1 ENS Live Breaking News

సచివాలయాలు తనిఖీచేసిన కమిషనర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన గురువారం 6వ జోన్ 70వ వార్డు శ్రామిక నగర్, డ్రైవర్స్ కోలనీలో ఉన్న 1086417, 418, 420, 421 సచివాలయాలను సందర్శించి కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండాలని తెలియజేశారు. వార్డ్ మ్యాపింగ్ లో ప్రతి ఇల్లు ట్యాగింగు చెయ్యాలని,  కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో, డైరీలో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, నిర్ణీతకాలంలో ఆర్జీలను పరిష్కరించని యెడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని, అలాగే ఆగష్టు 2వ తేది నుండి 18వ తేదీ వరకు జరిగే ఆన్ లైన్ శిక్షణా తరగతులకు విధిగా హాజరు అవ్వాలని కమిషనర్ సూచించారు. 

విశాఖ సిటీ

2021-07-29 16:30:20

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు..

కార్పొరేట్ ఆసుపత్రిలకి ధీటుగా జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ ) పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ వైద్యులకు సూచించారు. ఇక్కడ మంచి అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే కార్పొరేట్ ఆసుపత్రికి తక్కువేమి కాదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ వైద్యులు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడిన ఆయన వైద్యులు చేసేది వృత్తి కాదని, సేవగా భావించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యకరంగా, సంతోషంగా వెళ్లాలని ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మరియు సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులపై ఎక్కువ శాతం మంది ఆధారపడేలా ఆసుపత్రిని అభివృద్ధిచేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన వాటిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి, వైద్య కళాశాల ఉందని ఇందుకు నీటి అవసరం ఎంతైనా ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు లేవని సభ్యులు తెలియజేయడం జరిగిందన్నారు. 

ఈ విషయమై నగరపాలక సంస్థ కమీషనర్ తో మాట్లాడటం జరిగిందని, ఇప్పటికే బోర్ వేసారని, పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే వేతనాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పారిశుద్ధ్యం కొంత లోపించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం వేరే సంస్థకు పారిశుద్ధ్య బాధ్యతలను అప్పగించడం వలన ఇకపై పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లలో వైద్యులు, సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్ధులు బాగా పనిచేసారని ఇదేస్పూర్తితో రానున్న థర్డ్ వేవ్ లో కూడా బాగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. దేశంలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయని, అందుకు తగిన విధంగా ఆసుపత్రిలో వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి మౌలిక వసతులను మరింత మెరుగుపరచుకోవలసిన అవసరం ఉందని, ఆ దిశగా వైద్యులు కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తొలుత ఆసుపత్రి ప్రగతి నివేదికను ఆసుపత్రి పర్యవేక్షకులు కలెక్టర్ కు వివరించారు.

శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ ఛైర్ పర్సన్ మరియు సలహా మండలి సభ్యులు యం.వి. పద్మావతి మాట్లాడుతూ  రిమ్స్ ప్రారంభమైన నాటి నుండి అభివృద్ధి చెందుతూ వస్తుందని అన్నారు. రిమ్స్ లో ఉండే సదుపాయాలు, వసతులు గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదని, అందువలనే కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ప్రజల్లో ఈ అపోహను తొలగించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఇక్కడి వైద్యులు మంచి సేవలు అందించారని కితాబిచ్చారు. వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావించాలని, అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించాలని వైద్యులను కోరారు. ఈ విషయమై వైద్యులు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని, తద్వారా విశాఖలోని కె.జి.హెచ్ కు ఎంత మంచి పేరు ఉందో  రిమ్స్ కు అంత మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని, ఇంత భారీస్థాయిలో నిర్మించిన ఆసుపత్రికి సరైన నీటి సదుపాయం, పారిశుద్ధ్యం లేదని ఫిర్యాదులు తమకు వచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 600 పడకల ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల ఇక్కడ ఉందని, విద్యార్ధులు, వైద్యుల క్వార్టర్స్ ఉన్నాయని, అందుకు తగిన విధంగా నీటి సదుపాయం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని నాడు – నేడు క్రింద ఆసుపత్రికి నీటి సదుపాయాన్ని కల్పిస్తే భవిష్యతులో నిరంతర నీటి సరఫరా ఉంటుందని  ఆమె కలెక్టర్ ను కోరారు.

