1 ENS Live Breaking News

యాంత్రీకరణ దిశగా అడుగు వేయాలి..

యాంత్రీకరణ దిశగా రైతులు అడుగు వేయాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.  శ్రీకాకుళం రూరల్ మండలం లంకం గ్రామంలో అగ్రికల్చర్ పరిశోధన కేంద్ర ( రాగోలు ) సౌజన్యంతో మంగళవారం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు వరి నాటు వేసే యంత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరినాటు వేసే యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులు వరి నాటు వేసే యంత్రం ద్వారా నాటు వేస్తే తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో నాటు వేయవచ్చన్నారు. కూలీలు సైతం తక్కువగా ఉపయోగపడతారని, పని ముట్లను ఉపయోగిస్తే ఖర్చు ఆదా అవుతుందన్నారు. అగ్రికల్చర్ పరిశోధన కేంద్ర ( రాగోలు ) వారి సౌజన్యంతో విత్తనాలు వేసి - కోత వరుకు బాధ్యత తీసుకునే కార్యక్రమం, యంత్రం ద్వారా నాటు వేయటం వల్ల కలిగే లాభాలను రైతులకు శాస్త్రవేత్త డా.పి.వి.వి. సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పద్మావతీ,  ఆచార్య ఎన్.జి రంగ బోర్డ్ సభ్యులు డా. నేతాజీ, ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ బాబు, సర్పంచ్ ప్రతినిధి చిట్టి రవికుమార్, మాజీ జెడ్పిటిసి సభ్యులు చిట్టి జనార్ధన, సర్పంచ్ గెదల చంగల్ రావు, అల్లు లక్ష్మీనారాయణ, గోండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లంకం

2021-08-03 14:17:32

7న కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటన..

కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ నెల 7వ తేదీన రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటనపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళ వారం సంబంధిత అధికారులు, బ్యాంకులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆయన ఆదేశించారు. పొందూరు ఖాదీతో పాటు చేనేతకారుల అంశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ పథకాల క్రింద రుణాలు పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు. పొందూరు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగతుందన్నారు. అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. బ్యాంకులు సైతం తమ కార్యలాపాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. యు బి శత శాతం బ్యాంకు డిజిటలైజేషన్ ప్రక్రియను మంత్రి ప్రారంభించు అవకాశం ఉందని ఆయన తెలిపారు. లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బాలివాడ దయానిధి, ఆర్డీఓ ఐ.కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం బి. గోపాల కృష్ణ, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, యుబిఐ జోనల్ మేనేజర్ కే.ఎస్. డి.శివ వర ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్, నాబార్డు డిడిఎం మిలింద్ చౌసాల్కర్,ఎస్బిఐ ఆర్ఎం తపోధన్ దేహారి, డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, డిఆర్డిఎ పిడి బి. శాంతి శ్రీ, డా. పద్మ,  స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పడాల భూదేవి, ఎం. ప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-03 14:16:19

ప్రమాణాలు పెంచేందుకే నూతన విద్యావిధానం..

 విద్యాప్ర‌మాణాలు పెంచేందుకే నూత‌న విద్యావిధానాన్ని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతోంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో, జాతీయ విద్యావిధానం-2020 పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం అవ‌గాహ‌నా స‌ద‌స్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యావ్య‌వ‌స్థ‌పై సుదీర్ఘ అధ్య‌య‌నం త‌రువాతే ప్ర‌భుత్వం కొన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతోంద‌ని అన్నారు. పిల్ల‌ల వ‌య‌సు, వారి అభ్య‌స‌న సామ‌ర్థ్యం, తోటిపిల్ల‌ల‌తో మెలిగే తీరు త‌దిర ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని కొత్త విధానాన్ని ఖ‌రారు చేశార‌ని అన్నారు. ఈ విధానాన్ని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని కేంద్రం ఆదేశించ‌లేద‌ని, కేవ‌లం సూచ‌న మాత్ర‌మే చేసింద‌ని చెప్పారు. కేంద్రం సూచించిన నూత‌న విద్యావిధానాన్ని బాగా అధ్య‌య‌నం చేసి, కొన్ని మార్పుల‌తో రాష్ట్రం కొత్త విద్యావిధానాన్ని ఖ‌రారు చేసింద‌న్నారు. కేవ‌లం విద్య మాత్ర‌మే కాకుండా, సంస్కృతి, క‌ళ‌లు, క్రీడలు త‌దిత‌ర అన్ని అంశాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని నూత‌న విద్యావిధానాన్ని రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ కొత్త విధానంలో ఏ ఒక్క‌రినీ తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లా భౌగోలిక ప‌రిస్థితులూ, అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని, మార్పులు చేర్పులు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల విలువైన సల‌హాలు, సూచ‌న‌లూ అంద‌జేయాల‌ని జెసి కోరారు. ఈ స‌దస్సులో జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి, ఉప విద్యాశాఖాధికారి బ్ర‌హ్మాజీ, ఇత‌ర అధికారులు, వివిధ పాఠ‌శాల‌ల హెడ్‌మాష్ట‌ర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-03 07:40:37

