1 ENS Live Breaking News

నియోజకవర్గ స్థాయిలో సదరం క్యాంపు..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నియోజక వర్గ స్థాయిలో సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త ( డిసిహెచ్ఎస్ ) డా. బి.సూర్యారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. గతంలో నిర్వహిస్తున్న షెడ్యూలులో మార్పులు చేయడం జరిగిందని, ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస సి.హెచ్.సి నందు శుక్రవారం, ఎచ్చెర్ల నియోజక వర్గానికి రణస్థలం సి.హెచ్.సి నందు బుధవారం సదరం క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట ఏరియా ఆసుపత్రి నందు శుక్రవారం, టెక్కలి నియోజకవర్గంలో జిల్లా ఆసుపత్రి, టెక్కలి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులు నిర్వహించబడతాయని ఆయన చెప్పారు. పలాస నియోజకవర్గంకు సంబంధించి పలాసలోని సి.హెచ్.సి నందు బుధవారం, ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం సి.హెచ్.సి నందు మంగళవారం, పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం సి.హెచ్.సి నందు మంగళవారం నాడు సదరం క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. రాజాం నియోజకవర్గ పరిధిలో రాజాం ఏరియా ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లోనూ , పాలకొండ నియోజకవర్గ పరిధిలోని పాలకొండ ఏరియా ఆసుపత్రి నందు మంగళ, శుక్రవారాల్లో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు  వివరించారు. సదరం క్యాంపులు పై తెలిపిన రోజుల్లో ఆయా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12.30గం.లకు ప్రారంభమై అదేరోజున జారీచేయడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.  

Srikakulam

2021-07-30 17:38:20

ఇ- క్రాప్ లో రైతులు నమోదు కావాలి..

రైతులు ఇ –క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. లావేరు మండలం తాళ్ళవలస, జి.సిగడాం మండలం సంతవురిటి తదితర గ్రామాల్లో ఇ క్రాప్ బుకింగ్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనితీరును కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేసారు. రైతులు ఇ క్రాప్ లో నమోదు కావడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు, బీమా, నష్టపరిహారం తదితర కార్యక్రమాలు పొందుటకు  ఇ క్రాప్ అవసరమని ఆయన చెప్పారు. ఇ క్రాప్ లో నమోదు కావడం వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.     సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు పాలన చేరువ చేయుటకు గ్రామ స్ధాయిలో వ్యవస్ధను ఏర్పాటు చేసిందని వాటి ఫలితాలు ప్రజలకు అందాలని ఆయన అన్నారు. గ్రామ స్ధాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు తమ సమస్యలను గ్రామ సచివాలయంలోనే నమోదు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రజలు సచివాలయంలోకి ప్రవేశించగానే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం వివరాలు తెలియాలని, సామాజిక ఆడిట్ కు వచ్చిన లబ్దిదారుల జాబితా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. సచివాలయాలకు బియ్యం కార్డు, పింఛను, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ కోసం అధికంగా దరఖాస్తులు వస్తాయని పేర్కొంటూ వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ధేశిత సమయంలో ఆర్జీలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేసారు. 

సచివాలయాల్లో యువత ఉద్యోగులుగా ఉన్నారని అదే వేగంతో సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. విధులను చక్కగా నిర్వహించడం వలన ప్రజల హృదయాల్లో నిలుస్తారని ఆయన సూచించారు. రైతు భరోసా కేంద్రంలో ధృవీకరణ విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. అందుకు తగిన విధంగా వ్యవసాయ సహాయకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో అన్ని సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ అన్నారు. విత్తనం నుండి విక్రయం వరకు అవసరమగు అన్ని మార్గదర్శకాలు రైతులకు అందించడం రైతు భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశ్యాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మంచి విత్తనాలు అందడం వలన అధిక దిగుబడులు సాధించగలరని అన్నారు. గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని మార్కెటింగు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన కియాస్కోల సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సచివాలయ, రైతు భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-30 17:36:44

ఉద్యోగులు పనినే దైవంగా భావించాలి..

