1 ENS Live Breaking News

మూడోదకు ముందస్తు ఏర్పాటు చేయాలి..

విశాఖజిల్లాలో 3వ దశ కోవిడ్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేసారు.  కోవిడ్ రహిత జిల్లాగా విశాఖను తీర్చి దిద్దాలన్నారు.  బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయపు  సమావేశ మందిరంలో  కోవిడ్–19 మూడవ దశ నివారణకు  తీసుకోవలసిన  చర్యలపై జిల్లా  అధికారులు, శాసన సభ్యులతో  సమావేశం నిర్వహించి, ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల  సూచనలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మొదటి దశ, రెండవ దశలో  ఎదుర్కొన్న  సమస్యలు పునరావృతం  కాకుండా నిర్ధిష్టమైన భద్రత, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.   జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా  ఉత్సవాలు, సామూహికంగా వేడుకలు  నిర్వహించకూడదని పేర్కొన్నారు.  నిబంధనలు అతిక్రమించి, మాస్క్ లు వినియోగించని  వారిపై  తగిన  చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు.   కోవిడ్ భారిన పడి కోలుకున్న వారికి వచ్చే ఆరోగ్య సమస్యలకు తగిన  వైద్యం అందించాలన్నారు.  కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ లో  నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.  జిల్లాలో  ఎక్కడా మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ప్రజా ప్రతి నిధులకు  అధికారులు  సహకరించి వారి సూచనలు అమలు చేయాలన్నారు. 

జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ధర్డ్ వేవ్ రాకుండా కోరుకుంటున్నానని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ధర్డ్ వేవ్ పై  కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. పౌరులు మాస్క్ లేకుండా  షాపింగ్ లకు  వెళితే షాపు యజమానికి రూ.10వేల నుంచి  రూ. 25వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసారు.  కోవిడ్ నిబంధనలు  అతిక్రమించే షాపులు, షాపింగ్ మాల్స్ పై కఠినంగా  వ్యవహరిస్తామన్నారు.  పార్కులు  బహిరంగ ప్రదేశాలలో  నిబంధనలు పక్కాగా అమలు చేయాలని  పోలీస్ అధికారులకు  సూచించారు.  వి ఎం ఆర్ డి ఎ, జి వి ఎం సి, పోలీస్ అధికారులు  మాస్క్ లు ధరించని వారిపై చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ ధర్డ్ వేవ్ నివారణకు జిల్లాలో   75 ఆసుపత్రులను  గుర్తించామన్నారు.  3370 బెడ్స్, 582 వెంటిలేటర్లు సిద్దం చేసామన్నారు.  చిన్న పిల్లల కోసం 100 పడకలు  ఏర్పాటు  చేసామన్నారు.  కె జి. హెచ్, విమ్స్, చెస్ట్ ఆసుపత్రిలో  బెడ్స్ సిద్దం చేసామని వివరించారు. 

పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీలో నిబంధనలు అమలు లేవని, వారపు సంతలకు  అనుమతిచ్చారని, గిరిజన ప్రాంతం లో కోవిడ్  నిబంధనలు అమలు చేయాలన్నారు.  పాయకరావుపేట ఎం .ఎల్ .ఎ . గొల్లబాబురావు మాట్లాడుతూ కె.జి.హెచ్ సి ఎస్ ఆర్ బ్లాకులో సౌకర్యాలు మెరుగు పరచాలని, పారిశద్ద్యపనులు చేయాలన్నారు.  అనకాపల్లి శాసన సభ్యులు  గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ చోడవరం, మాడుగుల ప్రజలు  అనకాపల్లి ఆసుపత్రి పై ఆధారపడతారని  అనకాపల్లి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో  వైద్యులను సిబ్బందిని నియమించాలన్నారు.  
పెందుర్తి ఎం ఎల్ ఎ  అదీప్ రాజు పెందుర్తి అర్బన్ లో లక్షమంది, గ్రామీణ ప్రాంతంలో  30 వేల మంది జనాభా  ఉన్నారని ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.  నెడ్ క్యాప్ చైర్మన్   కె. కె. రాజు,  ఎం ఎల్ ఎ గణబాబు కోవిడ్ అనంతరం వచ్చే సమస్యలపై దృష్టి  సారించాలన్నారు. చోడవరం ఎం .ఎల్ ఎ దర్మశ్రీ  నోడల్ అధికారులను కొనసాగించాలని సూచించారు. సాయంత్రం 5గంటల తరువాత బీచ్ రోడ్ లో సందర్శకులను అనుమతించ కుండా  చర్యలు  తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  మాట్లాడుతూ పీవర్ సర్వే వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో  మాడుగుల ఎం ఎల్ ఎ ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు,  జి.వి.ఎం.సి సృజన,  ఎస్ పి  బి. కృష్ణారావు , వి ఎం ఆర్ డి ఎ చైర్ పర్సన్ విజయనిర్మల,  మళ్ల విజయ ప్రసాద్, ఎ ఎం సి ప్రిన్సిపాల్ డా. సుధాకర్,  డి ఎం అండ్ హెచ్ ఒ  డా. సూర్యనారాయణ ,  కె జి హెచ్ సూపరిండెంట్ డా.మైధిలి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-04 14:58:01

