1 ENS Live Breaking News

సమన్యాయమే తమ ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు ఎస్.సిలు, ఎస్.టిలకు కూడా సమన్యాయాన్ని అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని,   ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. జిల్లాలో ఎస్.సిలు, ఎస్.టిలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు, దాడులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రతీ ఒక్కరికి సమన్యాయం తప్పక లభిస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం, అట్రాసిటీ కేసులపై విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో మెరుగైన స్థితి కనిపిస్తుందని ఇది శుభపరిణామమని అన్నారు. ఎస్.సిలు, ఎస్.టిలు తమ హక్కులు గురించి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో, అంతే బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలోని ఎస్.సిలకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అందువలనే జిల్లాలో వైషమ్యాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 

ఎస్.సిలు,ఎస్.టిల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎస్.సిలు, ఎస్.టిల సమన్యాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విశేషకృషి చేస్తున్నారని, వారితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. కమిటీ సభ్యురాలైన నిమ్మక కళావతి కుటుంబానికి జరిగిన విషయంపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ, కళావతి కుటుంబం ఒంటరిగా పోరాటం చేయడం బాధ కలిగిస్తుందని, ఆమె ఒంటరే అయినప్పటికీ ప్రభుత్వం అన్నివిధాల తగు న్యాయం చేస్తుందని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎస్.సిలకు, ఎస్.టిలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తక్షణమే తమ సమీప పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ స్పందించకుంటే తమ పై అధికారులు లేదా జిల్లా కలెక్టర్ ను సంప్రదించవచ్చన్నారు. అలాగే తమను కూడా సంప్రదించి తమ సమస్యలను తెలియజేసుకోవచ్చని, బాధ్యులు ఎంతటివారైన తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అయితే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోరాదని హితవు పలికారు. అణగారిన అన్నివర్గాల వారికి సమతుల్యత పాటిస్తూ  రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పదవులను కట్టబెట్టడం జరిగిందని, ఉపముఖ్యమంత్రి పదవినే ఎస్.సి మహిళకు కట్టబెట్టిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. అలాగే సమర్ధవంతమైన ఎస్.సి,ఎస్.టి మంత్రులు ప్రభుత్వంలో ఎందరో ఉన్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. అన్నివర్గాల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, అధికారులంటే ప్రభుత్వానికి అపారమైన గౌరవమని ఉపముఖ్యమంత్రి తెలిపారు. తప్పు జరిగితే దోషులు ఎంతటి వారైన వదలిపెట్టబోమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఉద్భోదించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న అట్రాసిటీ, అత్యాచార కేసులను తక్షణమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని అధికారులను కోరారు. భవిష్యతులో ఏ ఒక్కరూ తమకు న్యాయం జరగలేదని రాకూడాదని, అటువంటి సమాజం జిల్లాలో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, అందరూ క్షేమంగా ఉండాలనే ప్రభుత్వం పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి వివరించారు.

        పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన న్యాయం జరగడం లేదని,  ఇప్పటికైనా మరింత న్యాయం జరిగేలా ఈ సమావేశం చర్యలు తీసుకోవాలని కోరారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిల్లంగి, చేతబడి పేరుతో అమాయక కుటుంబాలను మానసికంగా కృంగదీసి, అమానుషంగా గ్రామాల నుండి వెలివేస్తున్నారని, అటువంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేయగా జన విజ్ఞాన వేదిక ద్వారా మారూమూల ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించి గిరిజనుల్లో మార్పును తీసుకువస్తామని వై.సి.బి డైరక్టర్ యం.ప్రసాదరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  సీతంపేటలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలికది నిరుపేద కుటుంబమని, నివశించేందుకు సరైన గృహం కూడా లేదని, కావున ఆమెకు గృహాన్ని మంజూరుచేయాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే గృహంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పాలకొండ ఆర్.డి.ఓను ఆదేశించారు. తమ నియోజకవర్గంలోని పలు యస్.సి కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా నోచుకోలేదని, దీనిపై యస్.సి.కార్పొరేషన్ ను సంప్రదించినప్పటికీ ఎటువంటి నిధులు మంజూరుకాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న నాడు – నేడు కార్యక్రమం క్రింద కనీస మౌలికవసతులు కల్పించాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఎస్.సి.ఎస్.టి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయలేదని, వాటిని భర్తీచేయాలని కోరగా పోస్టుల వివరాలను సేకరించి నోటిఫికేషన్ జారీచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులను కలెక్టర్ ఆదేశించారు.

        పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తమ నియోజక వర్గ పరిధిలో ఐదు మండలాల్లో గిరిజనులు నివశిస్తున్నారని, వారు అమాయికులని అటువంటి వారిపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. నాటుసారాలో ఉపయోగించే బెల్లం ఊటను మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు తయారుచేస్తున్నారని వదంతులు వస్తున్నాయని, నిజానికి గిరిజనులు తయారుచేయడం లేదని యస్.పి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సెంట్రల్ ఎక్సైజ్, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కలప తమ నియోజకవర్గం నుండే వెళ్తుందని, దీన్ని కూడా గిరిజనులే చేస్తున్నట్లు వదంతులు వస్తున్నాయని, వీటిపై అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే చివరిస్థానంలో పాతపట్నం నియోజకవర్గం ఉందని, దీన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా విద్యను అందించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించడం వలన గిరిజనులు కూడా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు. గిరిజనుల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయని, అటువంటి ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి మూఢనమ్మకాలకు దూరంగా ఉంచాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగులో ఉన్న అట్రాసిటి, అత్యాచార కేసులను డి.ఎస్.పిలు స్వయంగా పర్యవేక్షించి బాధితులకు తగు న్యాయం చేయాలని కోరారు. రానున్న సమావేశానికి ఎటువంటి కేసులు పెండింగు లేకుండా చూడాలని, కావున వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కోరారు. ఎస్.సిలు,ఎస్.టిల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను పారద్రోలేందుకే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామని, అందుకు తగిన విధంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి,ఎస్.టిలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, బాధితులు ఎవరైనా తమకు అన్యాయం జరిగితే పిర్యాదు చేయవచ్చని చెప్పారు. కేసులను బట్టి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కొన్ని ప్ర్రత్యేకమైన కేసులను బట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కాని నిజమైన దోషులను ఎప్పటికీ విడిచిపెట్టబోమని, బాధితులకు తగు న్యాయం తప్పక చేసి తీరుతామని ఎస్.పి హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, పాలకొండ, శ్రీకాకుళం రెవిన్యూ డివిజినల్ అధికారులు టి.వి.యస్.జి.కుమార్, ఐ.కిశోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ.రత్నం, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, నాన్ అఫీషియల్ సభ్యులు కంఠ వేణు, సతివాడ రామినాయుడు, బంటు దుర్గారావు, నిమ్మక కళావతి, స్వచ్ఛంధ సంస్థలు ప్రతినిధులు వై.సి.బి. డైరక్టర్ యం.ప్రసాదరావు, ఆర్ట్స్ సన్యాసిరావు, స్వీప్ కె.రమణమూర్తి, ఎస్.సి,ఎస్.టి సెల్ డి.ఎస్.పిలు, పబ్లిక్ ప్రోసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:14:19

సచివాలయాలు తనికీచేసిన ఎ.డి.హెచ్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ హార్టికల్చర్ విభాగపు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. దామోదర రావు 5వ జోన్ పరిధిలో మాధవధారలొని నాలుగు సచివాలయాలను బుధవారం సందర్శించి సచివాలయ కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టరు, డైరీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని, ఎటువంటి అలసత్వం వహించరాదని కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయాలలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా సూచిక బోర్డులు, అత్యవసర్ ఫోన్ నెంబర్లు, వివిధ పధకాలు తెలిపే నోటీసు బోర్డులు ఉండాలని ఆదేశించారు. కార్యదర్శుల విధులపై బయటకు వెళ్ళినప్పుడు తప్పని సరిగా మూమెంట్ రిజిష్టర్ లో పని  పూర్తి వివరాలు వ్రాయాలని, సెలవు పెట్టవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని ఆదేశించారు.   