నూతన ఉద్యోగులు పనినే దైవంగా భావించాలని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుని చూసి అంకితభావంతో సేవలందించాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. టిటిడిలో ఒకేసారి కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులకు తిరుపతి శ్వేత భవనంలో 15 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈఓ, జెఈఓ శ్రీమతి సదా భార్గవితో కలిసి 119 మంది ఉద్యోగులకు పోస్టింగులు అందజేశారు.  ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేసి టిటిడికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ జిఓలు, టిటిడి చట్టాలు, సర్వీస్ నిబంధనలపై పట్టు పెంచుకుని మెరుగ్గా కార్యాలయ విధులు నిర్వహించాలని సూచించారు. అర్హత గల ఉద్యోగులు పలు పోటీ పరీక్షలు కూడా రాసి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు అనంతరం ఉద్యోగ సమయంలో ఎలా ఉపయోగపడ్డాయనే విషయాలు, సొంత అనుభవాలను ఈ సందర్భంగా ఈఓ తెలియజేశారు.        జెఈఓ  సదా భార్గవి మాట్లాడుతూ ఈ ఉద్యోగాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ఇచ్చిన అరుదైన అవకాశంగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా విధులు నిర్వహించి టిటిడి ప్రతిష్టను కాపాడాలన్నారు. నూతన ఉద్యోగులందరూ శ్వేత భవనంలో మొక్కలు నాటారని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత వారే తీసుకోవాలని సూచించారు. టిటిడి ముఖ్య అంకణీయ అధికారి  శేషశైలేంద్ర మాట్లాడుతూ టిటిడిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతమని, నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు సేవాభావంతో విధులు నిర్వహించాలని కోరారు.  శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులరెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో(హెచ్ఆర్)  గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-30 17:35:06

ఆహార‌హ‌క్కు చ‌ట్టం అమ‌లు భేష్‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆహార హ‌క్కు చ‌ట్టం చ‌క్క‌గా అమ‌లు జ‌రుగుతోంద‌ని కేంద్ర బృందం ప్ర‌శంసించింది. మొత్తం 12 జిల్లాల్లో, విజ‌య‌న‌గ‌రం జిల్లా మెరుగ్గా ఉంద‌ని పేర్కొంది. జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం-2013 అమ‌లు తీరును వివిధ జిల్లాల్లో ప‌రిశీలించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం జైపూర్‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ క‌మ్యూనికేష‌న్ అండ్ స్ట‌డీస్ అనే సంస్థ‌కు అప్ప‌గించింది. ఈ సంస్థ ప్ర‌తినిధులు గిరిజాశంక‌ర్‌, ఎం.ర‌విప్ర‌తీక్‌, నాగేశ్వ‌ర్ జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. పిడిఎస్ బియ్యం స‌ర‌ఫ‌రా, మ‌హిళాభివృద్ది, శిశుసంక్షేమ‌శాఖ కార్య‌క‌లాపాలు, అంత్యోద‌య అన్న‌యోజ‌న బియ్యం పంపిణీ, బియ్యం, ఇత‌ర నిత్యావ‌స‌రాలు నిల్వ ఉంచేందుకు గోదాముల స‌దుపాయం, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లుతీరును ప‌రిశీలించి సంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఈ కేంద్ర బృందం శుక్ర‌వారం సాయంత్రం జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌తో స‌మావేశ‌మ‌య్యింది. పేద‌ల‌కు ఆహారాన్ని అందించేందుకు ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను సంద‌ర్భంగా జెసి వివ‌రించారు. పేద‌లంద‌రికీ ఆహార భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  కోవిడ్ స‌మ‌యంలో కూడా నిరాఘాటంగా బియ్యం పంపిణీ చేసినందుకు బృందం స‌భ్యులు జిల్లా యంత్రాంగాన్ని ప్ర‌శంసించారు.  ఈ స‌మావేశంలో జిల్లా పౌర స‌ర‌ఫ‌రా అధికారి ఏ.పాపారావు,  ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, సివిల్ సప్ల‌యిస్ డిఎం దేవుల్ నాయ‌క్‌, ఏఎం మీనా, మార్కెటింగ్ ఏడి వైవి శ్యామ్‌కుమార్‌, డ్వామా, ఎడ్యుకేష‌న్‌, ఫుడ్ సేఫ్టీ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, డిసిఐసి స‌భ్యులు చ‌ద‌ల‌వాడ ప్ర‌సాద్‌, వివిధ‌ వినియోగ‌దారుల సంఘాలు, సంస్థ‌ల‌ ప్ర‌తినిధులు సుబ్బారావు, హెచ్ఎస్ రామ‌కృష్ణ‌, కె.విన‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-30 16:05:23

విజయనగం జిల్లా అంతా పర్యటిస్తా..