మరో సభ్యులు వరుదు విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ 250 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, సంఘంలోని లోపాలు వలన సక్రమంగా పనిచేయడం లేదని, వాటిని సరిచేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేస్తే మరింత సార్ధకత లభిస్తుందన్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చే నిధుల్లో కొంత పారదర్శకత లోపించిందని, ఇప్పటికైనా సరిచేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ.కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, నగరపాలక సంస్థ కమీషనర్ సిహెచ్.ఓబులేసు, డి.సి.హెచ్.ఎస్ డా. బి.సూర్యారావు, ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి కార్యనిర్వాహక ఇంజినీర్ బి.ఎన్.ప్రసాద్, సలహా మండలి సభ్యులు లావేటి హేమసుందరరావు, డి.జగదీశ్వరరావు, కోరాడ లక్ష్మణమూర్తి, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-29 16:29:00

స్విమ్స్‌లో ఆరోగ్య‌శ్రీకి నూత‌న బ్లాక్..

తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ పేషంట్ల‌కు నూత‌న బ్లాక్ నిర్మించి రోగుల‌కు మ‌రింత మెరుగైన సౌర్యాలు క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని చాంబ‌ర్‌లో గురువారం స్విమ్స్‌, టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స్విమ్స్‌లో కార్పొరేట్ ఆసుప‌త్రుల త‌ర‌హాలో హెల్త్ ఇన్సూరెన్స్  కలిగిన పేషంట్ల‌కు క్యాష్‌లెస్ వైద్య సేవ‌లు అందించాల‌న్నారు.  రోగుల‌కు వేగ‌వంత‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి మ‌రింత  విస్తృతంగా ఐటి సేవ‌లు వినియోగించుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. హెచ్ఆర్ మేనేజ్మెంట్, హాస్పిటల్
మేనేజ్మెంట్ అప్లినేషన్లు రూపొందించాలని కోరారు.  ఆసుప‌త్రిలో రేడియాల‌జీ ఇమేజింగ్ సిస్ట‌మ్ (పిఏసిఎస్‌) ద్వారా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ తీసుకున్న రోగుల స్కానింగ్ రిపోర్టులు సంబంధింత డాక్ట‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో పంపేవిధంగా నూత‌న సాప్ట్‌వేర్  రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్ రూపొందించి టిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల వివ‌రాలు పొందుప‌ర్చాల‌న్నారు. రోగుల‌కు అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం పెంపొందించేందుకు ఆసుప‌త్రి అవ‌ర‌ణంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్దపీట వేస్తూ, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ఈఓ సమీక్షించారు.  స్విమ్స్ డైరెక్టర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ‌, సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రామ్‌, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, సిఏవో  ర‌విప్ర‌సాదు, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి,  స్విమ్స్ ఐటి మేనేజ‌ర్ భావ‌న ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.  

తిరుపలి

2021-07-29 16:27:30

గరుడవారధి రూ.25 కోట్లు కేటాయింపు..

గరుడవారధి పనుల ప్రగతిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పనుల కోసం రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టిటిడి రూ.50 కోట్లు విడుదల చేసినట్టయింది.  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు  పూర్తి కావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈఓకు వివరించారు. ఈ సమీక్షలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్  మోహన్, టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

Tirumala

2021-07-29 16:19:32

ఆర్బన్ పీహెచ్సీకి మేయర్ శంకుస్థాపన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 5వ జోన్ 41వ వార్డు లోని సుబ్బలక్ష్మి నగర్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, అయిదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్ పి. శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-29 15:10:29

వార్డు కార్యదర్శులకు శిక్షణాతరగతులు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్  డా. జి. సృజన గురువారం జివిఎంసి ఉన్నతాధికారులు,  జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఎం.ఎ.&యు.డి. కి సంబందించిన ఆరు రకాల సచివాలయ కార్యదర్శులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఏపిహెచ్ఆర్ డి తరుపున ఆన్లైన్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యదర్శులందరూ ఉదయం 8.45 గంటలకు మొబైల్ ఫోన్ లోనే హాజరు అవ్వాలని, మెడికల్ లీవ్ లోనూ,  మెటర్నటీ లీవ్ లో ఉన్నవారు కూడా తమ మొబైల్ ఫోన్లో నుండి క్లాసులకు హాజరు వాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఆన్లైన్ క్లాసులో పాల్గొని తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంతం 5 గంటల వరకు వారి వారి సచివాలయాలలో యధావిధిగా విధులను నిర్వహించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, నోడల్ అధికారులుగా వ్యవహరించాలని, వారి దిగువ స్థాయి సిబ్బందిని ప్రోగ్రాం ఇంచార్జ్ లుగా ఏర్పాటు చేసుకుని ఈ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.

