1 ENS Live Breaking News

ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేసిన కలెక్టర్..

అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అదనపు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఎన్.గోపి,  వి ఆర్ ఓ  మాకం కోటయ్య లను  జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఆ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం మండలంలో అదనపు ఆర్ ఐ గా పనిచేస్తున్న గోపి క్షేత్రస్థాయి విచారణ, రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండానే చుక్కల భూమిని కొందరికి అనుకూలంగా ఆన్ లైన్ లో నమోదు చేయడంపై విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఇడుపూరు విఆర్ఓ గా పనిచేస్తున్న మాకం కోటయ్య నకిలీ రికార్డులను సృష్టించి, కొందరికి అనుకూలంగా భూమిని ఇచ్చారనే ఆరోపణలపై విచారణ నివేదిక అనుసరించి సస్పెండ్ చేశారు.  సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు గురువారం నుంచే అమలులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

Ongole

2021-08-05 17:00:43

రహీమున్నీసా బేగంకు ఆరుదైన అవకాశం..

విశాఖలో ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త రహీమున్నీషాకు అరుదైన అవకాశం దక్కింది. కోవిడ్ పోరులో భాగంగా కరోనా పరిణామాలు, పరిష్కార నైపుణ్యాలు అనే అంశంపై ఆగస్టు 7న జరగనున్న అంతర్జాతీయ వెబినార్ లో ఆమె పాల్గొని ప్రశంగించనున్నారు. ఆఫ్రికా గ్లోబల్ డెవలప్ మెంట్ ఫర్ పాజిటివ్ చేంజ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో ఎంపవర్ ఉమెన్, ఎంపవర్ సొసైటీ అంశానికి సంబంధించి ఈ అంతర్జాతీయ వెబినార్ లో ఆమె తన అభిప్రాయాన్ని ఆలోచనలు, తన వద్ద వున్న ప్రస్తుత పరిస్థితుల తాజాసమాచారాన్ని తెలియజేస్తారు.  అంతేకాకుండా మహిళా సాధికారత దిశగా  దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయో ఆమె ఈ వెబినార్ లో విశ్లేషిస్తారు. ఈ అద్భుతమైన అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని, అలాగే తనకు అంతర్జాతీయంగా ఈ వెబినార్ మరింత బాధ్యత పెంచనుందన్నారు. ఇలాంటి వెబినార్ల ద్వారా మన దేశ పరిస్థితులను తాజాగా అంతర్జీతయంగా తెలియజేయడంతోపాటు, పలు దేశాల్లోని అంశాలను కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా ఇక్కడ పనిచేయడానికి, సేవలు అందించడానికి ఈ తరహా వెబినార్లు ఎంతగానో దోహదపడతాయన్నారు.

Visakhapatnam

2021-08-05 16:49:39

విశాఖలో లక్షమందికి కరోనా వేక్సిన్లు వేయాలి..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య   కేంద్రాలు, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 6న లక్ష కోవిడ్ వ్యాక్సినేషన్లు  వేస్తున్నట్టు జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందరు జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేక అధికారులు ఏఎంహెచ్ వో లు,  శానిటరీ సూపర్వైజర్ లు,  శానిటరీ ఇన్స్పెక్టర్లు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో  పాల్గొని విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.  వ్యాక్సినేషన్   ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన వారు,  గర్భిణీ స్త్రీలు,  ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు ఉన్న తల్లులకు,  టీచర్స్ కు వ్యాక్సినేషన్ వేయించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.

Visakhapatnam

2021-08-05 16:44:30

అర్భన్ పీహెచ్సీలకు మంత్రి శంకుస్థాపన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 8వ జోన్  89వ వార్డు లోని యల్లపువానిపాలెం - 2(కొత్త పాలెం) నందు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రివర్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నికల హామీలో ఇచ్చిన నవరత్నాలతో పాటూ, ప్రజల ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ లో అనేక రోగాలకు వైద్యం సేవలు చేర్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులలో రూ.80 లక్షల వ్యయంతో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంనకు శంకుస్థానం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ఎపి హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరామేశ్వరరావు, రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ మల్ల విజయప్రసాద్, అయిదవ జోనల్ కమిషనర్ చక్రవర్తి,  కార్యనిర్వాహక ఇంజనీరు, 89వ వార్డు వైసిపి  ఇంచార్జ్ దొడ్డి రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-05 16:35:56

