1 ENS Live Breaking News

ఆర్ అండ్ ఆర్‌ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా ఇన్ ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం త‌దిత‌ర అంశాలపై క‌లెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, తోట‌ప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం బ్రాంచ్ కెనాల్‌, తార‌క‌రామ‌తీర్ధ‌సాగ‌ర్‌, వెంగ‌ళ‌రాయసాగ‌ర్‌, నాగావ‌ళి ఫ్ల‌డ్ బ్యాంకు, కంచ‌ర‌గెడ్డ‌, అడారుగెడ్డ‌, క‌ర్రిగెడ్డ‌ త‌దిత‌ర ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా  ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ కిశోర్ మాట్లాడుతూ, నిర్వాసితుల పున‌రావాసం పై దృష్టిపెట్టాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అలాగే ప‌లు ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ ఇప్ప‌టికీ కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉంద‌ని, దానిని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. కోర్టు కేసుల‌కు సంబంధించి, న్యాయప‌రంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి, గూడెపువ‌ల‌స‌, కంచేరు, రావాడ‌, స‌వ‌రివిల్లి త‌దిత‌ర గ్రామాల్లో జ‌రుగుతున్న భూసేక‌ర‌ణ‌పై గ్రామాల‌వారీగా స‌మీక్షించారు. ఎయిర్‌పోర్టు ఎప్రోచ్ రోడ్డు, ట్రంపెట్ బ్రిడ్జి త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌శ్నించారు. విమానాశ్ర‌యానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని, నిర్లిప్త‌త‌ను విడ‌నాడి, ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు, హెచ్‌వి జ‌య‌రామ్‌, టిటిపిఆర్ ఇఇ తిరుప‌తిరావు, తోట‌ప‌ల్లి ప్రాజెక్టు ఇఇ రామ‌చంద్ర‌రావు,  క‌లెక్ట‌రేట్ జి.సెక్ష‌న్ సూప‌రింటిండెంట్ జి.సూర్య‌ల‌క్ష్మి,  ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.        

Vizianagaram

2021-07-29 17:05:00

వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలి..

ప్రతీ రైతు బరోసా కేంద్రం పరిధిలో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు పూర్తి చేయాలని ఇన్ ఛార్జి కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ వ్యవసాయాధికారులకు ఆదేశించారు.    గురువారం తన ఛాంబరులో పలు వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్షించారు.  జిల్లాలో 634 వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు కావల్సివుండగా ఇప్పటి వరకు 622  బోర్డులు ఏర్పాటు అయ్యాయని,  ఇంకను 12 బోర్డులు ఏర్పాటు కావల్సివుందని వాటిని వెంటనే  ఏర్పాటు చేయాలని సూచించారు.   ప్రతీ 1, 2, 3  శుక్రవారాలలో గ్రామ, మండల, జిల్లా స్థాయి సమానేశాలు తప్పని సరిగా జరిగేలా చూడాలన్నారు.  ఈ క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన శాఖల డిడిలు, ఎడిలతో పర్యవేక్షణ బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని జె.డి.కి సూచించారు.  ఆర్.బి.కె.లలో అందించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యతను తనిఖీలు చేయాలని, తనిఖీ చేసిన నివేదికను ఆర్.బి.కె.లలో ప్రదర్శించాలని సూచించారు.  ప్రతీ ఆర్.బి.కె.ను బ్యాంకులకు మ్యాపింగే చేయాలన్నారు.  కౌలు రైతులందరకు  ఆగష్టు 15లోగా రుణాలు అందజేయాలని ఆదేశించారు.   విత్తనాలు, ఎరువుల అక్రమ సరఫరాలను అరికట్టాలని, దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా అమ్మేవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలన్నారు.  చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.  ఎరువులు, విత్తనాలు జిల్లా సరిహద్దులు దాటి బయటకు వెళ్లకుండా నియంత్రించేలా పోలీసు బందోబస్తు కోరాలని ఆ మేరకు జిల్లా ఎస్.పి.కు లేఖ వ్రాయాలని, ప్రతిని  వ్యవసాయ కమిషనర్ కు మార్క్ చేయాలని సూచించారు.  ఈ సమావేశంలో  ఆర్.డి.ఓ. భవానీ శంకర్, వ్యవసాయ శాఖ జెడి ఆషాదేవి, డిడిలు, ఎడిలు, ఉద్యాన వన శాఖాధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-29 17:02:04

సంక్షేమ పథకాలపై అవగాహనుండాలి..