Visakhapatnam

2021-07-29 15:05:42

విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాకూడదు..

విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా జగనన్న విద్యా దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తల్లులు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు.  గురువారం విద్యా దీవెన పై వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ త్రైమాసికానికి విద్యా దీవెన తల్లులు ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా  6140 మంది విద్యార్థులకు 2 కోట్ల 81  లక్షల 8342 రూపాయలని, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 2692 మంది విద్యార్థులకు ఒక కోటి 5 లక్షల 89 వేల 103 రూపాయలని, వెనుక బడిన సంక్షేమ శాఖ ద్వారా 55864 మంది విద్యార్థులకు 26 కోట్ల 98 లక్షల 97 వేల 441 రూపాయలని, ఇబిసి ద్వారా 1902 మంది విద్యార్థులకు ఒక కోటి 4 లక్షల 74 వేల 892 రుపాయలని, మైనారిటీ సంక్షేమ శాఖా ద్వారా 145 మంది విద్యార్థులకు 6 లక్షల 34 వేల 475 రూపాయలని, కాపు సంక్షేమ శాఖ ద్వారా 991 మంది విద్యార్థులకు 68 లక్షల 34 వేల 995 రూపాయలను, క్రిస్టియన్ మైనారిటీ 15 మంది విద్యార్థులకు 81 వేల 112 రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేసినట్లు వివరించారు. 

 పాతపట్నం నియోజక వర్గం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తల్లి, తండ్రి ఎన్నో కష్టాలు పడుతూ తమ పిల్లలను చదివిస్తున్నారని,  తల్లి తండ్రిలకు కష్టాలు లేకుండా తమ పిల్లలకు ప్రభుత్వమే ఫీజు చెల్లించే విధంగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ప్రవేశపెట్టినట్లు వివరించారు.  అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశమన్నారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు.   రాజాం నియోజక వర్గం శాసన  సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ విద్యా, వైద్యరంగాలకు ముఖ్యమంత్రి పెద్ద పీఠ వేస్తున్నారని చెప్పారు.  విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి  జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహాయం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు  వెల్లి చదువుకోవచ్చునని, అక్షరాస్యత పెరగాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-29 14:06:51

సింహాద్రి అప్పన్నకు కలెక్టరమ్మ పూజలు..

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి దంపతులు గురువారం సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ  వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి పూజలు చేశారు.  ఇటీవలే విజయనగరం కలెక్టర్ గా నియమితులైన ఆమె స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కలెక్టర్ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఆమె శుక్రవారం విజయనగం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Simhachalam

2021-07-29 14:01:12

పుష్ప గుచ్చాలొద్దు.. పుస్తకాలివ్వండి..

విజయనగరం జిల్లా కలెక్టర్ గా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, అనధికారులు, ఇతరులు ఇకపై తనకు పూల దండలు, పుష్ప గుచ్ఛాలు తేవద్దని సూచిస్తున్నారు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఏ. సూర్యకుమారి. దానికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగ పడేలా నోటు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పుష్ప గుచ్చాల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని విద్యార్థులకు ఉపయోగ పడే పనికి వినియోగించడం వల్ల ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసినట్లవుతుందని అందరూ ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ గా ఈ నెల 30న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. దీనితో నూతన కలెక్టర్ ప్రతిపాదనను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతిస్తున్నారు.

Vizianagaram

2021-07-29 13:52:40

విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి..

విద్యార్థులు ఉన్నత చదవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లుతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెండవ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల 97 వేల మంది విద్యార్థులకు 694 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. నేరుగా విద్యార్థులు తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివితేనే తలరాతలు మారుతాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇతరులకు శత శాతం ఫీజు రీ ఎంబార్స్ మెంట్ ఉంటుందని చెప్పారు. చదువులకు పిల్లలు తల్లిదండ్రులు అప్పులు అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకాలతో పిల్లలు భవిష్యత్తు మార్చడానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతీ త్రైమాసికానికి నేరుగా విద్యార్థులు తల్లులు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవ విడత జగనన్న వసతి దీవెన డిశంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, పాతపట్నం, రాజాం శాసన సభ్యులు రెడ్డి శాంతి, కంబాల జోగులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, రిటైర్డ్ సెట్ శ్రీ సిఇఓ సూరంగి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం  32,81,08,342 రూపాయల చెక్కును విద్యార్థులకు అందజేశారు.

శ్రీకాకుళం

2021-07-29 13:41:14

యాంత్రీకరణ పద్ధతులు అవలంబించాలి..