స్థాయి సంఘంలో 3 అంశాలు ఆమోదం..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం గురువారం జివిఎంసి స్థాయి సంఘ సమావేశ మందిరం నందు నగర మేయర్ మరియు స్థాయి సంఘం చైర్మెన్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. అజెండాలో మొదటి మూడు అంశాలు స్థాయి సంఘ సమావేశంలో ఆమోదం పొందగా, నాలుగవ అంశము వాయిదా వేయడమైనదని, 5వ  అంశమును తిరస్కరించారు. ఈ సమావేశంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి,  డా. వి. సన్యాసి రావు, డి.సి.ఆర్. నల్లనయ్య, డి.ఇ.ఒ. శ్రీనివాస్, కార్యదర్శి లావణ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-05 16:34:16

వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంచండి..

ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన్ కల్పించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె రెండవ జోన్  10వ వార్డు పరిధిలోని ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై మలేరియా విభాగం వారు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా మొదలైనవి నియంత్రణకు లార్వా నిర్మూలనకు కార్యక్రమంనకు స్ప్రేయింగ్ చేయించాలని, దోమలు నియంత్రణకు నిరంతరం ఫాగింగు చేయాలని, వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ప్రతీ శుక్రవారం “డ్రై డే” పాటించాలని, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ సీసాలు ఇంటి పరిసరాలలో ఉండకుండా చూడాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. రెసిడెన్షియాల్ వెల్ఫేర్ అసోషియేషన్ (ఆర్.డబ్ల్యూ.ఎస్), ఆర్.పి.లు వారితో మాట్లాడుతూ సేవా కార్యక్రమం ఏ ఏ ప్రాంతాలలో  చేస్తున్నారని ఆరా తీశారు. అనంతరం డోర్ టు డోర్ చెత్త నిర్వహణ చేయు విధానాన్ని పరిశీలించి, ప్రతీ ఇంటి నుండి తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తను వేరు వేరుగా సేకరించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. కాలువలలో చెత్త సరిగా తీయడంలేదని, కాలువలలో ఉన్న చెత్తను దగ్గరుండి తీయించాలని శానిటరీ కార్యదర్శిని ఆదేశించారు. వార్డులో త్రాగునీరు సమయానికి రావడంలేదని స్థానికులు కమిషనర్ కు తెలపగా, సంబందిత సహాయక ఇంజినీరు(వాటర్ సప్లై)ను ప్రతీ రోజూ త్రాగునీరు సమయం ప్రకారం అందించాలని ఆదేశించారు.  డో.నెం. 03-23/1 ఇంటిలో డాబా పై కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున విధానాన్ని పరిశీలించి వారిని అభినందించారు. కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు పాటించవలసిన పద్దతులను, వాటి ఉపయోగాలను తెలిపి వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు సహాయ సహకారాలు అందించాలని, వార్డులోని బరియల్ గ్రౌండ్ పాడైనందున, దానికి మరమత్తులు చేయించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ బి.రాము, ఎఎంఒహెచ్  కిషోర్, ఎసిపి భాస్కర బాబు, కర్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, మత్స్య రాజు,  ఉప కర్యనిర్వాహక ఇంజినీర్ వంశీ, సహాయక ఇంజినీర్లు అప్పాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2021-08-05 16:16:10

కుటుంబ నియంత్రణ శాల ప్రారంభం..

 అరసవల్లి వద్ద కాజీపేటలో రూ.25 లక్షల నిధులతో  కుక్కల కుటుంబ నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్ ) శాలను స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గురువారం ప్రారంభించారు.  నగరపాలక సంస్థ కమీషనర్  కుక్కల జనన నియంత్రణ గురించి శాసన సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాల మేరకు వీధి కుక్కల సంతతి నియంత్రణ చర్యలలో భాగంగా కుటుంబ నియంత్రణ శాలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం లో సుమారు 4 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు కమీషనర్ తెలిపారని, ఇవి వాహనదారుల వెంటబడి కరవడం చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. యానిమాల్ వెల్ఫేర్ బోర్డ్ చట్టం ప్రకారం ప్రతీ జీవికి జీవించే హక్కు ఉందని, అందువలన వాటిని చంపకూడదని స్పష్టం చేశారు. అయితే వీటికి కుటుంబ నియంత్రణ చేసి, తద్వారా వాటి సంతతిని నిర్మూలించ వచ్చని, అందువలనే దీన్ని ప్రారంభించుకోవడం జరిగిందని  శాసనసభ్యులు తెలిపారు. అందుకోసం ఈ విభాగాన్ని ఇక్కడ అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. మొదటగా వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి 4 రోజులు పర్యవేక్షణలో ఉంచి తదుపరి ఎక్కడ పట్టుకున్న కుక్కలను అదే వీధిలో నగరపాలక సంస్థ సిబ్బంది వదిలేస్తారని అన్నారు. కుటుంబ నియంత్రణతో పాటు కుక్కలు నుండి ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉండేందుకు