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చూడాలి..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దృష్టి సారించాలని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన  శానిటరీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె 3వ జోన్ 24వ వార్డు పరిధిలో తులసి పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీహనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, కాలువలలో స్ప్రేయింగు చేయించాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ప్రతి శుక్రవారం “డ్రైడే” పాటించేలా చూడాలని, డెంగ్యూ, మలేరియ కేసులు నమోదు అవకుండా చూడాల్సిన బాధ్యతా మలేరియా  సిబ్బందిపై ఉందని కమిషనర్ తెలిపారు. పారిశుధ్య సిబ్బందిచే 8గంటలు పని చేయించాలని రోడ్లు, కాలువలు శుభ్రపరచాలని ప్రతీ ఇంటి నుండి తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తను సేకరించాలని కమర్షియల్ ఏరియాలలో కూడా చెత్త సేకరణ జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, ఎ పనికి నిర్దేశించిన పారిశుధ్య కార్మీకులను ఆ పనికే ఉపయోగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆదేశించారు. వార్డులో త్రాగు నీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్య కారీకుల పనితీరుపై స్థానిక ప్రజలను అడిగి తెలుసికున్నారు. ఈ పర్యటనలో 3వ జోనల్ కమిషనర్ కె.శివ ప్రసాద్, కార్యనిర్వాహక ఇంజనీర్ చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ జనార్ధన, శానిటరీ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-08-02 16:52:54

అభివృద్ధి ప‌నుల‌ను తనిఖీచేసిన‌ సివిఎస్వో..

తిరుమలలో వివిధ ప్రాంతాల్లో, అలిపిరి న‌డ‌క మార్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను సోమ‌వారం టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి ఇంజనీరింగ్, అట‌వీ, విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా సివిఎస్వో జిఎన్‌సి సమీపంలోని పాత వ్యూ పాయింట్‌ను సందర్శించి, అక్క‌డ అవ‌స‌ర‌మైన అభివృద్ధి, పచ్చదనం పెంపొందించేందుకు చెప‌ట్ట‌వ‌ల‌సిన ప‌నుల‌ను ఇంజనీరింగ్, అటవీ అధికారులకు సూచించారు. తరువాత జిఎన్‌సి సమీపంలోని ప‌న‌స వనం, ఔటర్ రింగ్ రోడ్‌లోని అభివృద్ధి పనులను ప‌రిశీలించారు.  సివిఎస్వో తనిఖీలో భాగంగా అలిపిరి న‌డ‌క‌మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆల‌యం ప్రక్కన ఆధునీక‌రించిన గూర్ఖా సెక్యూరిటీ పోస్ట్‌ని సందర్శించారు. ఇదివ‌ర‌కు ఆయ‌న తనిఖీ సమయంలో ఘాట్ రోడ్ విధుల్లో ఉన్న ఘూర్ఖాస్‌కి ఉండే ఈ సెక్యూరిటీ పోస్ట్ సౌక‌ర్య‌వంతంగా లేదని గమనించి ఆధునీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్ని వ‌స‌తుల‌తో ఆధునీక‌రించిన ఘూర్ఖా పోస్ట్‌ను ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా నేపాల్, డార్జిలింగ్ మొదలైన ప్రాంతాలకు చెందిన ఘూర్ఖాస్ రాత్రి, ప‌గలు విశేషంగా సేవలు అందిస్తున్నార‌ని ప్రశంసించారు. త‌రువాత వారితో కలిసి సివిఎస్వో  భోజనం చేశారు.  తనిఖీలో ఎస్ఇ- 2 జగదీశ్వర్ రెడ్డి, డిఎఫ్‌వో  చంద్రశేఖర్, ఈఈ 1  జగన్మోహన్ రెడ్డి, విజివో  బాలి రెడ్డి, ఎవిఎస్వోలు  గంగరాజు,  పవన్ కుమార్, శైలేంద్ర ఉన్నారు.