21 లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..

విశాఖ జిల్లాలో జిల్లాలో  21 లక్షల మందికి   కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు  వేసారని రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. బుధవారం జిల్లా అధికారులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 3వ దశ నివారణకు తీసుకోవలసిన చర్యలపై  అధికారులతో  చర్చించామన్నారు. కోవిడ్ నివారణలో  విశాఖ అగ్ర స్థానంలో  ఉండాలని ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు   నూరు శాతం  వ్యాక్సినేషన్  సాధించాలని  అధికారులను  ఆదేశించినట్టు చెప్పారు. 3వ దశపై వైద్య నిపుణల సూచనల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. కాగా  ఈ నెల 16వ తేది నుంచి  జిల్లాలో  ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుందని  జిల్లా కలెక్టర్ చెప్పారని  తగిన జాగ్రత్తలు తీసుకొని  ఆర్మీ రిక్రూట్ మెంట్  ఆగకుండా   రిక్రూట్ మెంట్   ప్రక్రియ పూర్తి చేయాలని  సూచించామని  చెప్పారు.    కోవిడ్ నివారణపై  ప్రజలను  అప్రమత్తం  చేస్తూ  అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో  పలువురు  శాసన సభ్యులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-04 14:57:07

ఆగస్టు 5న జగనన్న పచ్చతోరణం..

కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గంలోని వాక‌ల‌పూడి జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 5న  జ‌ర‌గ‌నుంద‌ని డీఎఫ్‌వో (సోష‌ల్ ఫారెస్ట్రీ) ఆర్‌.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణం (వ‌న మ‌హోత్స‌వం, 2021) కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు హాజ‌రుకానున్న‌ట్లు వెల్ల‌డించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి పిలుపు మేర‌కు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములై ప‌చ్చ‌తోర‌ణంలో జిల్లాను ముందు వ‌రుస‌లో నిల‌పాల‌ని ప్రజలను శ్రీనివాస్ కోరారు.

Kakinada

2021-08-04 14:56:18

సీనియారిటీల జాబితా సిద్దంచేయండి..

శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సీనియర్ అసిస్టెంట్లకు చెందిన టెంటటివ్ సీనియారిటీ జాబితాను ఆయా అధికారుల జి – మెయిల్ నందు ఉంచినట్లు  జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన జారీచేసారు. 2021 –22 పేనల్ సం.నకు గాను జిల్లాలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సీనియర్ అసిస్టెంట్ల సీనియారిటి లిస్టును సంబంధిత ఉద్యోగులకు సమాచారాన్ని అందించుటకు ఆయా అధికారుల ఇ-మెయిల్స్ నందు ఉంచడం జరిగిందని, వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నఎడల సంబంధిత ఆధారాలతో ఆయా అధికారుల ద్వారా ఈ నెల 15 లోగా తమ కార్యాలయానికి ప్రత్యేక దూత ద్వారా సమర్పించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. 

Srikakulam

2021-08-04 14:28:52

పథకాల అమలులో లోపాలు సవరించాలి..

ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ర‌త్నాలు-పేదలంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మం అమ‌లులో లోపాలను స‌వ‌రించి, త్వ‌రిత‌గ‌తిన లేఅవుట్ల‌ను అభివృద్ధి చేసి, ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌జాప్ర‌తినిధుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునేందుకు వీలుగా డివిజ‌న్ స్థాయిలో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జేసీ (గృహ నిర్మాణం) ఎ.భార్గ‌వ్ తేజ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తొలిద‌శ లేఅవుట్ల‌లో లెవెలింగ్‌, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణ సామ‌గ్రి త‌దిత‌రాల‌కు సంబంధించిన క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ల‌క్ష్యంగా డివిజ‌న‌ల్ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు భార్గ‌వ్ తేజ తెలిపారు. ఆగ‌స్టు 5న పెద్దాపురం డివిజ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఏడో తేదీన రామ‌చంద్రాపురం, ఎనిమిదో తేదీన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, తొమ్మిదిన కాకినాడ‌, 12వ తేదీన అమ‌లాపురం డివిజ‌న్ల‌లో స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ స‌మావేశాల‌కు ఆయా డివిజ‌న్ల ప‌రిధిలోని ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రై జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా అమ‌ల‌య్యేందుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించాల‌ని జేసీ (హెచ్‌) భార్గ‌వ్ తేజ కోరారు.

Kakinada

2021-08-04 14:25:17

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.03 కోట్లు..

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి హుండీ ఆదాయం ఒక కోటి మూడు లక్షల 35వేల 857 రూపాయలు వచ్చిందని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. భారత దేశ కరెన్సీతోపాటు ఆరు దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా స్వామివారి హుండీ లెక్కింపులో లభ్యమైందని ఈఓ తెలియజేశారు. ట్రస్టుబోర్టు సభ్యులు, ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, ఇతర సభ్యులు, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో పరకామణి లెక్కింపు కార్యక్రమం చేపట్టిన్టు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసినట్టు చెప్పారు.

సింహాచలం

2021-08-04 14:02:14

అన్నదాతలకు అండగా నిండుగా రైతు భరోసా కేంద్రాలు..

 రైతు బాగుంటేనే రాష్ట్రం ఆన్ని విధాలా అభివృధి చెందుతుంది, వ్యవసాయంతో ఆహార భద్రత కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులు చేశారు ఆని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. బుధవారం కురుపాంలో  ఉప ముఖ్యమంత్రి రైతు భారోసా కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భం గా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ, రైతులకు బహుళ ప్రయోజనాలు కలిగించే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాలలోనే  విత్తనం నుండి పండించిన పంట అమ్మకం వరకు సేవలందిస్తోంది అన్నారు. అలాగే వై.ఎస్.అర్. రైతు భరోసా సన్న చిన్నకారు రైతుల పంటల కాలం ప్రారంభమైన  నుండి చివరివరకు సాగు పెట్టుబడికి అవసరమైయ్యే ఖర్చులకు సకాలంలో చెల్లిస్తేనే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని భావించి వై ఎస్.ఆర్ రైతు భరోసా క్రింద సంవత్సరానికి 13,500 చొప్పున 5 సంవత్సరాలు ప్రతి రైతుకు రూ.67,500 సాయం అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు,. దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వై.ఎస్.ఆర్ రైతుభరోసా క్రింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్.ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

        ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం లో విజ్ఞానాన్ని, వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సబ్సిడీ వంటి సౌకర్యాలు ఒకే దగ్గర పొందడానికి  రైతు భరోసా కేంద్రం అన్నారు.

Vizianagaram

2021-08-04 11:04:19

అధికారాలను భర్తలకు ఎప్పుడూ అప్పగించకూడదు..

నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళలు ఎక్కువగా ఉన్నారని, వారిని చూస్తుంటే ఆనందంగా ఉందని, అయితే  వారి అధికారాన్ని భర్తలకు అప్పగించకుండా వారే చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి తెలిపారు.  శిక్షణ లో నేర్చుకున్న అంశాలను పాలనలో  అమలు చేయాలనీ అన్నారు.  జే. ఎన్.టి యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణా ముగింపు   కార్యక్రమం లో బుధవారం కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.  సర్పంచ్ అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి అని, గ్రామానికి మంచి జరిగినా , చెడు జరిగినా  పూర్తి బాధ్యత సర్పంచ్ లదే నని అన్నారు.  ఉన్నటువంటి వనరులతోనే అభివృద్ధిని చేయవచ్చని ముందుగా ఆ గ్రామానికి ఏం కావాలో గ్రామ సభల ద్వారా తీర్మానం చేసుకోవాలని, పార్టీల కతీతంగా ప్రజలంతా మనవాళ్ళే అనుకోని పని చేయాలనీ హితవు పలికారు.  మంచి పనులు చేస్తే  సర్పంచ్ మాటకు గ్రామస్తులంత గౌరవిస్తారని, సంక్షేమ పధకాల పై పూర్తి  అవగాహన కలిగించుకొని, పారదర్శకంగా వాటిని ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.  అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేలా చూస్తే గ్రామం లోని పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఆశ వర్కర్స్ ప్రతి రోజు గ్రామానికి వచ్చి ఫీవర్ సర్వే చేస్తే గ్రామస్తులంత ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యతలను   పెట్టుకోవాలని, బహిరంగ  మల ముత్రాదుల విసర్జనలు లేకుండా  పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.  శిక్షణ నుండి గ్రామానికి వెళ్ళగానే  జగనన్న  పచ్చతోరణం  క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.  ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం లో కార్నాల్ గ్రామం లో గ్రామస్తుల శ్రమదానం తో  మురుగు నీరు నుండి మంచి నీరు వచ్చేలా నిర్మించుకున్న 3 రకాల చెరువుల గురించి వివరిస్తూ  ఆ విజయ గాధ  షార్ట్ ఫిలింను పిపిటి  ద్వారా ప్రదర్శించారు.  ప్రతిది డబ్బు తోనే ముడిపెట్ట కూడదని, ప్రజలంతా ఏకమైతే  శ్రమదానం ద్వారా గ్రామాల అవసరాలను కొన్ని తీర్చుకోవచ్చునని తెలిపారు.  అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ లను అందజేశారు. 
ఫోర్టి ఫైడ్  బియ్యం అంటే బలవర్ధక బియ్యం :  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ 
ఫోర్టిఫైడ్  బియ్యం అంటే సాధారణ ధాన్యం లో పోషకాలను కలిపి మిల్లు ఆడిస్తామని,  అవి బలవర్ధకంగా తయారవుతాయని   సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. సర్పంచ్ ల శిక్షణ ముగింపు లో కలెక్టర్ తో  పాటు పాల్గొన్న జే.సి. ఫోర్టి ఫైడ్ బియ్యం పై సర్పంచ్ లకు అవగాహన కల్పించారు. ఫోర్టి ఫైడ్ బియ్యం పై ముద్రించిన కర పత్రాలను,  గోడ పత్రికలను,  ప్ల కార్డులను సర్పంచ్ లకు అందజేశారు.  గ్రామాల్లో ఈ బియ్యం పై అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు వినియోగించేలా చూడాలన్నారు.  ఈ బియ్యం లో సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయని, రక్త హీనత నివారణ లో, నాడీ వ్యవస్థ అభివ్రుది, గర్భస్థ శిశువు  వికాసం జరుగుఉందని, చిన్న పిల్లలు, గర్భిణీలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.  సర్పంచ్ లు  ఈ విషయాలన్నిటిని ప్రజలకు అర్ధమయ్యేలా హేప్పలన్నారు.  ఈ సమావేశం  డి.పి.ఓ  సుభాషిని, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-04 11:00:21

ప్రతీవారం పురోగతి తప్పక పెరగాలి..