రబిపూర్ ఇంజక్షన్లను కూడా కుక్కలకి వేయడం జరుగుతుందని చెప్పారు. కుక్కలు కోపంగా ఉండి కరవడానికి వెంటబడే తత్వం కలిగి ఉంటాయని, వాటికి ఆ కోపాన్ని తగ్గించే ఇంజెక్షన్లను కూడా వేయనున్నట్లు కమీషనర్ చెప్పారని అన్నారు. కాజీ పేటలో సుమారు 50 కుక్కలకు ఉంచడానికి గదులు నిర్మాణం చేయడం జరిగిందని,అలాగే శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలుగా 10 బల్లలను అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కుక్కల కుటుంబ నియంత్రణ, ఇంజెక్షన్లు, కార్యక్రమం మొత్తం స్థానిక వెటర్నరీ డాక్టర్ సూర్యం బ్లూ క్రాస్ సంస్థ  చైర్మన్ వారితో ఎం.ఓ.యూ కూడా చేసుకోబో తున్నట్లు కమీషనర్ తెలిపారని, ఇది శుభదాయకమన్నారు. బ్లూ క్రాస్ చైర్మన్ సూర్యం మాట్లాడుతూ గతంలో రాష్ట్రం మొత్తం 42 వేలకు పైగా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసిన అనుభవం తమ సిబ్బందికి ఉందని అన్నారు. కుక్కలవల్ల ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కరోనా లాంటి వ్యాధి  నుండి తప్పించుకోవచ్చు కానీ రాబిస్ వ్యాధి వచ్చిందంటే మరణమే అని అన్నారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. తమవద్ద డాగ్ క్యాచర్లు ఉన్నారని, వీరితో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందనే నమ్మకం తమకు ఉందని అన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డా. వెంకటరావు మాట్లాడుతూ ప్రతీరోజు కుక్కలు గురించి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే వీటిపై దృష్టి పెట్టామని అన్నారు. .ఇకముందు ఇటువంటి ఫిర్యాదులు లేకుండా ఈ కుక్కల కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. దక్షిణ మూర్తి,ఉప కార్య నిర్వాహక ఇంజినీర్ రమణమూర్తి , పారిశుద్ధ్యం పర్యవేక్షకులు  గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Arasavilli

2021-08-05 15:57:16

స్వచ్ఛతకు మారుపేరు శ్రీకాకుళం కావాలి..

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ద్వారా  శ్రీకాకుళం స్వచ్ఛతకు మారుపేరు కావాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు.  ఏ.పి.హెచ్.బి.కాలనీలో గల కార్గిల్ పార్క్ వద్ద పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడంతోనే పని అయిపోలేదని, దానిని సంరక్షించుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉందని అన్నారు. నేడు  ఎవరి ఇంటి ముందు మొక్కలు నాటారో, ఆ ఇంటి యజమానులే వాటి సంరక్షణ బాద్యతలను తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలనీలోని  ప్రతీ ఇంటికీ వాలంటీర్ ద్వారా తడి చెత్త, పొడిచెత్త, కాలుష్య చెత్త వేరు వేరుగా వేయుటకు 3 ప్లాస్టిక్ డస్ట్ బిన్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్... క్లీన్ శ్రీకాకుళం కార్యక్రమం మొట్ట మొదటిగా కార్గిల్ పార్క్ వద్ద ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ కాలనీలో విశ్రాంతి ఉద్యోగులు, కాలనీ అసోసియేషన్, మంచి రోడ్లు, పార్కులు మంచి నాయకత్వం కలిగిన వారు ఉన్నారని, ఆదర్శకాలనీగా ఈ కాలనీ ఉంటుందని ప్రగాఢంగా నమ్మి పైలట్ ప్రోజెక్టుగా  ఎంచుకున్నామన్నారు.