Tirumala

2021-08-02 16:47:19

శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టిటిడి సారె..

తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టిటిడి అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం సమర్పించారు. టిటిడి ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్‌  జయశంకర్‌, దేవాదాయ శాఖ‌ జాయింట్ కమిషనర్  ప‌రంజ్యోతి ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. కాగా భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన  శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రశస్త్యం. టిటిడి 2006 నుండి ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తుంది.   తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ''ఆరుపడైవీడు'' లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.  ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.

Tirupati

2021-08-02 16:40:29

ఆత్మీయ సమావేశం..జిల్లా అభివ్రుద్ధికి నిర్ధేశం..

విజయనగరం జిల్లా కలెక్టరమ్మ ఏ.సూర్యకుమారి ఏ కార్యక్రమం చేపట్టినా చాలా వినూత్నంగా వుంటుంది.. ఇటీవలే విధుల్లోకి చేరిన కలెక్టర్ జిల్లా అధికారులందరినీ ఒకేసారి పరిచియం చేసుకోవడంతోపాటు, వారి శాఖలు తెలుసుకునేందుకు అధికారులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం సోమవారం రాత్రి ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్లుగా వున్నవారు ముఖ్యమైన రోజుల్లోనే మాత్రమే నిర్వహిస్తుంటారు. కానీ మనం పనిచేయడం ప్రారంభించిన రోజే చాలా ముఖ్యమైన రోజుగా భావించే కలెక్టరమ్మ అధికారులందరితో ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో జిల్లా అధికారులంతా ఒక్కసారి కలెక్టర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని తమను తాము పరిచియం చేసుకుంటూ జిల్లా అభివ్రుద్ధిలో మీవెంటనే మేమంటూ పదం కలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్క జిల్లా అధికారిణీ కలెక్టర్ స్వయంగా పలుకరించారు. జిల్లాని రాష్ట్రంలో ప్రగతి పధంలో నిలబెట్టడానికి అధికారులంతా సమిష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో
జిల్లా ఎస్పీ దీపిక పాటిల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, జాయింట్ కలెక్టర్ లు డా జి.సి. కిషోర్ కుమార్, డా మహేష్ కుమార్, మయూర్ అశోక్,  జె. వెంకట రావు, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావ్నా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇందులో పాల్గొన్నారు. మహారాజా సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

Vizianagaram

2021-08-02 16:28:41

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది..