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సచివాలయ ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్  డా.ఏ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన స్వర్ణభారతి స్టేడియం వద్దగల పాత రేసపువానిపాలెం 24వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను  ప్రదర్శించే బోర్డులను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల తో మాట్లాడుతూ వారి పని వివరాలు, ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు విషయమై అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానం రానందున సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నింటిపైనా పునశ్చరణ శిక్షణ ఏర్పాటు చేయాలని యు.సి.డి. పథక సంచాలకులు శ్రీనివాస్ ను ఆదేశించారు. లబ్ధిదారులకు ఉండవలసిన అర్హతల గురించి క్షుణ్ణంగా   తెలుసుకోవాలన్నారు.  విధి నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని చెబుతూ వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.  అనంతరం కలెక్టర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను తనిఖీ చేశారు.

విశాఖ సిటీ

2021-07-29 16:59:12

వికలాంకులకు ప్రత్యేక సదుపాయాలు..

సింహాచలం దేవస్థానంలో వికలాంగులకు ఉచితంగానే వీల్ ఛైర్, లిఫ్ట్ అన్ని సమకూర్చి దేవదేవుని దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఈఓ సూర్యకళ ఆదేశాలతో ఈ సేవ అమల్లోకి వచ్చింది. గురువారం బరంపురం నుంచి వచ్చిన ఒక వికలాంగురాలు సాయంత్రం వచ్చిన ఈ జంటకు వీల్ ఛైర్ ఇచ్చి, లిఫ్టులో పైకి తీసుకెళ్లి దర్శనం చేయించారు సిబ్బంది.  తన భార్యకు కాలి సమస్య ఉందని.. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించి ఆపరేషన్ చేయించి స్వామివారి చెంతకు తీసుకొచ్చానని చెప్పారు బరంపురంవాసులు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, వికలాంగులు, నడవలేని వయస్సు మళ్లిన వారు దర్శనానికొస్తే సెక్యూరిటీ సహా సిబ్బంది సహకరించి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సూచించారు.  వీల్ ఛైర్ లు పీఆర్వో ఆఫీసులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు..

Simhachalam

2021-07-29 16:53:01

సింహాద్రి అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

విశాఖ  బాపూజీనగర్ కు చెందిన దాసరి పృధ్వీ రెడ్డి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న)స్వామి నిత్య అన్నదాన పథకానికి   లక్షా నూట పదహారు రూపాయలు (1,00,116)  విరాళమిచ్చారు. ఆ మొత్తాన్నిచెక్కు రూపంలో గురువారం పీఆర్వో కార్యాలయంలో  అందించారు . తన జన్మదినోత్సవమైన మే 20న స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని దాతలు కోరారు. దాతలకు  టెంపుల్ ప్రొటోకాల్ ప్రకారం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం కల్పించారు.  టెంపుల్ ఏఈఓ ప్రసాదాన్ని అందించారు. 

Simhachalam

2021-07-29 16:40:18

అప్పన్నకు హాల్ డైరెక్టర్లు పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) సీఎండీ , డైరెక్టర్ల కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎండీ ఆర్ మాధవన్ కుటుంబ సభ్యులు, సీఈఓ మైథీ , డైరెక్టర్లు అనంతకృష్ణన్, ఎంఎస్ వెలపరి, అలోక్ వర్మ, అరూప్ చటర్జీ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. అంతముందు వీరంతా స్వామివారి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ విశేషాలను దేవస్థాన సిబ్బంది హాల్ డైరెక్టర్ల బ్రుందానికి తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-29 16:39:26

అధికారులకు స్థానిక నివాసం తప్పనిసరి..