. గతంలో చెత్త వేయడానికి ఎక్కడా స్థలం లేని పరిస్థితుల్లో సింగుపురం వద్ద సుమారు 25 ఎకరాలలో డంపింగ్ యార్డ్ కొరకు తీసుకోవడం జరిగిందని, ఇపుడు అక్కడ కూడా చెత్త వేయడానికి స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందువలన పాత పద్ధతిని విడనాడి కొత్త పద్దతిని అనుసరించాలని, అందులో భాగంగా ఈ డస్ట్ బిన్ల పద్దతిని అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై మొదటగా వార్డు వాలంటీర్ అవగాహన కల్పించుకుని అనంతరం వారి పరిధిలో గల గృహాల మహిళకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతీ రోజూ ఇంటి ముందరికి వచ్చే  చెత్త కలెక్షన్ చేసేవారికి అవమానకర   పద్దతిలో చూడరాదని,  అటువంటి వారు లేకపోతే మనం రోగాల పాలు కాక తప్పదని హెచ్చరించారు.   అందువలన వాళ్ళని గౌరవించాలని, తద్వారా చెత్త రహిత శ్రీకాకుళంగా తీర్చిదిద్దు కుందాం అని అన్నారు.  మరలా త్వరలో ఈ కాలనీకి వస్తానని, ఇపుడు నాటిన మొక్కలు, చెత్తపై పరిశీలన చేస్తానని తెలిపారు. పందులు, కుక్కలు, ఆవులు గురించి కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ ఫిర్యాదుపై కమీషనర్ స్పందించి పందులను వాటి యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు. అప్పటికి వారినుండి స్పందన రాకపోతే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. వీధి కుక్కలకు సంబంధించి కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆవులు రోడ్లపై తిరిగితే తొలిసారికి రూ.2500/-లు, రెండవసారి రూ.5000/-లు జరిమానాగా నిర్ణయించడం జరిగిందని, ఇకపై ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కావని హామీ ఇచ్చారు.  

నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పొజెక్టులలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ఒకటని అన్నారు.  అందులో భాగంగా స్వచ్ఛతకు మారుపేరుగా శ్రీకాకుళంను తీర్చిదిద్దేందుకు విశేష కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్లీన్ శ్రీకాకుళంలో భాగంగా  ప్రతీ ఇంటికి 3 రకాల ప్లాస్టిక్ డస్ట్ బిన్లు అందజేయడం జరిగిందని, డస్ట్ బిన్లను ఉపయోగించుకునే విధానం గురించి ఆయన మహిళలకు వివరించారు.   రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లలో పాత పద్దతిలో చెత్త కలెక్షన్ మార్పు కోసం కొత్త పద్దతిని అనుసరించే విధానంలో భాగమే ఈ డస్ట్ బిన్ ల పంపిణి అని అన్నారు.

Srikakulam

2021-08-05 15:53:58

డిపార్ట్ మెంటల్ టెస్టులకి ఏర్పాట్లు పూర్తి..

శ్రీకాకుళం జిల్లాలో ఆగస్టు 6నుండి జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ఆగష్ట్ 6 నుండి 13వ తేదీ వరకు ఏ.పి.పి.యస్.సి నిర్వహించే డిపార్ట్ మెంటల్ టెస్టులపై చీఫ్ సూపరింటెండెంట్లతో డి.ఆర్.ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులను పొందుటకు అవసరమైన శాఖపర పరీక్షలు ఇవని అన్నారు. ఈ పరీక్షలకు సుమారు 1150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యే అవకాశముందని, కావున  వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఎచ్చెర్లలోని   శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, రాజాంలోని జి.ఎం.ఆర్. కళాశాల , టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు ఒక షెషన్, మధ్యాహ్నం 03.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు  మరో షెషన్ చొప్పున మొత్తం 15 షెషన్స్ లలో పరీక్షలు జరగుతాయని డి.ఆర్.ఓ.ఓ స్పష్టం చేసారు. కోవిడ్ నేపధ్యంలో పరీక్షలకు హాజరయ్యే వారందరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ చేసుకునేలా తగు చర్యలు ఆయా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు పరీక్షా సమాయానికి గంట ముందే హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. సకాలంలో అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యేవిధంగా ఆర్.టి.సి, వైద్య సదుపాయాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను డి.ఆర్.ఓ ఆదేశించారు. వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

          ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అసిస్టెంట్ సెక్రటరీ బి.సిహెచ్.ఎన్.రాజు, సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఆర్.టి.సి ప్రజా సంబంధాల అధికారి బి.ఎల్.ప్రసాదరావు, శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర, జి.ఎం.ఆర్, ఆదిత్య కళాశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-05 15:48:25

7న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురు వారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తేదీన  జాతీయ చేనేతకారుల దినోత్సవం అని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారని వివరించారు. పొందూరులో జాతీయ చేనేతకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొందూరులో ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం సంస్థను సందర్శిస్తారని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం, వివిధ పథకాల క్రింద సహాయక కార్యక్రమాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు 50 వరకు ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి అంశాన్ని పక్కాగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, డిఆర్ఓ బలివాడ దయానిధి, ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పి ఎం. మహేంద్ర, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్. కూర్మ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, డిఅర్డిఏ పిడి బి.శాంతి, ఎల్.డి.ఎం జివిబిడి హరిప్రసాద్, డిఎంహెచ్ఓ కే. సి. చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-05 15:46:26

ఆరోగ్యభారత్ మనందరి లక్ష్యం కావాలి..

ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు ప్రతీ  ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి కర్తవ్య దీక్షతో సాగాలని, అట్లాంటి నిబద్ధతతో పనిచేస్తే భారత ప్రభుత్వం నరేంద్రమోదీ కలలు కన్న ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యపడతుందని శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.ప్రభాకరరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నెహ్రు యువ కేంద్రం మరియు శ్రీకాకుళం జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతే పక్వాడా పక్షోత్సవాలు, మాస్కే రక్షణ కవచం ర్యాలీను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో ప్రధాన ఘట్టం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ అని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా సగం రోగాలు నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కరోనా మూడవ దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కరోనా నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ,vకరోనా  కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 శ్రీకాకుళం జిల్లాలో పల్లెల్లో స్వచ్చ భారత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మూడో దశ వ్యాప్తి అరికట్టడానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మాస్కు ప్రాధాన్యత ను తెలియజేస్తూ క్రీడాకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల మీదుగా  మాస్కె రక్షణ కవచం  ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ప్రధాన కోచ్ బి.శ్రీనివాస్ కుమార్, నెహ్రు యువక కేంద్రం ప్రతినిధి డి.శ్రీనివాసరావు, పర్యాటక  అధికారి ఎన్. నారాయణ రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కూన వెంకట రమణ మూర్తి, ఎస్.జోగినాయుడు, ఐ. కె.రావు, వివిధ క్రీడా విభాగాల కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-05 15:45:02

మళ్లించిన నిధులు తక్షణమే జమచేయాలి..

భవననిర్మాణకార్మికులు సంక్షేమ బోర్డు నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారిమళ్లించిన 14వందల కోట్లు రూపాయలనుతక్షణమే బోర్డులో జమ చేయాలని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి.వామునమూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఇసుక తోట జంక్షన్ వద్ద భవన నిర్మాణకార్మికులుతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, సంక్షేమ బోర్డులో సభుత్వం తీసుకొనిఉన్న కార్మికులు తక్షణమే గుర్తింపు కార్డులుఇవ్వాలన్నారు.  ప్రభుత్వం ఇస్తున్న  ఇళ్ల స్థలాల్లో అర్హులైన  భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతప్రభుత్వం లో నిర్మాణకార్మికులకు అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు న్యాయం చేస్తామని హామీయిచ్చిన  ముఖ్యమంత్రి జగన్ నేటికి అధికారంలోకి వచ్చి
 రెండు సంవత్సరాలు అయిన కార్మికులు బ్రతుకులకు ఒక దారి చూపలేదన్నారు. ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో, మరోపక్క  కరోనా మహమ్మారి తో మరోపక్క కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిజీవితాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రావి కృష్ణ,ఎమ్.గోవిందు,ఎమ్.రమణభవన,నిర్మాణకార్మిక సంఘం నాయకులు జి.రాజు,తాతారావు,సూర్యనారాయణ,ఆశిలునాయుడు రాములమ్మ, లక్ష్మీ, దుర్గారావు, గౌరీమ్మ తవుడుమ్మ తదితరులుపాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-05 05:17:10