విశాఖ సిటీ

2021-07-28 15:10:31

రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి..

రక్తదానం చేసి ఆపదలో వున్నవారి ప్రాణాలు కాపాడాలని విశాఖ నగర పాలక సంస్థ మేయర్  గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. బుధవారం ఓలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.  ఆమె 3వ జోన్ 19వ వార్డు పరిధిలోని పెద్ద జాలరిపేటలో ఓలిశెట్టి సత్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ సంస్థ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్ని దానాల కంటే రక్త దానం గొప్పదని,  కరోనా వైరస్ కారణంగా రక్తదానం చేసే వారు తక్కువగా ఉన్నందున రక్త నిల్వలు తగ్గుతున్నాయని ఇటువంటి కష్ట కాలంలో చారిటబుల్ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు  చేసిందని,  రక్తదానం వలన ఎంతోమంది ప్రాణాలను కాపాడగలమని తెలిపారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నకు దాదాపు 200 మంది యువత నేడు రక్తదానం చేశారని, మరింత మంది రక్తదానం చేయాలని యువతకు మేయర్ పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఓలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ ఓలిశెట్టి గురునాథంకు మేయర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంనకు మత్స్యశాఖ చైర్మన్ కోలా గురువులు,  కార్పొరేటర్ బెహరా భాస్కర్,  స్వచ్ఛ భారత్ అంబాసిడర్ రమణ మూర్తి,  వైయస్సార్ సిపి నాయకులు అక్కరమాని వెంకటరావు,  పేడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-28 15:02:23

బలవర్ధక బియ్యంపై అవగాహన పెంచండి..

బలవర్ధక  బియ్యం(పోర్టిఫైడ్ రైస్) పై గ్రామాల్లో అపోహలున్నాయని, వాటిని పోగొట్టి ప్రజలు వినియోగించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. జె.ఎన్. టీ. యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి  బుధవారం  ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరైనారు. ఈ సందర్బంగా సర్పంచ్ లతో మాట్లాడుతూ ఫోర్టిఫైర్డ్ బియ్యం పై అవగాహన లేకనే  ప్లాస్టిక్ బియ్యమని  గ్రామాల్లో అపోహ పడుతున్నారాని,  సాధారణ ధాన్యానికి పోషకాలను కలపడం ద్వారా బలవర్ధకంగా తయారు అవుతాయని అన్నారు.  ప్రభుత్వ పథకాలపై  కూడా ప్రజలకు అవగాహన కల్పించడం,  వాటిని లబ్ది దారులకు  పారదర్శకంగా  అందించడం లో కూడా దృష్టి పెట్టాలన్నారు.  గ్రామాభివృద్ధి లో సర్పంచ్ ల దే  కీలక పాత్ర యని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుభాషిణి, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-28 13:55:27

సింహాద్రి అప్పన్నకు కాటా విరాళం..

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారి క్రిస్టల్ ఇండస్ట్రీస్ అధినేత గ్రంధి సతీష్  200 కేజీల కాటాను అన్నదాన సత్రం కు ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ కెవి నాగేశ్వరరావు ద్వారా విరాళంగా అందజేశారు. బుధవారం ఈ మేరకు కాటాను దేవస్థానం అధికారులకు అందించారు. తొలిపూజ చేసి కాటాను ప్రారంభించారు. అనంతరం దాతలు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు దాతలకు తీర్ధ ప్రసాదాలు అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-28 13:53:55

సింహాద్రి అప్పన్నకు జిల్లా కలెక్టర్ పూజలు..

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా వచ్చిన  ఏ.మల్లికార్జున  బాధ్యతలు చేపట్టేముందు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్, అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. జిల్లా కలెక్టర్ గా విజయవంతంగా పనిచేయాలని, ఎన్నో మంచి పనులు చేయాలని   అర్చకులు దీవించారు. కలెక్టర్ మల్లికార్జునకు కళ్యాణ మండపాన్ని కూడా చూపించి..ఆర్జిత సేవల గురించి ఈఓ సూర్యకళ వివరించారు.