 భవన నిర్మాణాలను వేగంగా  నిర్దేశించిన  సమయానికి  పూర్తి చేసి  ప్రతీ వారం పురోగతి  సాధించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున  స్పష్టమైన  ఆదే్శాలు జారీ చేసారు.  అభివృద్ది పనుల్లో  ప్రతీ వారం ప్రోగ్రస్ చూపించాలని  గణాంకాలు చూపిసై  క్రాస్ చెక్ చేయిస్తానన్నారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయం  సమావేశమందిరం నుండి , ఉపాధి హామి పనులు, మనబడి, నాడు నేడు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ,వై ఎస్ ఆర్  హైల్త్ క్లీనిక్ లు, అంగన్వాడీ కేంద్రాలు, జగనన్న పచ్చతోరణం, పశుగ్రాస పెంపకం, స్పందన ఫిర్యాదుల పరిష్కారం, జనగన్న పాలవెల్లువ పై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో   వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  ఉపాధి హామిలో  చేపట్టి పూర్తి చేసిన పనుల స్దాయిలకు  ఎక్సపెండిచర్ బుక్ చేయాలని  ఆదేశించారు.   మంజూరు చేసిన ప్రతి పని ప్రారంభించాలని చెప్పారు.  మనబడి నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు సకాలంలో   పూర్తి చేయడానికి   ప్రత్యేక దృష్టి సారించాలని  సంబంధిత అధికారులను  ఆదేశించారు.  
 వై ఎస్ ఆర్ డిజిటల్ లైబ్రెరీలు నిర్మాణానికి  అవసరమైన స్థలాలను  గుర్తించాలని  తాహశీల్థారులకు సూచించారు. ఉపాధి హామి పధకంలో      రూ. 2 కోట్ల 34 లక్షలు లేబర్ బడ్జెట్  లక్ష్యంగా  నిర్దేశించామని, జూలై నాటికి  రూ. 1కోటి 64 లక్షలు పూర్తి చేసారని అన్నారు. ఈ నెలాఖరు నాటికి  మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని  ఆదేశించారు.  పశుగ్రాస పెంపకంపై  పశుసంవర్ధక శాఖ అధికారులను  అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసం  పెంపకంపై డ్వామా, పశుసంవర్ధక శాఖ అధికారులు  రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  వై ఎస్ ఆర్ జలకళ ప్రోగ్రాంలో  344 బోర్ వెల్స్ వేశామని  డ్వమా పి.డి. వివరించారు.  అర్భన్ ప్రాంతాలలో  జరుగుతున్న మనబడి నాడు – నేడు , అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలపై ఆరాతీసారు. 
ఈ నెల 18వ తేది నుంచి పాలసేకరణ
జగనన్న పాల వెల్లువ – ఆంధ్రప్రదేశ్  అమూల్ ప్రాజెక్టులో  ఈ నెల 18వ తేదీ నుంచి పాలసేకరణ ప్రారంభిస్తామన్నారు.  మహిళా సంఘాలతో  డైరీ ఏర్పాటు చేస్తామన్నారు.  మొదటి దశలో  123 గ్రామాల్లో  పాలు సేకరిస్తారని  పేర్కొన్నారు. 
ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్ ఇ సుధాకర్ రెడ్డి, డ్వామా పి.డి.  ఇ. సందీప్, డి ఇ ఓ  లింగేశ్వరరెడ్డి, పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డా.ఎన్. కరుణాకరరావు, పంచాయితీ రాజ్  పి .ఐ .యు. ఈ ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-04 10:10:37

Simhachalam

2021-08-04 07:19:29

7న జిల్లా స‌మీక్ష స‌మావేశం..

విజ‌య‌న‌గ‌రం  జిల్లా స‌మీక్ష మండ‌లి(డి.ఆర్‌.సి.) స‌మావేశం ఈనెల 7వ తేదీన జ‌ర‌గ‌నుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో ఆరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని జిల్లా కలెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ. సూర్య‌కుమారి తెలిపారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్య‌మంత్రి శ్రీ‌మ‌తి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లాకు చెందిన శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు, పార్ల‌మెంటు స‌భ్యులు ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు. ఖ‌రీఫ్ సీజ‌నుకు సంబంధించి పంట‌ల సాగుకు ఏర్పాట్లు, జ‌ల‌వ‌న‌రుల శాఖ ప‌నులు, కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌లు, ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్స్ ప‌నులు, గృహ‌నిర్మాణంలో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షిస్తారు.