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని, రైతు శ్రేయస్సు కోరి నియోజకవర్గ, మండల స్థాయిల్లో రైతు భరోసా కేంద్రాలు వ్యవస్థ తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి అన్నారు. జిల్లాలో 627 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని. ఇప్పటికే 80 పూర్తయి రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు మరిన్ని పెంచుతామని అన్నారు. ఈ-క్రాప్ విధానంలో రైతులందరినీ నమోదు చేసి.. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇనాం భూముల్లో రైతు భరోసా కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఉంటేనే బోరు వేసుకునే సౌలభ్యం ఉందని. ఎకరం ఉన్న రైతులకు కూడా ఆ సౌకర్యం కల్పించే విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. జిల్లాలోని సబ్బవరంలో ఏర్పాటు చేసిన సీడ్ ప్రాసెస్సింగ్ ప్లాంట్ మంజూరైందని. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. సాయిల్ టెస్టింగ్ లాబ్స్ విశాఖ, అనకాపల్లిలో ఉన్నాయని, నర్సీపట్నంలో ఏర్పాటు చేయాలని సూచించామని అన్నారు. వ్యవసాయ సంబంధిత సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 756 కోట్లు రైతు భరోసాగా ఇచ్చిందని అన్నారు.
ఇకపై ప్రతినెలా 3వ శుక్రవారం వ్యవసాయ అడ్వైజరీ సమావేసం నిర్వహిస్తామని అన్నారు. ఈ తరహా సమావేశాలు అడ్వైజరీ బోర్డు చైర్ పర్సన్, సభ్యుల సమక్షంలో నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రతినెలా జరిగేలా చూస్తామన్నారు. జైజవాన్, జైకిసాన్, రైతును రాజు చేస్తామని గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని.. సీఎం జగన్ మాత్రం వాటిని ఆచరణలో పెట్టారని అన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండడుగులు వేస్తే, జగన్ నాలుగడుగులు వేస్తున్నారని అన్నారు. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని వైఎస్ అంటే. ఎద్దేవా చేసారని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని ఈసందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
అంతకు ముందు అగ్రికల్టర్ ఎడ్వయిజరి బోర్డు సమావేశం నిర్వహించ బడింది.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మరియు సంబంధిత అధికారులు మంచి దిగుబడుల కు,  ఆదాయానికి గాను  రైతులకు  సలహాలు సూచనలు ఇన్యాలని, మేలైన విత్తనాలు,, ఎరువుల ను అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రోగ్ర సి వ్ రైతులు  పలు సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు. జిల్లా కలక్టరు డా. ఎ. మల్లి ఖార్జున మాట్లాడుతూ , అధికారులు రైతుల తెలిపిన అంశాల పై తన తో చర్చించాలన్నారు. కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తుఫానులో తమలపాకుల రైతులు నష్టపోతున్నారని ఈ పంటను రైతు భరోసా పరిధిలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో  విప్ బూడి ముత్యాల నాయుడు- పాయకరావుపేట శాసనసభ్యులు గొల్లబాబురావు, పాడేరు శాసనసభ్యులు కె.భాగ్యలక్ష్మీ, ఎలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు, గాజువాక శాసనసభ్యులు తిప్పలనాగిరెడ్డి, అరకు శాసనసభ్యులు శెట్టి ఫాల్గున, విశాఖ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ వెస్ట్ శాసనసభ్యులు పి.వి.జి.నాయుడు, డిసిఎమ్ ఎస్ ఛైర్మన్, వుడా ఛైర్మన్ అక్కరమాని విజయనిర్మల, జాయింట్ కలెక్టర్ యం .వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర అగ్రికల్చర్ లీలావతి, సెరి కల్చర్, హార్టి కల్చర్, ఎనిమల్ హస్బెండరీ, సివిల్ సప్లయిస్, ఎపిఇపిడిసిఎల్, ఎడి మార్కెటింగ్, తదితర అధికారులు,  ప్రోగ్రసివ్ రైతులు సరస్వతి, గంగు నాయుడు, ఆనంద్, రమణ, పాండు, సూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-02 15:53:30

బదిరులకు ల్యాప్ టాప్, మొబైల్స్ పంపిణీ..

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దువుతున్న బ‌ధిర (మూగ, చెవిటి) విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ చదువుతున్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్ల‌ను సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, జాయింట్ కలెక్టర్ (ఆసరా,సంక్షేమం) జి.రాజకుమారి సమక్షంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప‌ది మంది విద్యార్థుల‌కు అందజేశారు.
- కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇంద్రపాలెం వాసి సూరంపూడి మాధవ స్థానిక ఐడియ‌ల్ కళాశాలలో24 సంవత్సరాలు నుంచి అటెండర్‌గా పనిచేస్తున్నాన‌ని, 2020లో కోవిడ్ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందని ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు అర్జీని అందించ‌గా.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ఐవోను పరిష్కరించాలని ఆదేశించారు.
- పెదపూడి మండలం, గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ఆర్‌వీఎం ఆచార్యులు తనకు 2013లో చొల్లంగి వద్ద రాజీవ్ స్వగృహలో గృహం మంజూరైంద‌ని, అక్కడ సరైన తాగునీరు, రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తాగునీరు స‌ర‌ఫ‌రా, రోడ్లు వేయాలని కలెక్టర్‌కు విజ్ఞ‌ప్తి చేయ‌గా స‌మ‌స్య‌ను పరిష్కారించాల్సిందిగా రాజీవ్ స్వగృహ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
- మండపేట మండలం, కేశవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి జాన్ ప్రసాదు తమ నివాసాలకు దగ్గరలో డ్రైనేజీ నిమిత్తం కేటాయించిన స్థలంలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయాలంటూ కలెక్టర్‌కు విజ్ఞ‌ప్తి చేయ‌గా పరిష్కరించాల్సిందిగా మండపేట ఎంపీడీవోను ఆదేశించారు.

Kakinada

2021-08-02 15:51:16

అప్పన్నకు ఎస్టీ కమిషన్ చైర్మన్ పూజలు..

ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బాధతలు స్వీకరించాక  కుంభా రవిబాబు తొలిసారి శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని సతీ సమీతంగా దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్థంబాన్ని ఆలింగన చేసుకున్నారు. పదవి వస్తే స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని రవిబాబు మీడియాతో తెలిపారు. అంతకుముందు ఆలయం పక్కనున్న  రాజగోపురం, కాశీవిశ్వేశ్వర స్వామివారిని కూడా ఆయన  దర్శించుకున్నారు.