గుంటూరు జిల్లాలోని అన్నిశాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు వారు విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నేడోక ప్రకటనలో ఆదేశించారు. ఆ విధంగా వారి కార్యస్థానంలో నివాసం ఉండని అధికారులపై శాఖాపరమైన  క్రమశిక్షాణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారుల పనితీరుపై అసనం వ్యక్తం చేసిన తరుణంలో జిల్లా కలెక్టర్ స్థానిక నివాసం ఆదేశ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

Guntur

2021-07-29 16:31:32

సచివాలయాలు తనిఖీచేసిన కమిషనర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన గురువారం 6వ జోన్ 70వ వార్డు శ్రామిక నగర్, డ్రైవర్స్ కోలనీలో ఉన్న 1086417, 418, 420, 421 సచివాలయాలను సందర్శించి కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండాలని తెలియజేశారు. వార్డ్ మ్యాపింగ్ లో ప్రతి ఇల్లు ట్యాగింగు చెయ్యాలని,  కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో, డైరీలో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, నిర్ణీతకాలంలో ఆర్జీలను పరిష్కరించని యెడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని, అలాగే ఆగష్టు 2వ తేది నుండి 18వ తేదీ వరకు జరిగే ఆన్ లైన్ శిక్షణా తరగతులకు విధిగా హాజరు అవ్వాలని కమిషనర్ సూచించారు. 

విశాఖ సిటీ

2021-07-29 16:30:20

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు..

కార్పొరేట్ ఆసుపత్రిలకి ధీటుగా జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ ) పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ వైద్యులకు సూచించారు. ఇక్కడ మంచి అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే కార్పొరేట్ ఆసుపత్రికి తక్కువేమి కాదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ వైద్యులు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడిన ఆయన వైద్యులు చేసేది వృత్తి కాదని, సేవగా భావించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యకరంగా, సంతోషంగా వెళ్లాలని ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మరియు సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులపై ఎక్కువ శాతం మంది ఆధారపడేలా ఆసుపత్రిని అభివృద్ధిచేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన వాటిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి, వైద్య కళాశాల ఉందని ఇందుకు నీటి అవసరం ఎంతైనా ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు లేవని సభ్యులు తెలియజేయడం జరిగిందన్నారు. 

ఈ విషయమై నగరపాలక సంస్థ కమీషనర్ తో మాట్లాడటం జరిగిందని, ఇప్పటికే బోర్ వేసారని, పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే వేతనాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పారిశుద్ధ్యం కొంత లోపించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం వేరే సంస్థకు పారిశుద్ధ్య బాధ్యతలను అప్పగించడం వలన ఇకపై పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లలో వైద్యులు, సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్ధులు బాగా పనిచేసారని ఇదేస్పూర్తితో రానున్న థర్డ్ వేవ్ లో కూడా బాగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. దేశంలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయని, అందుకు తగిన విధంగా ఆసుపత్రిలో వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి మౌలిక వసతులను మరింత మెరుగుపరచుకోవలసిన అవసరం ఉందని, ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తొలుత ఆసుపత్రి ప్రగతి నివేదికను ఆసుపత్రి పర్యవేక్షకులు కలెక్టర్ కు వివరించారు.

శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ ఛైర్ పర్సన్ మరియు సలహా మండలి సభ్యులు యం.వి. పద్మావతి మాట్లాడుతూ  రిమ్స్ ప్రారంభమైన నాటి నుండి అభివృద్ధి చెందుతూ వస్తుందని అన్నారు. రిమ్స్ లో ఉండే సదుపాయాలు, వసతులు గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదని, అందువలనే కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రజల్లో ఈ అపోహను తొలగించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఇక్కడి వైద్యులు మంచి సేవలు అందించారని కితాబిచ్చారు. వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావించాలని, అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించాలని వైద్యులను కోరారు. ఈ విషయమై వైద్యులు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని, తద్వారా విశాఖలోని కె.జి.హెచ్ కు ఎంత మంచి పేరు ఉందో  రిమ్స్ కు అంత మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని, ఇంత భారీస్థాయిలో నిర్మించిన ఆసుపత్రికి సరైన నీటి సదుపాయం, పారిశుద్ధ్యం లేదని ఫిర్యాదులు తమకు వచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 600 పడకల ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల ఇక్కడ ఉందని, విద్యార్ధులు, వైద్యుల క్వార్టర్స్ ఉన్నాయని, అందుకు తగిన విధంగా నీటి సదుపాయం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని నాడు – నేడు క్రింద ఆసుపత్రికి నీటి సదుపాయాన్ని కల్పిస్తే భవిష్యతులో నిరంతర నీటి సరఫరా ఉంటుందని  ఆమె కలెక్టర్ ను కోరారు.

