి పరుస్తామని ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండదన్నారు. ప్రతిష్టాత్మకమైన మారిటైం బోర్డు చైర్మన్ గా తనను నియమించిన రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉత్తరాంధ్ర నాయకులు విజయసాయిరెడ్డి, వై.సి.పి. రాష్ట్ర నాయకులకు కాయల వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడూ జర్నలిస్ట్ లుకు అండగా ఉంటామని. తన వంతు సహకారము అందిస్తామన్నారు.. కార్య క్రమంలో ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు,కార్యదర్శి ఎస్.. దుర్గారావు లు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు సంక్షేమం కోసము  తమ పాలక వర్గం పూర్తి స్థాయిలో పని చేస్తుంది అన్నారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.. నార్ల భవన్ అధునీకరణతో పాటు అంతర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తామన్నారు.. తొలుత విజేఎఫ్ కార్యవర్గ సభ్యులు కాయల వెంకట రెడ్డి ను ఘనముగా సత్కరించారు. ఉపాద్యక్షుడు అర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమం లోజాయింట్ సెక్రటరీ దాడి రవి కుమార్, కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Daba Gardens

2021-08-31 09:34:47

డిగ్రీ పరీక్షలు తక్షణమే వాయిదావేయాలి.

శ్రీకాకుళం జిల్లాలోని డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కన్వీనర్ పొన్నాడ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలో ఆయన విద్యార్ధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు 4 మరియ 6 సెమిస్టర్ పరీక్షలు  వచ్చేనెల రెండో తేదీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ వారు నిర్వహించబోతున్నారన్నారు. దీనివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.  అంబేద్కర్ యూనివర్సిటీ వైస్.ఛాన్సలర్, రిజిస్టర్ గారు పరీక్షల నిర్వహణను పునరాలోచన చేసి వాయిదా వేయాలని వారు కోరారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక్ష కంగా తరగతులు జరగలేదని, ఆన్లైన్లో  బోధన కేవలం రెండు నెలలోనే అరాకొర జరిపి పూర్తి చేశారన్నారు. దీనివల్ల విద్యార్థులకు సరిగా అవగాహనకు రాలేకపోయారన్నారు. ఫలితంగా పరీక్షలకు సమాయత్తం కాకపోవడం ఒక భాగమైతే, మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న డిగ్రీ విద్యార్థులకు అంతర్జాల సదుపాయం లేకపోవడం వల్ల అసలు వారికి ఆన్ లైన్ క్లాసులే జరగలేదన్నారు. ఈ కారణాలను ద్రుష్టిలో పెట్టుకొని డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి వారి భవిష్యత్తును కాపాడాలని ఏఐఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోరంగి గోపి నాయుడు ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు పరిడాల రాజశేఖర్,మెండి ప్రసాద్ కాదుర్లా శివ ,బెజ్జిపురం రాంబాబు,  విద్యార్థులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-31 09:29:17

దోబీ ఘాట్ ల జాబితా అందజేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో దోబీ ఘాట్ లు అవసరమైతే ఆ జాబితా అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్-3 ఆర్. శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు.  మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రజకుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  జిల్లాలో రజకులకు దోబీ ఘాట్ లు ఎక్కడైనా అవసరం అనుకుంటే ఆ జాబితాను అందజేస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.  ఏవైనా సమస్యలు ఉంటే బి.సి. కార్పొరేషన్ ఇడి దృష్టికి తీసుకురావాలన్నారు.  ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలనుకుంటే తెలియజేయాలని సూచించారు.  రజకులలో చదువుకొని కాళీగా ఉన్నట్లు తెలియజేస్తే స్కిల్ డెవలప్ మెంట్ లో ఉపాధి కల్పిస్తామని తెలిపారు.  పిల్లలను స్కూల్స్ లలో చేర్పించాలన్నా తెలియజేయాలని పేర్కొన్నారు.  వచ్చే సమావేశం నాటికి సమస్యలు ఏవైనా ఉంటే సమావేశం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.  షాపులకు 100 యూనిట్లు సబ్సిడీ ఇస్తున్నారని, గృహాలకు 100 యూనిట్లు సబ్సిడి ఇవ్వాలని సభ్యులు యేసుపాదం కోరారు.  జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాలు నిర్మించి కమ్యూనిటీకి అందజేసినట్లు బి.సి. కార్పొరేషన్ ఇడి రాజారావు చెప్పారు.  ప్రభుత్వ నిబంధనలు మేరకు మున్సిపాలిటీలు, పంచాయితీలలో షాపులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు.  రజకుల సమస్యలు తీర్చడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  మూడు నెలలకు ఒక సారి సమావేశం ఏర్పాటుచేయాలని, సమస్య ఏమైనా వస్తే అధికారులు స్పందించాలని కమిటీ సభ్యులు యేసుపాదం సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇడి రాజారావు మాట్లాడుతూ దోబీ ఘాట్ లు ఉన్న చెరువులు అక్రమణలు జరుగుతున్నాయని చెప్పారు.  కమ్యూనిటీ పై దౌర్జన్యాలు జరిగినా అలాంటి వివరాలు అందజేయాలని జెసి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి రవి కుమార్, కమిటీ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు పిరిడి రాణి, మబగాపు రాజు, బొమ్మాళి చిన్నవాడు, డి. సూర్యనారాయణ, బొమ్మాళి వాహిణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-31 09:20:29

