1 ENS Live Breaking News

కలెక్టర్ గా చేరడం సంతోషంగా ఉంది..

మెట్ట‌, డెల్టా, అట‌వీ, తీర‌ప్రాంతాల‌తో భౌగోళిక వైవిధ్య‌మున్న అంద‌మైన తూర్పుగోదావ‌రి జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా రావ‌డం ఎంతో సంతోషంగా ఉందని.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకెళ్లేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ అన్నారు. శుక్ర‌వారం రాత్రి జిల్లాకు చేరుకున్న హ‌రికిర‌ణ్ శ‌నివారం వేద పండితుల ఆశీర్వ‌చ‌నాల మ‌ధ్య క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చ‌ట్టం ప‌రిధిలో కారుణ్య నియామ‌కానికి సంబంధించిన ఓ ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు. జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌, ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రులు కొత్త క‌లెక్ట‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం స్పంద‌న హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ ఎస్‌సీ, ఎస్‌టీలు, రైతులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త రెండేళ్లుగా అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ల‌బ్ధిదారుల‌కు చేరువ చేసేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. త‌న‌పై నమ్మకం ఉంచి జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా నియ‌మించినందుకు  ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైతు భ‌రోసా, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, స‌చివాల‌య వ్య‌వ‌స్థ సేవ‌లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంంగా అమ‌లుచేస్తూ జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

జిల్లాలో అనుభ‌వ‌జ్ఞులైన అధికారుల బృందం ఉంద‌ని, ఐఏఎస్‌లు ఉన్నార‌ని.. రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర అన్ని శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ జిల్లాను అగ్ర‌స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తామ‌న్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇలా అందరి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ మీడియా వార‌ధిగా అంద‌రి స‌హ‌కారంతో ప్రజా సంక్షేమం ల‌క్ష్యంగా విధులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. 2011లో భ‌ద్రాచ‌లంలో స‌బ్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన స‌మ‌యంలో ప్ర‌స్తుతం జిల్లాలోని విలీన మండ‌లాల‌పై అవ‌గాహ‌న ఉంద‌న్నారు. బాల్య జీవితంలోని కొంత స‌మ‌యం జిల్లాతో ముడిప‌డి ఉంద‌ని.. ఇలాంటి జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా రావ‌డం అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. అందమైన తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క విధానానికి అనుగుణంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ మూడో వేవ్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల‌కు కీల‌క‌మైన కాకినాడ జీజీహెచ్ అభివృద్ధికి కృషిచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.
 
మీడియా స‌మావేశం అనంత‌రం జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ క‌లెక్ట‌రేట్‌లోని మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. కార్య‌క్ర‌మంలో రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్,  అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌; రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, రంప‌చోడ‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్లు ఇలాక్కియా, క‌ట్టా సింహాచ‌లం; ర‌ంప‌చోడ‌వ‌రం, చింతూరు ఐటీడీఏ పీవోలు సీవీ ప్ర‌వీణ్ ఆదిత్య‌, వెంకట  ర‌మ‌ణ‌; కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, రామచంద్రాపురం ఆర్‌డీవో సింధు సుబ్ర‌హ్మ‌ణ్యం, క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు తదిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-31 16:23:36

తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష..

విశాపట్నం జిల్లావ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పతివాడ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆగష్ట్ 1 నుండి 7వ తేది వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి – ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సాదారణ ,  సి –సెక్షన్ డెలివరీ రెండింటిలోనూ  డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి బిడ్డకు ఆరోగ్యకరమని ఆయన చెప్పారు. తల్లి పాల వారోత్సవాలలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు.  గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరింత అవగాహన కల్పించనున్నట్టు డిఎంహెచ్ఓ వివరించారు.

Visakhapatnam

2021-07-31 15:59:45

దిశ యాప్ ప్రతీమహిళా డౌన్లోడ్ చేయాలి..