రానున్న రోజుల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ప్ర‌భుత్వ సంక్షేమ అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లుపై త‌న‌కు అధికారుల నుంచి వాస్త‌వ స‌మాచారం వుండాల‌ని స్ప‌ష్టంచేశారు. జిల్లాలో ఏదైనా ప్ర‌భుత్వ శాఖ‌లో ఘ‌ట‌న జ‌రిగితే జిల్లా అధికారుల నుంచే త‌న‌కు ముందుగా స‌మాచారం అందాల‌ని, రాష్ట్రస్థాయి నుంచి వ‌చ్చే వ‌ర‌కు ఇక్క‌డి అధికారులు తెలియ‌జేయ‌క‌పోతే స‌హించేది లేద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా శుక్ర‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం మ‌ధ్యాహ్నం జిల్లా అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోర‌యంలో క‌లెక్ట‌ర్ భేటీ అయ్యారు. ముందుగా జిల్లా అధికారుల‌కు త‌న గురించి వివ‌రించి, గ‌తంలో ఎక్క‌డెక్క‌డ, ఏయే ప్ర‌భుత్వ శాఖ‌ల్లో విధులు నిర్వ‌హించిందీ వివ‌రించారు. అనంత‌రం వివిధ శాఖ‌ల జిల్లా అధికారుల‌ను ఒక్కొక్క‌రిని ప‌రిచ‌యం చేసుకొని ఆయా శాఖ‌ల ద్వారా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప‌రిష్క‌రించాల్సిన స‌మస్య‌లు, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాల‌పై దాదాపు మూడు గంట‌ల పాటు స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్‌గా త‌న ప్రాధామ్యాల‌ను వివ‌రించారు.

జిల్లాలో విద్యాభివృద్ధి, వ్య‌వ‌సాయం, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశుసంక్షేమం వంటి రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు. జిల్లాలో వ‌రి అధికంగా పండిస్తున్నందున రైస్ బ్రాన్ ఆయిల్ త‌యారీ వంటి ఆహార‌శుద్ది ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటును ప్రోత్స‌హిస్తామ‌న్నారు. జిల్లాకు కొత్త రైస్‌మిల్లు య‌జ‌మానుల‌ను రప్పించాల‌ని పౌర‌సర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్‌ను ఆదేశించారు. జిల్లాలో ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ స‌కాలంలో జ‌ర‌గ‌డం లేద‌ని ఫిర్యాదులు ఉన్నాయ‌ని, వాటిని స‌రిచేయాల‌న్నారు. ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్  అశోక్‌, జె.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారులంతా క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన  సూర్య‌కుమారిని పుష్ప‌గుచ్ఛాల‌కు బ‌దులు నోటు పుస్త‌కాలు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నోటు పుస్త‌కాల‌ను గిరిజ‌న విద్యార్దుల‌కు అంద‌జేసి వారికి ఉప‌యోగ‌ప‌డేలా చూస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