Simhachalam

2021-07-28 13:50:02

అప్పన్నకు విశాఖవాసి రూ.1,00,116 విరాళం

విశాఖ మధురవాడకు చెందిన  విశ్వనాధ శివ శంకర్ శ్రీనివాస్, సుబ్బలక్ష్మి దంపతులు శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారి నిత్యాన్నదాన పథకానికి  లక్షా నూట పదహారు రూపాయలు  (1,00,116) విరాళం అందించారు. ఫిబ్రవరి 22న  తమపెళ్లి రోజు సందర్భంగా స్వామివారి సన్నిధిలో అన్నదానం చెయ్యాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆలయ పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల చెక్కును అందించారు. అనంతరం దాతలు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు దాతలకు తీర్ధ ప్రసాదాలు అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

Simhachalam

2021-07-28 13:44:10

విశాఖజిల్లా కలెక్టర్ గా డా.ఎ.మల్లిఖార్జున..

విశాఖ జిల్లా కలెక్టరుగా  డా. ఎ . మల్లిఖార్జున బుధవారం ఉదయం  బాధ్యతలు స్వీక రించారు. ఈ సందర్భముగా జిల్లా జాయింట్ కలెక్టర్ లు  ఎం.వేణు గోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, ఆర్.గోవింద రావు, పలువురు జిల్లా అధికారులు కలెక్టరు ను  మర్వాద  పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  తదుపరి కలెక్టరు జాయింట్ కలెక్టర్ లతో సమావేశమైయి పలు అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టరు డా. ఎ. మల్లిఖార్జున   విలేఖరులతో మాట్లాడుతూ  జిల్లాలో    ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి  అందేలా కృషి చేస్తానన్నారు. ఎల్ల వేళలా అందుబాటు లో ఉంటూ  అధికారులందరి సమన్వయంతో   పట్టణ,  గ్రామీణ, గిరిజన ప్రాంతాలన్నింటికి సమ ప్రాధాన్యత నిచ్చి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకంతో జిల్లాని రాష్ట్రంలోనే అభివ్రుద్ధి పధంలో ముందువరుసలో నిలబెడతానని చెప్పారు.

Visakhapatnam

2021-07-28 13:21:49

ఇకపై ఒక రేషన్ కార్డుకి ఒకే పింఛను..