“దిశ” యాప్ ను ప్రతి ఒక్క మహిళ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని జవిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శనివారం విశాఖ బీచ్ రోడ్లో పోలీస్ శాఖ వారు ఏర్పాటుచేసిన “దిశ” యాప్ కోసం మహిళలకు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలపై ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, దానిని అరికట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “దిశ” చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అన్నగా నిలబడ్డారని మేయర్ తెలిపారు. ఈ “దిశ” యాప్ గురించి పూర్తి వివరాలు ప్రతి సచివాలయంలోని మహిళా పోలీసుల వద్ద ఉన్నాయని కావున, ప్రతి ఒక్క మహిళ, కాలేజీ విద్యార్థులు మొదలైనవారు ఈ “దిశ” యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ తరుపున డిసిపి శాలి గౌతమ్, ఎసిపి(దిశ) డా. ప్రేమ్ కుమార్, టౌన్  సిఐ ఈశ్వర రావు “దిశ” చట్టం ఉపయోగం గురుంచి మహిళలకు అవగాహన కల్పించారు.    

Visakhapatnam

2021-07-31 15:54:33

ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నేటి నుండి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్  తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆగష్ట్ 1 నుండి 7వ తేది వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి – ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సాదారణ మరియు సి –సెక్షన్ డెలివరీ రెండింటిలోనూ  డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి మరియు బిడ్డకు ఆరోగ్యకరమని ఆయన చెప్పారు. తల్లి పాల వారోత్సవాలలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.  

Srikakulam

2021-07-31 15:48:25

జిల్లాలో చర్చిల సమాచారం అందించాలి..

శ్రీకాకుళం జిల్లాలో గల చర్చిలు, చర్చి నిర్వహణ సంస్థల సమాచారంను అందజేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అరుణ కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టడానికి వాటిని కాలపరిమితిలో పరిష్కరించడానికి ప్రభుత్వంలోని అన్ని ఇతర మంత్రిత్వ శాఖలతో వారి అవసరాలను సమన్వయం చేయడానికి మరియు కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికేనన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ చర్చిలు, చర్చి నిర్వహణ సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల సుందరీకంణ, క్రైస్తవ సంస్కృతి ప్రోత్సాహం, గౌరవ వేతనం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, పాస్టర్లకు, జెరూసలేం పవిత్ర భూమి మరియు ఇతర బైబిల్ ప్రదేశాలకు తీర్థయాత్ర, మొబైల్ పంపిణీ యూనిట్లు, అర్హత గల క్రైస్తవుల కోసం నవరత్నాలకు సంబంధించిన పథకాలు వాలంటీర్ల ద్వారా క్రైస్తవ మైనారిటీలందరికీ చేరుకోగలవని, కార్పొరేషన్ లో డేటా అందుబాటులో లేనందు వలన ఇతర పథకాల లక్ష్యాలను సాధించలేకపోయిందన్నారు.  అర్హత ఉన్నా అభ్యర్థులు కార్పొరేషన్ పథకాలను పొందలేకోయారని తెలిపారు. 