Simhachalam

2021-08-02 15:05:37

పోర్టిపైడ్ బియ్యంతో సూక్ష్మపోషకాలు..

ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమ్ బి12 పుష్కలముగా లభించే పోర్టిపైడ్ బియ్యంతో చిన్నారులకు పరిపూర్ణ అరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బియ్యం వాడడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్త హీనతను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.  సోమవారం కలెక్టరేట్ లో పోర్టిపైడ్ బియ్యంపై ప్రజలకు అవగాహన కలిగేందుకు కరపత్రాలను పంపిణీ చేసి బియ్యాన్ని గ్రీవెన్సు వద్ద ప్రదర్శించారు. ఈ పోర్టిపైడ్ బియ్యంతో మెదడు, నాడిమండలం పనిచేయుటలో, ఎర్రరక్త కణాలు ఉత్పత్తి సక్రమంగా జరుగుతుందన్నారు.  గర్బిణీలు తినడం వల్ల గర్బిస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు.  ఇవి సాధారణ బియ్యమేనని, వీటికి పోషకాలు జత చేయడం జరిగిందని, అపోహలు వీడి అందరు వినియోగించాలని కోరారు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, గ్రామవాలంటీర్ల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

 

Vizianagaram

2021-08-02 14:37:21

థర్డ్ వేవ్ ఎదర్కోవడానికి సిద్ధంగా ఉండాలి..

కోవిడ్‌ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్దంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు. మూడోద‌శ రాకూడ‌నే కోరుకుంటున్నామ‌ని, ఒక‌వేళ వ‌స్తే, దానిని ఎదుర్కొనేందుకు గాను, ఆసుప‌త్రుల్లో అన్ని మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ మూడోద‌శ సన్న‌ద్ద‌త‌పై వైద్యారోగ్య‌శాఖ అధికారులు, వైద్యులు, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల ప్ర‌తినిధులు, ఆసుప‌త్రుల ఇన్‌ఛార్జి అధికారుల‌తో,  మూడోవిడ‌త‌ స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం జ‌రిగింది. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, అన్ని కోవిడ్‌ ఆసుపత్రుల్లోని ప‌డ‌క‌ల‌కూ ఆక్సీజ‌న్ స‌దుపాయాన్ని క‌ల్పించాల‌ని ఆదేశించారు. ప‌డ‌క‌ల సంఖ్య‌లో క‌నీసం 70శాతం ఆక్సీజ‌న్ కాన్‌సెంటేట‌ర్ల‌ను స‌మ‌కూర్చి సిద్దంగా ఉంచాల‌ని సూచించారు. కొన్ని ఆసుప‌త్రుల‌కు ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను, ట్యాంక‌ర్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని, వెంటిలేట‌ర్ ప‌డ‌క‌ల‌ను సిద్దం చేయాల‌ని చెప్పారు.  జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంట‌క‌ట‌రావు మాట్లాడుతూ, ఆసుప‌త్రుల‌వారీగా స‌న్న‌ద్ద‌త‌పై స‌మీక్షించారు. ప‌డ‌క‌ల సంఖ్య‌, ఆక్సీజ‌న్ బెడ్లు, వెంటిలేట‌ర్లు, ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు, కాన్‌సెంటేట‌ర్లు, ఆక్సీజ‌న్ ప్లాంట్ల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై, ఆయా ఆసుప‌త్రుల ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. కోవిడ్ ఆసుప‌త్రులకు ప్ర‌భుత్వం నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను అన్నిటినీ పూర్తి చేసి, ఆసుప్ర‌తుల‌ను ఆగ‌స్టు 15లోగా అన్నివిధాలా సిద్దం చేయాల‌ని ఆదేశించారు.  

             క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే కోవిడ్ మూడోద‌శ మొద‌లైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌న్నారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా, జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రుల‌ను సంసిద్దం చేయాల‌ని సూచించారు. ఏ వ్య‌క్తి కూడా కోవిడ్ చిక‌త్స కోసం బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి రాకూడ‌ద‌ని, అన్ని వ‌న‌రుల‌ను సిద్దం చేయాల‌ని చెప్పారు. మూడోద‌శ‌లో కోవిడ్ పిల్ల‌ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో, పిల్ల‌ల‌కు చికిత్స‌ను అందించేందుకు అనువైన మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ స‌మావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ఎపిఎంఐడిసి ఇఇ స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, వివిధ ఆసుప‌త్రుల నాన్‌మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ఆసుప‌త్రుల ప్ర‌తినిధులు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-02 13:45:14

స్పందన దరఖాస్తులకు సత్వర పరిష్కారం..