మరో సభ్యులు వరుదు విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ 250 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, సంఘంలోని లోపాలు వలన సక్రమంగా పనిచేయడం లేదని, వాటిని సరిచేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేస్తే మరింత సార్ధకత లభిస్తుందన్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చే నిధుల్లో కొంత పారదర్శకత లోపించిందని, ఇప్పటికైనా సరిచేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ.కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, నగరపాలక సంస్థ కమీషనర్ సిహెచ్.ఓబులేసు, డి.సి.హెచ్.ఎస్ డా. బి.సూర్యారావు, ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి కార్యనిర్వాహక ఇంజినీర్ బి.ఎన్.ప్రసాద్, సలహా మండలి సభ్యులు లావేటి హేమసుందరరావు, డి.జగదీశ్వరరావు, కోరాడ లక్ష్మణమూర్తి, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-29 16:29:00

స్విమ్స్‌లో ఆరోగ్య‌శ్రీకి నూత‌న బ్లాక్..

తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ పేషంట్ల‌కు నూత‌న బ్లాక్ నిర్మించి రోగుల‌కు మ‌రింత మెరుగైన సౌర్యాలు క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని చాంబ‌ర్‌లో గురువారం స్విమ్స్‌, టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స్విమ్స్‌లో కార్పొరేట్ ఆసుప‌త్రుల త‌ర‌హాలో హెల్త్ ఇన్సూరెన్స్  కలిగిన పేషంట్ల‌కు క్యాష్‌లెస్ వైద్య సేవ‌లు అందించాల‌న్నారు.  రోగుల‌కు వేగ‌వంత‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి మ‌రింత  విస్తృతంగా ఐటి సేవ‌లు వినియోగించుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. హెచ్ఆర్ మేనేజ్మెంట్, హాస్పిటల్
మేనేజ్మెంట్ అప్లినేషన్లు రూపొందించాలని కోరారు.  ఆసుప‌త్రిలో రేడియాల‌జీ ఇమేజింగ్ సిస్ట‌మ్ (పిఏసిఎస్‌) ద్వారా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ తీసుకున్న రోగుల స్కానింగ్ రిపోర్టులు సంబంధింత డాక్ట‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో పంపేవిధంగా నూత‌న సాప్ట్‌వేర్  రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్ రూపొందించి టిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల వివ‌రాలు పొందుప‌ర్చాల‌న్నారు. రోగుల‌కు అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం పెంపొందించేందుకు ఆసుప‌త్రి అవ‌ర‌ణంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్దపీట వేస్తూ, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ఈఓ సమీక్షించారు.  స్విమ్స్ డైరెక్టర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ‌, సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రామ్‌, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, సిఏవో  ర‌విప్ర‌సాదు, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి,  స్విమ్స్ ఐటి మేనేజ‌ర్ భావ‌న ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.  

తిరుపలి

2021-07-29 16:27:30

గరుడవారధి రూ.25 కోట్లు కేటాయింపు..