Vizianagaram

2021-07-30 16:03:08

మాతా శిసు మరణాలు పూర్తిగా తగ్గించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైద్యారోగ్య‌శాఖ సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర్చాల‌ని వైద్యాధి కారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. వైద్యారోగ్య‌శాఖపై త‌న ఛాంబ‌ర్‌లో శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్షించారు. శాఖా పరంగా అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. జిల్లాలో పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, బ్ల‌డ్ బ్యాంకులు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు ద్వారా అందుతున్న సేవ‌ల‌ను తెలుసుకున్నారు. ముఖ్యంగా గిరిజ‌నుల‌కు, మ‌హిళ‌ల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల‌పై ప్ర‌శ్నించారు. ఆసుప‌త్రుల ప‌నితీరు, స‌దుపాయాలు, మందులు, వైద్యులు,  సిబ్బంది ల‌భ్య‌త‌ను తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణ‌ప‌నుల‌పై ప్ర‌శ్నించారు.  జిల్లాలో మ‌లేరియా వ్యాప్తి, చికెన్ గున్యా, ఇత‌ర సీజ‌నల్ వ్యాధుల‌పైనా ఆరా తీశారు.  జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. దీనికోసం స్త్రీశిశు సంక్షేమ‌శాఖ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో ఆశా కార్య‌క‌ర్త‌లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండేలా చూడాల‌న్నారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌పై చ‌ర్చించారు. టెస్టులు, కోవిడ్ ఆసుప‌త్రులు, ప‌డ‌క‌లు, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా, వేక్సినేష‌న్‌, మందులు,  స‌దుపాయ‌ల‌ను తెలుసుకున్నారు.  అన్నివిధాలా ఆసుప‌త్రుల‌ను సంసిద్దంగా ఉంచాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

                  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, డిఐఓ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, కేంద్రాసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ సీతారామ‌రాజు, ఎపిఎంఐడిసి ఇఇ ఎం.స‌త్య‌ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-07-30 15:57:11

శ్రీ సత్యదేవ నీ సమాచారం ఎక్కడ..?

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంత స్థాయిలో ఇక్కడ సత్యేదేవుడిని కూడా భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. పైగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటం, స్వామివారి ఆలయం మీదుగానే అన్ని వాహనాలు వెళ్లడం అందరికీ కలిసొచ్చే అంశం. ఎలా చూసినా స్వామివారు భక్తులకు చాలా దగ్గరగా ఉంటారు. ఇంతవరకూ బాగానే వున్నా స్వామివారికి చెందిన ముఖ్య సమాచారం దేవస్థాన అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ దేవస్థానానికి అధికారిక పీఆర్వోఓ(పత్రికా సంబంధాల అధికారి) లేకపోవడం.. ఇక్కడ పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ కి ఈ బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో స్వామి సమాచారం బయటకు రావడం లేదు. వాస్తవానికి శ్రీ సత్యదేవుని ఆలయంలో విశేషమై పూజలు, ముఖ్యపర్వదినాల్లో దర్శనాలు, కార్యక్రమాలు, ఆలయ అభివ్రుద్ధి, ప్రముఖుల సందర్శన, స్వామికి వారికి చెందిన పూజలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం, అన్నింటికంటే మించి కానుకల సమర్పణ, విరాళాలు, దాతలు ఎవరైనా ముందుకి వచ్చి ఏమైనా సహాయం అందించాలన్నా ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. దీనితో స్వామివారికి చాలా ఆదాయం చేరకుండా పోతుంది. చిన్న చిన్న దేవస్థానాలు సైతం ఆలయాల్లో ప్రత్యేకంగా పీఆర్వోలను ఏర్పాటు చేసుకొని స్వామి వైభవాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఆదాయాన్ని, దాతల నుంచి సహాయాన్ని ఆర్జిస్తున్నారు. పెద్ద పెద్ద దాతల సహాయంతో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 