స్పందన దరఖాస్తులపై అధికారులు సత్వరమే స్పందించాలని పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌తీ సోమ‌వారం నిర్వహించిన స్పంద‌న కార్య‌క్ర‌మానికి మొత్తం 282 విన‌తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు దరఖాస్తు చేసుకున్న సమస్యలపై పరిష్కారం ఎన్ని రోజుల్లో చేస్తామో తెలియజేయాలన్నారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహిచడం వలన జిల్లా కేంద్రాలకు అర్జీదారులు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకొని గ్రామ సచివాలయాల్లో స్పందన నిత్యం జరిగేలా చూడాలని గ్రామ సచివాలయ జాయంట్ కలెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్లు డా.జి.సి. కిషోర్ కుమార్,  డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, డి.ఆర్.ఓ. గణపతిరావు, డిపియం పద్మావతి,మత్స్యశాఖ అదనపు సంచాలకులు ఎన్.నిర్మల కుమారి, ఇతర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-02 13:37:12

స్పందన అర్జీలపై అధికారులు శ్రద్ధపెట్టాలి..

ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల నుంచి స్వీక‌రిస్తున్న అర్జీలను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని.. సంతృప్తిక‌ర‌, నాణ్య‌త‌తో కూడిన సేవ‌లు అందేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత స్పంద‌న కార్య‌క్ర‌మం గ‌త సోమ‌వారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మైంది. రెండో వారం కార్య‌క్ర‌మం కొత్త‌గా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన హ‌రికిర‌ణ్ నేతృత్వంలో సోమ‌వారం జ‌రిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు రావ‌డంతో క‌లెక్ట‌రేట్ కిట‌కిట‌లాడింది. క‌లెక్ట‌ర్‌తో పాటు జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, జేసీ (గృహ‌నిర్మాణం) ఎ.భార్గ‌వ్‌తేజ, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రులు అర్జీలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి సోమ‌వారం ఉద‌యం 9.30 గం. నుంచి 10 గం. వ‌ర‌కు అంత‌కుముందు వారం స్పంద‌న‌కు వ‌చ్చిన అర్జీల ప‌రిష్కారం ప్ర‌గ‌తిపై స‌మీక్షించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించ‌ని అర్జీల‌పై ఆయా శాఖ‌ల అధికారులు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. స్పంద‌న వేదిక ద్వారా వ‌చ్చే అర్జీలు, ప‌రిష్కారం అంశానికి సంబంధించి జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) నోడ‌ల్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్నారు. ప్ర‌తి సోమ‌వారం జ‌రిగే స్పంద‌న కార్య‌క్ర‌మానికి అధికారులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని వివిధ దూర ప్రాంతాల నుంచి వ‌చ్చి మ‌న‌పై ఎంతో న‌మ్మ‌కంతో అర్జీలు స‌మ‌ర్పిస్తార‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో ఆయా సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. 

గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బందికి బ‌యోమెట్రిక్ హాజ‌రు త‌ప్ప‌నిస‌ర‌ని, ఈ విష‌యంపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. డిప్యుటేష‌న్ అనేది మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉండాలే త‌ప్ప వెసులుబాటుగా ఉండ‌కూడ‌దన్నారు. డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయిలో అధికారులు స‌చివాలయాల ప‌నితీరును నిరంత‌రం ప‌రిశీలించాల‌ని, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద్వారా పూర్తిస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు ఫ‌లాలు అందేలా చూడాల‌న్నారు. త‌నిఖీల ప్ర‌క్రియ‌ను నిరంత‌రం కొన‌సాగించాల‌ని స్పష్టం చేశారు. కింది స్థాయిలో స‌రిగా త‌నిఖీలు చేప‌ట్ట‌కుంటే ఆ ప్ర‌భావం ఉన్న‌త‌స్థాయిలో ప‌డుతుంద‌న్నారు. క‌లెక్ట‌రేట్‌లో స్పంద‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా ప‌టిష్ట జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని, ఇదే విధంగా ఇత‌ర కార్యాల‌యాల్లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వైర‌స్ వ్యాప్తిచెంద‌కుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. 

Kakinada

2021-08-02 13:19:41