విజయనగరం

2021-08-03 17:14:17

విభిన్నంగా జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు..

విజయనగరం జిల్లాలో ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను విభిన్నంగా నిర్వ‌హించాల‌ని, అందుకు ప‌క‌డ్భందీగా ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జాయింట్ క‌లెక్ట‌ర్(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ, ఇప్ప‌టి వ‌ర‌కూ స్వాంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించిన విధానాన్ని, వివిధ శాఖ‌లు ప్ర‌తీఏటా చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు.  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, సంప్ర‌దాయ‌భ‌ద్దంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈ ఏడాది కూడా కోవిడ్ కార‌ణంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను వేడుక‌ల‌కు అనుతించ‌బోమ‌ని, స్క్రీన్స్ ఏర్పాటు చేసి లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్ర‌సారం చేస్తామ‌ని చెప్పారు. స్టాల్స్‌, శ‌క‌టాల‌ను ఈ ఏడాది ర‌ద్దు చేస్తూ, వాటికి బ‌దులుగా, న‌వ‌ర‌త్నాలు, వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప్రాధాన్య‌త‌ల‌ను  వివ‌రిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కూడిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను, ప‌రిమిత సంఖ్య‌లో ఏర్పాటు చేయాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల వారీగా చేయాల్సిన ప‌నుల‌ను సూచించి, ఈ నెల 12వ తేదీలోగా ఏర్పాట్ల‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ స‌మావేశంలో జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఎఫ్ఓ స‌చిన్ గుప్తా, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-08-03 16:39:53

సచివాలయాల్లోనే సేవలన్నీ అందాలి..

గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి నమ్మకంతో సృష్టించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కలెక్టర్ సి.హరికిరణ్ మంగళవారం  క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు.ఈ నేపథ్యంలో కాకినాడ గ్రామీణ మండలం నేమాం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా  సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ,సర్పంచ్ ల భాగస్వామ్యం,సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. కోవిడ్ రెండవ దశ తగ్గుముఖం పట్టినందున  తిరిగి సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సచివాలయ సిబ్బందికి సంబంధించి డిప్యుటేషన్ లు రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని , సిబ్బంది  అత్యవసర పరిస్థితుల్లో మినహా తమకు కేటాయించిన సచివాలయంలోనే విధులు నిర్వహించాలన్నారు. నేమాం గ్రామానికి సంబంధించి సిబ్బంది గడువులోనే  సేవలందిస్తున్నారని, త్వరలోనే నూతన భవన సముదాయాలు అందుబాటులోకి రానున్నాయాన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరుకు సంబంధించి సచివాలయంలో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, జాబితాలోని  వివరాలను, సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు , నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు నిర్మాణం‌ , గ్రౌండింగ్  పరిస్థితి, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు మంజూరు,మత్స్యకార భరోసా తదితర అంశాలపై సిబ్బందిని కలెక్టర్ ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకుని,క్షుణ్ణంగా రిజిస్టర్ లను తనిఖీ చేశారు .
         అనంతరం నేమాం గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ,బల్క్ మిల్క్  సెంటర్ భవనాలను కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, భవనాల నిర్మాణ పనుల పురోగతిని ఆయా విభాగాల ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి నేమాం  లేఅవుట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా లేఅవుట్ లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న గృహ సముదాయలను పరిశీలించి , ఇళ్ల  నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయాలను కలెక్టర్ నేరుగా లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు.  ఈ పర్యటనలో కలెక్టర్ వెంట  కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పీ.నారాయణ మూర్తి, హౌసింగ్ డీఈ గుప్త , పంచాయతీ రాజ్ డీఈ కె.శ్రీనివాసు,నేమాం సర్పంచ్ చిన్న ,ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

2021-08-03 15:55:51

త్వ‌రిత‌గ‌తిన ఈ-క్రాప్ న‌మోదు చేయాలి..

