1 ENS Live Breaking News

డిపార్ట్ మెంటల్ టెస్టులకి ఏర్పాట్లు పూర్తి..

శ్రీకాకుళం జిల్లాలో ఆగస్టు 6నుండి జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ఆగష్ట్ 6 నుండి 13వ తేదీ వరకు ఏ.పి.పి.యస్.సి నిర్వహించే డిపార్ట్ మెంటల్ టెస్టులపై చీఫ్ సూపరింటెండెంట్లతో డి.ఆర్.ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులను పొందుటకు అవసరమైన శాఖపర పరీక్షలు ఇవని అన్నారు. ఈ పరీక్షలకు సుమారు 1150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యే అవకాశముందని, కావున  వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఎచ్చెర్లలోని   శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, రాజాంలోని జి.ఎం.ఆర్. కళాశాల , టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు ఒక షెషన్, మధ్యాహ్నం 03.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు  మరో షెషన్ చొప్పున మొత్తం 15 షెషన్స్ లలో పరీక్షలు జరగుతాయని డి.ఆర్.ఓ.ఓ స్పష్టం చేసారు. కోవిడ్ నేపధ్యంలో పరీక్షలకు హాజరయ్యే వారందరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ చేసుకునేలా తగు చర్యలు ఆయా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు పరీక్షా సమాయానికి గంట ముందే హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. సకాలంలో అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యేవిధంగా ఆర్.టి.సి, వైద్య సదుపాయాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను డి.ఆర్.ఓ ఆదేశించారు. వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

          ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అసిస్టెంట్ సెక్రటరీ బి.సిహెచ్.ఎన్.రాజు, సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఆర్.టి.సి ప్రజా సంబంధాల అధికారి బి.ఎల్.ప్రసాదరావు, శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర, జి.ఎం.ఆర్, ఆదిత్య కళాశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-05 15:48:25

7న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురు వారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తేదీన  జాతీయ చేనేతకారుల దినోత్సవం అని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారని వివరించారు. పొందూరులో జాతీయ చేనేతకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొందూరులో ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం సంస్థను సందర్శిస్తారని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం, వివిధ పథకాల క్రింద సహాయక కార్యక్రమాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు 50 వరకు ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి అంశాన్ని పక్కాగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, డిఆర్ఓ బలివాడ దయానిధి, ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పి ఎం. మహేంద్ర, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్. కూర్మ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, డిఅర్డిఏ పిడి బి.శాంతి, ఎల్.డి.ఎం జివిబిడి హరిప్రసాద్, డిఎంహెచ్ఓ కే. సి. చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-05 15:46:26

ఆరోగ్యభారత్ మనందరి లక్ష్యం కావాలి..

ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు ప్రతీ  ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి కర్తవ్య దీక్షతో సాగాలని, అట్లాంటి నిబద్ధతతో పనిచేస్తే భారత ప్రభుత్వం నరేంద్రమోదీ కలలు కన్న ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యపడతుందని శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.ప్రభాకరరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నెహ్రు యువ కేంద్రం మరియు శ్రీకాకుళం జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతే పక్వాడా పక్షోత్సవాలు, మాస్కే రక్షణ కవచం ర్యాలీను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో ప్రధాన ఘట్టం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ అని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా సగం రోగాలు నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కరోనా మూడవ దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కరోనా నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ,vకరోనా  కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 శ్రీకాకుళం జిల్లాలో పల్లెల్లో స్వచ్చ భారత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మూడో దశ వ్యాప్తి అరికట్టడానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మాస్కు ప్రాధాన్యత ను తెలియజేస్తూ క్రీడాకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల మీదుగా  మాస్కె రక్షణ కవచం  ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ప్రధాన కోచ్ బి.శ్రీనివాస్ కుమార్, నెహ్రు యువక కేంద్రం ప్రతినిధి డి.శ్రీనివాసరావు, పర్యాటక  అధికారి ఎన్. నారాయణ రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కూన వెంకట రమణ మూర్తి, ఎస్.జోగినాయుడు, ఐ. కె.రావు, వివిధ క్రీడా విభాగాల కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-05 15:45:02

మళ్లించిన నిధులు తక్షణమే జమచేయాలి..