నులిపురుగుల నివారణతో ఆరోగ్యం..

శరీరంలో నులిపురుగులను నివారించుకోవడం ద్వారా ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం స్థానిక హడ్కో కాలనీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబులేసు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులిపురుగుల సంక్రమించి ఉన్న చిన్నారుల నుండి ఇతరులకు వ్యాపిస్తుందని అన్నారు. నులి పురుగుల వల్ల రక్తహీనత సంభవిస్తుందని, పోషకాహారం తీసుకున్నప్పటికీ ఉపయోగకరంగా ఉండదని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని తద్వారా నులి పురుగులు నివారణ జరిగి తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన పనులు చేసుకోవడానికి, చదువుకోవడానికి తగిన శక్తి,  మానసిక పెరుగుదల ఉంటుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క చిన్నారి విధిగా ఆల్బెండజోల్ మాత్రలు సూచించిన మేరకు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బిం, రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం సమన్వయ అధికారి మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కే.అప్పారావు, వైద్య శాఖ అధికారి కృష్ణమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్యాధికారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-31 09:14:51

తిరుమలలో ద‌శ‌ల‌వారీగా విద్యుత్ వాహ‌నాలు ..

తిరుమ‌ల‌లో వాహ‌నాల కాలుష్యాన్ని త‌గ్గించ‌డం ద్వారా ప‌విత్ర‌త‌ను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ సిటీగా మారుస్తామ‌ని, ఇందుకోసం ద‌శ‌ల‌వారీగా పూర్తిగా విద్యుత్ వాహ‌నాల‌ను వినియోగిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. రాంభగీచా విశ్రాంతి గృహాల వ‌ద్ద సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డితో క‌లిసి 35 విద్యుత్ కార్ల‌ను ఛైర్మ‌న్ ప్రారంభించారు. ముందుగా విద్యుత్ కార్ల‌కు అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.  ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమ‌ల‌లో ద‌శ‌లవారీగా డీజిల్ వాహ‌నాల స్థానంలో పూర్తిగా విద్యుత్ వాహ‌నాలు ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ణాళికలు రూపొందించామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో టిటిడి అధికారిక విధుల కోసం వినియోగించేందుకు 35 విద్యుత్ కార్ల‌ను(టాటా నెక్సాన్‌) ప్రారంభించిన‌ట్టు చెప్పారు. ఈ విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన క‌న్వ‌ర్జ‌న్స్ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(సిఇఎస్‌ఎల్‌) నుండి తీసుకున్నామ‌న్నారు. రెండో ద‌శ‌లో మ‌రో 6 నెల‌ల లోపు 32 విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌న్నారు. ఇందులో 20 టిటిడి ఉచిత బ‌స్సులు కాగా, మ‌రో 12 బ‌స్సుల‌ను ఆర్‌టిసి న‌డుపుతుందన్నారు. ఆర్‌టిసి న‌డిపే ఈ 12 బ‌స్సులు శ్రీ‌వారి పాదాలు - ఆకాశ‌గంగ - పాప‌వినాశ‌నం మార్గంలో న‌డుస్తాయ‌ని తెలిపారు. టిటిడి విజ్ఞ‌ప్తి మేర‌కు మ‌రో 6 నెల‌ల వ్య‌వ‌ధిలోపు ఎపిఎస్ఆర్‌టిసి కూడా తిరుమ‌ల - తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ముందుకొచ్చింద‌న్నారు. తిరుమ‌ల‌లో, ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే ట్యాక్సీ / మ్యాక్సీ య‌జ‌మానులు, టిటిడి ఉద్యోగులు, స్థానికులు, దుకాణ‌దారులు కూడా త‌మ వాహ‌నాల‌ను విద్యుత్ వాహ‌నాలుగా మార్చుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