విచిత్రంగా అన్నవరం దేవస్థానంలో మాత్రం వీటికి విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ కొండపై బెదిరించేవారిదే రాజ్యం. అలాంటి వారికే దేవస్థాన అధికారులు కూడా సమాచారం తెలియజేస్తారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. చిన్న ఉదాహరణ తీసుకుంటే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక బియ్యం వ్యాపారి కోట్ల రూపాయలు ఖర్చుచేసి పేదలకు ఉచితంగా వివాహాలు జరిపించడానికి ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ విషయాన్ని దేవస్థాన అధికారులు ఒక వర్గం మీడియాకి మాత్రమే అందించారు. సత్యదేవుని రత్నగిరి కొండపై పెళ్లిళ్లు చేసుకుంటే వారి జీవితాలు బాగుంటాయనేది ఏన్నోఏళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అలాంటి నిరుపేద ప్రజల కోసం కొండపై ఏ తరహా వసతులు ఉన్నాయో కూడా ఇక్కడ చెప్పే అధికారులు లేరు. కారణం వారికి వచ్చే సైడ్ ఇన్కం పోతుంది. అదే ప్రజలకు దేవస్థానంలోని ప్రతినిత్యం కాటేజీల వివరాలు, సదుపాయాలు, ఉచిత కళ్యాణ మండపాలు వివరాలు అన్ని మీడియా సంస్థలకుతెలియజేస్తే.. వాటిని పత్రికలు, టీవీలు, సామాజిక మాద్యమ మొబైల్ న్యూస్ యాప్ ల ద్వారా ప్రజలు తెలుసుకొని స్వామివారి సన్నిధికి రావడానికి, విశేషంగా కొండపైనే పెళ్లిల్లు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలా వస్తే దేవస్థాన అధికారులకు.. అక్కడ బ్రోకరేజీచేసేవారికి ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది. 

దీనితో కొండపై ఏం జరుగుతందనేది ఎవరికీ చెప్పడం లేదు.. చెప్పినా ఒక వర్గం మీడియాకి మాత్రమే చెబుతున్నారు. వారు కూడా ఇష్టమొస్తే దానిని మీడియాకి తెలియజేస్తారు లేదంటే అదీ లేదు. దీనితో సత్యదేవుని సమాచారం భక్తులకు గానీ ప్రజలకు గాని సకాలంలో మీడియాకి ద్వారా తెలియడం లేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఆదాయం పెంచుకోవడానికి, స్వామివారిని భక్తులకు చేరువ చేయడానికి ఎన్నో ప్రచార కార్యక్రమాలు అవలంభించాయి ఒక్క అన్నవరం దేవస్థానం తప్పా. ముఖ్యంగా ఆన్ లైన్ లో సేవలు, ఆన్ లైన్ విరాళాలు, ఇలా చాలా కార్యక్రమాలపై ఇక్కడి అధికారులు అస్సలు ప్రచారం చేయడం లేదు. వాస్తవానికి దేవస్థానికి చెందిన ఏ ప్రచారమైనా మీడియా సంస్థల ద్వారా ప్రభుత్వం ఉచితంగానే చేపడుతుంది. విచిత్రంగా ఆ పనికూడా ఇక్కడి అధికారులు చేయరంటే బయట ఆదాయం పోతుందనే కోణంలో ఇక్కడి అధికారులు ఏస్థాయిలో ఆలోచిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్జేసి స్థాయి అధికారి దేవస్థానానికి ఈఓగా ఉన్నా.. స్వామి సమాచారం మాత్రం బయటకు పూర్తిస్థాయిలో రావడం లేదంటే ఇక్కడి అధికారులు, యాక్టింగ్ పీఆర్వో ఏవిధంగా పనిచేస్తున్నారో.. మీడియాకి సమాచారం ఏవిధంగా అందజేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.. ఇప్పటికైన సత్యదేవుని పూర్తిసమాచారం దేవస్థాన పీఆర్వో విభాగం ద్వారా మీడియాకి తెలియజేసినా, ఉచిత, నగదు కళ్యాణ మండపాల వివరాలు అనునిత్యం తెలియజేసినా స్వామివారికి ఆదాయం రావడంతోపాటు, ఆయన పాదాల చెంతనే పెళ్లిల్లు, పూజలు చేసుకోవాలన్న భక్తుల కోరికలు నెరవేరుతాయి. 

Annavaram

2021-07-30 03:00:09

విజయనగరం జిల్లాలో 57,545 మందికి ల‌బ్ది..

విద్యాదీవెన ప‌థ‌కం క్రింద‌ జిల్లాలో  57,545 మంది విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో రూ.30.02 కోట్లు జ‌మ అయ్యింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంనుంచి గురువారం విద్యాదీవెన రెండో విడ‌త నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, ఎంఎల్ఏలు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్(సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, సాంఘిక సంక్షేమ‌శాఖ డిడి కె.సునీల్ రాజ్‌కుమార్‌, డిబిసిడ‌బ్ల్యూఓ కీర్తి,  మైనారిటీ సంక్షేమాధికారి బి.అరుణ‌కుమారి, కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యాదీవెన మొత్తానికి సంబంధించిన చెక్కును, విద్యార్థుల త‌ల్లితండ్రుల‌కు,  ఉప ముఖ్య‌మంత్రి పుష్ప శ్రీ‌వాణి లాంఛ‌నంగా అంద‌జేశారు.