గరుడవారధి పనుల ప్రగతిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పనుల కోసం రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టిటిడి రూ.50 కోట్లు విడుదల చేసినట్టయింది.  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు  పూర్తి కావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈఓకు వివరించారు. ఈ సమీక్షలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్  మోహన్, టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

Tirumala

2021-07-29 16:19:32

ఆర్బన్ పీహెచ్సీకి మేయర్ శంకుస్థాపన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 5వ జోన్ 41వ వార్డు లోని సుబ్బలక్ష్మి నగర్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, అయిదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్ పి. శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-29 15:10:29

వార్డు కార్యదర్శులకు శిక్షణాతరగతులు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్  డా. జి. సృజన గురువారం జివిఎంసి ఉన్నతాధికారులు,  జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఎం.ఎ.&యు.డి. కి సంబందించిన ఆరు రకాల సచివాలయ కార్యదర్శులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఏపిహెచ్ఆర్ డి తరుపున ఆన్లైన్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యదర్శులందరూ ఉదయం 8.45 గంటలకు మొబైల్ ఫోన్ లోనే హాజరు అవ్వాలని, మెడికల్ లీవ్ లోనూ,  మెటర్నటీ లీవ్ లో ఉన్నవారు కూడా తమ మొబైల్ ఫోన్లో నుండి క్లాసులకు హాజరు వాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఆన్లైన్ క్లాసులో పాల్గొని తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంతం 5 గంటల వరకు వారి వారి సచివాలయాలలో యధావిధిగా విధులను నిర్వహించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, నోడల్ అధికారులుగా వ్యవహరించాలని, వారి దిగువ స్థాయి సిబ్బందిని ప్రోగ్రాం ఇంచార్జ్ లుగా ఏర్పాటు చేసుకుని ఈ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.

Visakhapatnam

2021-07-29 15:05:42

విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాకూడదు..

విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా జగనన్న విద్యా దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తల్లులు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు.  గురువారం విద్యా దీవెన పై వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ త్రైమాసికానికి విద్యా దీవెన తల్లులు ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా  6140 మంది విద్యార్థులకు 2 కోట్ల 81  లక్షల 8342 రూపాయలని, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 2692 మంది విద్యార్థులకు ఒక కోటి 5 లక్షల 89 వేల 103 రూపాయలని, వెనుక బడిన సంక్షేమ శాఖ ద్వారా 55864 మంది విద్యార్థులకు 26 కోట్ల 98 లక్షల 97 వేల 441 రూపాయలని, ఇబిసి ద్వారా 1902 మంది విద్యార్థులకు ఒక కోటి 4 లక్షల 74 వేల 892 రుపాయలని, మైనారిటీ సంక్షేమ శాఖా ద్వారా 145 మంది విద్యార్థులకు 6 లక్షల 34 వేల 475 రూపాయలని, కాపు సంక్షేమ శాఖ ద్వారా 991 మంది విద్యార్థులకు 68 లక్షల 34 వేల 995 రూపాయలను, క్రిస్టియన్ మైనారిటీ 15 మంది విద్యార్థులకు 81 వేల 112 రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేసినట్లు వివరించారు. 

 పాతపట్నం నియోజక వర్గం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తల్లి, తండ్రి ఎన్నో కష్టాలు పడుతూ తమ పిల్లలను చదివిస్తున్నారని,  తల్లి తండ్రిలకు కష్టాలు లేకుండా తమ పిల్లలకు ప్రభుత్వమే ఫీజు చెల్లించే విధంగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ప్రవేశపెట్టినట్లు వివరించారు.  అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశమన్నారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు.   రాజాం నియోజక వర్గం శాసన  సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ విద్యా, వైద్యరంగాలకు ముఖ్యమంత్రి పెద్ద పీఠ వేస్తున్నారని చెప్పారు.  విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి  జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహాయం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు  వెల్లి చదువుకోవచ్చునని, అక్షరాస్యత పెరగాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-29 14:06:51

సింహాద్రి అప్పన్నకు కలెక్టరమ్మ పూజలు..

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి దంపతులు గురువారం సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ  వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి పూజలు చేశారు.  ఇటీవలే విజయనగరం కలెక్టర్ గా నియమితులైన ఆమె స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కలెక్టర్ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఆమె శుక్రవారం విజయనగం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Simhachalam

2021-07-29 14:01:12