భవననిర్మాణకార్మికులు సంక్షేమ బోర్డు నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారిమళ్లించిన 14వందల కోట్లు రూపాయలనుతక్షణమే బోర్డులో జమ చేయాలని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి.వామునమూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఇసుక తోట జంక్షన్ వద్ద భవన నిర్మాణకార్మికులుతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, సంక్షేమ బోర్డులో సభుత్వం తీసుకొనిఉన్న కార్మికులు తక్షణమే గుర్తింపు కార్డులుఇవ్వాలన్నారు.  ప్రభుత్వం ఇస్తున్న  ఇళ్ల స్థలాల్లో అర్హులైన  భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతప్రభుత్వం లో నిర్మాణకార్మికులకు అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు న్యాయం చేస్తామని హామీయిచ్చిన  ముఖ్యమంత్రి జగన్ నేటికి అధికారంలోకి వచ్చి
 రెండు సంవత్సరాలు అయిన కార్మికులు బ్రతుకులకు ఒక దారి చూపలేదన్నారు. ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో, మరోపక్క  కరోనా మహమ్మారి తో మరోపక్క కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిజీవితాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రావి కృష్ణ,ఎమ్.గోవిందు,ఎమ్.రమణభవన,నిర్మాణకార్మిక సంఘం నాయకులు జి.రాజు,తాతారావు,సూర్యనారాయణ,ఆశిలునాయుడు రాములమ్మ, లక్ష్మీ, దుర్గారావు, గౌరీమ్మ తవుడుమ్మ తదితరులుపాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-05 05:17:10

అప్పన్నకు డీసీపీ గౌతమి శాలి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారిని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ గౌతమి శాలి గురువారం దర్శించుకున్నారు. ఈమేరకు ఆమెకు ఆలయ అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యుడు దినేష్ రాజు  స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలే సంపెంగ తైలాలతో శుభ్రపరిచిన నరసింహ అవతారాలు, శిల్పకళలను పరిశీలించి అంతర్జాతీయ హెరిటేజ్ సైట్ స్టేటస్ కోసం ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆమెకు సిబ్బంది వివరించారు. ఆలయంలోని  శిల్పకళ అద్భుతంగా ఉందని గౌతమిశాలి ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం కళ్యాణ మండపాన్ని సందర్శించారు  ఆర్జిత సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి  ప్రసాదాలను అందజేశారు.

Simhachalam

2021-08-05 04:45:13

Visakhapatnam

2021-08-04 17:00:04

గొప్ప వాగ్గేయకారుడు దివంగత వంగపండు..

గొప్ప వాగ్గేయకారుడు, ప్రజా కవి (వంగపండు ప్రసాదరావు) అని, పేద ప్రజల కోసం ఎన్నో పద్యాలు, పాటలు వ్రాసి పాడారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.   బుధవారం  వి.ఎం.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో   ప్రముఖ  వాగ్గేయకారుడు,  ప్రజా కవి వంగపండు ప్రసాదరావు  ప్రధమ వర్ధంతి  సందర్భంగా   ప్రభుత్వ పరంగా  కార్యక్రమాన్ని  నిర్వహించడం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి  అధ్యక్షత  వహించిన మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  వంగపండు ప్రసాదరావు  బడుగుల జీవితాలు, వారి కష్టాలు, ఇబ్బందులను  వారి పాటలు పధ్యాలు ద్వారా  వెలుగులోకి  తీసుకు రావడానికి  కృషి చేసారన్నారు. వారిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి పేరిట  జానపద పురస్కారాన్ని  ఒక జానపద కళాకారుడికి ప్రదానం గావించాలని నిర్ణయించిందని  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం   చైర్మన్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు వర్థంతి సభను  శోభాయమానంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేసారు. ప్రముఖ జానపద గాయకుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, విప్లవ  కవిని గుర్తించి  ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినందుకు  కృతజ్ఞతలు తెలుపుతూ  ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసారు.  విమలక్క మాట్లాడుతూ  ప్రజా కవి వంగపండు జీవితాన్ని  కొనియాడారు .  వంగపండు ప్రసాదరావు  “నా మాట- నాపాట” ప్రజలకు అంకితం  అనే వారని గుర్తుచేశారు.