జిల్లాలో 57,545 మందికి ల‌బ్ది
డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్‌
                  విద్యాదీవెన ప‌థ‌కం ద్వారా జిల్లాలో సుమారు 57,545 మందికి  ల‌బ్ది చేకూరుతోంద‌ని జిల్లా ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న ముఖ్య‌మంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన ప‌థ‌కం క్రింద జిల్లాకు రూ.30.02 కోట్లు విడుద‌లవుతుంద‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థులు 5,419 మంది, గిరిజ‌న సంక్షేమ‌శాఖ ద్వారా 3,708 మంది, బిసి సంక్షేమ‌శాఖ ద్వారా 44,220 మంది, ఇబిసిలు 3,001 మంది, ముస్లిం మైనారిటీలు 227 మంది, కాపు విద్యార్థులు 929, క్రిష్టియ‌న్‌లు 41 మంది ల‌బ్ది పొందుతున్నార‌ని వివ‌రించారు.

మేన‌మామ‌గా బాధ్య‌త తీసుకున్నారు
చిప్పాడ లావ‌ణ్య‌, విద్యార్థిని త‌ల్లి
                ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ఒక మేన‌మామ‌లా, తమ పిల్లల చ‌దువుల బాధ్య‌త‌ను తీసుకున్నార‌ని, విద్యార్థిని జ్యోతిక త‌ల్లి చిప్పాడ లావ‌ణ్య అన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  ఆమె ముఖ్య‌మంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన విడుద‌ల చేసినందుకు,  జిల్లాలోని విద్యార్థులు, త‌ల్లుల త‌ర‌పున ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ‌కు స్థోమ‌త లేన‌ప్ప‌టికీ,  విద్యాదీవెన ప‌థ‌కం వ‌ల్లే త‌మ ఇద్ద‌రు పిల్ల‌లూ చ‌దువుకోగ‌లుగుతున్నార‌ని ఆమె చెప్పారు. ఇద్ద‌రూ ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటుండ‌టంవ‌ల్ల‌, వారు మంచి ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ‌తార‌న్న ధీమా క‌లుగుతోంద‌న్నారు. త‌మ పిల్ల‌ల‌కు వ‌స‌తి దీవెన వ‌చ్చింద‌ని, త‌మ కుటుంబానికి జ‌గ‌న‌న్న ఇళ్లు కూడా మంజూర‌య్యింద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌ అత్తకు వృద్దాప్య పింఛ‌న్ కూడా వ‌స్తోంద‌ని, త‌మ కుటుంబంలో ప్ర‌భుత్వం వెలుగులు నింపింద‌ని ఆమె ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

విద్య‌, వైద్యానికి అధిక ప్రాధాన్య‌త‌
ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి
               త‌మ ప్ర‌భుత్వం విద్య‌. వైద్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పిల్ల‌లంద‌రూ చ‌దువుకొని, విద్యావంతులు కావాల‌న్న‌దే ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌నరెడ్డి ల‌క్ష్య‌మ‌న్నారు. రాష్ట్రంలో విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టి, వాటిని ప్ర‌జ‌లంద‌రికీ అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌న్నీప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు జిల్లా అధికారులు బాధ్య‌తాయుతంగా కృషి చేస్తున్నార‌ని, వారికి త‌మ‌వంతుగా సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తున్నామ‌ని చెప్పారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, పార‌ద‌ర్శ‌కంగా ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని స్వామి చెప్పారు.