 క్రైస్తవులకు మెరుగైన సేవలందించడానికి రాష్ట్రంలోని చర్చిలు, చర్చి నిర్వహణ సంస్థల పూర్తి సమాచారాన్ని పొందాలని, ప్రభుత్వ పథకాలను పొందడానికి వచ్చే నెల 5వ తేదీలోగా సమాచారాన్ని తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  క్రమ సంఖ్య(1) చర్చి/చర్చి నిర్వహణ సంస్థ పేరు (పాఠశాల/కళాశాల/ ఆసుపత్రి/అనాథాశ్రమం/వృద్దాశ్రమం)(2), పూర్తి పోస్టల్ చిరునామా(3), గ్రామం పేరు(4), మండలం పేరు(5), ప్రతి వారం చర్చికి హాజరయ్యే వ్యక్తుల సంఖ్య/సంస్థ యొక్క బలం(6), పాస్టర్/ఇనిస్టిట్యూట్(7), పాస్టర్/ఇనిస్టిట్యూట్ హెడ్ యొక్క సంఖ్యను సంప్రదించండి(8), చర్చి/చర్చ్ రన్ ఇనిస్టిట్యూట్ అద్దెకు/స్వంత భవనంలో ఉన్నదా(9), చర్చి నమోదు చేరుబడిందా (అవును/లేదు)(10), చర్చి/చర్చి రన్ ఇనిస్టిట్యూట్ ఉన్న భూమి విస్తీర్ణం(11), ఆ చర్చికి జతచేయబడిన ఏదైనా లక్షణాలు (అవును/లేదు)(12), ఒకవేళ ప్రాపర్టీస్ యొక్క మొత్తం ఉంటే(13), చర్చి స్వతంత్ర చర్చి (అవును/కాదు)(14), చర్చి యొక్క విలువ (చర్చి స్వతంత్రంగా లేకోతే)(15), రిమార్క్(వ్యాక్యాలు)(16) లు క్రమ సంఖ్య 1 నుండి 16 వరకు గల క్రమ సంఖ్య గల ప్రొఫార్మాలో పంపవలసినదిగా కోరడమైనది. గ్రామ, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని చర్చిలు మరియు చర్చి నిర్వహణ సంస్థల సమాచారాన్ని ఆగష్టు 5వ తేదీలోగా అందజేయాలని ఆ ప్రకటనలో  పేర్కొన్నారు. 

Srikakulam

2021-07-31 15:39:12

ఈవీఎంలకు పటిష్ట భద్రత..

రాష్ట్ర ముఖ్య  ఎన్నికల  అధికారి  ఆదేశాల  మేరకు మాసాంత తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను,   ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వ్యవసాయ మార్కెట్  యార్డు లో వీవీపాట్స్ ను భద్రపరచిన  గోడౌన్ ను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ శనివారం తనిఖీ చేసారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో కలసి గోడౌన్ల తాళాలకు వేసిన  సీళ్ళును పరిశీలించారు. ఇవియం, వీవీపాట్స్ ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్లు నోడల్ ఆఫీసర్ వి.శైలజ, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య,  గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, బహుజన సమాజ్ పార్టీ సిటి ప్రెసిడెంట్ చిరతనగండ్ల వాసు, సీపీఐ పార్టీ తరుపున కె.ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరుపున అడవి ఆంజనేయులు,   రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-07-31 15:29:23

భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలి..

కరోనా మూడో దశ(థర్డ్ వేవ్)కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని  తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని , తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. కొంతమంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా సంచరిస్తుండడం సమంజసం కాదు. ఈ కారణంగా తోటి యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు విధిగా మాస్కులు ధ‌రించి భౌతిక‌దూరం పాటించాలని, శానిటైజ‌ర్ వినియోగించాలని కోరుతోంది.  తిరుమలలో యాత్రికుల రద్దీ ప్రాంతాలు, టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం తదితర ప్రాంతాల్లో విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tirumala

2021-07-31 15:26:36

కలెక్టర్ ను కలసిన ఇన్ చార్జ్ డిఎఫ్ఓ..

విశాఖపట్నం సోషల్ ఫారెస్ట్ డి.ఎఫ్.ఓ., శ్రీకాకుళం ఇన్ చార్జ్ డి.ఎఫ్.ఓ. డి. లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు.  వచ్చే నెల 5వ తేదీన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  72వ వన మహోత్సవ కార్యక్రమం మంగళగిరిలోని ఎయిమ్స్ కళాశాలలో ప్రారంభిస్తున్నారని, అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.  జిల్లాలో 72వ వన మహోత్సవ కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నికల్ (బాయ్స్)లో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు పాల్గొంటారని ఆయన కలెక్టర్ కు వివరించారు.

Srikakulam

2021-07-31 15:17:27

పర్యాటక అవకాశాలను మెరుగు పరచాలి..