అప్పన్నకు డీసీపీ గౌతమి శాలి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారిని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ గౌతమి శాలి గురువారం దర్శించుకున్నారు. ఈమేరకు ఆమెకు ఆలయ అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యుడు దినేష్ రాజు  స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలే సంపెంగ తైలాలతో శుభ్రపరిచిన నరసింహ అవతారాలు, శిల్పకళలను పరిశీలించి అంతర్జాతీయ హెరిటేజ్ సైట్ స్టేటస్ కోసం ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆమెకు సిబ్బంది వివరించారు. ఆలయంలోని  శిల్పకళ అద్భుతంగా ఉందని గౌతమిశాలి ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం కళ్యాణ మండపాన్ని సందర్శించారు  ఆర్జిత సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి  ప్రసాదాలను అందజేశారు.

Simhachalam

2021-08-05 04:45:13

Visakhapatnam

2021-08-04 17:00:04

గొప్ప వాగ్గేయకారుడు దివంగత వంగపండు..

గొప్ప వాగ్గేయకారుడు, ప్రజా కవి (వంగపండు ప్రసాదరావు) అని, పేద ప్రజల కోసం ఎన్నో పద్యాలు, పాటలు వ్రాసి పాడారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.   బుధవారం  వి.ఎం.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో   ప్రముఖ  వాగ్గేయకారుడు,  ప్రజా కవి వంగపండు ప్రసాదరావు  ప్రధమ వర్ధంతి  సందర్భంగా   ప్రభుత్వ పరంగా  కార్యక్రమాన్ని  నిర్వహించడం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి  అధ్యక్షత  వహించిన మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  వంగపండు ప్రసాదరావు  బడుగుల జీవితాలు, వారి కష్టాలు, ఇబ్బందులను  వారి పాటలు పధ్యాలు ద్వారా  వెలుగులోకి  తీసుకు రావడానికి  కృషి చేసారన్నారు. వారిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి పేరిట  జానపద పురస్కారాన్ని  ఒక జానపద కళాకారుడికి ప్రదానం గావించాలని నిర్ణయించిందని  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం   చైర్మన్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు వర్థంతి సభను  శోభాయమానంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేసారు. ప్రముఖ జానపద గాయకుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, విప్లవ  కవిని గుర్తించి  ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినందుకు  కృతజ్ఞతలు తెలుపుతూ  ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసారు.  విమలక్క మాట్లాడుతూ  ప్రజా కవి వంగపండు జీవితాన్ని  కొనియాడారు .  వంగపండు ప్రసాదరావు  “నా మాట- నాపాట” ప్రజలకు అంకితం  అనే వారని గుర్తుచేశారు.

 ప్రముఖ జానపద గాయకుడు  గద్దర్ మాట్లాడుతూ  ఈ రోజును  “త్యాగాల పాటల ప్రజల దినం” గా  అభివర్ణించారు.  నేను పాడిన పాటలన్నీ  వంగపండు వ్రాసినవే అన్నారు.   మానవ సమాజం గురించిన తత్వాన్ని  వివరించారు.  మనది “వైవిద్య” భారత  దేశమని, వంగపండు  “సజీవం” గానే  ఉంటారని  తెలిపారు.  వంగపండు పాటలను హిందిలోకి  అనువదించాలని  గద్దర్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ ను  కోరారు.
ఈ సందర్భంగా గద్దర్, ఆర్.నారాయణ మూర్తి, విమలక్క పలు జానపద గేయాలను లయ బద్దంగా  పాడి ఉర్రూతలూగించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు  మల్లిఖార్జున, ఎం.ఎల్. ఏ. లు  కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, భాగ్యలక్ష్మీ,  వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్  అక్కరమాని విజయనిర్మల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్చన్ వంగపండు ఉషా తదితరులు ప్రసంగించారు.  అనంతరం వంగపండు ప్రసాదరావు జానపద పురస్కారం ప్రముఖ జానపద కళాకారులు “శ్రీ బాడ సూరయ్య” కు అందించి వారిని  మంత్రి  ఘనంగా  సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పలువురు  అధికారులు  పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-04 15:34:27