 ప్రముఖ జానపద గాయకుడు  గద్దర్ మాట్లాడుతూ  ఈ రోజును  “త్యాగాల పాటల ప్రజల దినం” గా  అభివర్ణించారు.  నేను పాడిన పాటలన్నీ  వంగపండు వ్రాసినవే అన్నారు.   మానవ సమాజం గురించిన తత్వాన్ని  వివరించారు.  మనది “వైవిద్య” భారత  దేశమని, వంగపండు  “సజీవం” గానే  ఉంటారని  తెలిపారు.  వంగపండు పాటలను హిందిలోకి  అనువదించాలని  గద్దర్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ ను  కోరారు.
ఈ సందర్భంగా గద్దర్, ఆర్.నారాయణ మూర్తి, విమలక్క పలు జానపద గేయాలను లయ బద్దంగా  పాడి ఉర్రూతలూగించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు  మల్లిఖార్జున, ఎం.ఎల్. ఏ. లు  కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, భాగ్యలక్ష్మీ,  వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్  అక్కరమాని విజయనిర్మల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్చన్ వంగపండు ఉషా తదితరులు ప్రసంగించారు.  అనంతరం వంగపండు ప్రసాదరావు జానపద పురస్కారం ప్రముఖ జానపద కళాకారులు “శ్రీ బాడ సూరయ్య” కు అందించి వారిని  మంత్రి  ఘనంగా  సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పలువురు  అధికారులు  పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-04 15:34:27

మూడోదకు ముందస్తు ఏర్పాటు చేయాలి..

విశాఖజిల్లాలో 3వ దశ కోవిడ్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేసారు.  కోవిడ్ రహిత జిల్లాగా విశాఖను తీర్చి దిద్దాలన్నారు.  బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయపు  సమావేశ మందిరంలో  కోవిడ్–19 మూడవ దశ నివారణకు  తీసుకోవలసిన  చర్యలపై జిల్లా  అధికారులు, శాసన సభ్యులతో  సమావేశం నిర్వహించి, ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల  సూచనలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మొదటి దశ, రెండవ దశలో  ఎదుర్కొన్న  సమస్యలు పునరావృతం  కాకుండా నిర్ధిష్టమైన భద్రత, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.   జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా  ఉత్సవాలు, సామూహికంగా వేడుకలు  నిర్వహించకూడదని పేర్కొన్నారు.  నిబంధనలు అతిక్రమించి, మాస్క్ లు వినియోగించని  వారిపై  తగిన  చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు.   కోవిడ్ భారిన పడి కోలుకున్న వారికి వచ్చే ఆరోగ్య సమస్యలకు తగిన  వైద్యం అందించాలన్నారు.  కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ లో  నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.  జిల్లాలో  ఎక్కడా మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ప్రజా ప్రతి నిధులకు  అధికారులు  సహకరించి వారి సూచనలు అమలు చేయాలన్నారు. 

జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ధర్డ్ వేవ్ రాకుండా కోరుకుంటున్నానని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ధర్డ్ వేవ్ పై  కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. పౌరులు మాస్క్ లేకుండా  షాపింగ్ లకు  వెళితే షాపు యజమానికి రూ.10వేల నుంచి  రూ. 25వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసారు.  కోవిడ్ నిబంధనలు  అతిక్రమించే షాపులు, షాపింగ్ మాల్స్ పై కఠినంగా  వ్యవహరిస్తామన్నారు.  పార్కులు  బహిరంగ ప్రదేశాలలో  నిబంధనలు పక్కాగా అమలు చేయాలని  పోలీస్ అధికారులకు  సూచించారు.  వి ఎం ఆర్ డి ఎ, జి వి ఎం సి, పోలీస్ అధికారులు  మాస్క్ లు ధరించని వారిపై చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ ధర్డ్ వేవ్ నివారణకు జిల్లాలో   75 ఆసుపత్రులను  గుర్తించామన్నారు.  3370 బెడ్స్, 582 వెంటిలేటర్లు సిద్దం చేసామన్నారు.  చిన్న పిల్లల కోసం 100 పడకలు  ఏర్పాటు  చేసామన్నారు.  కె జి. హెచ్, విమ్స్, చెస్ట్ ఆసుపత్రిలో  బెడ్స్ సిద్దం చేసామని వివరించారు. 

పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీలో నిబంధనలు అమలు లేవని, వారపు సంతలకు  అనుమతిచ్చారని, గిరిజన ప్రాంతం లో కోవిడ్  నిబంధనలు అమలు చేయాలన్నారు.  పాయకరావుపేట ఎం .ఎల్ .ఎ . గొల్లబాబురావు మాట్లాడుతూ కె.జి.హెచ్ సి ఎస్ ఆర్ బ్లాకులో సౌకర్యాలు మెరుగు పరచాలని, పారిశద్ద్యపనులు చేయాలన్నారు.  అనకాపల్లి శాసన సభ్యులు  గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ చోడవరం, మాడుగుల ప్రజలు  అనకాపల్లి ఆసుపత్రి పై ఆధారపడతారని  అనకాపల్లి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో  వైద్యులను సిబ్బందిని నియమించాలన్నారు.  
పెందుర్తి ఎం ఎల్ ఎ  అదీప్ రాజు పెందుర్తి అర్బన్ లో లక్షమంది, గ్రామీణ ప్రాంతంలో  30 వేల మంది జనాభా  ఉన్నారని ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.  నెడ్ క్యాప్ చైర్మన్   కె. కె. రాజు,  ఎం ఎల్ ఎ గణబాబు కోవిడ్ అనంతరం వచ్చే సమస్యలపై దృష్టి  సారించాలన్నారు. చోడవరం ఎం .ఎల్ ఎ దర్మశ్రీ  నోడల్ అధికారులను కొనసాగించాలని సూచించారు. సాయంత్రం 5గంటల తరువాత బీచ్ రోడ్ లో సందర్శకులను అనుమతించ కుండా  చర్యలు  తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  మాట్లాడుతూ పీవర్ సర్వే వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో  మాడుగుల ఎం ఎల్ ఎ ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు,  జి.వి.ఎం.సి సృజన,  ఎస్ పి  బి. కృష్ణారావు , వి ఎం ఆర్ డి ఎ చైర్ పర్సన్ విజయనిర్మల,  మళ్ల విజయ ప్రసాద్, ఎ ఎం సి ప్రిన్సిపాల్ డా. సుధాకర్,  డి ఎం అండ్ హెచ్ ఒ  డా. సూర్యనారాయణ ,  కె జి హెచ్ సూపరిండెంట్ డా.మైధిలి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-04 14:58:01

21 లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..

విశాఖ జిల్లాలో జిల్లాలో  21 లక్షల మందికి   కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు  వేసారని రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. బుధవారం జిల్లా అధికారులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 3వ దశ నివారణకు తీసుకోవలసిన చర్యలపై  అధికారులతో  చర్చించామన్నారు. కోవిడ్ నివారణలో  విశాఖ అగ్ర స్థానంలో  ఉండాలని ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు   నూరు శాతం  వ్యాక్సినేషన్  సాధించాలని  అధికారులను  ఆదేశించినట్టు చెప్పారు. 3వ దశపై వైద్య నిపుణల సూచనల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. కాగా  ఈ నెల 16వ తేది నుంచి  జిల్లాలో  ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుందని  జిల్లా కలెక్టర్ చెప్పారని  తగిన జాగ్రత్తలు తీసుకొని  ఆర్మీ రిక్రూట్ మెంట్  ఆగకుండా   రిక్రూట్ మెంట్   ప్రక్రియ పూర్తి చేయాలని  సూచించామని  చెప్పారు.    కోవిడ్ నివారణపై  ప్రజలను  అప్రమత్తం  చేస్తూ  అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో  పలువురు  శాసన సభ్యులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-04 14:57:07

ఆగస్టు 5న జగనన్న పచ్చతోరణం..

కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గంలోని వాక‌ల‌పూడి జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 5న  జ‌ర‌గ‌నుంద‌ని డీఎఫ్‌వో (సోష‌ల్ ఫారెస్ట్రీ) ఆర్‌.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణం (వ‌న మ‌హోత్స‌వం, 2021) కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు హాజ‌రుకానున్న‌ట్లు వెల్ల‌డించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి పిలుపు మేర‌కు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములై ప‌చ్చ‌తోర‌ణంలో జిల్లాను ముందు వ‌రుస‌లో నిల‌పాల‌ని ప్రజలను శ్రీనివాస్ కోరారు.

Kakinada

2021-08-04 14:56:18

సీనియారిటీల జాబితా సిద్దంచేయండి..

శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సీనియర్ అసిస్టెంట్లకు చెందిన టెంటటివ్ సీనియారిటీ జాబితాను ఆయా అధికారుల జి – మెయిల్ నందు ఉంచినట్లు  జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన జారీచేసారు. 2021 –22 పేనల్ సం.నకు గాను జిల్లాలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సీనియర్ అసిస్టెంట్ల సీనియారిటి లిస్టును సంబంధిత ఉద్యోగులకు సమాచారాన్ని అందించుటకు ఆయా అధికారుల ఇ-మెయిల్స్ నందు ఉంచడం జరిగిందని, వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నఎడల సంబంధిత ఆధారాలతో ఆయా అధికారుల ద్వారా ఈ నెల 15 లోగా తమ కార్యాలయానికి ప్రత్యేక దూత ద్వారా సమర్పించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. 

Srikakulam

2021-08-04 14:28:52

పథకాల అమలులో లోపాలు సవరించాలి..

ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ర‌త్నాలు-పేదలంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మం అమ‌లులో లోపాలను స‌వ‌రించి, త్వ‌రిత‌గ‌తిన లేఅవుట్ల‌ను అభివృద్ధి చేసి, ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌జాప్ర‌తినిధుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునేందుకు వీలుగా డివిజ‌న్ స్థాయిలో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జేసీ (గృహ నిర్మాణం) ఎ.భార్గ‌వ్ తేజ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తొలిద‌శ లేఅవుట్ల‌లో లెవెలింగ్‌, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణ సామ‌గ్రి త‌దిత‌రాల‌కు సంబంధించిన క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ల‌క్ష్యంగా డివిజ‌న‌ల్ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు భార్గ‌వ్ తేజ తెలిపారు. ఆగ‌స్టు 5న పెద్దాపురం డివిజ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఏడో తేదీన రామ‌చంద్రాపురం, ఎనిమిదో తేదీన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, తొమ్మిదిన కాకినాడ‌, 12వ తేదీన అమ‌లాపురం డివిజ‌న్ల‌లో స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ స‌మావేశాల‌కు ఆయా డివిజ‌న్ల ప‌రిధిలోని ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రై జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా అమ‌ల‌య్యేందుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించాల‌ని జేసీ (హెచ్‌) భార్గ‌వ్ తేజ కోరారు.

Kakinada

2021-08-04 14:25:17

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.03 కోట్లు..

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి హుండీ ఆదాయం ఒక కోటి మూడు లక్షల 35వేల 857 రూపాయలు వచ్చిందని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. భారత దేశ కరెన్సీతోపాటు ఆరు దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా స్వామివారి హుండీ లెక్కింపులో లభ్యమైందని ఈఓ తెలియజేశారు. ట్రస్టుబోర్టు సభ్యులు, ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, ఇతర సభ్యులు, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో పరకామణి లెక్కింపు కార్యక్రమం చేపట్టిన్టు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసినట్టు చెప్పారు.

సింహాచలం

2021-08-04 14:02:14

అన్నదాతలకు అండగా నిండుగా రైతు భరోసా కేంద్రాలు..

 రైతు బాగుంటేనే రాష్ట్రం ఆన్ని విధాలా అభివృధి చెందుతుంది, వ్యవసాయంతో ఆహార భద్రత కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులు చేశారు ఆని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. బుధవారం కురుపాంలో  ఉప ముఖ్యమంత్రి రైతు భారోసా కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భం గా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ, రైతులకు బహుళ ప్రయోజనాలు కలిగించే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాలలోనే  విత్తనం నుండి పండించిన పంట అమ్మకం వరకు సేవలందిస్తోంది అన్నారు. అలాగే వై.ఎస్.అర్. రైతు భరోసా సన్న చిన్నకారు రైతుల పంటల కాలం ప్రారంభమైన  నుండి చివరివరకు సాగు పెట్టుబడికి అవసరమైయ్యే ఖర్చులకు సకాలంలో చెల్లిస్తేనే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని భావించి వై ఎస్.ఆర్ రైతు భరోసా క్రింద సంవత్సరానికి 13,500 చొప్పున 5 సంవత్సరాలు ప్రతి రైతుకు రూ.67,500 సాయం అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు,. దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వై.ఎస్.ఆర్ రైతుభరోసా క్రింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్.ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

        ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం లో విజ్ఞానాన్ని, వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సబ్సిడీ వంటి సౌకర్యాలు ఒకే దగ్గర పొందడానికి  రైతు భరోసా కేంద్రం అన్నారు.