 శ్రీకాకుళం  జిల్లాలో పర్యాటక అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పర్యాటక అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యాటక అథారిటీ సమావేశం శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అపారమైన పర్యాటక వనరులు ఉన్నాయన్నారు. జిల్లాలో నదులు, ఆలయాలు, ప్రకృతి అందించిన పచ్చదనం, దగ్గర లో పట్టణాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పర్యాటక ఆకర్షణకు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుత పర్యాటక పరిస్థితి, పర్యాటక పరంగా వస్తున్న ఆదాయం స్థితిగతులకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వాటి అంచనాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక ప్రదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశమని ఆ మేరకు పర్యాటక ప్రదేశాల్లో ఉపాధి పొందుతున్న వారి వివరాలను సేకరించాలని ఆయన అన్నారు. పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్న దృష్ట్యా పర్యాటక శాఖ, పర్యాటక సంస్థ వ్యాపార దృక్పథంలో ఆలోచించి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. జిల్లాలో ప్రస్తుతం పర్యాటక కేంద్రాలు ఉన్న ప్రదేశంతో పాటు ఇంకా అవకాశాలు ఉన్న ప్రదేశాలను కూడా గుర్తించి వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ఆయన ఆదేశించారు. పక్కా ప్రణాళికలతో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

         పర్యాటక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే.రమణ మాట్లాడుతూ జగతిపల్లి రిసార్ట్స్, శివ సాగర్ బీచ్ అభివృద్ధి చేయుటకు చేపట్టామని అయితే చెల్లింపులు పెండింగ్ కారణంగా గుత్తేదారులు పనులను ఇంకా పూర్తి చేయలేదని వివరించారు. శాలిహుండం బౌద్ద సర్క్యూట్ అభివృద్ధి, సీతంపేట లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామని, సీతంపేట ట్రైబల్ మ్యూజియం నిర్మాణాన్ని స్థానిక పర్యాటక నిధులతో చేపట్టామని ఆయన వివరించారు. స్కూబా డైవింగ్ ఏర్పాటుకు, రిసార్ట్స్ ఏర్పాటుకు అవసరమగు స్థలాల్ని కేటాయించుటకు ప్రతిపాదనలు సమర్పించామని, మడ్డువలస ప్రాజెక్టు వద్ద రిసార్ట్స్ ఏర్పాటు, బోటింగ్ చేయుటకు మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా జలవనరుల శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని  ఆయన చెప్పారు.

       ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ,  ఆర్కియాలజీ ప్రతినిధి కే.నరసింహ నాయుడు , సెట్ శ్రీ సీఈఓ కె.ఎస్. ప్రభాకర్ రావు,  హోటల్స్ సంఘం ప్రతనిధులు ఎస్.వి.సతీష్, మెట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-31 15:16:14

ఒకరి రక్తదానం 8మందికి ప్రాణదానం..

రక్తదానం ఒక గొప్ప కార్యక్రమమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిరెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణందాస్ పేర్కొన్నారు.  ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో గల వై.టి.సి. కేంద్రం వద్ద రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేయడమనేది ఒక గొప్ప కార్యక్రమనిజిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ లలో కూడా సుమారు వేయి మంది రక్త దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ముఖ్యంగా యువత ముందుకు రావాలనిరెవెన్యూ సిబ్బంది అందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.  క్రీడల శాఖ నుండి రక్త దానం శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.  తాను చాలా సార్లు రక్తం దానం చేసినట్లు వివరించారు.  ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ కోవిడ్ ఉన్నందు వలన కళాశాలలకు సెలవు దినాలు అయినందున యువత అందుబాటులో లేరనిఅలాంటి సమయంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ముందుకు వచ్చి రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడమనేది ఒక గొప్ప కార్యక్రమమన్నారు.  రక్త దానం ఒక ఉద్యమంలా మరింత మంది ముందుకు వచ్చి రక్తం దానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  నా రక్తం ఎ పాజివ్ అనిఇక ముందు నేను రక్త దానం చేస్తానని చెప్పారు. ఎవరికైనా అత్యసరం అనిపిస్తే రక్తం దానం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.  ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ను ఆయన అభినందించారు.  

          ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్ఐటిడిఎ పిఓ సిహెచ్ శ్రీధర్ఆర్డిఓ ఐ. కిషోర్జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి. జగన్మోహన్ రావుజిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి. సుందరరావుజిల్లా చీఫ్ కోచ్ బి. శ్రీనివాస్ కుమార్రెడ్ క్రాస్ కార్యదర్శి బి. మల్లేశ్వరరావు,  రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాళీ ప్రసాద్కార్యదర్శి పి. వేణుగోపాల్ఉపాధ్యక్షులు ఎస్. సతీష్డివిజనల్ కార్యదర్శి ధర్మాన ప్రకాసరావుతహసిల్థర్లు వెంకటరావుసుధాసాగర్దిలీప్ చక్రవర్తితదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-31 15:14:12

నియోజకవర్గ స్థాయిలో సదరం క్యాంపు..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నియోజక వర్గ స్థాయిలో సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త ( డిసిహెచ్ఎస్ ) డా. బి.సూర్యారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. గతంలో నిర్వహిస్తున్న షెడ్యూలులో మార్పులు చేయడం జరిగిందని, ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస సి.హెచ్.సి నందు శుక్రవారం, ఎచ్చెర్ల నియోజక వర్గానికి రణస్థలం సి.హెచ్.సి నందు బుధవారం సదరం క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట ఏరియా ఆసుపత్రి నందు శుక్రవారం, టెక్కలి నియోజకవర్గంలో జిల్లా ఆసుపత్రి, టెక్కలి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులు నిర్వహించబడతాయని ఆయన చెప్పారు. పలాస నియోజకవర్గంకు సంబంధించి పలాసలోని సి.హెచ్.సి నందు బుధవారం, ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం సి.హెచ్.సి నందు మంగళవారం, పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం సి.హెచ్.సి నందు మంగళవారం నాడు సదరం క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. రాజాం నియోజకవర్గ పరిధిలో రాజాం ఏరియా ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లోనూ , పాలకొండ నియోజకవర్గ పరిధిలోని పాలకొండ ఏరియా ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు  వివరించారు. సదరం క్యాంపులు పై తెలిపిన రోజుల్లో ఆయా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12.30గం.లకు ప్రారంభమై అదేరోజున జారీచేయడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.  

Srikakulam

2021-07-30 17:38:20

ఇ- క్రాప్ లో రైతులు నమోదు కావాలి..

రైతులు ఇ –క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. లావేరు మండలం తాళ్ళవలస, జి.సిగడాం మండలం సంతవురిటి తదితర గ్రామాల్లో ఇ క్రాప్ బుకింగ్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనితీరును కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేసారు. రైతులు ఇ క్రాప్ లో నమోదు కావడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు, బీమా, నష్టపరిహారం తదితర కార్యక్రమాలు పొందుటకు  ఇ క్రాప్ అవసరమని ఆయన చెప్పారు. ఇ క్రాప్ లో నమోదు కావడం వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.     సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు పాలన చేరువ చేయుటకు గ్రామ స్ధాయిలో వ్యవస్ధను ఏర్పాటు చేసిందని వాటి ఫలితాలు ప్రజలకు అందాలని ఆయన అన్నారు. గ్రామ స్ధాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు తమ సమస్యలను గ్రామ సచివాలయంలోనే నమోదు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రజలు సచివాలయంలోకి ప్రవేశించగానే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం వివరాలు తెలియాలని, సామాజిక ఆడిట్ కు వచ్చిన లబ్దిదారుల జాబితా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. సచివాలయాలకు బియ్యం కార్డు, పింఛను, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ కోసం అధికంగా దరఖాస్తులు వస్తాయని పేర్కొంటూ వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ధేశిత సమయంలో ఆర్జీలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేసారు. 

సచివాలయాల్లో యువత ఉద్యోగులుగా ఉన్నారని అదే వేగంతో సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. విధులను చక్కగా నిర్వహించడం వలన ప్రజల హృదయాల్లో నిలుస్తారని ఆయన సూచించారు. రైతు భరోసా కేంద్రంలో ధృవీకరణ విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. అందుకు తగిన విధంగా వ్యవసాయ సహాయకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో అన్ని సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ అన్నారు. విత్తనం నుండి విక్రయం వరకు అవసరమగు అన్ని మార్గదర్శకాలు రైతులకు అందించడం రైతు భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశ్యాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మంచి విత్తనాలు అందడం వలన అధిక దిగుబడులు సాధించగలరని అన్నారు. గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని మార్కెటింగు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన కియాస్కోల సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సచివాలయ, రైతు భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-30 17:36:44

ఉద్యోగులు పనినే దైవంగా భావించాలి..