Vizianagaram

2021-07-29 17:09:04

ఆర్ అండ్ ఆర్‌ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా ఇన్ ఛార్జి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం త‌దిత‌ర అంశాలపై క‌లెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, తోట‌ప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం బ్రాంచ్ కెనాల్‌, తార‌క‌రామ‌తీర్ధ‌సాగ‌ర్‌, వెంగ‌ళ‌రాయసాగ‌ర్‌, నాగావ‌ళి ఫ్ల‌డ్ బ్యాంకు, కంచ‌ర‌గెడ్డ‌, అడారుగెడ్డ‌, క‌ర్రిగెడ్డ‌ త‌దిత‌ర ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా  ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ కిశోర్ మాట్లాడుతూ, నిర్వాసితుల పున‌రావాసం పై దృష్టిపెట్టాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అలాగే ప‌లు ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ ఇప్ప‌టికీ కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉంద‌ని, దానిని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. కోర్టు కేసుల‌కు సంబంధించి, న్యాయప‌రంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి, గూడెపువ‌ల‌స‌, కంచేరు, రావాడ‌, స‌వ‌రివిల్లి త‌దిత‌ర గ్రామాల్లో జ‌రుగుతున్న భూసేక‌ర‌ణ‌పై గ్రామాల‌వారీగా స‌మీక్షించారు. ఎయిర్‌పోర్టు ఎప్రోచ్ రోడ్డు, ట్రంపెట్ బ్రిడ్జి త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌శ్నించారు. విమానాశ్ర‌యానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని, నిర్లిప్త‌త‌ను విడ‌నాడి, ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు, హెచ్‌వి జ‌య‌రామ్‌, టిటిపిఆర్ ఇఇ తిరుప‌తిరావు, తోట‌ప‌ల్లి ప్రాజెక్టు ఇఇ రామ‌చంద్ర‌రావు,  క‌లెక్ట‌రేట్ జి.సెక్ష‌న్ సూప‌రింటిండెంట్ జి.సూర్య‌ల‌క్ష్మి,  ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.        

Vizianagaram

2021-07-29 17:05:00

వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలి..

ప్రతీ రైతు బరోసా కేంద్రం పరిధిలో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు పూర్తి చేయాలని ఇన్ ఛార్జి కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ వ్యవసాయాధికారులకు ఆదేశించారు.    గురువారం తన ఛాంబరులో పలు వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్షించారు.  జిల్లాలో 634 వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు కావల్సివుండగా ఇప్పటి వరకు 622  బోర్డులు ఏర్పాటు అయ్యాయని,  ఇంకను 12 బోర్డులు ఏర్పాటు కావల్సివుందని వాటిని వెంటనే  ఏర్పాటు చేయాలని సూచించారు.   ప్రతీ 1, 2, 3  శుక్రవారాలలో గ్రామ, మండల, జిల్లా స్థాయి సమానేశాలు తప్పని సరిగా జరిగేలా చూడాలన్నారు.  ఈ క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన శాఖల డిడిలు, ఎడిలతో పర్యవేక్షణ బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని జె.డి.కి సూచించారు.  ఆర్.బి.కె.లలో అందించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యతను తనిఖీలు చేయాలని, తనిఖీ చేసిన నివేదికను ఆర్.బి.కె.లలో ప్రదర్శించాలని సూచించారు.  ప్రతీ ఆర్.బి.కె.ను బ్యాంకులకు మ్యాపింగే చేయాలన్నారు.  కౌలు రైతులందరకు  ఆగష్టు 15లోగా రుణాలు అందజేయాలని ఆదేశించారు.   విత్తనాలు, ఎరువుల అక్రమ సరఫరాలను అరికట్టాలని, దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా అమ్మేవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలన్నారు.  చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.  ఎరువులు, విత్తనాలు జిల్లా సరిహద్దులు దాటి బయటకు వెళ్లకుండా నియంత్రించేలా పోలీసు బందోబస్తు కోరాలని ఆ మేరకు జిల్లా ఎస్.పి.కు లేఖ వ్రాయాలని, ప్రతిని  వ్యవసాయ కమిషనర్ కు మార్క్ చేయాలని సూచించారు.  ఈ సమావేశంలో  ఆర్.డి.ఓ. భవానీ శంకర్, వ్యవసాయ శాఖ జెడి ఆషాదేవి, డిడిలు, ఎడిలు, ఉద్యాన వన శాఖాధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-29 17:02:04

సంక్షేమ పథకాలపై అవగాహనుండాలి..