Vizianagaram

2021-08-04 11:04:19

అధికారాలను భర్తలకు ఎప్పుడూ అప్పగించకూడదు..

నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళలు ఎక్కువగా ఉన్నారని, వారిని చూస్తుంటే ఆనందంగా ఉందని, అయితే  వారి అధికారాన్ని భర్తలకు అప్పగించకుండా వారే చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి తెలిపారు.  శిక్షణ లో నేర్చుకున్న అంశాలను పాలనలో  అమలు చేయాలనీ అన్నారు.  జే. ఎన్.టి యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణా ముగింపు   కార్యక్రమం లో బుధవారం కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.  సర్పంచ్ అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి అని, గ్రామానికి మంచి జరిగినా , చెడు జరిగినా  పూర్తి బాధ్యత సర్పంచ్ లదే నని అన్నారు.  ఉన్నటువంటి వనరులతోనే అభివృద్ధిని చేయవచ్చని ముందుగా ఆ గ్రామానికి ఏం కావాలో గ్రామ సభల ద్వారా తీర్మానం చేసుకోవాలని, పార్టీల కతీతంగా ప్రజలంతా మనవాళ్ళే అనుకోని పని చేయాలనీ హితవు పలికారు.  మంచి పనులు చేస్తే  సర్పంచ్ మాటకు గ్రామస్తులంత గౌరవిస్తారని, సంక్షేమ పధకాల పై పూర్తి  అవగాహన కలిగించుకొని, పారదర్శకంగా వాటిని ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.  అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేలా చూస్తే గ్రామం లోని పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఆశ వర్కర్స్ ప్రతి రోజు గ్రామానికి వచ్చి ఫీవర్ సర్వే చేస్తే గ్రామస్తులంత ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యతలను   పెట్టుకోవాలని, బహిరంగ  మల ముత్రాదుల విసర్జనలు లేకుండా  పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.  శిక్షణ నుండి గ్రామానికి వెళ్ళగానే  జగనన్న  పచ్చతోరణం  క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.  ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం లో కార్నాల్ గ్రామం లో గ్రామస్తుల శ్రమదానం తో  మురుగు నీరు నుండి మంచి నీరు వచ్చేలా నిర్మించుకున్న 3 రకాల చెరువుల గురించి వివరిస్తూ  ఆ విజయ గాధ  షార్ట్ ఫిలింను పిపిటి  ద్వారా ప్రదర్శించారు.  ప్రతిది డబ్బు తోనే ముడిపెట్ట కూడదని, ప్రజలంతా ఏకమైతే  శ్రమదానం ద్వారా గ్రామాల అవసరాలను కొన్ని తీర్చుకోవచ్చునని తెలిపారు.  అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ లను అందజేశారు. 
ఫోర్టి ఫైడ్  బియ్యం అంటే బలవర్ధక బియ్యం :  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ 
ఫోర్టిఫైడ్  బియ్యం అంటే సాధారణ ధాన్యం లో పోషకాలను కలిపి మిల్లు ఆడిస్తామని,  అవి బలవర్ధకంగా తయారవుతాయని   సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. సర్పంచ్ ల శిక్షణ ముగింపు లో కలెక్టర్ తో  పాటు పాల్గొన్న జే.సి. ఫోర్టి ఫైడ్ బియ్యం పై సర్పంచ్ లకు అవగాహన కల్పించారు. ఫోర్టి ఫైడ్ బియ్యం పై ముద్రించిన కర పత్రాలను,  గోడ పత్రికలను,  ప్ల కార్డులను సర్పంచ్ లకు అందజేశారు.  గ్రామాల్లో ఈ బియ్యం పై అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు వినియోగించేలా చూడాలన్నారు.  ఈ బియ్యం లో సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయని, రక్త హీనత నివారణ లో, నాడీ వ్యవస్థ అభివ్రుది, గర్భస్థ శిశువు  వికాసం జరుగుఉందని, చిన్న పిల్లలు, గర్భిణీలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.  సర్పంచ్ లు  ఈ విషయాలన్నిటిని ప్రజలకు అర్ధమయ్యేలా హేప్పలన్నారు.  ఈ సమావేశం  డి.పి.ఓ  సుభాషిని, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-04 11:00:21