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.  మంగళవారం  ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల  పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.  తొలుత ఒక మహిళ మంత్రిని కలిసి తన సమస్య తెలిపింది. తన తండ్రి చనిపోయారని తన తల్లికి పింఛన్ కావాలని తన తల్లి అత్తగారు పింఛన్  పొందుతున్నారని వీరంతా ఒకే రేషన్ కార్డులో ఉన్నారని  ఈ ఇరువురిని రేషన్ కార్డులో వేరు చేస్తే రెండు పింఛన్ లు పొందవచ్చని ఆశపడుతున్నట్లుగా ఆమె తెలిపింది. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛన్ను రద్దు కాబడుతుందన్నారు. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని  ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్ను రద్దు చేయనున్నదని చెప్పారు. దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్హెచ్వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఆధార్లో వయసు మార్పు చేసినవారు.. రేషను కార్డును పింఛనుకు అనుసంధానం చేయని వారు... ఒకే రేషన్కార్డు ద్వారా కుటుంబంలో రెండు లేదా అంతకు మించి పింఛన్లు ఉన్న వారిని గుర్తించి అనర్హులను క్షేత్ర స్థాయిలోనూ, సాంకేతికంగానూ పరిశీలించాకే తొలగింపు ఉంటుందని మంత్రి  చెప్పారు. తద్వారా మరికొంత మంది అర్హులకు పింఛన్లు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 
        మచిలీపట్నం మండలంలోని ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన కుక్కల కుమారి మంత్రిని కలిసింది. తనకు అసైన్డ్ భూమి ఉందని  రైతు కర్షక్ లోన్  6 లక్షల ఇప్పించాలని అభ్యర్ధించింది. భూమి స్వంతం కాకపోతే , ఆ రుణం రాదనీ, ప్రభుత్వం ఇచ్చిన పట్టా    భూమిని సాగు చేస్తే మాత్రం పంట రుణం ఇస్తారని ఆమెకు మంత్రి పేర్ని నాని వివరించారు. మచిలీపట్నం లోని  పాత రామన్నపేటకు చెందిన అచ్యుత మాధవి,  సర్కిల్ పేటకు చెందిన పుప్పాల సుధలు మంత్రిని కలిసి తమకు విద్యుత బిల్లులు అధికమొత్తంలో వస్తున్నాయని చెప్పారు.  రెండు నెలలకు 1085 యూనిట్లు విద్యుత్ బిల్లు వచ్చిందని 7, 462  రూపాయల చెల్లించమంటున్నారని, ఈలోపున మరో బిల్లు సిద్ధమైందని 349 యూనిట్లకు 2, 980 రూపాయలు మొత్తం 10, 444 చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు వత్తిడి తెస్తున్నారని మాధవి మంత్రికి చెప్పారు. తనకు అధిక మొత్తంలో కరంట్ బిల్లు  9,392 రూపాయలు వచ్చిందని ఆ మొత్తం చెల్లించమని విద్యుత్ అధికారులు అంటున్నారని మంత్రికి సుధ అనే మహిళ వివరించింది.    
           స్థానిక లక్ష్మణరావుపురం దిమ్మల సెంటర్ కు చెందిన పాస్టర్ మట్టా మేరీ పాల్ మంత్రి వద్ద తన ఇబ్బంది చెప్పుకొన్నారు. 2013 తాను ఒకరి వద్ద ఇల్లు కొని రిజిస్ట్రేషన్ తన పేర చేయించుకున్నానని ఇంటి పన్ను సైతం కటుతున్నానని, ఇటీవల ఇంటి పన్ను తన పేరున కాక ఇంటి పన్ను పాత యజమాని కుమారుని పేరున వచ్చిందని వాపోయారు. 

Machilipatnam

2021-07-27 16:53:37

సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి..

శ్రీకాకుళం జిల్లాలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ వర్షాకాలం రావడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మలేరియా అధికారి, వైద్యఆరోగ్య శాఖాధికారి మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగాధిపతులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమలు వలన వచ్చే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతీవారం క్లోరినేషన్ మరియు ఫాగింగ్ ఖచ్చితంగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మునిసిపల్ పరిధిలో తాగునీటిని క్లోరినేషన్ చేసి నీటి నిల్వలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే గ్రామస్థాయిలో నీటి కొళాయిలు దెబ్బతిని నీటి నిల్వలు ఏర్పడినట్లయితే తక్షణమే అధికారులు స్పందించి మరామ్మతులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలపై అధికారులు నిర్లక్ష్యధోరణి కనబరచరాదని, తద్వారా మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యూ, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ప్రస్తుతం గ్రామ, వార్డుస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నందున వారి ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ప్రతీ పి.హెచ్.సి కేంద్రాల్లో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి టెస్టులు చేసేందుకు వీలుగా కిట్లను మరియు మందులను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధిపతులు ప్రతీ వారం చేపట్టిన ప్రగతి నివేదికలను తమకు సమర్పించాలని ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యూ, జికా వైరస్ ఎడిస్ దోమ వలన వస్తుందని, గంబూషియా చేపల ద్వారా ఈ ఎడిస్ దోమలను లార్వా దశలోనే నివారించాలని సూచించారు. సీజనల్ వ్యాదులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల డాక్యుమెంటరినీ వాట్సాప్ గ్రూపు ద్వారా  గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపి అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున మునిసిపల్ కమీషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం పనులతో పాటు క్లోరినేషన్, ఫాగింగ్ ప్రతీ వారం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తొలుత జిల్లా మలేరియా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ కమీషనర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం చేపడుతున్న ప్రగతిని కలెక్టర్ కు వివరించారు.

          ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐటిడిఏ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా మలేరియా అధికారి , జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఓబులేసు, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, పాలకొండ, రాజాం, ఇచ్చాపురం మునిసిపల్ కమీషనర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-27 16:50:23

రూర్బన్ పనులపై దృష్టి సారించాలి..