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సచివాలయ ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్  డా.ఏ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన స్వర్ణభారతి స్టేడియం వద్దగల పాత రేసపువానిపాలెం 24వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను  ప్రదర్శించే బోర్డులను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల తో మాట్లాడుతూ వారి పని వివరాలు, ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు విషయమై అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానం రానందున సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నింటిపైనా పునశ్చరణ శిక్షణ ఏర్పాటు చేయాలని యు.సి.డి. పథక సంచాలకులు శ్రీనివాస్ ను ఆదేశించారు. లబ్ధిదారులకు ఉండవలసిన అర్హతల గురించి క్షుణ్ణంగా   తెలుసుకోవాలన్నారు.  విధి నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని చెబుతూ వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.  అనంతరం కలెక్టర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను తనిఖీ చేశారు.

విశాఖ సిటీ

2021-07-29 16:59:12

వికలాంకులకు ప్రత్యేక సదుపాయాలు..

సింహాచలం దేవస్థానంలో వికలాంగులకు ఉచితంగానే వీల్ ఛైర్, లిఫ్ట్ అన్ని సమకూర్చి దేవదేవుని దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఈఓ సూర్యకళ ఆదేశాలతో ఈ సేవ అమల్లోకి వచ్చింది. గురువారం బరంపురం నుంచి వచ్చిన ఒక వికలాంగురాలు సాయంత్రం వచ్చిన ఈ జంటకు వీల్ ఛైర్ ఇచ్చి, లిఫ్టులో పైకి తీసుకెళ్లి దర్శనం చేయించారు సిబ్బంది.  తన భార్యకు కాలి సమస్య ఉందని.. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించి ఆపరేషన్ చేయించి స్వామివారి చెంతకు తీసుకొచ్చానని చెప్పారు బరంపురంవాసులు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, వికలాంగులు, నడవలేని వయస్సు మళ్లిన వారు దర్శనానికొస్తే సెక్యూరిటీ సహా సిబ్బంది సహకరించి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సూచించారు.  వీల్ ఛైర్ లు పీఆర్వో ఆఫీసులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు..

Simhachalam

2021-07-29 16:53:01

సింహాద్రి అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

విశాఖ  బాపూజీనగర్ కు చెందిన దాసరి పృధ్వీ రెడ్డి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న)స్వామి నిత్య అన్నదాన పథకానికి   లక్షా నూట పదహారు రూపాయలు (1,00,116)  విరాళమిచ్చారు. ఆ మొత్తాన్నిచెక్కు రూపంలో గురువారం పీఆర్వో కార్యాలయంలో  అందించారు . తన జన్మదినోత్సవమైన మే 20న స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని దాతలు కోరారు. దాతలకు  టెంపుల్ ప్రొటోకాల్ ప్రకారం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం కల్పించారు.  టెంపుల్ ఏఈఓ ప్రసాదాన్ని అందించారు. 

Simhachalam

2021-07-29 16:40:18

అప్పన్నకు హాల్ డైరెక్టర్లు పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) సీఎండీ , డైరెక్టర్ల కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎండీ ఆర్ మాధవన్ కుటుంబ సభ్యులు, సీఈఓ మైథీ , డైరెక్టర్లు అనంతకృష్ణన్, ఎంఎస్ వెలపరి, అలోక్ వర్మ, అరూప్ చటర్జీ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. అంతముందు వీరంతా స్వామివారి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ విశేషాలను దేవస్థాన సిబ్బంది హాల్ డైరెక్టర్ల బ్రుందానికి తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-07-29 16:39:26

అధికారులకు స్థానిక నివాసం తప్పనిసరి..

గుంటూరు జిల్లాలోని అన్నిశాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు వారు విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నేడోక ప్రకటనలో ఆదేశించారు. ఆ విధంగా వారి కార్యస్థానంలో నివాసం ఉండని అధికారులపై శాఖాపరమైన  క్రమశిక్షాణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారుల పనితీరుపై అసనం వ్యక్తం చేసిన తరుణంలో జిల్లా కలెక్టర్ స్థానిక నివాసం ఆదేశ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

Guntur

2021-07-29 16:31:32