రైతులు యాంత్రీకరణ పద్దతులు అవలంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.   బుధవారం మబగాంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యాంత్రీకరణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక పద్ధతులు మన ముందుకు వచ్చాయని, వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  గతంలో పశువులుతో పని చేసేవారమని, ప్రస్తుతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.  యాంత్రీకరణ పై రైతులు అవగాహన పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి ప్రతీ విషయంపై చర్చిస్తున్నట్లు చెప్పారు.  మెరుగైన వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించుకొని రాబడులు పెంచుకోవాలని పేర్కొన్నారు. మన ప్రాంతాలకు వ్యవసాయం చేయడానికి ఇతర ప్రాంతాలు నుండి వస్తారని చెప్పారు. కౌలు రైతుల్లో మనోధైర్యం నింపినట్లు చెప్పారు. రైతులు యాంత్రీకరణ పద్ధతులు ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని అందుకొని యాంత్రీకరణ పద్దతులు అవలంభించాలని రైతులకు పిలుపునిచ్చారు.  పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాలని, రైతులు కూడా నూతన పద్ధతులు, నూతన వంగడాలను అవలంభించాలని వివరించారు.  శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం యాంత్రీకరణ పద్ధతుల్లో చేయడానికి మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కూలీలు దొరకని సమయంలో యాంత్రీకరణ పద్దతులు అవలంబించి మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల్లో యాంత్రీకరణ పై అవగాహన పెంచాలని కోరారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఖర్చు తక్కువగా ఉండి దిగుబడులు ఎక్కువగా ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని చెప్పారు. రైతులు యాంత్రీకరణ పద్ధతులను అవలంభిస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఇలాంటి సమాశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  సుగర్స్ ఎజిఎం మాట్లాడుతూ కూలీలు సమస్య వలన యాంత్రీకరణ పై దృష్టి సారించాలని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ మాట్లాడుతూ యాంత్రీకరణ నిరంతరం జరుగు ప్రక్రియన్నారు.  యాంత్రీకరణ సాగుతో పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందని వివరించారు. చీడ పీడల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెప్పారు. నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని వివరించారు. అనకాపల్లి పరిశోధన సంస్థ ఎడి భరత లక్ష్మి మాట్లాడారు.

          వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ యాంత్రీకరణ పద్దతుల పై మాట్లాడారు. రైతు వరహ నర్సింహం మాట్లాడుతూ ఎన్.ఆర్.జి.యస్. కూలీ పనులకు వెళ్లడం వలన కూలీలు దొరకడం లేదని, ఈ సమయంలో యాంత్రీకరణలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ తో ఒక రోజు కు 5 ఎకరాల భూమిని వరినాట్లు వేయవచ్చని, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.  రైతు సింహాచలం మాట్లాడుతూ లేజర్ గైడెడ్ లెవలర్స్ జిల్లాకు తీసుకురావాలని చెప్పారు. యాంత్రీకరణ తో దిగుబడి పెరుగుతుందన్నారు. రైతు మధుసూదనరావు, పంచిరెడ్డి సింహాచలం చెరకు సాగు పద్ధతులు పై వివరించారు.  అంతకు ముందు అక్కడే ఏర్పాటు చేసిన యాత్రీకరణ లు చెరకు నరకు యంత్రం, 5 రెక్కలు నాగళ్ళు, రోటా వేటర్, కలుపు తీత యంత్రం, ధాన్యం మిల్లర్లు, తుంపర్ల సేధ్యం, వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన వరి దిగుబడి, విత్తనాలు వేయు పద్దతి, ఎరువులు స్టాల్స్ ప్రదర్శనలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలుపు, ఎరువులు వాడకంపై బ్రోచర్లను ఆవిష్కరించారు.  భారత వాతావరణ పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసిన డాము యాప్  డౌన్‌లోడ్ చేసుకుంటే ముందుగా పిడుగులు పడే సమాచారం బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఉత్తర ఆంధ్ర అగ్రి మిషన్ సభ్యులు జి. రఘురామ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులు డాక్టర్ ఎస్. నేతాజి, సర్పంచ్ పి. దానమ్మ, ఆత్మ పిడి కె. కృష్ణారావు, ఎపిఎంఐపి పిడి జమదగ్ని, రాగోలు పరిశోధన సంస్థ డా. సత్యనారాయణ, చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:28:15

యాంత్రీకరణతో వరినాట్లు వేసిన మంత్రి..