నూతన ఉద్యోగులు పనినే దైవంగా భావించాలని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుని చూసి అంకితభావంతో సేవలందించాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. టిటిడిలో ఒకేసారి కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులకు తిరుపతి శ్వేత భవనంలో 15 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈఓ, జెఈఓ శ్రీమతి సదా భార్గవితో కలిసి 119 మంది ఉద్యోగులకు పోస్టింగులు అందజేశారు.  ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేసి టిటిడికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ జిఓలు, టిటిడి చట్టాలు, సర్వీస్ నిబంధనలపై పట్టు పెంచుకుని మెరుగ్గా కార్యాలయ విధులు నిర్వహించాలని సూచించారు. అర్హత గల ఉద్యోగులు పలు పోటీ పరీక్షలు కూడా రాసి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు అనంతరం ఉద్యోగ సమయంలో ఎలా ఉపయోగపడ్డాయనే విషయాలు, సొంత అనుభవాలను ఈ సందర్భంగా ఈఓ తెలియజేశారు.        జెఈఓ  సదా భార్గవి మాట్లాడుతూ ఈ ఉద్యోగాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ఇచ్చిన అరుదైన అవకాశంగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా విధులు నిర్వహించి టిటిడి ప్రతిష్టను కాపాడాలన్నారు. నూతన ఉద్యోగులందరూ శ్వేత భవనంలో మొక్కలు నాటారని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత వారే తీసుకోవాలని సూచించారు. టిటిడి ముఖ్య అంకణీయ అధికారి  శేషశైలేంద్ర మాట్లాడుతూ టిటిడిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతమని, నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు సేవాభావంతో విధులు నిర్వహించాలని కోరారు.  శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులరెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో(హెచ్ఆర్)  గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-30 17:35:06

ఆహార‌హ‌క్కు చ‌ట్టం అమ‌లు భేష్‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆహార హ‌క్కు చ‌ట్టం చ‌క్క‌గా అమ‌లు జ‌రుగుతోంద‌ని కేంద్ర బృందం ప్ర‌శంసించింది. మొత్తం 12 జిల్లాల్లో, విజ‌య‌న‌గ‌రం జిల్లా మెరుగ్గా ఉంద‌ని పేర్కొంది. జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం-2013 అమ‌లు తీరును వివిధ జిల్లాల్లో ప‌రిశీలించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం జైపూర్‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ క‌మ్యూనికేష‌న్ అండ్ స్ట‌డీస్ అనే సంస్థ‌కు అప్ప‌గించింది. ఈ సంస్థ ప్ర‌తినిధులు గిరిజాశంక‌ర్‌, ఎం.ర‌విప్ర‌తీక్‌, నాగేశ్వ‌ర్ జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. పిడిఎస్ బియ్యం స‌ర‌ఫ‌రా, మ‌హిళాభివృద్ది, శిశుసంక్షేమ‌శాఖ కార్య‌క‌లాపాలు, అంత్యోద‌య అన్న‌యోజ‌న బియ్యం పంపిణీ, బియ్యం, ఇత‌ర నిత్యావ‌స‌రాలు నిల్వ ఉంచేందుకు గోదాముల స‌దుపాయం, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లుతీరును ప‌రిశీలించి సంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఈ కేంద్ర బృందం శుక్ర‌వారం సాయంత్రం జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌తో స‌మావేశ‌మ‌య్యింది. పేద‌ల‌కు ఆహారాన్ని అందించేందుకు ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను సంద‌ర్భంగా జెసి వివ‌రించారు. పేద‌లంద‌రికీ ఆహార భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  కోవిడ్ స‌మ‌యంలో కూడా నిరాఘాటంగా బియ్యం పంపిణీ చేసినందుకు బృందం స‌భ్యులు జిల్లా యంత్రాంగాన్ని ప్ర‌శంసించారు.  ఈ స‌మావేశంలో జిల్లా పౌర స‌ర‌ఫ‌రా అధికారి ఏ.పాపారావు,  ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, సివిల్ సప్ల‌యిస్ డిఎం దేవుల్ నాయ‌క్‌, ఏఎం మీనా, మార్కెటింగ్ ఏడి వైవి శ్యామ్‌కుమార్‌, డ్వామా, ఎడ్యుకేష‌న్‌, ఫుడ్ సేఫ్టీ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, డిసిఐసి స‌భ్యులు చ‌ద‌ల‌వాడ ప్ర‌సాద్‌, వివిధ‌ వినియోగ‌దారుల సంఘాలు, సంస్థ‌ల‌ ప్ర‌తినిధులు సుబ్బారావు, హెచ్ఎస్ రామ‌కృష్ణ‌, కె.విన‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-30 16:05:23