సోంపేట క్లస్టర్ లో రూర్బన్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. రూర్బన్ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళ వారం సమీక్షించారు. తాగు నీటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ క్రింద పనులు బాగా జాప్యం జరుగుతోందని వాటిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. పి.ఎం.ఏ.జి.వై క్రింద లావేరు, వీరఘట్టం, రాజాం, రణస్థలం మండలాల్లో మంజూరైన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక అధికారులు పనుల పై దృష్టి సారించి మంజూరు నుండి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి  మాట్లాడుతూ ఇంజినీరింగ్  పనుల్లో 107 పూర్తి అయ్యాయని, 43 పనులు ప్రగతిలో ఉన్నాయని, 14 ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. పి.ఎం.ఏ.జి.వై క్రింద చేపడుతున్న పనులకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల మేర నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, డిపిఓ వి.రవి కుమార్, డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ, పంచాయితీ రాజ్ ఎస్ఇ కే.బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జేడి కే.శ్రీధర్, ఏపిఇడబ్లుఐసి ఇఇ కే. భాస్కర రావు తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-27 16:48:02

కలెక్టర్ వినయ్ చంద్ కు ఘన సత్కారం..

విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ను జిల్లా ఉద్యోగులు ఎప్పటికీ మరిచిపోరని సీతమ్మధార తహశీల్దార్ జ్నానవేణి అన్నారు. పదోన్నతిపై వెళుతులుతున్న కలెక్టర్ ను మంగళవారం తహశీల్దార్, సూపరింటెండెంట్ లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాని అభివ్రుద్ధి పధంలో నడిపించడానికి తమకు మంచి అవకాశం కల్పించి, ఆయనతోపాటు పనిచేసే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా మంచి అధికారి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు కాస్త బాధగా కూడా ఉందన్నారు. కాకపోతే బదిలీలు ఉన్నతాధికారులకు సహజమని.. కానీ రెండేళ్లపాటు మంచి అధికారితో పనిచే అవకాశం రావడం, మంచి కార్యక్రమాలు ఆయనతో కలిపి చేయడం ఉద్యోగులమంతా మరిచిపోలేని అంశమని అన్నారు.

విశాఖ సిటీ

2021-07-27 16:42:46

మొక్కలు నాటాలి -పచ్చదనం పెంచాలి..

మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని, మొక్కలు నాటి అవి బ్రతుకుటకు విధిగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఆయన ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ లతో ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని ఆయన సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రాదాన్యత క్రమంలో వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆయన అన్నారు. మూడవ దశ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి రైతు ఇ క్రాప్ లో నమోదు కావాలని ఆయన అన్నారు. గృహ పట్టాలకు దరఖాస్తు చేసిన వారికి వెంటనే జారీ చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలో భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు అధికం చేయాలని ఆయన అన్నారు. గ్రామ సచివాయాలను తనిఖీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు.  పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు జారీ నిర్దేశిత సమయంలో జరగాలని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉన్నది లేనిది పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఆగస్టులో నేతన్న నేస్తం 10వ తేదీన, విద్యా కానుక 16వ తేదీన, 20 వేలులోపు అగ్రీ గోల్డ్ పరిహారం  24 వ తేదీన, ఎం.ఎస్.ఎం.ఇలకు 27 వ తేదీన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

        ఈ వీడియో కన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు, వ్యవసాయ శాఖ జేడి కే. శ్రీధర్, సిపిఓ ఎం. మోహన రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పి. కూర్మి నాయుడు, ఆర్ అండ్ బి ఎస్ఇ కే. కాంతిమతి, పంచాయతి రాజ్ ఎస్ఇ కే.బ్రహ్మయ్య, ప్రజా ఆరోగ్య శాఖ ఇఇ పి. సుగుణకర రావు తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-27 13:47:25

మంచితో చెడును దూరం చెయ్యొచ్చు..