ఈ-క్రాప్ బుకింగ్‌కు సంబంధించి రైతుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఫిజిక‌ల్ ర‌శీదు అందించాల‌ని, ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయాధికారులతో మాట్లాడారు. సచివాలయాల వారీగా ఈ-క్రాప్ నమోదు శతశాతం జరగాలన్నారు. రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ, భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌కు సంబంధించి రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను రెండోద‌శ‌లో మండ‌లానికి ఓ గ్రామంలో చేప‌ట్ట‌నున్నందున స‌న్న‌ద్ధత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. సీసీఆర్‌సీ కార్డుల జారీకి సంబంధించి పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్నారు. అమ‌లాపురం, రామ‌చంద్రాపురం డివిజ‌న్ల‌లో ఇళ్ల స్థ‌లాల లేఅవుట్ల లెవెలింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. క్షేత్ర‌స్థాయిలో కోవిడ్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కిట్లు అంద‌జేయాల‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. 104 కాల్‌సెంట‌ర్‌కు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆగ‌స్టు 10న నేత‌న్న హ‌స్తం కార్య‌క్ర‌మం ఉన్నందున ఇందుకు సంబంధించి ల‌బ్ధిదారుల బ‌యోమెట్రిక్ అథింటికేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి సూచించారు. ఆగ‌స్టు 10న 17 వేల  ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ ప్రారంభ‌మై, 25 నాటికి బేస్‌మెంట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా చూడాల్సి ఉంద‌ని జేసీ(హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ పేర్కొన్నారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, జేడీ(ఏ) ఎన్.విజ‌య్‌కుమార్, పీడీ హౌసింగ్ వీరేశ్వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-03 15:15:03

థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే..

కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని.. మ‌న జిల్లాలోనూ కొన్ని మండ‌లాల్లో పాజిటివిటీ పెరుగుతున్నందున అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాలని.. మండ‌ల‌, డివిజ‌న్ స్థాయిలో వారానికి క‌నీసం రెండుసార్లు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీల స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ, జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి మండ‌ల‌, డివిజ‌న‌ల్ అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు; రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఇందుకు ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో ముందుకెళ్లాల‌న్నారు. ప్రతి ఒక్క‌రూ కోవిడ్ నిబంధ‌న‌లను క‌చ్చితంగా పాటించేలా చూడాల‌ని, ఉల్లంఘించిన వారిపై నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, పోలీసు శాఖ స‌హ‌కారంతో జ‌రిమానా విధింపులు జ‌రిగేలా చూడాల‌న్నారు. 50, ఆపై ప‌డ‌క‌లున్న కోవిడ్ ఆసుప‌త్రుల‌కు అనుబంధంగా ట్రాన్సిట్ ఆసుప‌త్రుల ఏర్పాటుపై దృష్టిసారించాల‌ని సూచించారు. ఆగ‌స్టు 10 త‌ర్వాత ముహూర్తాలు ఉన్నందున వివాహాల‌కు త‌హ‌సీల్దారు అనుమ‌తులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని, 150 కంటే ఎక్కువ మంది వివాహ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాకుండా చూడాల‌న్నారు.  
జిల్లాలో స‌మ‌ర్థ‌వంత‌మైన అధికార బృందం ఉంద‌ని.. ప్రభుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల అమ‌లు పురోగ‌తిలో ఇది ప్ర‌స్ఫుటం కావాల‌న్నారు. ప్ర‌జా ఫిర్యాదుల వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌న్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా నాణ్య‌మైన సేవ‌లు అందించాల‌ని.. బియ్యంకార్డు, పెన్ష‌న్‌కార్డు, ఆరోగ్య‌శ్రీకార్డు, 90 రోజుల్లో ఇంటి ప‌ట్టాకు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత ఎస్ఎల్ఏ గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యాల సిబ్బందికి బ‌యోమెట్రిక్ హాజ‌రు త‌ప్ప‌నిస‌ర‌ని, ఈ అంశంపై క్షేత్ర‌స్థాయి అధికారులు దృష్టిసారించాల‌న్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; ఆర్‌బీకేలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తిచేయాల‌ని ఆదేశించారు. 
స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, జేడీ(ఏ) ఎన్.విజ‌య్‌కుమార్, పీడీ హౌసింగ్ వీరేశ్వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-03 15:14:01