విజయనగం జిల్లా అంతా పర్యటిస్తా..

రానున్న రోజుల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ప్ర‌భుత్వ సంక్షేమ అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లుపై త‌న‌కు అధికారుల నుంచి వాస్త‌వ స‌మాచారం వుండాల‌ని స్ప‌ష్టంచేశారు. జిల్లాలో ఏదైనా ప్ర‌భుత్వ శాఖ‌లో ఘ‌ట‌న జ‌రిగితే జిల్లా అధికారుల నుంచే త‌న‌కు ముందుగా స‌మాచారం అందాల‌ని, రాష్ట్రస్థాయి నుంచి వ‌చ్చే వ‌ర‌కు ఇక్క‌డి అధికారులు తెలియ‌జేయ‌క‌పోతే స‌హించేది లేద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా శుక్ర‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం మ‌ధ్యాహ్నం జిల్లా అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోర‌యంలో క‌లెక్ట‌ర్ భేటీ అయ్యారు. ముందుగా జిల్లా అధికారుల‌కు త‌న గురించి వివ‌రించి, గ‌తంలో ఎక్క‌డెక్క‌డ, ఏయే ప్ర‌భుత్వ శాఖ‌ల్లో విధులు నిర్వ‌హించిందీ వివ‌రించారు. అనంత‌రం వివిధ శాఖ‌ల జిల్లా అధికారుల‌ను ఒక్కొక్క‌రిని ప‌రిచ‌యం చేసుకొని ఆయా శాఖ‌ల ద్వారా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప‌రిష్క‌రించాల్సిన స‌మస్య‌లు, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాల‌పై దాదాపు మూడు గంట‌ల పాటు స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్‌గా త‌న ప్రాధామ్యాల‌ను వివ‌రించారు.

జిల్లాలో విద్యాభివృద్ధి, వ్య‌వ‌సాయం, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశుసంక్షేమం వంటి రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు. జిల్లాలో వ‌రి అధికంగా పండిస్తున్నందున రైస్ బ్రాన్ ఆయిల్ త‌యారీ వంటి ఆహార‌శుద్ది ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటును ప్రోత్స‌హిస్తామ‌న్నారు. జిల్లాకు కొత్త రైస్‌మిల్లు య‌జ‌మానుల‌ను రప్పించాల‌ని పౌర‌సర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్‌ను ఆదేశించారు. జిల్లాలో ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ స‌కాలంలో జ‌ర‌గ‌డం లేద‌ని ఫిర్యాదులు ఉన్నాయ‌ని, వాటిని స‌రిచేయాల‌న్నారు. ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్  అశోక్‌, జె.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారులంతా క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన  సూర్య‌కుమారిని పుష్ప‌గుచ్ఛాల‌కు బ‌దులు నోటు పుస్త‌కాలు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నోటు పుస్త‌కాల‌ను గిరిజ‌న విద్యార్దుల‌కు అంద‌జేసి వారికి ఉప‌యోగ‌ప‌డేలా చూస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

Vizianagaram

2021-07-30 16:03:08