మంచితనంతో ఎంత పనినైనా చేయించగలమని,  అది అధికారుల మధ్య సఖ్యతను, ప్రేమను పెంచుతుందని పదోన్నతి  పొంది బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  స్థానిక కృషి భవన్ లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సంఘం కలెక్టర్ కు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  తనకు కలెక్టర్ కన్నా వ్యవసాయ శాఖ లో పని చేసినప్పుడే ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు. వ్యవసాయం అంటే ఇష్టమని,  ఆ శాఖ లో పని చేసిన కాలం లో చేసిన  అనేక సంస్కరణలను  గుర్తు చేసుకున్నారు. మూడేళ్ళ పాటు జిల్లాలో పని చేసి అందరి అభిమానాన్ని మూట కట్టుకొని తీసుకు వెళ్తున్నానని అన్నారు. సంయుక్త సంచాలకులు ఆశ దేవి మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో  పీపుల్ కలెక్టర్ గా హరి జవహర్ లాల్ నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు ఉమ మహేశ్వర నాయుడు, హరి కృష్ణ, తిరుపతి రావు, ఆత్మా పి డి లక్మన రావు, మార్కుఫెడ్, ఏ.పి సీడ్స్, ఆగ్రోస్ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ గా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆడిట్ అధికారి హిమ బిందు కలెక్టర్ ను సన్మానించారు. స్టాండింగ్  ఒవేషన్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.

Vizianagaram

2021-07-27 13:44:08

విజయనగరానికి విశేష సేవలందించారు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ గా డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాకు అమోఘ‌మైన సేవ‌ల‌ ను అందించార‌ని. ఆయ‌న పేరును జిల్లా ప్ర‌జ‌లు ఎన్న‌డూ మ‌ర్చిపోలేర‌ని ప‌లువురు కొనియాడారు. ఇంత‌వ‌ర‌కూ జిల్లాలో ఎంతోమంది క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ, జిల్లాపై హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ వేసిన ముద్ర చెర‌గ‌రానిద‌ని పేర్కొన్నారు. ప‌దోన్న‌తిపై బ‌దిలీపై వెళ్తున్న క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ను,  స్థానిక డిఆర్‌డిఏ స‌మావేశ మందిరంలో డిఆర్‌డిఏ, బిసి, ఎస్‌సి, సాంఘిక సంక్షేమ‌శాఖ‌లు మంగ‌ళ‌వారం ఘ‌నంగా స‌న్మానించాయి. ఆయా శాఖ‌ల అధికారులు, సిబ్బంది క‌లెక్ట‌ర్‌ను దుశ్శాలువ‌ల‌తో స‌త్క‌రించి, పూల‌గుత్తెలు అందించారు. ఈ సంద‌ర్భంగా డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, త‌న ఉద్యోగ జీవితంలో డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఐఏఎస్ అధికారిని ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేని అన్నారు. సానుకూల దృక్ఫ‌థం, స‌హ‌నశీల‌త‌, నిరాడంబ‌ర‌త‌, ఓర్పు, అంద‌రికీ మంచిచేసే నైజం ఆయ‌న సొంత‌మ‌ని పేర్కొన్నారు. ఎటువంటి బేష‌జాలు, అధికార ద‌ర్పం లేని హ‌రిజ‌వహ‌ర్ లాల్ నుంచి, తాము ఎంతో నేర్చుకున్నామ‌ని అన్నారు. ప్ర‌జా క‌లెక్ట‌ర్‌గా, ప్ర‌గ‌తిశీల క‌లెక్ట‌ర్‌గా ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశార‌ని అన్నారు.

                  జిల్లా బిసి కార్పొరేష‌న్ ఇడి ఆర్.వి.నాగ‌రాణి, ఎస్‌సి కార్పొరేష‌న్ ఇడి ఎస్‌.జ‌గ‌న్నాధ‌రావు, ఎపిఇడ‌బ్ల్యూఐడిసి ఇఇ ఎం.శ్యామ్యూల్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్దికి క‌లెక్ట‌ర్ చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న హ‌యాంలో జిల్లాకు సుమారు 20కి పైగా జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డులు వ‌రించాయ‌ని చెప్పారు. క‌లెక్ట‌ర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తమ శాఖల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దామ‌ని అన్నారు. ఆయ‌న హ‌యాంలో ప‌నిచేయ‌డం త‌మ అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు.
 