యాంత్రీకరణతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వరి నాట్లు వేశారు. బుధవారం మబగాంలో ఏర్పాటు చేసిన యాంత్రీకరణ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉన్నారు. తుంపర్ల సేద్యంతో పంటకు రక్షణ, డ్రమ్ సీడర్ తో వరి విత్తనాలు వేయు పద్దతి, వరుసలో వరి నాట్లు వేయు పద్ధతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  డిసిసిబి ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, ఆత్మ పిడి కృష్ణారావు, రాగోలు వ్యవసాయ క్షేత్రం , నైరా కళాశాల శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:26:23

ప్రకృతిని మనమే పరిరక్షించు కోవాలి..

ప్రకృతిని పరిరక్షించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు అన్నారు. ప్రపంచ ప్రక్రుతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శాంతి నగర్ క్రీడా సముదాయం ఆవరణలో బుధ వారం మొక్కలు నాటారు. ఈ సందర్భగా శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రకృతినీ పరిరక్షించితే అది మనలను రక్షిస్తుందని అన్నారు. ప్రకృతిని వినాశనం చేస్తే మానవుడు వినాశనాన్ని కోరుకుంటున్నట్లు భావించాలని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ప్రకృతి వినాశనం మూలంగా జరుగుతుందనీ ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సి.ఇ.ఓ కే. సూర్య ప్రభాకర రావు, చీఫ్ కోచ్ బి. శ్రీనివాస కుమార్, కోచ్ లు శ్రీధర్, బాలమురళి, పర్యాటక అధికారి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:22:00

ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి..

శ్రీకాకుళం జిల్లాలోని శాఖాధిపతులు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి కేటాయించిన నిధులలో యస్.సి , యస్.టిలకు నిధులు తప్పక కేటాయించాలని , ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యస్.సి కాంపోనెంట్ నిధులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు తమ శాఖలకు కేటాయించిన నిధులలో ప్రభుత్వ నిర్ధేశాల మేరకు కేటాయించడం సంతోషకరమని, అయితే గతేడాదిలో ఖర్చుచేసిన వివరాలతో పాటు రానున్న కాలంలో నిధులు కేటాయించేందుకు తీసుకున్న ప్రణాళికల వివరాలు కూడా సమర్పించాలని కోరారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి యస్.సి.కాంపొనెంట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉందని, అయితే కొన్ని శాఖలు నిల్ రిపోర్టు చూపాయని, వాటిపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని,  ప్రతీ సంక్షేమ పథకం ఏదో ఒక శాఖతో ముడిపడి ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని శాఖాధిపతులు సంక్షేమ పథకాల వారీగా కేటాయించిన నిధుల వివరాలతో పాటు యస్.సిలకు, యస్.టిలకు కేటాయించిన, ఖర్చుచేసిన, ఖర్చుచేయబోతున్న నిధుల వివరాలు అందజేయాలని ఆదేశించారు. వచ్చే నెల 4వ తేది నాటికి పూర్తి వివరాలు అందజేయాలని, తదుపరి సమావేశంలో అందజేసిన నివేదికలపై చర్చించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో యస్.సిలకు కేటాయించాల్సినవి ఏమైనా ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే మంజూరుచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  

            ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్,  జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ.రత్నం, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోధలక్ష్మీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:19:21

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి..

ఆరోగ్యకరమైన సమాజం కోసం, స్థిరమైన వాతావారణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్  జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం, వాతావరణానికి మొక్కలు పునాది వంటిదని అన్నారు. మానవజాతి దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం భూమి, దాని నుండి లభించే వనరులను ప్రకృతి వనరులుగా పిలుస్తామని, అటువంటి వనరులను భావితరాల కోసం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ప్రకృతి తీరుస్తుందని, అటువంటి ప్రకృతిని మన అశ్రద్ధ కారణంగా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, తద్వారా స్వచ్చమైన గాలి, నీరు, వర్షం, వాతావరణం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అలాగే రెడ్ క్రాస్ సంస్థ లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పండగ రోజు, ఇతర పర్వదినాలను పురష్కరించుకొని ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు.

        ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహన రావు, కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు,  సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.యస్.ప్రభాకరరావు, తహశీల్ధారు వెంకటరావు, రెడ్ క్రాస్ యం.సి మెంబర్స్ పి.శ్రీకాంత్, పెంకి చైతన్యకుమార్, సత్యనారాయణ, విజయ, శ్రీధర్, కోటేశ్వరరావు, చౌదరి రాధాకృష్ణ,లయన్స్ క్లబ్ సభ్యులు బాణాన దేవభూషణరావు, డా. చింతాడ కృష్ణమోహన్, టి.రామగోపాల్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:16:59