          కాగా, ఒక్కో విద్యుత్‌ వాహ‌నానికి నెల‌కు రూ.33,600/- చొప్పున 5 సంవ‌త్స‌రాల పాటు ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల త‌రువాత ఈ వాహ‌నాలు టిటిడి సొంత‌మ‌వుతాయి. ఈ వాహ‌నాల నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని 5 సంవ‌త్స‌రాల పాటు స‌ద‌రు సంస్థ భ‌రిస్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేసిన వాహ‌నం 250 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంది. ఒక వాహ‌నం పూర్తి ఛార్జింగ్ కోసం సాధార‌ణ AC విద్యుత్ ద్వారా అయితే 8 గంట‌లు, DC విద్యుత్ ద్వారా అయితే 90 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఒక వాహ‌నం పూర్తి ఛార్జింగ్ కోసం 30 యూనిట్ల విద్యుత్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ప్ర‌స్తుత ధ‌ర‌ల ప్ర‌కారం ఒక యూనిట్ విద్యుత్ ధ‌ర రూ.6.70/- కాగా, ఒక కిలోమీట‌రు దూరం ప్ర‌యాణించేందుకు 80 పైస‌లు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ట్రాన్స్‌పోర్టు జిఎం  శేషారెడ్డి, డిఐ  మోహ‌న్ ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-30 13:20:28

అగ‌రబ‌త్తుల త‌యారీని ప‌రిశీలించిన ఈవో..

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో సోమ‌వారం ఉద‌యం గోకులాష్ట‌మి గోపూజ అనంత‌రం ఈవో  డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అగ‌ర బ‌త్తుల త‌యారీ ప్లాంట్‌ను  ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూలతో తయారు చేసే ప‌రిమ‌ళ‌మైన అగర బత్తులు వారం, పది రోజుల్లో  భ‌క్తుల‌కు అందుబాటులోకి  తీసుకురానున్న‌ట్లు తెలిపారు. అగ‌ర బ‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్ల‌తో, పది ర‌కాల  బ్రాండ్ల‌తో త‌యారు చేసి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు వివ‌రించారు. స్వామివారికి వినియోగించిన పూలను వ్రుధాగా పడేయకుండా వాటిని వాడుకలోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు.

తిరుమల

2021-08-30 13:18:31

తెనాలిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటన..

గుంటూరు జిల్లాలో తెనాలి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్  మారుమూడి విక్టర్ ప్రసాద్ ను ప్రముఖ రచయిత స్టిఫెన్ డేవిడ్, జిల్లా జి.డి.సి.సి బ్యాంకు మాజీ ఛైర్ పర్సన్ కత్తెర క్రిస్టీనా మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం మద్యాహ్నం తెనాలి ఐతానగర్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి  హాజరైన రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్  మారుమూడి విక్టర్ ప్రసాద్ ను స్థానిక పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసి  మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్  దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ‘అందరి బంధువు ’ (జీవిత చరిత్ర), కాకతీయ యుగంధర్ ( భారత తొలి ప్రధాన మంత్రి ) ల పేరుతో స్టిఫెన్ డేవిడ్ రచించిన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా  గుంటూరు జిల్లా జి.డి.సి.సి బ్యాంకు మాజీ ఛైర్ పర్సన్ కత్తెర క్రిష్టీనా, స్థానిక నేతలు కలిసి రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను సత్కరించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక తెనాలి మున్సిపల్ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Tenali

2021-08-30 12:45:38