                   డిఆర్‌డిఏ ఏపిడి ఎం.సావిత్రి, వివిధ విభాగాల ప్ర‌తినిధులు మాట్లాడుతూ, క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చి, త‌న పేరును సార్థ‌కం చేసుకున్నార‌ని అన్నారు. చెరువుల‌ను శుద్దిచేసి, భూగ‌ర్భ‌జ‌లాల‌ను పెంచ‌డం ద్వారా జిల్లా ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చార‌ని అన్నారు. ఒక సాధార‌ణ వ్య‌క్తికి సైతం అందుబాటులో ఉండే క‌లెక్ట‌ర్‌ను తాము ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌ని అన్నారు.

అభివృద్దిని కొన‌సాగించాలి ః డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌.
               త‌న హ‌యాంలో జ‌రిగిన అభివృద్దిని, భ‌విష్య‌త్తులో కూడా కొన‌సాగించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. తాను జిల్లాకు ఎంతో రుణ‌ప‌డి ఉంటాన‌ని, భ‌విష్య‌త్తులో కూడా జిల్లా అభివృద్దికి త‌న‌వంతుగా పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తాన‌ని అన్నారు. స‌న్మానం అనంత‌రం ఆయ‌న ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. తాను మునిపంపుల అనే ఒక మారుమూల గిరిజ‌న తండాలో పుట్టిన‌ప్ప‌టికీ, ఒక ఐఏఎస్ అధికారిగా ముస్సోరీలో శిక్ష‌ణ పొందే స్థాయికి ఎదిగానంటే, దానికి కార‌ణం మ‌హిళ‌లేన‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అత్యంత వెనుక‌బడిన కుటుంబంలో పుట్టిన‌ త‌న‌ను, త‌న త‌ల్లి తీర్చిదిద్దింద‌ని, డిఆర్‌డిఏ పిడిగా పనిచేసిన స‌మ‌యంలో మ‌హిళ‌ల నుంచి, ఓర్పు, స‌హ‌నం నేర్చుకున్నాన‌ని చెప్పారు. తాను చిన్న‌త‌నంలో ఎదుర్కొన్న ప్ర‌తీ అవ‌మానాన్నీ, ఆయుధాలుగా మార్చుకొని త‌న ఎదుగుద‌ల‌కు బాట‌లు వేసుకున్నాన‌ని అన్నారు. వృత్తిరీత్యా తొలుత డాక్ట‌ర్ కావ‌డం వ‌ల్ల స‌హ‌న‌శీల‌త అల‌వ‌డింద‌న్నారు. ఎన్న‌డూ తాను అవార్డులు కోసం ప్రాకులాడ‌లేద‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే, అవే వ‌స్తాయ‌ని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌లు త‌న‌ప‌ట్ల చూపించిన అభిమానం, ఆద‌ర‌ణ‌ను ఎన్న‌డూ మ‌ర్చిపోలేనని అన్నారు.
             ఈ కార్య‌క్ర‌మంలో సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, డిఆర్‌డిఏ, వైకెపి ఏపిఎంలు, ఏరియా కో-ఆర్డినేట‌ర్లు, డిపిఎంలు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఘ‌నంగా స‌న్మానించిన‌ వైద్యారోగ్య‌శాఖ‌
            జిల్లా క‌లెక్ట‌ర్‌గా విశేష‌మైన సేవ‌లందించి, ప‌దోన్న‌తితో బ‌దిలీపై వెళ్తున్న డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను వైద్యారోగ్య‌శాఖ ఘ‌నంగా స‌న్మానించింది. ఆశాఖ స‌మావేశ మందిరంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ఇత‌ర అధికారులు, మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ గా హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చేసిన‌ సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం త‌మ అధృష్ట‌మ‌ని పేర్కొన్నారు. ప‌లువురు వైద్యులు, వివిధ సంఘాలు కూడా క‌లెక్ట‌ర్‌ను దుశ్శాలువ‌ల‌తో స‌త్క‌రించాయి.

Vizianagaram

2021-07-27 13:42:11